
మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో
వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Crude Oil Price Surge: పశ్చిమాసియా మరోసారి భగ్గుమన్నది. దీంతో యుద్ధ ముప్పు పొంచి ఉంది. లెబనాన్ పై ఇజ్రాయెల్ జరిపిన తాజా దాడులు, అమెరికా, ఇరాన్ మధ్య క్షిపణి, డ్రోన్ దాడులు.. ప్రపంచ ఇంధన మార్కెట్ ను కుదిపేశాయి. ఈ ఉద్రిక్తతల కారణంగా సోమవారం ఉదయం ముడి చమురు ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగాయి. బ్రెంట్ క్రూడాయిల్ ధర బ్యారెల్ కు 96 డాలర్లకు పైగా చేరుకుంది. డబ్య్లూటీఐ క్రూడ్ ధర కూడా 4శాతానికి పైగా పెరిగింది. దీంతో భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణంపై ఆందోళనలు మరింత పెరిగాయి.
అటు హోర్ముజ్ సంక్షోభం ఇప్పుడు మళ్లీ తీవ్రరూపం దాల్చింది. లెబనాన్పై ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో, ఇరాన్ అమెరికాతో చర్చలను నిలిపివేసింది. అంతేకాదు.. ఈమధ్యే సమస్య సద్ధుమణి.. హోర్ముజ్ జలసంధి గుండా రాకపోకలు సాగాయి. కానీ తాజా పరిస్థితుల నేపథ్యంలో ఇరాన్ మళ్లీ అడ్డుకునే అవకాశం ఉంది. ఈ సంఘర్షణ తీవ్రరూపం దాల్చి... కేవలం హోర్ముజ్నే కాకుండా ఇతర గల్ఫ్ మార్గాలను, కీలకమైన చమురుచ గ్యాస్ వనరులను కూడా ప్రభావితం చేస్తుందని పెట్టుబడిదారులు భయపడుతున్నారు.
నేడు ముడి చమురు ధర ఎంత? జూన్ 8 ఉదయం ట్రేడింగ్లో బ్రెంట్ ముడి చమురు ధర బ్యారెల్కు $96.20కి చేరుకుంది. ఇది దాని మునుపటి ముగింపు ధర అయిన $93.09 నుండి 3.34శాతం పెరిగింది. అదేవిధంగా.. ముడి చమురు 3.23శాతం పెరిగి బ్యారెల్కు $93.46 వద్ద ట్రేడ్ అవుతోంది. హోర్ముజ్ జలసంధి మార్కెట్కు ప్రధాన ఆందోళనగా ఉంది. అమెరికా, ఇరాన్ల మధ్య కుదిరే అవకాశం ఉన్న ఒప్పందం ఈ మార్గంలో సాధారణ రాకపోకలను పునరుద్ధరిస్తుందని పెట్టుబడిదారులు ఆశించారు. కానీ ఇటీవలి పరిణామాలు ఆ అంచనాలను నీరుగార్చాయి.
ఆశలు అడియాశలయ్యాయి: లెబనాన్ తన మిత్రపక్షమైన హిజ్బుల్లాపై జరిగిన దాడులకు ప్రతిస్పందనగా ఇరాన్, ఇజ్రాయెల్పై క్షిపణి దాడులు చేసింది. అయితే.. ఇరాన్పై ప్రతీకార చర్యలకు దూరంగా ఉండాలని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహును తాను కోరతానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంటున్నారు. అయినప్పటికీ, ఈ సంఘర్షణ సుదీర్ఘకాలం కొనసాగవచ్చని ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారు.
ఒపెక్ నిర్ణయం నుండి రిలీఫ్: ఒపెక్ నిర్ణయంతో చమురు మార్కెట్కు ప్రస్తుతానికి కొంత ఉపశమనం లభించిందని చెప్పాలి. ప్రపంచంలోని అతిపెద్ద చమురు ఉత్పత్తి, ఎగుమతి దేశాల ఈ సంస్థ, జూలై నెలకు తన ఉత్పత్తి కోటాను రోజుకు 1,88,000 బ్యారెళ్ల మేర పెంచడానికి అంగీకరించింది. అయితే, ప్రస్తుతం మార్కెట్ దృష్టి సరఫరా పెరుగుదల కంటే, సరఫరా మార్గానికి పొంచి ఉన్న ముప్పుపైనే ఎక్కువగా ఉంది. ఎందుకంటే, ప్రపంచానికి ఇప్పటికీ హోర్ముజ్ జలసంధికి ప్రత్యామ్నాయం లేదు.
భారత్ కు ముప్పు తప్పదా? ఈ పరిస్థితి భారత్ వంటి ప్రధాన చమురు దిగుమతిదారులకు ఆందోళన కలిగిస్తోంది. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్కు 95-100 డాలర్ల పరిధిలోనే కొనసాగితే, పెట్రోల్, డీజిల్ ధరలు, దిగుమతి బిల్లులు, కరెంట్ ఖాతా లోటు, ద్రవ్యోల్బణంపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. అందువల్ల, రానున్న రోజుల్లో ఇన్వెస్టర్లు పశ్చిమాసియా హోర్ముజ్ జలసంధిలోని పరిణామాలను నిశితంగా గమనిస్తారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.