
ఏఐ కంపెనీలు సూపర్ ఇంటెలిజెన్స్ను సృష్టిస్తున్నాయి!
Google DeepMind researcher: కృత్రిమ మేధ (Artificial intelligence) వేగంగా మార్పు చెందడంపై తీవ్ర ఆందోళన ఏర్పడుతోంది.

Google DeepMind researcher: కృత్రిమ మేధ (Artificial intelligence) వేగంగా మార్పు చెందడంపై తీవ్ర ఆందోళన ఏర్పడుతోంది.

ఆవిరి కుడుములంటే గణనాథుడికి మహా ఇష్టం. అందుకే వినాయక చవితి రోజున మోదకాలు చేసి ఆ పార్వతీ నందనుడికి నివేదిస్తాం. సాధారణంగా వీటిని బియ్యప్పిండితో తయారుచేస్తాం. అందులో స్టఫింగ్ కోసం కొబ్బరి తురుము, బెల్లం, నెయ్యి, డ్రైఫ్రూట్స్.. వంటివి వాడతాం.

వైద్య రంగంలో, ముఖ్యంగా డ్రగ్ డెలివరీ (శరీరంలో నిర్దిష్ట భాగాలకు మందులను చేరవేయడం) ప్రక్రియలో విప్లవాత్మక మార్పులకు భారత శాస్త్రవేత్తలు శ్రీకారం చుట్టారు. బిగుసుకుపోయి, ఘనరూపంలో ఉన్న పదార్థాలను సైతం తాత్కాలికంగా ద్రవరూపంలోకి మార్చే ఒక సరికొత్త పద్ధతిని కనుగొన్నారు. ఆకస్మికంగా ఉష్ణోగ్రతను పెంచడం ద్వారా పదార్థాల 'జ్ఞాపకశక్తి' (memory imprints) ముద్రలను చెరిపివేసి, వాటిని ప్రవహించేలా చేయవచ్చని నిరూపించారు. ఈ ఆవిష్కరణతో దుష్ప్రభావాలు తగ్గించి, మరింత సమర్థవంతంగా మందులను లక్షిత కణాలకు చేర్చవచ్చని కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది.బెంగళూరులోని రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (RRI) పరిశోధకులు ఈ కీలక ముందడుగు వేశారు. గ్లాస్ వంటి కొన్ని పదార్థాలు నిర్మాణాత్మకంగా ద్రవాలను పోలి ఉన్నప్పటికీ, యాంత్రికంగా ఘన పదార్థాల వలె ప్రవర్తిస్తాయి. అంతేకాకుండా, అవి తమ గత స్థితులను గుర్తుంచుకోగలవు. ఇలా బిగుసుకుపోయిన వ్యవస్థలను (Jammed Systems) తిరిగి ప్రవహించేలా చేయడంపై పరిశోధకులు దృష్టి సారించారు. ఇందులో భాగంగా, మైక్రోజెల్ కణాలను ఉపయోగించి ప్రయోగాలు నిర్వహించారు. ఈ మైక్రోజెల్ కణాలను వేగంగా వేడి చేసినప్పుడు, వాటిలోని కణాల అమరికలో మార్పులు జరిగి, ఆ వ్యవస్థ తాత్కాలికంగా ద్రవరూపంలోకి మారడాన్ని గమనించారు. ఈ ప్రక్రియలో పదార్థం తన గత స్థితికి సంబంధించిన జ్ఞాపకాలను కోల్పోతుందని గుర్తించారు.ఈ పరిశోధన వివరాలు ప్రఖ్యాత 'జర్నల్ ఆఫ్ కొలాయిడ్ అండ్ ఇంటర్ఫేస్ సైన్స్'లో ప్రచురితమయ్యాయి. RRIలో పీహెచ్డీ విద్యార్థిని, ఈ పరిశోధన పత్రం యొక్క మొదటి రచయిత సోనాలి కవాలే, ఈ ప్రయోగాల కోసం ప్రత్యేకమైన మైక్రోజెల్

Bhimavaram: పవన్ కళ్యాణ్ జన్మదిన బైక్ ర్యాలీ ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు! Bhimavaram: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవర్ కారిడార్లలో డిప్యూటీ సీఎం అనే పదవికి సరికొత్త గ్లామర్, బ్రాండ్ ఇమేజ్ ను తెచ్చిపెట్టిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ అని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) అన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా బుధవారం భీమవరం జనసేన పార్టీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. విస్సాకోడెరు వంతెన దగ్గర జియో పెట్రోల్ బంక్ దగ్గర నుంచి ఉండి రోడ్డులోని మల్టీప్లెక్స్ ఎమ్మెల్యే కార్యాలయం వరకు జనసేన నాయకులు కార్యకర్తలు అభిమానులు వీర మహిళలతో బైక్ ర్యాలీ చేపట్టారు. ర్యాలీని ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ కేవలం ఒక హోదాగా పరిమితం కాకుండా ప్రజల సమస్యలపై తక్షణమే స్పందించే సేవకుడిగా పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో పాలనందిస్తున్నారని అన్నారు. సినిమా పరిశ్రమ నుండి ప్రజా నాయకుడిగా ఎదిగిన పవన్ కళ్యాణ్ ప్రస్థానం ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయమన్నారు. ప్రజాదరణ పొందిన నాయకుడు పవన్ కళ్యాణ్ అని, సమాజ సేవలో నిరంతరం కొనసాగాలని ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని ఎమ్మెల్యే అంజిబాబు అన్నారు. జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు కోటికలపూడి గోవిందరావు మాట్లాడుతూ పవర్ స్టార్ గా అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా ఉండే పవన్ కల్యాణ్ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లూ వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నామని అన్నారు. పంచాయతీ రాజ్ శాఖలో అనేక సంస్కరణలతో అభివృద్ది కార్యక్రమాలతో పెనుమార్పులు తెస్తున్నారని, గిరిజన ప్రజల కష్టాలు తీర్చేలా రోడ్ల నిర్మాణం నుంచి పచ్చదనం పెంపు వరకు ఆయన తీసుకుంటున్న చర్యలు ఉత్తమ ఫలితాలను ఇస్తున్నాయన్నారు. అనంతరం జియో పెట్రోల్ బంక్ దగ్గర నుంచి ఓవర్ బ్రిడ్జి, బుధవారం మార్కెట్ రోడ్, పోలీస్ బొమ్మ సెంటర్, ప్రకాశం చౌక్, అంబేడ్కర్ సెంటర్, బాంబే స్వీట్స్ సెంటర్, ఉండి రోడ్డు మీదుగా ఎమ్మెల్యే

