
భారత స్టార్ బ్యాటర్, 'కింగ్ కోహ్లీ' విరాట్ కోహ్లీ క్రికెట్ మైదానంలోకి తిరిగి అడుగుపెట్టేందుకు ముమ్మరంగా సన్నద్ధమవుతున్నాడు.
టీమిండియా మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ పర్యవేక్షణలో కోహ్లీ నెట్స్లో తీవ్రంగా శ్రమిస్తున్న ఒక వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇంగ్లాండ్ జరగనున్న వన్డే సిరీస్తో కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్లోకి గ్రాండ్ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడనే వార్తలకు ఈ వీడియో మరింత బలాన్ని చేకూర్చడంతో అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. 2014 నుండి 2019 వరకు కోహ్లీ కెరీర్లో అత్యంత విజయవంతమైన కాలంలో సంజయ్ బంగర్ భారత జట్టుకు బ్యాటింగ్ కోచ్గా వ్యవహరించడం గమనార్హం.ఈ కీలక సిరీస్ కోసం కోహ్లీ ఇప్పటికే ముంబై, అలీబాగ్లలో ప్రత్యేక బ్యాటింగ్ క్యాంప్ను పూర్తి చేసుకున్నాడు. తన బ్యాటింగ్ టెక్నిక్లో కొన్ని మార్పులు, చేర్పులు చేసుకునేందుకు కోహ్లీ ఈ శిక్షణలో ప్రత్యేక శ్రద్ధ పెట్టాడు. జూలై 14 నుండి ప్రారంభం కానున్న 3 మ్యాచ్ల వన్డే సిరీస్ కోసం ప్రకటించిన 15 మంది సభ్యుల భారత జట్టులో విరాట్ కోహ్లీకి చోటు దక్కింది. అయితే, గతంలో ఎదురైన గాయం ఆందోళనల నేపథ్యంలో, కోహ్లీ ఈ సిరీస్లో ఆడటం అనేది పూర్తిగా 'ఫిట్నెస్ క్లియరెన్స్'పైనే ఆధారపడి ఉంది.వన్డే ఫార్మాట్పైనే పూర్తి దృష్టిటెస్టులు, టీ20 అంతర్జాతీయ క్రికెట్కు ఇప్పటికే రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇకపై వన్డే ఫార్మాట్లోనే దేశానికి ప్రాతినిధ్యం వహించనున్నారు. కోహ్లీ పునరాగమనం కోసం అభిమానులతో పాటు ఆయన చిన్ననాటి కోచ్ రాజ్కుమార్ శర్మ కూడా