
తమిళనాడు రాజకీయాల్లో సంచలన విజయాన్ని నమోదు చేసి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన కోలీవుడ్ స్టార్ విజయ్ తనదైన శైలిలో ప్రజలను, రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరుస్తున్నారు. పరిపాలన చేపట్టిన కొద్ది రోజులకే సాధారణ రాజకీయ నాయకులకు భిన్నమైన వ్యక్తిత్వాన్ని చాటుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఆయన కర్ణాటకలోని ప్రముఖ కొల్లూరు మూకాంబిక అమ్మవారి ఆలయాన్ని సందర్శించడం, అనంతరం దాదాపు 130 కిలోమీటర్ల మేర తన కారును స్వయంగా నడుపుకుంటూ ఎయిర్పోర్ట్కు వెళ్లడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.మూకాంబిక అమ్మవారికి వెండి ఖడ్గం కానుకకర్ణాటకలోని ప్రసిద్ధ కొల్లూరు మూకాంబిక ఆలయానికి చేరుకున్న సీఎం విజయ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి సుమారు 1.6 కేజీల బరువున్న భారీ వెండి ఖడ్గాన్ని కానుకగా సమర్పించారు. అలాగే పట్టుచీర, పండ్లు, పూజా సామగ్రిని సమర్పించి ప్రత్యేక దర్శనం చేసుకున్నారు. ఆలయ వేద పండితులు ఆయనకు ఆశీర్వచనాలు అందించగా, ఆలయ అధికారులు ప్రసాదాలు అందజేశారు.డ్రైవింగ్ సీట్లో సీఎం విజయ్.. అభిమానుల ప్రశంసలుదర్శనం అనంతరం అందరినీ ఆశ్చర్యపరుస్తూ తన కాన్వాయ్లోని కారులో డ్రైవింగ్ సీట్లో స్వయంగా కూర్చున్న విజయ్, కొల్లూరు నుంచి ఎయిర్పోర్ట్ వరకు దాదాపు 130 కిలోమీటర్ల ప్రయాణాన్ని తానే డ్రైవ్ చేశారు. దారిలోని ఒక టోల్ ప్లాజా వద్ద అభిమానులు ఆయనను గుర్తించి కేకలు వేయగా, విజయ్ స్టీరింగ్ పట్టుకునే చిరునవ్వుతో చేతులూపి అభిమానులను పలకరించారు. ఈ దృశ్యాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సింప్లిసిటీకి మరో పేరు విజయ్, ముఖ్యమంత్రి అయినా స్టార్డమ్ మార్చలేదు, ప్రజలకు దగ్గరగా ఉండే నాయకుడు అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.తమిళనాడు రాజకీయాల్లో ప్రత్యేక సెంటిమెంట్కొల్లూరు మూకాంబిక ఆలయానికి తమిళనాడు రాజకీయాల్లో ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ముఖ్యమంత్రి హోదాలో ఈ ఆలయాన్ని సందర్శించిన మూడో తమిళనాడు సీఎం విజయ్ మాత్రమే కావడం విశేషం. గతంలో దిగ్గజ నాయకులు ఎం.జి
తమిళనాడు రాజకీయాల్లో సంచలన విజయాన్ని నమోదు చేసి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన కోలీవుడ్ స్టార్ విజయ్ తనదైన శైలిలో ప్రజలను, రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరుస్తున్నారు. పరిపాలన చేపట్టిన కొద్ది రోజులకే సాధారణ రాజకీయ నాయకులకు భిన్నమైన వ్యక్తిత్వాన్ని చాటుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఆయన కర్ణాటకలోని ప్రముఖ కొల్లూరు మూకాంబిక అమ్మవారి ఆలయాన్ని సందర్శించడం, అనంతరం దాదాపు 130 కిలోమీటర్ల మేర తన కారును స్వయంగా నడుపుకుంటూ ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.మూకాంబిక అమ్మవారికి వెండి ఖడ్గం కానుకకర్ణాటకలోని ప్రసిద్ధ కొల్లూరు మూకాంబిక ఆలయానికి చేరుకున్న సీఎం విజయ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి సుమారు 1.6 కేజీల బరువున్న భారీ వెండి ఖడ్గాన్ని కానుకగా సమర్పించారు. అలాగే పట్టుచీర, పండ్లు, పూజా సామగ్రిని సమర్పించి ప్రత్యేక దర్శనం చేసుకున్నారు. ఆలయ వేద పండితులు ఆయనకు ఆశీర్వచనాలు అందించగా, ఆలయ అధికారులు ప్రసాదాలు అందజేశారు.