
కోలీవుడ్ దళపతి విజయ్ నటిస్తున్న చివరి చిత్రం కావడంతో ‘జయ నాయగన్‘ పై అటు ఇండస్ట్రీలోనూ, ఇటు ప్రేక్షకులలోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి.
కోలీవుడ్ దళపతి విజయ్ నటిస్తున్న చివరి చిత్రం కావడంతో ‘జయ నాయగన్‘ పై అటు ఇండస్ట్రీలోనూ, ఇటు ప్రేక్షకులలోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ను కేవీఎన్ ప్రొడక్షన్స్ అత్యంత భారీ బడ్జెట్తో నిర్మించింది. కానీ సెన్సార్ సర్టిఫికెట్ జాప్యం కారణంగా ఎప్పుడో విడుదల కావలసిన ఈ సినిమా వాయిదా పడుతూ వస్తుంది. ఇప్పుడు తమిళనాడు డిస్ట్రిబ్యూషన్ రంగంలో జయ నాయగన్ పై ఒక సంచలన వార్త చక్కర్లు కొడుతోంది.
వాస్తవానికి ఈ చిత్రాన్ని ఈ ఏడాది జనవరి 9వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. కానీ దాదాపు ఆరు నెలలుగా ఈ సినిమా విడుదల వాయిదా పడుతూ వస్తోంది. తమిళనాడులోని వివిధ ప్రాంతాలకు చెందిన బయ్యర్లు ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ను భారీ ధరలకు కొనుగోలు చేశారు. కానీ సినిమా అనుకున్న సమయానికి రిలీజ్ కాకపోవడంతో రిలీజ్ ఆలస్యం అవుతుండటంతో వ్యాపార పరంగా బయ్యర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సినిమా విడుదల మరింత ఆలస్యం అయ్యేలా కనిపించడంతో నిర్మాత సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ ఒక కీలక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. తమిళనాడు బయ్యర్ల నుండి తీసుకున్న అడ్వాన్స్ మొత్తాలను తిరిగి చెల్లించాలని మేకర్స్ భావిస్తున్నారట. అసలు మొత్తమే కాకుండా ఈ ఆరు నెలల కాలానికి సరిపడా వడ్డీని కూడా కలిపి బయ్యర్లకు సెటిల్ చేయాలని కేవీఎన్ ప్లాన్ చేస్తోందనే టాక్ కోలీవుడ్ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. విజయ్ కెరీర్ లోనే ల్యాండ్ మార్క్ మూవీగా భావిస్తున్న ఈ చిత్రం బిజినెస్ వ్యవహారాల్లో జరుగుతున్న పరిణామాలు చోటుచేసుకోవడం ఇప్పుడు కొలువుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.