
హైదరాబాద్లోని లింగంపల్లి రైల్వే స్టేషన్లో మంగళవారం తెల్లవారుజామున తనకు ఎదురైన చేదు అనుభవంపై ఓ యువతి తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. అర్ధరాత్రి సమయంలో ఒంటరిగా ఉన్న తనను ఇంటి వద్ద దింపాలని ఇవ్వాలని
కోరగా పోలీసులు నిరాకరించారని ఆమె ఆరోపించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో, నగరంలో మహిళల భద్రతపై మరోసారి చర్చ మొదలైంది.విజయవాడ నుంచి రైలులో బయలుదేరిన సదరు యువతి, రైలు ఆలస్యం కావడంతో మంగళవారం తెల్లవారుజామున 1:45 గంటలకు లింగంపల్లి స్టేషన్కు చేరుకుంది. ఆ సమయంలో ఒంటరిగా ప్రయాణించడం క్షేమకరం కాదని భావించిన ఆమె, పోలీసు హెల్ప్లైన్కు ఫోన్ చేసి సహాయం కోరింది. అయితే, ప్రయాణికులను ఇళ్ల వద్ద దింపే నిబంధన ఏదీ తమ వద్ద లేదని అధికారులు స్పష్టం చేసినట్లు ఆమె సోషల్ మీడియాలో పంచుకున్న వీడియోలో వాపోయింది.ఈ ఘటనతో హైదరాబాద్లో రాత్రి సమయాల్లో మహిళల ప్రయాణ భద్రత అంశం మరోసారి తెరపైకి వచ్చింది. కొద్ది రోజుల క్రితమే మల్కాజ్గిరి కమిషనర్ బి. సుమతి స్వయంగా మారువేషంలో బస్టాప్లో నిలబడి మహిళల భద్రతపై క్షేత్రస్థాయి పరిశీలన చేసిన నేపథ్యంలో, ఈ తాజా ఉదంతం ప్రాధాన్యత సంతరించుకుంది.గతంలో తెలంగాణ పోలీసులు ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న మహిళలు, వృద్ధులకు మానవతా దృక్పథంతో సహాయం అందించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అయితే, ప్రయాణికులకు ఉచితంగా రైడ్స్ ఇవ్వడం లేదా ఇళ్ల వద్ద దింపడం తమ అధికారిక విధివిధానాల్లో భాగం కాదని అధికారులు స్పష్టం చేస్తున్నారు.