
విమాన ఇంధనానికీ ఊరట గృహ వినియోగ ఎల్పీజీలో మార్పులేదు దిల్లీ: వాణిజ్య వినియోగదారులు హోటళ్లు, రెస్టారెంట్లలో వాడే వంటగ్యాస్ ధర తగ్గింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు సడలి..
అంతర్జాతీయంగా చమురు ధరలు దిగి వస్తుండటంతో ప్రభుత్వరంగ చమురు సంస్థలు బుధవారం కొత్త ధరల్ని ప్రకటించాయి. విమానాల్లో వినియోగించే ఇంధనం (ఏటీఎఫ్) ధరను కూడా తగ్గించాయి.
ప్రభుత్వరంగ సంస్థలు చమురు ధరల్ని మార్చలేదు. ప్రైవేటు రంగంలోని నయారా ఎనర్జీ సంస్థ మాత్రం తమ పెట్రోలుపై లీటరుకు రూ.5, డీజిల్పై రూ.3 తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఇరాన్ యుద్ధం మొదలయ్యాక ఎంత పెంచిందో అంత ధరను ఇప్పుడు తగ్గించింది. గత రెండేళ్లలో ఇంధన సరఫరాదారుల్లో ఎవరైనా ధర తగ్గించడం ఇదే తొలిసారి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.