
దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది.
ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్సైట్కు సంబంధించిన వీడియో కంటెంట్పై కూడా అవగాహన ఉంది..
Karimnagar Crime News: ఉపాధి ఆశ చూపిన ఓ కిరాతకుడు నమ్మకద్రోహానికి పాల్పడ్డాడు.. పని ఇప్పిస్తానని నమ్మించి.. ఓ అమాయక మహిళను నిర్మానుష ప్రాంతానికి తీసుకెళ్లి.. ఆమె మెడలో ఉన్న బంగారాన్ని దోచుకోవడమే కాకుండా.. సాక్ష్యం లేకుండా చేయాలని కుట్రతో బావిలోకి తోసేసిన దారుణ ఘటన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ గ్రామంలో వెలుగు చూసింది. మృత్తుతో పోరాడి.. ప్రాణాలతో బయటపడ్డ ఆ మహిళ ఉదాంత స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టిస్తుంది..
నమ్మించి తీసుకెళ్లి.. నట్టేట ముంచాడు.. పోలీసులతో పాటు స్థానికులందించిన కథనం ప్రకారం.. కరీంనగర్ నగరానికి చెందిన ఓ మహిళ కొద్దిరోజులుగా పని కోసం వెతుకులాడుతోంది.. దీనిని ఆసరాగా చేసుకున్న ఒక గుర్తు తెలియని వ్యక్తి.. ఆమెకు మంచి పని ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి నమ్మించాడు.. అతని మాటలను నిజమని నమ్మిన సదరు మహిళ.. అతను చెప్పిన చోటుకు వెళ్ళింది. పథకం ప్రకారం ఆ వ్యక్తి ఆమెను నుస్తులాపూర్ శివారులోని ఒక నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు.
చుట్టుపక్కల ఎవ్వరూ లేరని నిర్ధారించుకున్నాక.. ఆ కిరాతకుడు తన అసలు రూపాన్ని బయట పెట్టాడు.. మహిళపై ఒక్కసారిగా దాడి చేసి ఆమె మెడలో ఉన్న అర్థతులం బంగారు గొలుసును బలవంతంగా లాక్కున్నాడు.. అంతటితో ఆగకుండా ఆమె గట్టిగా కేకలు వేస్తే ఎక్కడ దొరికిపోతానో అనే భయంతో.. పక్కనే ఉన్న ఒక పాడుబడిన వ్యవసాయ బావిలోకి ఆమెను నెట్టేసి అక్కడి నుంచి పరారయ్యాడు..
బావిలోనే 24 గంటల నరకయాతన.. బావిలో పడిపోయిన బాధితురాలు తీవ్రభయాందోళనకు గురయ్యింది.. లోతైన ఆ భావించి పైకి రావడం సాధ్యం కాకపోవడంతో పాటు చుట్టుపక్కల జనాలు లేకపోవడంతో ఆమె పెట్టిన కేకలు ఎవరికి వినిపించలేదు.. దాదాపు 24 గంటల పాటు ఆమె నీటిలో.. ఆ చీకటి బావిలోనే ప్రాణాల కోసం కొట్టుమిట్టాడింది.. ఆకలితో పాటు దాహం, భయంతో నరకయాతన అనుభవించింది.. అయినప్పటికీ ధైర్యం కోల్పోకుండా ప్రాణాలను నిలబెట్టుకుంది..
రక్షించిన బావి యజమాని.. మర్రిశెట్టి రోజు ఉదయం బావి యజమాని తన పొలానికి వచ్చి.. బావి వైపు వెళ్లక లోపలి నుంచి మహిళ ములుగుతున్న శబ్దం వినిపించింది. అనుమానంతో లోపలికి తొంగి చూడగా.. ఒక మహిళ ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతూ కనిపించింది.. వెంటనే సదరు యజమాని గ్రామంలోని స్థానికులకు సమాచారం అందించాడు..
రంగంలోకి పోలీసులు.. ఈ ఘోర ఉదాంతం పై సమాచారం అందుకున్న తిమ్మాపూర్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు.. బాధితురాలి ప్రథమక చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.. అనంతరం ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.. అపరిచిత వ్యక్తుల మాటలు నమ్మి ఒంటరిగా నిర్మానుష ప్రాంతాలకు వెళ్ళవద్దని.. మహిళలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని.. నిందితుడిని పట్టుకోవడానికి ప్రత్యేకమైన బృందాలను రంగంలోకి దించామని పోలీసులు తెలిపారు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.