ఇలాంటి జుంకాలు మంచి లుక్ ఇస్తాయి. పట్టు చీరల మీదకు మరింత గ్రేస్ ఫుల్ లుక్ ఇస్తాయి. చీరల మీదకు చాంద్ బాలీ ఇయర్ రింగ్స్ అదిరిపోయే లుక్ ఇస్తాయి. చాలా గ్రాండ్ లుక్ ఇస్తాయి. పువ్వు ఆకారంలో ఉండే స్టడ్ కి.. మ్యాచింగ్ మాటీలతో సహా ఈ జుంకాలు ఉంటాయి. ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతున్నాయి. పట్టు చీరల మీదకు ఇలాంటి గోల్డ్ జుంకాలు చాలా అందంగా ఉంటాయి. ఈ డిజైన్ కూడా మరింత అందంగా ఉంటుంది. మీకు లైట్ వెయిట్ లో జుంకాలు కావాలి అంటే.. ఇలాంటి మీనాకారీ జుంకాలు ట్రై చేయచ్చు. తేలికగా ఉంటాయి. ట్రెండీ లుక్ ఇస్తాయి. Black Beads: నల్లపూసలకు మ్యాచింగ్ బ్రేస్లేట్ డిజైన్లు.. చూసేయండి AD necklace:రూ.వెయ్యికే డైమండ్ లా మెరిసే ఏడీ స్టోన్ నక్లెస్ డిజైన్లు Gold Locket: హార్ట్ షేప్ గోల్డ్ లాకెట్స్.. చూస్తే మనసు పారేసుకుంటారు! Saree Designs: పండగలకు పర్ఫెక్ట్ మ్యాచ్ అయ్యే చీరల డిజైన్లు

విధి చేసిన గాయం ఆ పసిపాప కాళ్లను తుంచేసింది. వయసు ఏడేళ్లు.. ఆడుతూ పాడుతూ బడికి వెళ్లాల్సిన సమయంలో ఒక కాలు లేక నరకం అనుభవిస్తోంది. ఊతకర్ర లేదు, చక్రాల కుర్చీ అంతకంటే లేదు.. కానీ, చదువుకోవాలనే ఆ చిన్నారి సంకల్పం ముందు ఆ వైకల్యం కూడా ఓడిపోయింది! విపరీతమైన పేదరికం, ఒంటికాలితో కుంటుతూ వెళ్లాల్సి వస్తున్నా సరే.. చదువుపై ఉన్న ఆరాటంతో రోజూ వందల మీటర్లు దూకుతూ బడి బాట పడుతోంది ఉత్తరప్రదేశ్ బాలిక రాగిణి. ఈ పసిపాప కష్టాన్ని చూసి ఇటు ఊరి జనం, అటు నెటిజన్లు కన్నీటి పర్యంతమవుతున్నారు.ఆరు నెలల వయసులోనే కోలుకోలేని దెబ్బ!యూపీలోని బల్లియా జిల్లా దిఘేడా గ్రామ పంచాయతీ పరిధిలోని రాణీపూర్ గ్రామానికి చెందిన ఏడేళ్ల రాగిణి కథ ఇది. ఈ చిన్నారికి కేవలం ఆరు నెలల వయసు ఉన్నప్పుడే ఒక దారుణమైన రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ ఘటనలో పాప ఒక కాలు తీవ్రంగా దెబ్బతింది. తండ్రి రెక్కాడితే గానీ డొక్కాడని కూలీ. తీవ్రమైన పేదరికం వల్ల ఆ చిన్నారికి సరైన వైద్యం చేయించలేకపోయారు. కాలక్రమేణా ఒక కాలు పూర్తిగా పాడైపోయింది. అలాగని రాగిణి ఇంట్లో కూర్చోలేదు. తోటి పిల్లలు బడికి వెళ్తుంటే తాను కూడా వెళ్తానని ఏడ్చేది. అలా స్థానిక ప్రాథమిక పాఠశాలలో ఒకటో తరగతిలో చేరింది. Viral Video: వరదలో చిక్కుకున్న బైకర్.. చున్నీతో ప్రాణాలు కాపాడిన నవ వధువురోడ్డుపై ఏడుస్తూనే పాఠశాలకు..ఇంటి నుంచి బడికి ఉన్న 400 మీటర్ల దూరాన్ని రాగిణి ఒంటికాలితో ఎగురుతూ, కుంతుతూ చేరుకుంటుంది. ఈ ప్రయాణం ఆ చిన్నారికి నరకప్రాయంగా మారింది. దారి మధ్యలో అలసిపోయి, నొప్పి తట్టుకోలేక రోడ్డుపైనే కూర్చుని ఏడుస్తూ నాకే ఎందుకీ శిక్ష దేవుడా అని ప్రశ్నిస్తుంటుంది. మళ్లీ కాసేపటికి కన్నీళ్లు తుడ్చుకుని ఒంటికాలితోనే బడి వైపు అడుగులు వేస్తుంది. ఈ దయనీయ స్థితిని చూసి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అమిత్ పాల్ యాదవ్

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Folk dancer Eshwar sai filed bail petition in telangana high court: ఫోక్ డ్యాన్సర్ ఈశ్వర్ సాయి, మాధురీ రాథోడ్ ల వివాదంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాధురీ రాథోడ్ ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనను శారీరకంగా వాడుకొని మోసం చేశాడని మాధురి రాథోడ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)ని ఉపయోగించి తన పరువుకు భంగం కలిగించేలా ఫేక్ వీడియోలు సృష్టించి డిజిటల్ వేధింపులకు గురిచేశాడని కూడా మాధురీ రాథోడ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. మాధురీ రాథోడ్ ఫిర్యాదు చేసినప్పటి నుంచి ఈశ్వర్ సాయి పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈశ్వర్ సాయి తాజాగా.. తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడు. పోలీసులు తనను అరెస్ట్ చేస్తారని భావించి ఈశ్వర్ సాయి తన లాయర్లతో ఈ బెయిల్ పిటిషన్ వేసుకున్నట్లు తెలుస్తొంది. మరోవైపు.. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఈశ్వర్ సాయి, మాధురీ రాథోడ్ లు ఒకే గదిలో అడ్డంగా దొరికిపోయారు. వీరి బండారాన్ని ఈశ్వర్ సాయి శరణ్య బైటపెట్టింది. అప్పట్లో ఈ వీడియో తెగ వైరల్ గా మారింది. తొలుత మాధురీ రాథోడ్ ది తప్పని ప్రచారం జరిగింది. ఇక ఈశ్వర్ సాయి సైతం పదే పదే వీడియోలు రిలీజ్ చేయడంతో మాధురీ రాథోడ్ కూడా అసలు విషయాన్ని బైటపెట్టింది. Read more: Disha Salian Death Case: దిశా
గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి సందర్భంగా సిలికానాంధ్ర మనబడి ఆధ్వర్యంలో అమెరికా అంతటా ‘తెలుగుకు పరుగు’ కార్యక్రమాన్ని నిర్వహించారు. వల్లభాపురపు బాలాజీ, అల్లం శ్రీదేవి నాయకత్వంలో చేపట్టిన ఈ కార్యక్రమం విజయవంతమైంది. తెలుగు భాష గొప్పతనాన్ని చాటిచెప్పడంతో పాటు ‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అనే సందేశాన్ని సమాజానికి అందించడమే ఈ పరుగు ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. చిన్నారుల నుంచి పెద్దల వరకు అన్ని వయస్సుల వారు ఉత్సాహంగా పాల్గొని తెలుగు భాషపై తమ అభిమానాన్ని చాటుకున్నారు. తెలుగు భాషను భావితరాలకు అందించాలనే సంకల్పంతో భాషా సైనికులు, స్వచ్ఛంద సేవకులు సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మనబడి ‘తెలుగుకు పరుగు’ నిర్దేశకుడు వల్లభాపురపు బాలాజీ మాట్లాడుతూ మనబడి నిర్వహిస్తున్న తెలుగు భాషా తరగతులు, 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన నమోదు వివరాలను వెల్లడించారు. తెలుగు భాషను నేర్పడం, నేర్చుకోవడం ప్రతి తెలుగు కుటుంబ బాధ్యత అని గుర్తుచేశారు. మనబడి అధ్యక్షుడు కులపతి చమర్తి రాజు మాట్లాడుతూ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో భాగస్వాములైన వారందరికీ అభినందనలు తెలిపారు. ‘భాషా సేవయే భావితరాల సేవ’ అనే నినాదాన్ని గుర్తుచేస్తూ ఇప్పటివరకు లక్షా 10 వేల మందికి పైగా విద్యార్థులు మనబడి ద్వారా విద్యను పూర్తి చేసుకున్నారని చెప్పారు. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి సెప్టెంబర్ రెండో వారంలో 10 దేశాల్లో దాదాపు 300 కేంద్రాల్లో తరగతులు ప్రారంభం కానున్నాయని వెల్లడించారు. ఈ విద్యా సంవత్సరానికి ఇప్పటివరకు 12,500 మంది పిల్లలు నమోదు చేసుకున్నారని తెలిపారు. ఉత్తర అమెరికాలో మనబడికి పాశ్చాత్య పాఠశాలలు, కళాశాలల సంఘం గుర్తింపుతో పాటు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం అనుబంధ గుర్తింపు ఉండటం గర్వకారణమని పేర్కొన్నారు. ‘రన్ ఫర్ తెలుగు’ పోటీలను రెండు విభాగాల్లో నిర్వహించారు. ప్రతి ప్రాంతంలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన విజేతలను మనబడి పతకాలతో సత్కరించారు. పాల్గొన్న వారందరికీ ధ్రువపత్రాలు అందజేసి, ఆయా ప్రాంతాల్లో అల్పాహారం

