
ఎయిడ్స్ వ్యాధితో బాధపడుతున్న ఒక మహిళకు మత్తుమందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని ముంబై సెషన్స్ కోర్టు నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పునిచ్చింది.
ఈ కేసు విచారణ జరుగుతున్న సమయంలోనే సదరు బాధితురాలు అదృశ్యం కావడం, పోలీసులు ఎంత ప్రయత్నించినా ఆమె ఆచూకీ లభించకపోవడమే నిందితుడి విడుదలకు ప్రధాన కారణమైంది. బాధితురాలి సాక్ష్యం లేకపోవడం వల్ల నేరం నిరూపితం కాలేదని కోర్టు స్పష్టం చేసింది.అసలేం జరిగిందంటే..ఈ కేసు నేపథ్యం 2018 నాటి సంఘటనకు సంబంధించింది. అప్పట్లో 35 ఏళ్ల వయసున్న సదరు మహిళ తన భర్తతో గొడవపడి ఇల్లు వదిలి వచ్చేసింది. విఖ్రోలి బస్ స్టాప్ వద్ద ఆమె నిలబడి ఉండగా, నిందితుడు ఆమెను తన బస్సులో తీసుకెళ్తానని నమ్మబలికాడు. బస్సును కొంతదూరం తీసుకెళ్లిన తర్వాత, ఆమెకు మత్తుమందు కలిపిన కూల్డ్రింక్ ఇచ్చి, స్పృహ కోల్పోయాక ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడని అప్పట్లో కేసు నమోదైంది. ఆ తర్వాత స్పృహలోకి వచ్చిన మహిళ.. పోలీస్ హెల్ప్లైన్కు ఫోన్ చేసి సమాచారం అందించడంతో పోలీసులు ఆమెను రక్షించారు. ఈ కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు 2023లో నిందితుడిని అరెస్ట్ చేయగా, అతడు తనపై వచ్చిన ఆరోపణలను తోసిపుచ్చాడు.ఆధారాలు సరిపోవన్న న్యాయస్థానంఈ కేసు విచారణ సందర్భంగా స్పెషల్ జడ్జి సురేఖ సిన్హా కీలక వ్యాఖ్యలు చేశారు. నిందితుడు, బాధితురాలు మాత్రమే ఉన్న సమయంలో ఈ ఘటన జరిగిందని ఆరోపణలు వచ్చాయని.. కాబట్టి ఇందులో బాధితురాలి సాక్ష్యం అత్యంత కీలకమైన ఆధారమని కోర్టు పేర్కొంది. అయితే, ఆమె కోర్టుకు హాజరుకాకపోవడంతో ఎఫ్ఐఆర్ లోని అంశాలను