
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో, 24 మంది భారత సిబ్బంది ఉన్న వాణిజ్య నౌకపై అమెరికా బలగాలు జరిపిన దాడిని భారత్ తీవ్రంగా పరిగణించింది. ఈ ఘటనపై నిరసన వ్యక్తం చేస్తూ న్యూఢిల్లీలోని
అమెరికా రాయబార కార్యాలయ సీనియర్ దౌత్యవేత్తకు బుధవారం సమన్లు జారీ చేసింది. ఒమన్ గల్ఫ్లో జరిగిన ఈ ఘటనలో 21 మంది సిబ్బంది క్షేమంగా బయటపడగా, మరో ముగ్గురి ఆచూకీ ఇంకా లభించలేదని విదేశాంగ శాఖ అధికారికంగా వెల్లడించింది.పలావు జెండాతో ఉన్న 'ఎంటీ మారివెక్స్' అనే ఆయిల్ ట్యాంకర్ను లక్ష్యంగా చేసుకుని అమెరికా ఈ దాడికి పాల్పడింది. ఇరాన్పై విధించిన ఆంక్షలను ఉల్లంఘించి ఆ నౌక ప్రయాణించిందని, తమ ఆదేశాలను పాటించకపోవడంతో ఇంజిన్ రూమ్ను ధ్వంసం చేసేందుకు దాడి చేయాల్సి వచ్చిందని యూఎస్ సెంట్రల్ కమాండ్ (సెంట్కామ్) ప్రకటించింది. యూఎస్ఎస్ అబ్రహం లింకన్ యుద్ధనౌక నుంచి బయలుదేరిన ఎఫ్-18 ఫైటర్ జెట్ ఈ దాడిలో పాల్గొన్నట్లు తెలుస్తోంది.దాడి జరిగిన తరుణంలో నౌకలోని భారత సిబ్బంది పంపిన అత్యవసర సందేశాలు ఆందోళన తీవ్ర ఆందోళన కలిగించాయి. "మా నౌకపై అమెరికా నేవీ క్షిపణి దాడి చేసింది. దీనివల్ల ఇంజిన్ రూమ్ దెబ్బతినడమే కాకుండా, నౌక కింద భాగంలో రంధ్రం పడింది. మేమంతా 24 మంది భారతీయ సిబ్బంది ఉన్నాం, దయచేసి త్వరగా మమ్మల్ని రక్షించండి" అంటూ వారు వేడుకున్నారు. ఈ సమాచారం అందిన వెంటనే స్పందించిన ఒమన్ నావికాదళ, హెలికాప్టర్ల ద్వారా సిబ్బందిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది.ఈ పరిణామాలను భారత విదేశాంగ శాఖ