
తెలంగాణ టీ20 (TG20) లీగ్లో హైదరాబాద్ ఛాంపియన్స్ జట్టు ప్లే ఆఫ్స్కు అర్హత సాధించింది. కెప్టెన్ అభిరత్ రెడ్డి అజేయ సెంచరీతో చెలరేగడంతో, వరంగల్ వారియర్స్పై 6 వికెట్ల తేడాతో హైదరాబాద్ ఘన విజయం...
తెలంగాణ టీ20 (TG20) లీగ్లో హైదరాబాద్ ఛాంపియన్స్ జట్టు ప్లే ఆఫ్స్కు అర్హత సాధించింది. కెప్టెన్ అభిరత్ రెడ్డి అజేయ సెంచరీతో చెలరేగడంతో, వరంగల్ వారియర్స్పై 6 వికెట్ల తేడాతో హైదరాబాద్ ఘన విజయం సాధించింది.వరంగల్ నిర్దేశించిన 174 పరుగుల లక్ష్యాన్ని హైదరాబాద్ ఛాంపియన్స్ కేవలం 15.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ అభిరత్ రెడ్డి కేవలం 43 బంతుల్లో 7 ఫోర్లు, 9 సిక్సర్లతో 101 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతనికి గణేష్ గాడ్గు (31 బంతుల్లో 50) అర్ధ సెంచరీతో చక్కటి సహకారం అందించాడు. వరంగల్ బౌలర్లలో సల్మాన్ ఖాన్, క్రాంతి చెరో వికెట్ పడగొట్టారు.అంతకుముందు, తొలుత బ్యాటింగ్ చేసిన వరంగల్ వారియర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. ఆ జట్టులో అమన్ రావు (45), రిషికేత్ (38) రాణించారు. హైదరాబాద్ బౌలర్లలో అజయ్ దేవ్ గౌడ్ 27 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టి వరంగల్ స్కోరును కట్టడి చేశాడు.ఈ టోర్నమెంట్లో అభిరత్ రెడ్డికి ఇది తొలి సెంచరీ కావడం విశేషం. ఈ విజయంతో హైదరాబాద్ జట్టు ఐదో గెలుపును నమోదు చేసి, 10 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానానికి చేరుకోవడమే కాకుండా ప్లే ఆఫ్స్ బెర్త్ను ఖరారు చేసుకుంది. రంగారెడ్డి రైడర్స్, అనురాగ్ నల్గొండ నైట్స్, అన్విత్ ఖమ్మం ఏసెస్ జట్లు తలా 6 పాయింట్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.ఇదే లీగ్లో జరిగిన మరో మ్యాచ్లో, ఖమ్మం ఏసెస్ జట్టు నల్గొండ నైట్స్పై