అప్ఘనిస్థాన్తో ఏకైక టెస్టు మ్యాచ్ కోసం టీమిండియా రెడీ అయింది. ముల్లాన్పూర్ వేదికగా జరిగే ఈ టెస్టు మ్యాచ్ కోసం ఇరు జట్లు సిద్ధమయ్యాయి. ఐపీఎల్ 2026 తర్వాత టీమిండియా ఆడుతున్న తొలి మ్యాచ్ కూడా ఇదే
అప్ఘనిస్థాన్తో ఏకైక టెస్టు మ్యాచ్ కోసం టీమిండియా రెడీ అయింది. ముల్లాన్పూర్ వేదికగా జరిగే ఈ టెస్టు మ్యాచ్ కోసం ఇరు జట్లు సిద్ధమయ్యాయి. ఐపీఎల్ 2026 తర్వాత టీమిండియా ఆడుతున్న తొలి మ్యాచ్ కూడా ఇదే కావడం విశేషం. అయితే, ఏకైక టెస్టు మ్యాచ్ కావడంతో ప్లేయింగ్ 11లో ఎవరెవరు ఆడుతారు అనేది ఆసక్తికరంగా మారిన వేళ.. కోచ్ గౌతమ్ గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా హెచ్ కోచ్ గౌతమ్ గంభీర్ యువ బ్యాటర్ సాయి సుదర్శన్కు తన పూర్తి మద్దతు ప్రకటించాడు. అప్ఘనిస్థాన్తో జరిగే టెస్టులో నెంబర్ 3లో సాయి సుదర్శన్ను ఆడించనున్నట్లు క్లారిటీ ఇచ్చాడు. సాయి సుదర్శన్కు తగినన్ని అవకాశాలు ఇవ్వలేదని పేర్కొన్న గంభీర్.. భవిష్యత్లో మరిన్ని అవకాశాలు ఇవ్వనున్నట్లు చెప్పకనే చెప్పాడు. అప్ఘనిస్థాన్తో టెస్టు మ్యాచ్కు ముందు మీడియాతో మాట్లాడిన గంభీర్.. సాయి సుదర్శన్కు పెద్ద అవకాశాలు దక్కలేదని చెప్పాడు. ఇంగ్లండ్లోనే ఎక్కువగా ఆడాడని, సొంతగడ్డపై అవకాశాలు ఇవ్వాలంటూ చెప్పాడు. అదేవిధంగా ఐపీఎల్లో 700 పరుగులు చేశాడని, కేవలం నాలుగైదు మ్యాచ్ల ఆధారంగా అతడిని అంచానా వేస్తే భవిష్యత్ కోసం బలమైన జట్టును నిర్మించలేమని గంభీర్ తెలిపాడు. అప్ఘనిస్థాన్తో జరిగే టెస్టు కోసం యువ ఆటగాళ్లను బీసీసీఐ ఎంపిక చేసింది. గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే, మానవ్ సుతార్కి స్క్వాడ్లో అవకాశం కల్పించారు. దేవదత్ పడిక్కల్, ప్రసిద్ధ్ కృష్ణ కూడా స్క్వాడ్లో ఉన్నారు. వీరితో పాటు కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, మొహమ్మద్ సిరాజ్ లాంటి సీనియర్ ప్లేయర్లు కూడా ఉన్నారు. తెలుగోడు నితీష్ కుమార్ రెడ్డికి ఆల్రౌండర్ కోటాలో చోటు దక్కగా.. జడేజాను పక్కనబెట్టారు. టీమిండియా స్క్వాడ్శుభ్మన్ గిల్ (కెప్టెన్), రిషభ్ పంత్, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్ , ధృవ్ జురేల్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ, మొహమ్మద్ సిరాజ్, గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే, దేవదత్ పడిక్కల్, మానవ్ సుతార్.