
మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో
వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
YS Jagan: ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి..గురువారం విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకుంటున్న నిర్ణయాలు.. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై వైఎస్ జగన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు నాయుడు సర్కార్ గత ఎన్నికల హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. ప్రజల్లో ఇప్పటికే ప్రభుత్వంపై వ్యతిరేకత మొదలైందని జగన్ ఆరోపించారు. ఈ క్రమంలోనే ఆయన చంద్రబాబును హెచ్చరిస్తూ.. జాగ్రత్త చంద్రబాబు.. ఏపీలో కూడా కాక్రోచ్లు బయటకు వస్తాయి అంటూ మైండ్ బ్లాకింగ్ కామెంట్స్ చేశారు.
డీఎస్సీ అభ్యర్థులు యువత భవిష్యత్తు కోసం పోరాడుతున్నారని.. వారికి న్యాయం చేయడం సర్కార్ బాధ్యత అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల వల్ల యువత నష్టపోతే ప్రశ్నించే హక్కు ప్రతి పౌరుడికి ఉంటుందన్నారు. ఎవరైనా మమ్మల్ని కాక్రోచ్ అని పిలుస్తారా లేదా అనేది పక్కన పెడితే.. డీఎస్సీ అభ్యర్థులు యువకులు, వారి భవిష్యత్తు, వారి ఉద్యోగ అవకాశాల గురించి మాట్లాడుతున్నాము. వారికి న్యాయం చేయనట్లయితే ప్రభుత్వ తన బాధ్యతను ఎలా నిర్వర్తించినట్లు అవుతుందని జగన్ ప్రశ్నించారు. యువత కలలను, ఆశలను నలిపివేస్తే కోట్లాది మంది ప్రజలు ఒక్కసారిగా బయటకు వస్తారు. వారిని ఎవరైనా బొద్దింకలు అని పిలిస్తే న్యాయం నకోసం పోరాడే వారందరూ కాక్రోచ్ లే అవుతారు. అలాంటి పోరాటంలో నేను కూడా ఒకటిని అంటూ జగన్ అన్నారు.
అసలు కాక్రోచ్ వ్యాఖ్యల వెనుక మర్మమేంటీ? రాజకీయ విమర్శల్లో భాగంగా జగన్ ఈ పదాన్ని ఉపయోగించడం వెనుక పెద్ద వ్యూహమే ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. సాధారణంగా చీకటి, అపరిశుభ్రత ఉన్న చోట బొద్దింకలు దాక్కుంటాయని.. సమయం చూసి ఒక్కసారిగా బయటకు వస్తాయని.. అలాగే కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి, అంతర్గత విభేదాలు త్వరలోనే ఒక్కొక్కటిగా బయటకు రావడం ఖాయమని జగన్ పరోక్షంగా హెచ్చరించారు. ప్రభుత్వంపై ప్రజల్లో వస్తున్న అసంతృప్తిని, పాలనా పరమైన లోపాలను ఎత్తిచూపేందుకే ఆయన ఈ వినూత్నమైన పోలికను వాడుకున్నారు.
సోషల్ మీడియాలో ట్రెండింగ్: వైఎస్ జగన్ నోటి నుంచి ఈ కాక్రోచ్ అనే పదం రాగానే ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. అటు వైసీపీ శ్రేణులు ఈ వ్యాఖ్యలను సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా షేర్ చేస్తూ కూటమి ప్రభుత్వంపై ట్రోలింగ్ మొదలుపెట్టగా.. ఇటు టీడీపీ, జనసేన నేతలు కూడా జగన్ వ్యాఖ్యలపై అంతే బలంగా కౌంటర్లు ఇస్తున్నారు. అధికారం కోల్పోయిన డిప్రెషన్లోనే జగన్ ఇలాంటి వింత వ్యాఖ్యలు చేస్తున్నారంటూ మంత్రులు, ఎమ్మెల్యేలు మండిపడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ, ప్రస్తుతం ఏపీ పొలిటికల్ స్పేస్లో ఈ బొద్దింకల రచ్చ మరికొన్ని రోజుల పాటు కొనసాగేలా కనిపిస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.