
కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
అసత్యాలతో ప్రజలను మబ్బే పెట్టే కార్యక్రమం రేవంత్రెడ్డి ప్రభుత్వం చేస్తోందని విమర్శించారు. ప్రతిపక్షాలకు సమాధానం ఇచ్చే తెగువ కాంగ్రెస్ సర్కార్కి లేదని ఎద్దేవా చేశారు. గతంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (Revanth Reddy)కూడా సవాల్ చేశారని, ప్రెస్క్లబ్కి వెళ్తే ఎందుకు రాలేదని ప్రశ్నించారు. అప్పుల విషయంలో దమ్ముంటే రావాలని సీఎం సవాల్ చేశారని తెలిపారు. చర్చించడానికి తాము సిద్ధమని రేవంత్రెడ్డికి చెప్పామని, ఎక్కడైనా చర్చకు సిద్ధమేనని స్పష్టం చేశారు. సవాల్ విరిసిన ముఖ్యమంత్రి పారిపోయారని సెటైర్లు గుప్పించారు. మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao,) మధ్యలో సవాల్ విసిరారని, సీఎం పంపితే జూపల్లి వస్తున్నారని తాము అనుకున్నామని, కానీ పనికి మాలిన డైలాగ్లను జూపల్లి కొడుతున్నారని అన్నారు. సవాల్ విసిరి మంత్రులు పారిపోతున్నారంటేనే, ఈ ప్రభుత్వ అసమర్థత ఏంటో తెలిసిందని ఎద్దేవా చేశారు. మాజీ మంత్రి హరీశ్రావు (Harish Rao) చర్చకు బయల్దేరగానే ఈ ప్రభుత్వం ఎందుకు అరెస్ట్ చేయించిందని ప్రశ్నించారు. గన్పార్కు రమ్మన్నారని, వెళ్తుంటే అరెస్ట్ చేశారని మండిపడ్డారు. చేతకాని వాళ్లు ఎందుకు సవాల్ విసరాలి? అని నిలదీశారు.