
అమెరికా, మెక్సికో, కెనడా సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న 2026 ఫిఫా వరల్డ్ కప్ చరిత్రలోనే అతిపెద్దదిగా నిలవడమే కాకుండా, టెక్నాలజీ పరంగానూ ఓ విప్లవాన్ని తీసుకురాబోతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)
, అత్యాధునిక సెన్సార్ల సహాయంతో ఆటలో పారదర్శకత పెంచేందుకు, అభిమానులకు సరికొత్త అనుభూతిని అందించేందుకు ఫిఫా సిద్ధమైంది.ఈ టోర్నమెంట్ కోసం అడిడాస్ ప్రత్యేకంగా ‘ట్రియోండా’ అనే బంతిని రూపొందించింది. ఈ బంతి లోపల ఒక ఇనర్షియల్ మెజర్మెంట్ యూనిట్ (ఐఎంయూ) సెన్సార్ చిప్ను అమర్చారు. ఇది సెకనుకు 500 సార్లు బంతి కదలికలను, దాని వేగాన్ని, 3డీ స్పేస్లో అది ప్రయాణిస్తున్న తీరును రికార్డ్ చేస్తుంది. ఈ డేటాను నేరుగా వీడియో అసిస్టెంట్ రిఫరీ (వీఏఆర్) సిస్టమ్కు పంపుతుంది. తద్వారా ఆఫ్సైడ్, బంతి ఎవరికి తగిలింది వంటి వివాదాస్పద నిర్ణయాలను మరింత కచ్చితత్వంతో తీసుకోవచ్చు.లెనోవో భాగస్వామ్యంతో మరో ముందడుగు వేశారు. ప్రతి ఆటగాడిని కేవలం ఒక్క సెకనులో స్కాన్ చేసి, వారి శరీర కొలతలతో కూడిన కచ్చితమైన 3D మోడళ్లను (అవతార్లను) సృష్టిస్తారు. ఈ ఏఐ ఆధారిత అవతార్లు సెమీ-ఆటోమేటెడ్ ఆఫ్సైడ్ టెక్నాలజీకి ఎంతగానో ఉపయోగపడతాయి. ఆటగాళ్లు గుంపులో ఉన్నా లేదా వేగంగా కదులుతున్నా, వారి కదలికలను కచ్చితంగా ట్రాక్ చేయడానికి ఇవి సహాయపడతాయి. ఈ అవతార్ల ద్వారా ఆఫ్సైడ్ నిర్ణయాలను అభిమానులకు మరింత స్పష్టంగా చూపించనున్నారు.వీటితో పాటు మరిన్ని మార్పులు కూడా ఉన్నాయి. ఆఫ్సైడ్ టెక్నాలజీని 10 సెం.మీ. కచ్చితత్వం వరకు మెరుగుపరిచారు. రిఫరీలకు రియల్ టైం ఆడియో హెచ్చరికలు అందుతాయి. మొత్తం 104 మ్యాచ్లలో రిఫరీలు