టీటీడీలో అవినీతి ఆరోపణలు కలకలం రేపాయి. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలపై టీటీడీ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (డీఈవో) ఎం. లోకనాథం నివాసం, కార్యాలయాలపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఈరోజు దాడులు నిర్వహించారు. తిరుపతి, తిరుమలతో పాటు ఆయన బంధువుల ఇళ్లలోనూ ఏకకాలంలో సోదాలు జరుగుతున్నాయి.ఏసీబీ డీఎస్పీ శ్రీనివాసరావు నేతృత్వంలో ఏడు బృందాలు ఈ సోదాల్లో పాల్గొన్నాయి. ఈరోజు ఉదయం 6 గంటలకే అధికారులు తిరుపతిలోని పెద్దకాపు లేఅవుట్లో ఉన్న లోకనాథం నివాసానికి చేరుకున్నారు. ఆ సమయంలో ఆయన ఇంట్లోనే ఉండగా తనిఖీలు ప్రారంభించారు. అదే సమయంలో తిరుమలలోని ఆయన కార్యాలయంలో మరో బృందం సోదాలు చేపట్టింది. ఈ దాడులు ఆదాయానికి మించిన ఆస్తుల కేసుకు సంబంధించిన విచారణలో భాగంగా జరుగుతున్నాయని ఏసీబీ వర్గాలు తెలిపాయి.ఈ సోదాలను అధికారులు బహుళ ప్రాంతాల్లో ఏకకాలంలో నిర్వహిస్తున్నారు. తిరుపతిలో లోకనాథం ఇద్దరు బావమరుదుల ఇళ్లలో, యెర్పేడు మండలం చెల్లూరులో ఉన్న ఆయన సోదరి నివాసంలోనూ తనిఖీలు చేపట్టారు. తిరుమలలో లోకనాథంకు సంబంధం ఉందని భావిస్తున్న ఒక గెస్ట్ హౌస్లో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. విచారణలో భాగంగా తిరుపతి ఎస్టీవీ నగర్లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచీలో ఉన్న లోకనాథం బ్యాంక్ లాకర్లను కూడా అధికారులు తెరిచి పరిశీలిస్తున్నారు. లోకనాథం ప్రస్తుతం శ్రీవారి ఆలయం టెంపుల్ డిప్యూటీ ఈవోగా కీలక బాధ్యతల్లో ఉండగా, గతంలో టీటీడీలో వివిధ హోదాల్లో పనిచేశారు.గత దశాబ్ద కాలంలో ఒక టీటీడీ ఉన్నతాధికారిపై ఏసీబీ సోదాలు నిర్వహించడం ఇది రెండోసారి

Apple| ఇంటర్నెట్ డెస్క్: యాపిల్ నూతన సీఈఓగా బాధ్యతలు చేపట్టిన జాన్ టెర్నస్ (John Ternus)కు సంస్థ భారీ వేతన ప్యాకేజీని ప్రకటించింది. వార్షిక వేతనం, షేర్ల రూపంలో లభించే ప్రోత్సాహకాలతో కలిపి ఈ ఆర్థిక సంవత్సరానికి ఆయన మొత్తం 58 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.551 కోట్లు) అందుకోనున్నారు. ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్గా ఉన్న టిమ్ కుక్కు సుమారు 47 మిలియన్ డాలర్లు (సుమారు రూ.446 కోట్లు) అందనున్నాయి. ఈ వివరాలను అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (SEC)కి సమర్పించిన నివేదికలో యాపిల్ వెల్లడించింది. టెర్నస్కు 3 మిలియన్ డాలర్లు వార్షిక మూల వేతనం కాగా.. మరో 55 మిలియన్ డాలర్ల విలువైన స్టాక్ అవార్డులు అందనున్నాయి. ఆ స్టాక్లో 75 శాతం యాపిల్ షేరు పనితీరుతో ముడిపడి ఉంటుంది. మిగతా 25 శాతం కాలానుగుణంగా ఆయనకు దక్కుతుంది. మరోవైపు కుక్కు 2 మిలియన్ డాలర్ల వార్షిక వేతనం.. 2027 ఆర్థిక సంవత్సరానికి 45 మిలియన్ డాలర్ల విలువైన షేర్లు అందనున్నాయి. సెప్టెంబరు 1న జాన్ టెర్నస్ యాపిల్ సీఈవోగా బాధ్యతలు చేపట్టారు. గతంలో ఆయన హార్డ్వేర్ ఇంజినీరింగ్ విభాగానికి సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా పనిచేశారు. 2001లో యాపిల్ సంస్థలో చేరిన టెర్నస్.. ఐఫోన్, ఐప్యాడ్, మ్యాక్, ఎయిర్పాడ్స్ తదితర ఉత్పత్తుల హార్డ్వేర్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