డ్రైవింగ్ సీట్లో సీఎం విజయ్.. అభిమానుల ప్రశంసలుదర్శనం అనంతరం అందరినీ ఆశ్చర్యపరుస్తూ తన కాన్వాయ్‌లోని కారులో డ్రైవింగ్ సీట్లో స్వయంగా కూర్చున్న విజయ్, కొల్లూరు నుంచి ఎయిర్‌పోర్ట్ వరకు దాదాపు 130 కిలోమీటర్ల ప్రయాణాన్ని తానే డ్రైవ్ చేశారు. దారిలోని ఒక టోల్ ప్లాజా వద్ద అభిమానులు ఆయనను గుర్తించి కేకలు వేయగా, విజయ్ స్టీరింగ్ పట్టుకునే చిరునవ్వుతో చేతులూపి అభిమానులను పలకరించారు. ఈ దృశ్యాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సింప్లిసిటీకి మరో పేరు విజయ్, ముఖ్యమంత్రి అయినా స్టార్‌డమ్ మార్చలేదు, ప్రజలకు దగ్గరగా ఉండే నాయకుడు అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.తమిళనాడు రాజకీయాల్లో ప్రత్యేక సెంటిమెంట్కొల్లూరు మూకాంబిక ఆలయానికి తమిళనాడు రాజకీయాల్లో ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ముఖ్యమంత్రి హోదాలో ఈ ఆలయాన్ని సందర్శించిన మూడో తమిళనాడు సీఎం విజయ్ మాత్రమే కావడం విశేషం. గతంలో దిగ్గజ నాయకులు ఎం.జి. రామచంద్రన్, జయలలిత మాత్రమే ముఖ్యమంత్రి హోదాలో ఈ క్షేత్రాన్ని దర్శించుకున్నారు. ఇప్పుడు వారి తర్వాత విజయ్ కూడా ఈ ఆలయాన్ని సందర్శించడం రాజకీయంగా, ఆధ్యాత్మికంగా ప్రాధాన్యం సంతరించుకుంది.పుట్టినరోజుకు ముందు ఆధ్యాత్మిక యాత్రజూన్ 22న విజయ్ తన 52వ పుట్టినరోజును జరుపుకోబోతున్నారు. బర్త్‌డేకి కొన్ని రోజుల ముందే ఈ ఆధ్యాత్మిక యాత్ర చేపట్టడం అభిమానుల్లో ఆసక్తి పెంచుతోంది. తన జీవితంలో కీలక సందర్భాల్లో ఆధ్యాత్మిక క్షేత్రాలను సందర్శించే అలవాటు విజయ్‌కు ఉందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.కావేరి వివాదం నేపథ్యంలో రాజకీయ చర్చ.. ప్రస్తుతం తమిళనాడు-కర్ణాటక రాష్ట్రాల మధ్య కావేరి జలాల వివాదం కొనసాగుతున్న సమయంలో విజయ్ పొరుగు రాష్ట్రానికి వెళ్లడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. దీనిని కొందరు కేవలం వ్యక్తిగత ఆధ్యాత్మిక పర్యటనగా చూస్తుండగా, మరికొందరు రెండు రాష్ట్రాల మధ్య సానుకూల సందేశాన్ని ఇచ్చే ప్రయత్నంగా విశ్లేషిస్తున్నారు.అభివృద్ధి అజెండాతో ముందుకెళ్తున్న సీఎం విజయ్ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో విజయ్ తొలిసారిగా ప్రసంగించి తన అభివృద్ధి దార్శనికతను వివరించారు. 2035 నాటికి తమిళనాడును 1.5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యాన్ని ప్రకటించారు. తయారీ, సాంకేతిక, ఆవిష్కరణ రంగాలను విస్తరించడం, పెట్టుబడులను ఆకర్షించడం, యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడం, ప్రాంతీయ అసమానతలను తగ్గించడం వంటి అంశాలను ఆయన ప్రధాన లక్ష్యాలుగా పేర్కొన్నారు.సహకార సమాఖ్యవాదం, రాష్ట్రాల అవసరాలకు అనుగుణంగా విధాన రూపకల్పన, కేంద్ర-రాష్ట్రాల మధ్య సమన్వయం వంటి అంశాలపై విజయ్ చేసిన వ్యాఖ్యలు నీతి ఆయోగ్ నాయకుల ప్రశంసలు పొందినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. సినిమాల్లో స్టార్‌డమ్‌ను ఆస్వాదించిన విజయ్, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా తన వ్యక్తిత్వాన్ని మార్చుకోకుండా సాధారణ జీవనశైలిని కొనసాగిస్తున్నారని అభిమానులు అంటున్నారు. ఆధ్యాత్మికత, సింప్లిసిటీ, అభివృద్ధి అజెండా, ప్రజలకు దగ్గరగా ఉండే తీరు.. ఈ నాలుగు అంశాల సమ్మేళనంగా సీఎం విజయ్ తనదైన రాజకీయ శైలిని నిర్మించుకుంటున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.