
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న 8వ వేతన సంఘం (8th Pay Commission) సిఫార్సుల కంటే ముందే వారికి భారీ ఊరట లభించనుంది. దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని
తట్టుకునేందుకు వీలుగా కేంద్రం త్వరలోనే డీయర్నెస్ అలవెన్స్ (డీఏ) పెంపును ప్రకటించవచ్చనే అంచనాలు బలంగా వినిపిస్తున్నాయి. తాజా ఆర్థిక గణంకాలు మరియు పారిశ్రామిక కార్మికుల వినియోగదారుల ధరల సూచీ (AICPI-IW) ట్రెండ్స్ ప్రకారం, ఈ ఏడాది జూలై 2026 నుంచి ఉద్యోగుల డీఏ మరో 3 శాతం పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ ప్రాథమిక వేతనంలో (Basic Pay) 60 శాతం మేర డీఏను అందుకుంటుండగా, ఈ పెంపుతో అది 63 శాతానికి చేరనుంది.నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల వల్ల ఉద్యోగుల కొనుగోలు శక్తి పడిపోకుండా ప్రభుత్వం కాలానుగుణంగా డీఏను సవరిస్తుంటుంది. ఇటీవలి కాలంలో పారిశ్రామిక కార్మికులకు సంబంధించిన రిటైల్ ద్రవ్యోల్బణం 4.27 శాతం నుంచి 4.46 శాతానికి పెరిగింది. అలాగే AICPI-IW సూచీ మార్చిలో 149.1 పాయింట్లుగా ఉండగా, ఏప్రిల్ నాటికి 149.9 పాయింట్లకు చేరుకుంది. గడిచిన 12 నెలల సగటు డేటా ఆధారంగా లెక్కలు వేస్తే డీఏ పెంపు 3 శాతంగా ఉండేలా కనిపిస్తోంది. అయితే, దీనిపై కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేయాల్సి ఉంది. రాబోయే మే, జూన్ నెలల తుది డేటా ఆధారంగా కేంద్రం అధికారిక ప్రకటన చేయనుంది.8వ వేతన సంఘం ముందు భారీ డిమాండ్లుమరోవైపు, 8వ వేతన సంఘం ఏర్పాటుపై ఉద్యోగ సంఘాలు తమ పోరాటాన్ని ఉధృతం చేశాయి. ప్రస్తుతం ఉన్న వేతన నిర్మాణం మారిన జీవనశైలికి, పెరిగిన వసతి, వైద్య, నాణ్యమైన విద్యా ఖర్చులకు ఏమాత్రం సరిపోవడం లేదని ఆల్ ఇండియా ఎన్పీఎస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (AINPSEF) ఆందోళన వ్యక్తం చేసింది. కనీస వేతన గణన కోసం ఇప్పటివరకు వాడుతున్న మూడు ఫ్యామిలీ యూనిట్ల పాత ఫార్ములాను పక్కనబెట్టి, ఐదు ఫ్యామిలీ యూనిట్లకు మార్చాలని సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.DA సున్నా?: ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ పీక్స్! శాలరీ హైక్ రిపోర్ట్ దీంతో పాటు మారుతున్న ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వ ఉద్యోగులు గౌరవప్రదమైన జీవన ప్రమాణాలు సాగించేలా.. 3.83 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఇవ్వాలని, కనీస ప్రాథమిక వేతనాన్ని భారీగా సవరించాలని మరియు డీఏను ప్రాథమిక వేతనంలో కలపాలని నేషనల్ కౌన్సిల్ (NC-JCM) డిమాండ్ చేస్తోంది.మెమోరాండమ్‌ల సమర్పణకు జూన్ 15 చివరి గడువు8వ వేతన సంఘం ప్రక్రియకు సంబంధించి ఒక కీలక అప్‌డేట్ వెలువడింది. వేతన సవరణపై వివిధ ఉద్యోగ సంఘాలు తమ ప్రతిపాదనలు, మెమోరాండమ్‌లను సమర్పించడానికి గడువును జూన్ 15, 2026 వరకు పొడిగించారు. ఇదే ఆఖరి గడువు అని, కేవలం అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో వచ్చే దరఖాస్తులను మాత్రమే స్వీకరిస్తామని స్పష్టం చేశారు.DA Hike: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్! డీఏ పెంపుపై కీలక అప్‌డేట్ ఈమెయిళ్లు, పీడీఎఫ్‌లు లేదా హార్డ్ కాపీలను పరిగణనలోకి తీసుకోబోమని వేతన సంఘం తేల్చి చెప్పింది. అనంతరం, ఉద్యోగుల సమస్యలు, వేతన సవరణ డిమాండ్లపై చర్చించేందుకు జూలై 9, 10 తేదీల్లో కోల్‌కతాలో ప్రాంతీయ సలహా సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ సమావేశాల్లో పాల్గొనదలచిన సంఘాలు జూన్ 15 లోపు తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.