తిరుమల తిరుపతి దేవస్థానం వర్గాల్లో ఉదయాన్నే ఒక వార్త పిడుగులా పడింది. టీటీడీ డిప్యూటీ ఈవో మెండు లోకనాథం లక్ష్యంగా అవినీతి నిరోధక శాఖ అధికారులు రైడ్స్ నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారనే బలమైన ఆరోపణల నేపథ్యంలో ఆయనపై ఏసీబీ కేసు నమోదు చేయడమే కాకుండా, తిరుపతితో పాటు వివిధ ప్రాంతాల్లోని ఆయన నివాసాలపై ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. శనివారం తెల్లవారుజామున 6 గంటలకే రంగంలోకి దిగిన ఏసీబీ బృందాలు ఒకేసారి పలు చోట్ల తనిఖీలు చేపట్టడంతో తిరుమలలో తీవ్ర సంచలనం వ్యక్తమవుతోంది.ఏసీబీ డీఎస్పీ శ్రీనివాసరావు పర్యవేక్షణలో మొత్తం 7 ప్రత్యేక బృందాలుగా ఏర్పడిన అధికారులు ఈ దాడులను అత్యంత రహస్యంగా నిర్వహించారు. తిరుపతిలోని పెదకాపు లేఅవుట్లో ఉన్న లోకనాథం ప్రధాన నివాసంలో సోదాలు చేస్తున్న సమయంలో ఆయన ఇంట్లోనే ఉన్నారు. దీంతో పాటు తిరుపతి ఎస్టీవీ నగర్లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖలో ఉన్న ఆయన లాకర్లను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కేవలం ఆయన ఇల్లే కాకుండా.. తిరుమలలోని ఆయన డిప్యూటీ ఈవో ఆఫీస్, వసతిగృహంతో పాటు బంధువుల ఇళ్లను కూడా ఏసీబీ వదల్లేదు. అవినీతి ముత్యం @రూ.200 కోట్లు.. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో 14రోజుల రిమాండ్ బంధువుల ఇళ్లపైనా విరుచుకుపడ్డ బృందాలులోకనాథంకు చెందిన బినామీ ఆస్తులు, కీలక పత్రాల అన్వేషణలో భాగంగా ఆయన నెట్వర్క్పై ఏసీబీ నిఘా పెట్టింది. తిరుపతిలోని ఆయన ఇద్దరు బావమరుదుల నివాసాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించగా.. ఏర్పేడు మండలం చెల్లూరులోని ఆయన సోదరుడి ఇంట్లో కూడా ఏసీబీ బృందాలు తనిఖీలు చేపట్టాయి. కీలక ఆధారాలు, నగదు, బంగారు ఆభరణాలు, ఆస్తి పాస్తుల డాక్యుమెంట్లను సీజ్ చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.డీఎస్పీ భీంరెడ్డి ఆస్తులు చూసి ఏసీబీ అధికారులే షాక్.. తొలిరోజే రూ.200 కోట్లకు పైనే 15 ఏళ్ల తర్వాత టీటీడీలో మళ్లీ ఏసీబీ ప్రకంపనలు!తిరుమల శ్రీవారి దేవస్థానంలో దాదాపు 15 సంవత్సరాల సుదీర్ఘ

ఇంటర్నెట్డెస్క్: దేశీయ మార్కెట్లు బుధవారం భారీ నష్టాలను చవిచూస్తున్నాయి (Stock Market Today). మరోసారి పశ్చిమాసియాలో ఘర్షణలు తీవ్రరూపం దాల్చడం, చమురు ధరలు భగ్గుమనడంతో సూచీలు నష్టాల్లో కదలాడుతున్నాయి. ఉదయం 9.31 గంటల సమయంలో సెన్సెక్స్ 703 పాయింట్లు నష్టపోయి.. 76,262 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 232 పాయింట్లు కోల్పోయి.. 23,823 వద్ద కదలాడుతోంది. నిఫ్టీ సూచీలో కోల్ ఇండియా, సన్ఫార్మా, ఓఎన్జీసీ, లార్సెన్ షేర్లు లాభాల్లో ఉండగా.. ఇన్ఫోసిస్, ఐషర్ మోటార్స్, శ్రీరామ్ ఫైనాన్స్ , విప్రో, ఎంఅండ్ఎం స్టాక్స్ నష్టపోతున్నాయి. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 94.97గా ఉంది. నెలరోజుల గ్యాప్ తర్వాత పశ్చిమాసియాలో మళ్లీ ఘర్షణలు మొదలయ్యాయి. హర్మూజ్పై పట్టుకోసం ఇరాన్, అమెరికా ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చమురు ధరలు భగ్గుమంటున్నాయి (Crude oil prices). బ్రెంట్ క్రూడ్ ప్యూచర్స్ ఒక బ్యారెల్కు 95.52 డాలర్లుగా ఉండగా.. యూఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ ఫ్యూచర్స్ 91 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

ఆస్కార్ విజేత ఏఆర్ రెహ్మాన్ తన ఆత్మకథ ‘రెహ్మాన్: ఏ రెనైసాన్స్’పై కీలక ప్రకటన చేశారు. భారతీయ సంగీత ప్రపంచంలో తనదైన ముద్ర వేసిన సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహ్మాన్ (A. R. Rahman) అభిమానులకు శుభవార్త చెప్పారు. తన జీవితంలో కొత్త అధ్యాయం మొదలవుతోందని అన్నారు. రచయిత్రి రూపా చక్రవర్తి (Rupa Chakravarti) తో కలిసి తాను రాయబోయే ఆత్మకథ గురించి ఎక్స్ వేదికగా ఆయన వెల్లడించారు. ‘రెహ్మాన్: ఏ రెనైసాన్స్’ (Rahman A Renaissance) అనే పేరుతో రాయనున్న పుస్తకం కోసం రూపా చక్రవర్తి, తాను రచయితలుగా కలిసి పనిచేస్తున్నట్టు తెలిపారు. ఈ పుస్తకంలో ‘నా ప్రపంచాన్ని తీర్చిదిద్దిన సంగీతం, ఆలోచనలు, సవాళ్లు, ప్రభావాలు, సృజనాత్మక ప్రయాణంపై మీకు పూర్తి అవగాహన కల్పిస్తుంది’ అని పేర్కొన్నారు

