భీమా కోరేగావ్-ఎల్గార్ పరిషత్ కేసులో నిందితుడైన ప్రముఖ విప్లవ కవి, 85 ఏళ్ల పి. వరవరరావు దాఖలు చేసిన పిటిషన్పై బాంబే హైకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. తన నివాసాన్ని ముంబై నుంచి హైదరాబాద్కు
మార్చుకునేందుకు అనుమతించాలని కోరుతూ ఆయన ఈ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై రెండు వారాల్లోగా స్పందన తెలియజేయాలని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)ను ఆదేశిస్తూ న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.జస్టిస్ అజయ్ గడ్కరీ, జస్టిస్ కమల్ ఖాతాలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ను విచారించింది. ముంబైలో నివాసం ఉండటం ఆర్థికంగా పెనుభారంగా మారిందని, వృద్ధాప్యంలో ఇక్కడి జీవన వ్యయాన్ని భరించలేకపోతున్నానని వరవరరావు తన పిటిషన్లో పేర్కొన్నారు. తన నెలవారీ పింఛను సుమారు రూ. 50,000 ఉండగా, ముంబైలో జీవన వ్యయం రూ. 77,000 దాటుతోందని, ఇది తనకు భారంగా మారిందని ఆయన వివరించారు.భీమా కోరేగావ్ కేసులో బెయిల్ పొందిన వరవరరావు, కోర్టు అనుమతి లేకుండా గ్రేటర్ ముంబై పరిధిని దాటి వెళ్లరాదన్న షరతుపై ప్రస్తుతం అక్కడే నివసిస్తున్నారు. ఇదే అభ్యర్థనతో ఆయన గతంలో ఎన్ఐఏ ప్రత్యేక కోర్టును ఆశ్రయించగా, ఈ ఏడాది మార్చి 16న ఆ పిటిషన్ తిరస్కరణకు గురైంది. సుప్రీంకోర్టు విధించిన బెయిల్ షరతులను సవరించే అధికారం తమకు లేదని ప్రత్యేక కోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఆయన హైకోర్టును ఆశ్రయించారు.2018 ఆగస్టులో అరెస్టయిన వరవరరావుకు, ఆరోగ్యం క్షీణించడంతో 2021లో బాంబే హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అనంతరం 2022లో సుప్రీంకోర్టు వైద్య కారణాలతో ఆయన బెయిల్ను