
Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం నాడు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. నగరంలో ప్రతిష్టాత్మకంగా జరగనున్న సముద్ర ఆహార ఉత్పత్తుల (సీఫుడ్) ఎగుమతుల జాతీయ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సీఎం చంద్రబాబు సైకిల్పై ప్రయాణించనుండటం విశేషం. అధికారిక షెడ్యూల్ ప్రకారం.. శుక్రవారం ఉదయం 8:30 గంటలకు అమరావతి నుంచి బయలుదేరే ముఖ్యమంత్రి, 10:00 గంటలకు విశాఖలోని ఆంధ్రా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణానికి చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన ‘నెట్ జీరో’ కార్యక్రమంలో భాగంగా ఆయన మొక్కలు నాటుతారు. అనంతరం అక్కడి నుంచి బీచ్ రోడ్డులోని నోవోటెల్ హోటల్ వరకు పర్యావరణ పరిరక్షణ సందేశాన్ని ఇస్తూ సైకిల్పై ప్రయాణిస్తారు. Read also: AP NDA Meeting: ఏపీ కూటమి ప్రభుత్వ రెండేళ్ల వేడుకలు.. చంద్రబాబు అధ్యక్షతన కీలక నేతల భేటీ! బీచ్ రోడ్డులోని నోవోటెల్ హోటల్లో నిర్వహించనున్న జాతీయ సీఫుడ్ ఎక్స్పోర్ట్స్ వర్క్షాప్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొంటారు. ఈ కీలక సదస్సుకు కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, చిరాగ్ పాశ్వాన్, రాజీవ్ రంజన్ సింగ్, జార్జ్ కురియన్, ఎస్పీ సింగ్ భగేల్ వంటి పలువురు అగ్రనేతలు, ప్రముఖులు హాజరుకానున్నారు. ఈ సదస్సులో మత్స్య రంగం, ఆక్వాకల్చర్లో ఉన్న సరికొత్త అవకాశాలు, నూతన స్టార్టప్లను ప్రోత్సహించడం వంటి అంశాలపై దేశవ్యాప్త నిపుణులతో కలిసి విస్తృతంగా చర్చించనున్నారు. ఈ వర్క్షాప్లో ప్రధానంగా యూ్రోపియన్ యూనియన్తో పాటు ఇతర అంతర్జాతీయ మార్కెట్లకు భారతదేశ సముద్ర ఉత్పత్తులను మరింత ఎక్కువగా ఎగుమతి చేయడం, ప్రస్తుతం ఎదురవుతున్న సవాళ్లు, ప్రత్యామ్నాయ మార్కెట్ల అన్వేషణపై దృష్టి సారించనున్నారు. ఉత్పత్తుల నాణ్యతను గుర్తించే ట్రేసబిలిటీ వ్యవస్థలను పటిష్ఠం చేయడం, ఆక్వాకల్చర్లో అంతర్జాతీయ సర్టిఫికేషన్ విధానాలను అమలు చేయడం ద్వారా స్థిరమైన పద్ధతులను అవలంబించడంపై చర్చిస్తారు. అలాగే, డీప్ సీ ఫిషింగ్ ( సముద్రంలో వేట), అండమాన్ నికోబార్, లక్షద్వీప్
వంటి ప్రాంతాల్లో లభించే అధిక విలువైన మత్స్య సంపదను సద్వినియోగం చేసుకోవడం, సీవీడ్ (సముద్రపు నాచు), ముత్యాల పెంపకం వంటి సరికొత్త రంగాల అభివృద్ధిపై కూడా ఈ సదస్సులో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.
సముద్ర ఉత్పత్తులకు విలువ జోడింపును (Value Added Products) పెంచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అందిస్తున్న ప్రాజెక్ట్ లింక్డ్ ఇన్సెంటివ్ (PLI) స్కీమ్, ఎంఎస్ఎంఈ (MSME) రంగానికి లభించే మద్దతుపై ఈ వర్క్షాప్లో అవగాహన కల్పిస్తారు. ఈ వేదికపై నుంచే పీఎంకేఎస్ఎస్వై (PMKSSY), కిసాన్ క్రెడిట్ కార్డ్ (KCC) పథకాలకు ఎంపికైన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ప్రోత్సాహకాలను అందజేయనున్నారు. సదస్సు ముగిసిన అనంతరం, విశాఖపట్నం ఎకనమిక్ రీజియన్ అభివృద్ధిపై ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. ఈ అధికారిక పర్యటన ముగించుకుని సాయంత్రం ఆయన తిరిగి అమరావతికి పయనమవుతారు.
Sabja Lemon Drink: సమ్మర్ స్పెషల్..శరీర వేడిని తగ్గించే సబ్జా లెమన్ డ్రింక్
Peddi: ‘పెద్ది’ సినిమా కోసం జపాన్ నుంచి హైదరాబాద్కు అభిమానులు
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.
Nellore Crime News:యువకుడిని చంపేందుకు ప్లాన్.. నెల్లూరులో 10 మంది అరెస్ట్!
Nellore Gold Theft Case:నెల్లూరులో భారీ చోరీ.. 210 గ్రాముల బంగారం మాయం!
AP NDA Meeting: ఏపీ కూటమి ప్రభుత్వ రెండేళ్ల వేడుకలు.. చంద్రబాబు అధ్యక్షతన కీలక నేతల భేటీ!
AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ సమావేశం..అమరావతిలో ‘అమరావతి ఐ’ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్
Gutha Sukhender Reddy: పవన్ కల్యాణ్ భాష, తీరు బాలేదు.. ఏపీ కూటమి నేతలపై గుత్తా సుఖేందర్ రెడ్డి ఫైర్!
AP Politics: పవన్ కళ్యాణ్కు కేవీపీ రామచంద్ర రావు బహిరంగ లేఖ