New LIC plans | ఇంటర్నెట్ డెస్క్: ప్రభుత్వరంగ జీవిత బీమా సంస్థ ఎల్ఐసీ (LIC) రెండు కొత్త ప్లాన్లను లాంచ్ చేసింది. ఎల్ఐసీ 70వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని బీమా ప్లాటినమ్ (LIC Bima Platinum), జీవన్ రక్ష (LIC Jeevan Raksha) పేరిట రెండు కొత్త ప్లాన్లను ప్రకటించింది. సెప్టెంబర్ 7 నుంచి ఈ పాలసీలు అందుబాటులోకి రానున్నాయి. ఆ ప్లాన్ల వివరాలు ఇవీ.. బీమా ప్లాటినమ్ నాన్ లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్, ఇండివిడ్యువల్ ప్లాన్. ఇది పొదుపుతో పాటు మీ కుటుంబానికి ఆర్థిక రక్షణ కూడా కల్పిస్తుంది. కచ్చితమైన ముందస్తు హామీతో కూడిన రాబడులు లభిస్తాయి. ప్రీమియం చెల్లింపు కాలవ్యవధిలో ప్రతి వెయ్యి రూపాయలకు రూ.70 చొప్పున గ్యారెంటీడ్ అడిషన్ చెల్లిస్తారు. ఈ పాలసీ తీసుకునేందుకు కనీస వయసు 28 ఏళ్లు. గరిష్ఠ వయసు 75 ఏళ్లుగా నిర్ణయించారు. 7, 10, 12, 15, 18 ప్రీమియం చెల్లింపు కాలవ్యవధిని ఎంచుకోవచ్చు. 17, 20, 22, 25, 28 ఏళ్ల పాటు పాలసీ గడువు ఉంటుంది. కనీస బీమా హామీ మొత్తం రూ.3 లక్షలుగా నిర్ణయించారు. గరిష్ఠ మొత్తంపై పరిమితి లేదు. పాలసీ మెచ్యూరిటీ సమయానికి పాలసీదారుడు జీవించి ఉంటే బేసిక్ సమ్అష్యూర్డ్, గ్యారెంటీడ్ అడిషన్లు చెల్లిస్తారు. జరగరానిది ఏదైనా జరిగితే వార్షిక ప్రీమియానికి 11 రెట్లు లేదా బేసిక్ సమ్ అష్యూర్డ్, గ్యారెంటీడ్ అడిషన్లలో ఏది ఎక్కువైతే అది చెల్లిస్తారు. ఎల్ఐసీ పాలసీదారులకు రిబేటు లభిస్తుంది. రుణ సదుపాయం కూడా ఉంది. రైడర్లు జోడించుకోవచ్చు. బేసిక్ సమ్ అష్యూర్డ్లో 10 శాతం చొప్పున రెగ్యులర్ ఇన్కమ్ కింద ఏటా తీసుకునే వెసులుబాటూ ఉంది. ఎల్ఐసీ జీవన్ రక్ష నాన్-పార్టిసిపేటింగ్, నాన్ లింక్డ్ ప్యూర్ రిస్క్ ప్లాన్. ఇది మీ కుటుంబానికి ఆర్థిక రక్షణ కల్పిస్తుంది. పాలసీదారుడికి జరగరానిది ఏదైనా జరిగితే అండగా నిలుస్తుంది. ఈ ప్లాస్ తీసుకోవడానికి కనీస వయసు

బాంబే క్రీమరీ ఐస్క్రీమ్ల ధరలను సామాన్య వినియోగదారులకు అందుబాటులో ఉండేలా నిర్ణయించారు. ఈ ఉత్పత్తుల ప్రారంభ ధర కేవలం రూ.10గా నిర్ణయించారు. కోన్స్, కప్స్, టబ్స్, బార్స్, స్టిక్స్ వంటి పలు రకాల ఫార్మాట్లలో ఐస్క్రీమ్లు అందుబాటులోకి రానున్నాయి. ప్రీమియం నాణ్యతతో పాటు తక్కువ ధరలో ఉత్పత్తులను అందించాలనే రిలయన్స్ వ్యూహంలో భాగంగానే ఈ బ్రాండ్ను రూపొందించారు. బాంబే క్రీమరీ ప్రత్యేకత ఏమిటంటే.. ఇందులో నిజమైన డెయిరీ క్రీమ్ను ఉపయోగిస్తున్నట్లు RCPL తెలిపింది. ఐస్క్రీమ్ తయారీలో నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడకుండా అసలైన పాల పదార్థాలతో ఉత్పత్తులను తయారు చేస్తున్నామని కంపెనీ పేర్కొంది. RCPL డైరెక్టర్ టీ. కృష్ణకుమార్ మాట్లాడుతూ.. డెయిరీ ఉత్పత్తుల్లో షార్ట్కట్స్ ఉండకూడదనే ఆలోచనతో ఈ బ్రాండ్ను రూపొందించామని చెప్పారు. ప్రతి భారతీయ కుటుంబం కొనుగోలు చేయగల ధరలో అసలైన ఐస్క్రీమ్ రుచిని అందించడమే తమ లక్ష్యమని తెలిపారు. బాంబే క్రీమరీ ఉత్పత్తులను తొలుత పశ్చిమ భారతదేశంలోని మార్కెట్లలో అందుబాటులోకి తీసుకురానున్నారు. ఆ తర్వాత దశలవారీగా దేశవ్యాప్తంగా విస్తరించాలని RCPL ప్రణాళికలు సిద్ధం చేసింది. రిలయన్స్కు ఇప్పటికే దేశవ్యాప్తంగా బలమైన డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్, భారీ రిటైల్ వ్యవస్థ ఉంది. దీంతో కొత్త ఐస్క్రీమ్ బ్రాండ్ను వేగంగా వినియోగదారులకు చేరవేయడం కంపెనీకి సులభం కానుంది. రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ ఇప్పటికే ఆహారం, పానీయాలు, వ్యక్తిగత సంరక్షణ, గృహ వినియోగ ఉత్పత్తుల రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ముఖ్యంగా కాంపా ద్వారా డ్రింక్స్ మార్కెట్లో రిలయన్స్ తన ఉనికిని మరింత బలోపేతం చేసుకుంది. ఇండిపెండెన్స్ బ్రాండ్ ద్వారా వంట నూనెలు, పిండి, ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ వంటి ఉత్పత్తులను విక్రయిస్తోంది. అలాగే పప్పులు, బియ్యం, నూడుల్స్, సాస్లు, బిస్కెట్లు, సబ్బులు, హెయిర్ కేర్, డిటర్జెంట్లు, క్లీనింగ్ ఉత్పత్తులు వంటి అనేక విభాగాల్లో కంపెనీ తన వ్యాపారాన్ని విస్తరించింది. ఇప్పుడు ఐస్క్రీమ్ మార్కెట్లోకి అడుగుపెట్టడం ద్వారా FMCG రంగంలో రిలయన్స్ పోర్ట్ఫోలియో మరింత విస్తరించనుంది. భారత

