
హీరోయిన్స్ గా రాణించడం అంటే అంత ఈజా కాదు. అవకాశాలు రావడమే కష్టం.. అయితే వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవడం కూడా అంతే కష్టం. చాలా మంది
హీరోయిన్స్ తమ నటనతో ప్రేక్షకులను కట్టిపడేస్తూ హీరోయిన్స్ గా రాణిస్తున్నారు. చాలా మంది అందాల తారలు చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి వచ్చి సక్సెస్ అయ్యారు. అవుతున్నారు కూడా.. అలాగే కొంతమంది ముద్దగుమ్మలు పెద్దగా చదువుకోకపోయినా సెలబ్రేటీలుగా మారి ఎంతో మందికి స్పూర్తిగా నిలుస్తున్నారు.
ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ కూడా పెద్దగా చదువుకోకపోయినా ఇండస్ట్రీలో స్టార్ గా ఎదిగింది. ఈ స్టార్ హీరోయిన్ పదోవ తరగతి కూడా పాస్ కాలేదు.. కానీ రెమ్యునరేషన్ మాత్రం రూ.25 కోట్లు.. ఆస్తులు రూ.200 కోట్ల పైనే..ఇంతకూ ఆ వయ్యారి భామ ఎవరో తెలుసా..? ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసి రాణించింది ఆ వయ్యారి. ఇంతకూ ఆ ముద్దుగుమ్మ మరెవరో కాదు. చాలా మంది అభిమాన హీరోయిన్ ఆమె. ఆమె పేరు చెప్తే కుర్రకారు కేరింతలు కొడతారు.
తెలుగులో వెంకటేష్, బాలకృష్ణ లాంటి లెజెండ్ యాక్టర్స్ సరసన నటించి మెప్పించింది ఆ బ్యూటీ . కానీ ఆమె టాలీవుడ్ భామ కాదు. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న ఆ అమ్మడు.. తెలుగులో రెండే రెండు సినిమాలు చేసింది. ఆమె మరెవరో కాదు కత్రినా కైఫ్. ఈ భామ తెలుగులో వెంకటేష్ తో మల్లీశ్వరి సినిమా చేసింది. మల్లీశ్వరి సినిమా మంచి విజయాన్ని అందుకుంది. దాంతో టాలీవుడ్ లో మరో ఛాన్స్ అందుకుంది.
నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన అల్లరి పిడుగు సినిమా చేసింది. కానీ ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. దాంతో టాలీవుడ్ వదిలి తిరిగి బాలీవుడ్ కు చెక్కేసింది. బాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా దూసుకుపోతుంది ఈ అమ్మడు. బాలీవుడ్ లో ఈ చిన్నది స్టార్ హీరోయిన్ గా గుర్తిపు తెచ్చుకుంది. అంతే కాదు హిందీ యంగ్ హీరో విక్కీ కౌశల్ ను వివాహం చేసుకుంది కత్రినా కైఫ్. ఈ జంట ఇప్పుడు హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నారు. పెళ్లి తర్వాత కత్రిన సినిమాలు తగ్గించింది.
అందాల కత్రినా కైఫ్ పదవతరగతి కూడా పాస్ కాలేదట.. కానీ తన నటనతో స్టార్ గా మారిపోయింది. అంతే కాదు ఈ బ్యూటీ ఒకొక్క సినిమాకు రూ.25 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటుంది. ఈ విషయాన్ని గతంలో ఆమె ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. కత్రినా కైఫ్ బాలీవుడ్ లో స్టార్ హీరోలందరి సరసన నటించింది. అలాగే ఈ అమ్మడి ఆస్తి దాదాపు రూ. 200కోట్లకు పైనే.. సోషల్ మీడియాలోనూ కత్రినా కైఫ్ చాలా యాక్టివ్ గా ఉంటుంది.