
TTA: నార్త్ కరోలినాలోని షార్లెట్ కన్వెన్షన్ సెంటర్లో జులై 17 నుండి 19, 2026 వరకు జరగనున్న తెలంగాణ అమెరికా తెలుగు సంఘం (TTA) మెగా కన్వెన్షన్లో ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ
కన్వెన్షన్లో భాగంగా, పద్మ విభూషణ్, పద్మ భూషణ్ , పద్మశ్రీ పురస్కార గ్రహీత, ఏఐజీ (AIG) హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ దువ్వూరు నాగేశ్వర రెడ్డితో ‘మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
వివరాలు.. ఈ కార్యక్రమం జులై 19, 2026, ఆదివారం రోజున జరుగుతుంది. దీనికి టీటీఏ (TTA) ఇండియా కోఆర్డినేటర్ డాక్టర్ ద్వారకానాథ రెడ్డి మోడరేటర్గా వ్యవహరిస్తారు. ఈ ప్రతిష్టాత్మక కన్వెన్షన్కు సంబంధించిన మరిన్ని వివరాల కోసం ttaconvention.org వెబ్సైట్ను సందర్శించవచ్చు.