చిత్తూరు జిల్లా పుత్తూరు పట్టణం 21వ వార్డు చెర్లోపల్లి ప్రాంతంలో అక్రమంగా కొనసాగుతున్న క్వారీలు, నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న బ్లాస్టింగ్ల కారణంగా రైతులు, స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారని మాజీ మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. తరతరాలుగా వ్యవసాయమే జీవనాధారంగా బతుకుతున్న రైతుల పంట పొలాలకు సమీపంలో ఇష్టారాజ్యంగా క్వారీలు నిర్వహిస్తూ పేలుళ్లు జరపడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. భారీ పేలుళ్ల కారణంగా రాళ్లు ఎగిరిపడి భూములు కంపిస్తున్నాయని, ఇళ్లు, బోర్లు దెబ్బతినే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రమాదం జరిగి ప్రాణాలు పోయిన తర్వాత ప్రభుత్వం స్పందిస్తుందా అని నిలదీశారు. కేంద్రానికి రోజా రిక్వెస్ట్.. హైవే సమస్యపై అలుపెరుగని పోరాటం!చెర్లోపల్లి రైతులు తమ ఆవేదనను పలుమార్లు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయిందని రోజా ఆరోపించారు. పోలీసు శాఖతో పాటు ఇతర అధికారులకు ఫిర్యాదు చేసినా, ఒకరిపై ఒకరు నెట్టేసుకుంటూ కాలయాపన చేయడం సరికాదన్నారు. క్వారీలకు అవసరమైన అన్ని అనుమతులు ఉన్నాయా? పర్యావరణ, గనుల, రెవెన్యూ, పోలీసు శాఖల నిబంధనలు పాటిస్తున్నారా? అనే దానిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. క్వారీ యాజమాన్యాలకు రాజకీయ అండదండలు ఉన్నాయని, నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్పై వస్తున్న క్వారీ వసూళ్ల ఆరోపణలపై ప్రభుత్వం నిష్పక్షపాతంగా విచారణ జరిపి వాస్తవాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు.ఆ పని చేయకుంటే కూటమి ప్రజాప్రతినిధులు రాజీనామా చేసి ఇంట్లో కూర్చోమన్న రోజా ప్రమాదం జరిగే వరకు ఎదురుచూడొద్దు!ఒక ప్రాణం పోయిన తర్వాతో, రైతు భూమి నాశనమైన తర్వాతో పరిహారం ఇచ్చినా పోయిన జీవనాధారం తిరిగి రాదని రోజా స్పష్టం చేశారు. ప్రమాదాలు జరిగే వరకు ప్రభుత్వం నిద్రపోకుండా ఇప్పటికైనా తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. చెర్లోపల్లి ప్రాంతంలోని అక్రమ క్వారీలను వెంటనే నిలిపివేసి, అనుమతులు లేకుండా జరుగుతున్న బ్లాస్టింగ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజలకు మేలు
అకస్మాత్తుగా శరీరంపై వచ్చే ఎర్రటి దద్దుర్లు, పొట్టు రాలడం, తీవ్రమైన దురద అనేవి అర్టికేరియా (Urticaria) యొక్క లక్షణాలు కావచ్చు. ఈ లక్షణాలు కొన్నిసార్లు వాతావరణ మార్పులు, ఆహారపు అలవాట్లలో మార్పులు, మందుల ప్రతిచర్యలు లేదా దుమ్ము అలెర్జీల కారణంగా అకస్మాత్తుగా కనిపించవచ్చు. సాధారణంగా హైవ్స్ (Hives) లేదా దద్దుర్లు అని పిలిచే అర్టికేరియా చర్మంపై ఎర్రగా, ఉబ్బినట్లుగా వచ్చి తీవ్రమైన దురదను కలిగిస్తుంది. అర్టికేరియాకి ప్రధాన కారణాలు, నివారణ మార్గాలు, ఎప్పుడు వైద్యుణ్ని సంప్రదించాలి ఇలా పూర్తి సమాచారాన్ని డాక్టర్ షిరీన్ ఫుర్టాడో (సీనియర్ కన్సల్టెంట్ - మెడికల్ & కాస్మెటిక్ డెర్మటాలజీ, ఆస్టర్ CMI హాస్పిటల్, బెంగళూరు) అందించారు. ఆ పూర్తి వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.అర్టికేరియా ప్రధాన కారణాలు కొన్ని రకాల ఆహారాలు, మందులు, ఇన్ఫెక్షన్లు, అధిక వేడి, మానసిక ఒత్తిడి, కీటకాలు కుట్టడం లేదా చర్మంపై ఎక్కువ ఒత్తిడి పడటం వంటివి దీనికి కారణం కావచ్చు. ఈ సమస్య సాధారణంగా తీవ్రమైన దురదతో మొదలవుతుంది. దీని తరువాత చర్మం ఎర్రబడటం, పొక్కులు వస్తాయి. చాలా మందికి చర్మంపై వాపు కూడా రావచ్చు. ఈ దద్దుర్లు శరీరంలో ఎక్కడైనా రావచ్చు. ముఖం, మెడ, చేతులు, కాళ్లు, వీపు లేదా శరీరం మొత్తం మీద కూడా రావచ్చు.పాటించాల్సిన చిట్కాలు చర్మంపై చల్లని క్లాత్తో అద్దడం (Cool Compress), వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరించడం, గోరువెచ్చని నీటితో స్నానం చేయడం ద్వారా దురద నుంచి ఉపశమనం పొందవచ్చు. ఘాటైన వాసన, కెమికల్స్ ఉండే సబ్బులు, పర్ఫ్యూమ్లకు దూరంగా ఉండండి. కలబంద (Aloe Vera) జెల్ లేదా క్యాలమైన్ లోషన్ రాస్తే చర్మం చల్లబడి దురద తగ్గుతుంది. ఏ ఆహారం తిన్న తర్వాత దద్దుర్లు వస్తున్నాయో ఒక నోట్బుక్లో రాసిపెట్టుకుంటే ట్రిగ్గర్లను గుర్తించడం సులువుగా ఉంటుంది. అల్లం తీసుకోవడం వల్ల శరీరం నుంచి టాక్సిన్లు బయటకు పోతాయి. ఇందుకోసం ఒక స్పూన్ అల్లం రసంలో

రోజుకు ఐదు నిమిషాలు.. అంతే పని. కానీ నెలకు 10 వేల డాలర్లు సంపాదించాలి! ఈ మాట వింటే ఎవరికైనా నవ్వొస్తుంది. కాలేజీ రోజుల్లో ఈ లక్ష్యాన్ని పెట్టుకున్నాడు ఓ యువకుడు. స్నేహితులు కూడా అతడిని చూసి ఆశ్చర్యపోయారు. కానీ అతడు మాత్రం వెనక్కి తగ్గలేదు. ఐదు నిమిషాల పని అంటే ఐదు నిమిషాలే.. ఆ సమయంలో ఏం ఆలోచించాలో నిర్ణయించుకున్నాడు. ఆ ఆలోచన ఓ చిన్న పరికరానికి దారి తీసింది. అదే అతడి జీవితాన్ని మార్చేసింది.ఆ యువకుడే మసయోషి సన్. నేడు సాఫ్ట్బ్యాంక్ వ్యవస్థాపకుడిగా ప్రపంచ టెక్నాలజీ రంగంలో అత్యంత ప్రభావవంతమైన పెట్టుబడిదారుల్లో ఒకరు. 2026 సెప్టెంబరు 1 నాటికి ఫోర్బ్స్ అంచనా ప్రకారం ఆయన సంపద 63.2 బిలియన్ డాలర్లు. అంటే మన కరెన్సీలో దాదాపు రూ.5.3 లక్షల కోట్లు. కానీ ఈ స్థాయికి ఆయన ప్రయాణం మాత్రం కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం, బెర్క్లీలో ఓ విద్యార్థిగా ఉన్నప్పుడే మొదలైంది.ఐదు నిమిషాల ఆలోచన..1970ల చివర్లో బెర్క్లీలో ఆర్థికశాస్త్రం చదువుతున్న సన్ తనకు తానే ఓ సవాల్ విసిరుకున్నారు. రోజుకు ఐదు నిమిషాలు మాత్రమే కేటాయించి నెలకు 10 వేల డాలర్లు సంపాదించాలి. ఉద్యోగం చేస్తే అది సాధ్యం కాదని ఆయనకు తెలుసు. అందుకే ఓ వినూత్న ఆదాయ మార్గం కోసం ఆలోచించారు.ఆ ఐదు నిమిషాల్లో ఓ ఆవిష్కరణ చేయాలని నిర్ణయించుకున్నారు. అలా ఎలక్ట్రానిక్ ట్రాన్స్లేటర్ ఆలోచన వచ్చింది. బెర్క్లీలోని పరిశోధకులు, ప్రొఫెసర్ ఫారెస్ట్ మోజర్ సహకారంతో దాన్ని అభివృద్ధి చేశారు. చివరకు ఆ పరికరాన్ని జపాన్కు

