
మహారాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులకు దారితీసే ఒక సంచలన పరిణామం తెరపైకి వచ్చింది. సీనియర్ నేత శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ (ఎస్పీ - శరద్ పవార్ శ్రేణి) పార్టీని, కాంగ్రెస్లో విలీనం చేసే దిశగా ఇరు...
మహారాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులకు దారితీసే ఒక సంచలన పరిణామం తెరపైకి వచ్చింది. సీనియర్ నేత శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ (ఎస్పీ - శరద్ పవార్ శ్రేణి) పార్టీని, కాంగ్రెస్లో విలీనం చేసే దిశగా ఇరు పార్టీల మహారాష్ట్ర రాష్ట్రస్థాయి విభాగాల మధ్య అత్యంత రహస్యంగా చర్చలు జరుగుతున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఒకవేళ ఈ విలీనం గనుక సఫలమైతే, మహారాష్ట్ర ప్రతిపక్ష రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోనుంది.ప్రస్తుతం ఈ విలీన ప్రతిపాదనలపై రాష్ట్రస్థాయిలోనే ప్రాథమిక చర్చలు జరుగుతున్నాయి. ఎన్సీపీ (ఎస్పీ) తమ పార్టీ అంతర్గతంగా నేతలందరి మధ్య ఒక ఏకాభిప్రాయాన్నిసాధించిన తర్వాత, ఈ అంశాన్ని ఢిల్లీలోని కాంగ్రెస్ అధిష్ఠానం వద్దకు తీసుకెళ్లి తుది నిర్ణయం తీసుకోనున్నారు. నిజానికి, 2024 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఈ విలీన ఆలోచన వచ్చినప్పటికీ.. ఎన్నికల ప్రచారం, వ్యూహాల బిజీ వల్ల దీనిని తాత్కాలికంగా పక్కన పెట్టారు. ఇప్పుడు ఎన్నికలు ముగిసిన తర్వాత ఈ ప్రక్రియ మళ్లీ ఊపందుకుంది.కూటమిలో కుదుపు.. 27 ఏళ్ల చరిత్రకు ముగింపు?ఈ విలీన వార్తలు 'మహా వికాస్ అఘాడీ' (ఎంవీఏ - కాంగ్రెస్, ఎన్సీపీ శరద్ పవార్, శివసేన ఉద్ధవ్ థాకరే) కూటమిలో తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఇటీవల ఉద్ధవ్ థాకరే వర్గంలో జరిగిన తిరుగుబాట్లు, అలాగే కూటమి ఐక్యతపై స్వయంగా ఉద్ధవ్ థాకరే బహిరంగంగానే అనుమానాలు వ్యక్తం చేయడంతో ఎంవీఏ భాగస్వామ్య పక్షాల మధ్య ఇప్పటికే తీవ్రమైన భేదాభిప్రాయాలు నడుస్తున్నాయి. ఈ తరుణంలో కాంగ్రెస్, ఎన్సీపీ విలీన ప్రయత్నాలు కూటమి భవిష్యత్తును