
రామ్ చరణ్ హీరోగా నటించిన `పెద్ది` సినిమా గత వారం ఆడియెన్స్ ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించింది. శివరాజ్ కుమార్
, జగపతిబాబు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాకి ఆడియెన్స్ నుంచి మిశ్రమ స్పందన లభించినా, కలెక్షన్లు మాత్రం బాగానే ఉన్నాయి. మొదటి వీకెండ్లో అదిరిపోయే వసూళ్లని రాబట్టింది. ఇక మొదటి వారంలో జోరు చూపించిన ఈ చిత్రం రెండో వారంలో మాత్రం బాగా పడిపోయింది.
ఇక పెద్ది సినిమా తొమ్మిది రోజులు విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇప్పటి వరకు ఈ చిత్రం రూ.287కోట్ల కలెక్షన్లని వసూలు చేసింది. ఇది ఇండియాలో రూ.236కోట్ల గ్రాస్ని, ఓవర్సీస్లో యాభై కోట్ల గ్రాస్ని వసూలు చేసింది. ఇక రెండు వందల కోట్ల నెట్ వసూళ్లని రాబట్టడం విశేషం. ఈ సినిమా హిట్ కావాలంటే ఇంకా రూ.150కోట్ల వరకు వసూళ్లని రాబట్టాలి. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు ఈ చిత్రానికి రూ.366కోట్లు వచ్చినట్టు టీమ్ అధికారికంగా ప్రకటించడం విశేషం.
పెద్ది సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.220కోట్లు. అంటే రూ.450కోట్ల గ్రాస్ రాబట్టాలి. కాకపోతే ఇప్పటికే ఇది 60-70శాతం రికవరీ కావడం విశేషం. ఇది సినిమాకి పాజిటివ్ టోన్గా చెప్పొచ్చు. కాకపోతే ఇప్పుడు రెండో వారం వసూళ్లు మాత్రం బాగా పడిపోయాయి. శుక్రవారం ఇది ఆరు కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఈ శనివారం, ఆదివారం కాస్త పెరిగే ఛాన్స్ ఉంది. అయినా టార్గెట్ చాలా దూరంలో ఉంది. వచ్చే గురువారం వరకు ఈ సినిమాకి తిరుగులేదు. కానీ అప్పటి వరకు ఎంత వసూలు చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమాకి కలెక్షన్లు పెరిగే ఛాన్స్ లేదు. పైగా పెంచిన టికెట్ రేట్లు కూడా తగ్గిపోయాయి. దీంతో కలెక్షన్ల డ్రాప్ గట్టిగానే ఉంటుంది. ఏదేమైనా ఈ మూవీకి దాదాపు 20శాతం నష్టాలు తప్పేలా లేదు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
పెద్ది సినిమా గుర్తింపు లేని తన ఊరుకోసం, తమ ప్రజల కోసం పెద్ది చేసే పోరాటమే ఈ మూవీ స్టోరీ. ఇందులో రామ్ చరణ్ పెద్దిగా నటించాడు. ఆయన క్రికెటర్గా, ఆ తర్వాత కుస్తీ వీరుడిగా కనిపించాడు. ఆ తర్వాత తన వారికోసం ఆయన కాలుని పోగొట్టుకొని మరీ రన్నర్గా మారతారు. ప్రపంచ ఛాంపియన్గా నిలుస్తాడు. తన గ్రామానికి గుర్తింపుని, రైల్వే స్టేషన్ ని తీసుకురావడమే ఈచిత్ర స్టోరీ. ఇందులో జగపతిబాబు అప్పలసూరిగా మరో కీలక పాత్రలో నటించి మెప్పించాడు. శివరాజ్ కుమార్.. గౌర్నాయుడిగా కనిపించిన విషయం తెలిసిందే.