
మునగాకును ఇప్పుడు సూపర్ ఫుడ్ గా చెప్పుకుంటున్నారు. ఇందులో ఉండే పోషకాలు, రోగనిరోధక శక్తి కారణంగా ప్రపంచవ్యాప్తంగా దీనికి డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది. 2025 నాటికి 0.
65 బిలియన్ డాలర్లుగా ఉన్న గ్లోబల్ మునగాకు పౌడర్ మార్కెట్, 2035 నాటికి 1.16 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా. అయితే ఈ గ్లోబల్ డిమాండ్లో 80 శాతం మన భారతదేశమే తీరుస్తోంది. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్న దీపక్, సంతోష్.. తమ 15 ఎకరాల భూమిలో మొత్తం 3 ఎకరాల్లో మునగ సాగు మొదలుపెట్టారు. ఎక్కువ ఆకు దిగుబడినిచ్చే 'వలియాపట్టి' (Valiyapatti) రకం విత్తనాలను చల్లారు. ఇందుకోసం వీళ్లు తమిళనాడులోని కోయంబత్తూరు వరకు వెళ్లారు.
చాలామంది రైతులు మునగాకును అమ్మి డబ్బు సంపాదిస్తారు. కానీ వారికి వచ్చేది చాలా తక్కువ. కానీ ఈ మాజీ సైనికులు ఇక్కడే తమ తెలివిని ఉపయోగించారు. ఆకును నేరుగా అమ్మకుండా, దాన్ని పౌడర్గా మార్చి 'దివ్యనితి ఆగ్రో అండ్ ఫుడ్ ప్రొడక్ట్స్' పేరుతో సొంత బ్రాండ్ను మార్కెట్లోకి తెచ్చారు. పౌడర్ను 100 గ్రాముల ప్యాకెట్లుగా మార్చి రూ. 80కి అమ్మసాగారు. సొంత బ్రాండ్పై అమ్మితే కిలోకు రూ.800 వస్తుంది.
మునగ సాగులో ఉన్న అతిపెద్ద ప్లస్ పాయింట్.. దీనికి ఎక్కువ నీరు, నిర్వహణ అవసరం లేదు. మొదట్లో ఆకులను నీడలో ఆరబెట్టేందుకు షెడ్, పౌడర్ చేసే 'పల్వరైజర్' (Pulveriser) యంత్రం కోసం సుమారు రూ.5 లక్షలు పెట్టుబడి పెట్టారు. ఆ తర్వాత, రసాయన ఎరువులకు బదులు, ఆవు పేడ, వర్మీకంపోస్ట్, స్థానికంగా తయారుచేసే 'తక్ అండి సంజీవక్' (Tak Andi Sanjeevak) అనే సహజ పోషక ద్రావణాన్ని మాత్రమే వాడుతున్నారు. ఏడాదికి 3 నుంచి 4 సార్లు సులభంగా ఆకు కోతకు వస్తుంది. వీరికి నష్టమే లేకుండా సొంత బిజినెస్ చక్కగా నడుస్తోంది.
మీ ఆహార ఉత్పత్తి ఏదైనా అమ్మేందుకు FSSAI లైసెన్స్ తీసుకోవాలి. 100 గ్రా, 250 గ్రా ప్యాకెట్లలో ఆకర్షణీయంగా ప్యాక్ చేసి ఆన్లైన్లో (Amazon, Flipkart), స్థానిక ఆర్గానిక్ స్టోర్లలో అమ్మడం మొదలుపెట్టాలి. సాంప్రదాయ వ్యవసాయ పద్ధతులను వీడి, పండించిన పంటను మనమే వాల్యూ యాడ్ చేసి, బ్రాండింగ్ చేసి అమ్మితే.. వ్యవసాయంలో కూడా ఐటీ ఉద్యోగాల కన్నా ఎక్కువ సంపాదించవచ్చు.