నీట్ పేపర్ లీక్ అంశంపై విద్యార్థుల ఆందోళనలకు సంబంధించి నమోదైన కేసుల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. విద్యార్థులపై నమోదైన కేసులను వెంటనే ఎత్తివేయాలని కోరుతూ 4 రాష్ట్రాలు సుప్రీంను ఆశ్రయించాయి. ఇంటర్నెట్ డెస్క్: నీట్ పేపర్ లీక్ అంశంపై విద్యార్థుల ఆందోళనలకు సంబంధించి నమోదైన కేసుల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. విద్యార్థులపై నమోదైన 116 ఎఫ్ఐఆర్లను రద్దు చేయాలని కోరుతూ బిహార్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, అస్సాం రాష్ట్రాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ప్రకారం తమ రాష్ట్రాల్లో నమోదైన కేసులను వెంటనే ఎత్తివేయాలని కోరుతూ 4 రాష్ట్రాలు వేర్వేరు పిటిషన్లలో విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. విద్యార్థులు ఆందోళనలు విరమిస్తే వారిపై నమోదైన కేసులను ఉపసంహరించుకుంటామని జులై 25న కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ)కి ఇచ్చిన హామీని ఆయా రాష్ట్రాలు తమ పిటిషన్లలో ప్రస్తావించినట్లు తెలుస్తోంది. మరోవైపు ఢిల్లీ పోలీసులు నమోదు చేసిన కేసులను రద్దు చేయాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు సమాచారం. విద్యార్థులపై నమోదైన కేసులను ఉపసంహరించుకోవాలనే డిమాండ్తో ఈ నెల 5న ఢిల్లీలో ర్యాలీ నిర్వహించేందుకు సీజేపీ పిలుపునిచ్చిన నేపథ్యంలో కేంద్రం, రాష్ట్రాలు వేగంగా స్పందించినట్లు తెలుస్తోంది. దీంతో విద్యార్థుల ఆందోళనలకు సంబంధించిన కేసుల ఉపసంహరణపై సుప్రీంకోర్టు తదుపరి విచారణలో కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. హెగ్సెత్పై ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు.. 2028 రేసులో ఉన్నట్టా? విమాన ఇంధనానికి మళ్లీ మంట.. లీటరుకు రూ.6.28 పెరిగిన ఏటీఎఫ్ ధర

సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో నిరసనకారులపై పెల్లెట్ గన్లను ఉపయోగించడం మానవ హక్కుల ఉల్లంఘన కాదని సీఆర్పీఎఫ్ స్పష్టం చేసింది. సమాచార హక్కు చట్టం కింద టీఎంసీ నేత సాకేత్ గోఖలే అడిగిన ప్రశ్నకు సీఆర్పీఎఫ్ ఈమేరకు సమాధానమిచ్చింది. ఈ విషయాన్ని తాను సుప్రీంకోర్టు ముందుంచుతానని గోఖలే చెప్పారు. జూలై 20వ తేదీన సీజేపీ పిలుపు మేరకు పార్లమెంట్ వైపు వెళ్తున్న నిరసనకారులపై ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్(ఆర్ఏఎఫ్) జవాన్లు పెల్లెట్ గన్లను వాడారంటూ వచి్చన ఆరోపణలపై సహచట్టం కింద సీఆర్పీఎఫ్కి పంపిన దరఖాస్తును గోఖలే సోమవారం ఎక్స్లో పోస్ట్ చేశారు. ‘నిరసనకారులపై పెల్లెట్ గన్లు ఉపయోగించడం మానవ హక్కుల ఉల్లంఘన కాదంటూ సీఆర్పీఎఫ్ సమాచారాన్ని నిరాకరించింది. దీనిపై అప్పిలేట్ అథారిటీ కూడా సమాచారాన్ని అందించేందుకు నిరాకరించింది’అని ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సైతం నిరసనకారులపై పెల్లెట్ గన్లను ఉపయోగించలేదంటూ మొదట్లో బుకాయించిందని గోఖలే గుర్తు చేశారు. హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు) అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు) కీర్తి సురేశ్ కలర్ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు) యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు) పార్వతీపురం మన్యం జిల్లా...శిఖపరువులో జలసవ్వడి (ఫొటోలు) జీ న్యూస్ అధినేత సుభాష్ చంద్రకు NCLT షాక్ Viral : 20 సెకన్లలో ఇద్దరిపై కత్తులతో దాడి.. న్యూయార్క్ లో టెన్షన్! పరారీలో బాసింగ బాసింగ డ్యాన్సర్ ఈశ్వర్ సాయి

తెలంగాణ జానపద పాటలు, డాన్స్ షోలతో విపరీతమైన ప్రజాదరణ పొందిన బాసింగ బలాలు ఫేమ్, ప్రముఖ ఫోక్ డాన్సర్ ఈశ్వర్ సాయి చట్టపరమైన చిక్కుల్లో పడ్డాడు. వెండితెర, బుల్లితెరపై తన స్టెప్పులతో గుర్తింపు తెచ్చుకున్న అతడి అసలు స్వరూపం బయటపడటంతో ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి, శారీరకంగా వాడుకొని, తీరా సమయం వచ్చేసరికి ముఖం చాటేసి మోసం చేశాడంటూ అతడితో పాటు డాన్స్ చేసే తోటి కళాకారిణి మాధురి రాథోడ్ పోలీసులను ఆశ్రయించింది.బాధితురాలు మాధురి రాథోడ్ తెలిపిన వివరాల ప్రకారం.. వీరిద్దరి మధ్య జానపద పాటల షూటింగ్లు, సోషల్ మీడియా రీల్స్ చేసే క్రమంలో పరిచయం ఏర్పడింది. బాసింగ బలాలు పాటతో పాటు మరికొన్ని ప్రాజెక్టులలో ఇద్దరూ కలిసి నటించడంతో ఆ పరిచయం కాస్తా చొరవగా మారింది. ఆ తర్వాత మాధురిపై ప్రేమ పేరిట వల విసిరిన ఈశ్వర్ సాయి, ఆమెను పెళ్లి చేసుకుంటానని బలంగా నమ్మించాడు. అతడి మాటలను నిజమని నమ్మిన మాధురి, అతడితో సహజీవనానికి సైతం అంగీకరించింది.సహజీవనం.. ఆపై బెదిరింపులు!పెళ్లి చేసుకుంటాననే నెపంతో ఈశ్వర్ సాయి ఆమెను పలుమార్లు శారీరకంగా వాడుకున్నాడు. అయితే, కొంతకాలంగా పెళ్లి ప్రస్తావన తెచ్చినప్పుడల్లా తప్పించు తిరగడం ప్రారంభించాడు. అనుమానం వచ్చి గట్టిగా నిలదీయగా.. పెళ్లి చేసుకునేది లేదని తెగేసి చెప్పడమే కాకుండా, ఈ విషయం బయటకు చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని, కెరీర్ నాశనం చేస్తానని బెదిరింపులకు దిగాడు. దీంతో మోసపోయానని గ్రహించిన మాధురి రాథోడ్ నార్సింగి పోలీస్ స్టేషన్లో ఈశ్వర్ సాయిపై అధికారికంగా ఫిర్యాదు చేసింది. అందుకే అర్ధరాత్రి మాధురి రూమ్ కు వెళ్లాను: అసలు నిజం బయటపెట్టిన ఫోక్ యాక్టర్ ఈశ్వర్ సాయిపోలీసుల కేసు నమోదు.. నిందితుడి కోసం గాలింపు!బాధితురాలి ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీసులు ఈశ్వర్ సాయిపై సెక్సువల్ అబ్యూస్, మోసం, బెదిరింపుల కింద కేసు నమోదు చేశారు. పోలీసుల విచారణ ముమ్మరం కావడంతో

