
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Ap cm Chandrababu naidu escaped from bicycle accident in vizag video viral: ఏపీ సీఎం చంద్రాబు నాయుడు విశాఖ పట్నంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సంబరాలు నిర్వహించారు. ఈ క్రమంలో విశాఖలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఫుల్ జోష్ గా దాదాపు 20 నిముషాల పాటు ఐదున్నర కిలోమీటర్ల దూరం ప్రయాణించారు. ఈక్రమంలో చంద్రబాబు విశాఖలో నెట్ జీరో కార్యక్రమంలో భాగంగా ఆంధ్రా యూనివర్సిటీ నుంచి నోవాటెల్ హోటల్ వరకు నేతలు, అధికారులతో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రయాణిస్తుండగా సైకిల్ ఒక్కసారిగా అదుపు తప్పింది. దీంతో ఆయన కింద పడపోయారు. వెంటనే సెక్యురిటీ సిబ్బంది అలర్ట్ అయి చంద్రబాబు కింద పడకుండా కాపాడారు. దీంతో అక్కడున్న అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.
అంతకు ముందు చంద్ర బాబు తన ర్యాలీలో.. పోలమాంబ గుడి, వాల్తేరు, బీచ్ రోడ్ మీదుగా నోవాటెల్కు ముఖ్యమంత్రి చేరుకున్నారు. ఒకవైపు ఎండమండిపోతున్న కూడా సైకిల్ తొక్కుతూ ప్రజలు, అధికారుల్లో జోష్ ను నింపారు. ఈ క్రమంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పర్యావరణాన్ని పరిరక్షించాలంటూ అందరికి పిలుపునిచ్చారు. అంతేకాకుండా ఒక మొక్కను సైతం సీఎం చంద్రబాబు నాటారు. మొక్కలు బాగా పెంచిన వాళ్లకే వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లంటూ సీఎం సరదాగా వ్యాఖ్యలు చేశారు.
ముఖ్యంగా సీ ఫుడ్ గురించి మాట్లాడారు. భారతదేశంలో సముద్రపు ఆహారం (సీ-ఫుడ్) ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉందని పేర్కొన్నారు. ప్రతి ఏటా 197 లక్షల మెట్రిక్ టన్నుల సీ-ఫుడ్ ఏపీ నుంచి ఉత్పత్తి అవుతోందన్నారు. కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ కాకినాడ పోర్ట్ మోడ్రనైజేషన్ చేపడతామని ప్రకటించినందుకు చాలా ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర మత్స్య శాఖకు ప్రాంతీయ కార్యాలయానికి అవసరమైన స్థలాన్ని 15 రోజుల్లో ఇస్తామన్నారు. బ్లూ ఎకానమీ ద్వారా ఆర్థిక వృద్ధి సాధ్యమని చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. నీరు ఉన్న చోట నాగరికతలు విలసిల్లుతాయన్నారు. ఏపీలో గోదావరి, కృష్ణ వంటి జీవ నదులు ఉన్నాయని, భవిష్యత్ అంతా బ్లూ ఎకానమీదేనని స్పష్టం చేశారు.
సీ-ఫుడ్ ఉత్పత్తిలో ఏపీ రెండో అతి పెద్ద రాష్ట్రమన్నారు. 197 లక్షల మెట్రిక్ టన్నుల సీ-ఫుడ్ ఉత్పత్తి ఏపీలో జరుగుతోందని తెలిపారు. అంతే కాకుండా.. ప్రపంచ వ్యాప్తంగా జరిగే సీ-ఫుడ్ బిజినెస్లో ఇండియా వాటా కేవలం 5 శాతం మాత్రమే ఉందని తెలిపారు. ఈ రంగంలో ఇండియాకు పెద్దఎత్తున అవకాశాలు ఉన్నాయని, ఏపీలో బ్లూ ఎకానమీ పెరిగితే... దేశ ప్రగతికి దోహద పడుతుందన్నారు.
భారతదేశం మొత్తం చేపల ఉత్పత్తిలో ఏపీ వాటా 28 శాతంకాగా, రొయ్యల ఉత్పత్తిలో ఏపీ షేర్ 66 శాతంగా ఉందన్నారు. మొత్తం సముద్ర ఆహార ఎగుమతుల్లో దాదాపు ఏపీ నుంచే 38 శాతం ఆదాయంగా వస్తోందన్నారు. ఏడాదికి రూ.28,000 కోట్లకు పైగా సముద్ర ఆహార ఎగుమతులు ఏపీ నుంచే జరుగుతున్నాయన్నారు.
Read more: AP TET: ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్ , టెట్ పరీక్ష షెడ్యూల్ విడుదల..
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందితే, భారతదేశ సముద్ర ఆహార ఎగుమతులు కూడా అభివృద్ధి చెందుతుందన్నారు. ఆక్వా రంగంలో ఆంధ్రప్రదేశ్ ఆవిష్కరణలు చేస్తే, భారతదేశ బ్లూ ఎకానమీ నిస్సందేహంగా ముందుకు సాగుతుందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలుచేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.