ఇంటర్నెట్ డెస్క్: టెక్ దిగ్గజం యాపిల్లో (Apple) కీలక నాయకత్వ మార్పు జరిగింది. 15 ఏళ్లుగా సంస్థ సీఈవోగా కొనసాగిన టిమ్ కుక్ (Tim Cook) ఆ పదవి నుంచి వైదొలిగారు. ఆయన స్థానంలో జాన్ టెర్నస్ (John Ternus) సీఈవోగా బాధ్యతలు చేపట్టారు. 2011 ఆగస్టులో సీఈవో బాధ్యతలు స్వీకరించిన కుక్.. సంస్థ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. ‘‘రేపటి నుంచి నా పదవి మారుతుంది, కానీ యాపిల్ సంస్థపై నాకున్న ప్రేమ ఎప్పటికీ మారదు. నిరంతరం నాకు స్ఫూర్తిగా నిలిచినందుకు అందరికీ ధన్యవాదాలు. తదుపరి నిర్వర్తించాల్సిన బాధ్యతలపై నేను ఎంతో ఉత్సాహంగా ఉన్నాను’ అని ఆయన ఎక్స్లో పేర్కొన్నారు. సీఈవో పదవి నుంచి వైదొలిగినప్పటికీ.. కుక్ యాపిల్కు దూరం కావడం లేదు. ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్గా కొనసాగనున్నారు. సంస్థకు సంబంధించిన కీలక అంశాల్లో సహకరించనున్నారు. 2011లో సుమారు 350 బిలియన్ డాలర్లుగా ఉన్న యాపిల్ మార్కెట్ విలువ కుక్ సారథ్యంలో ప్రస్తుతం 4.5 ట్రిలియన్ డాలర్లకు చేరింది. నూతన సీఈవోగా బాధ్యతలు స్వీకరించిన జాన్ టెర్నస్ (John Ternus) 2001లో యాపిల్లో చేరారు. ఆయన ఇప్పటి వరకు హార్డ్వేర్ ఇంజినీరింగ్ విభాగం సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా పనిచేశారు. ఐఫోన్, ఐప్యాడ్, మ్యాక్, ఎయిర్పాడ్స్ తదితర ఉత్పత్తుల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. సెప్టెంబరు 9న జరగనున్న యాపిల్ కార్యక్రమంలో టెర్నస్ తొలిసారి సీఈవోగా వేదికపై కనిపించే అవకాశాలు ఉన్నాయి. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

Subash chandra | ఇంటర్నెట్డెస్క్: ఎస్సెల్ గ్రూప్ వ్యవస్థాపకులు సుభాష్చంద్ర వ్యక్తిగత దివాలా ప్రక్రియపై వివాదం కొనసాగుతోంది. రూ.22,006 కోట్ల క్లెయిమ్నకు గానూ రూ.6.25 కోట్లు మాత్రమే చెల్లించేందుకు జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్ (NCLT) అనుమతించడంపై రుణాలు ఇచ్చిన బ్యాంకులు ఆగ్రహంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. చెల్లింపు విషయంలో త్రిసభ్య బెంచ్ ఇచ్చిన తీర్పును ఎన్సీఎల్టీ నిలిపివేసింది. సుభాష్ చంద్రపై దాఖలైన వ్యక్తిగత దివాలా ప్రక్రియలో భాగంగా క్రెడిటర్లంతా కలిసి రూ.22,006.57 కోట్లు క్లెయిమ్ చేయగా.. కేవలం రూ.6.25 కోట్లు చెల్లించే పరిష్కార ప్రణాళికకు ఇటీవల ఎన్సీఎల్టీ ఆమోదం తెలిపింది. ఈ ప్రణాళికకు 80.81 శాతం క్రెడిటర్ల నుంచి ఆమోదం లభించడం గమనార్హం. అయితే, ఇందులో సుభాష్ చంద్ర కుటుంబంతో సంబంధం ఉన్న 5 సంస్థలు రుణదాతల కమిటీలో 61.78 శాతం ఓటింగ్ వాటాను కలిగి ఉన్నాయని, ఈ ప్రణాళిక ఆమోదించడంలో కీలక పాత్ర పోషించాయని బ్యాంకులు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చంద్ర వ్యక్తిగత దివాలా పరిష్కార ప్రక్రియలో భాగంగా రుణ చెల్లింపు ప్రణాళికపై నిర్ణయం తీసుకోవడానికి అయిదుగురు సభ్యులతో కూడిన ధర్మాసనాన్ని ఎన్సీఎల్టీ ఏర్పాటు చేసింది. ఈ రోజు విచారణ జరిగింది. ఈ క్రమంలో త్రిసభ్య తీర్పును నిలిపివేయడంతో పాటు ఆయన వ్యక్తిగత హామీదారుగా ఉన్న ఆస్తులను ఎవరికీ బదిలీ చేయకూడదని ఆదేశించింది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

Fuel Prices Hike| ఇంటర్నెట్డెస్క్: పశ్చిమాసియా ఘర్షణలు ఎప్పుడు ముగుస్తాయో తెలియని అనిశ్చితి నెలకొంది. దాంతో ప్రపంచ ఇంధన రవాణాకు కీలకమైన హర్మూజ్ జలసంధిలో అంతరాయాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి సీఎన్జీ (CNG) ధరలు పెరిగాయి. విమానాల్లో ఉపయోగించే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF) ధరలో కూడా వరుసగా రెండోనెలలో పెంపు నమోదైంది. మంగళవారం మహానగర్ గ్యాస్ లిమిటెడ్ (MGL) సీఎన్జీ ధరను కేజీకి రూ.2 చొప్పున పెంచింది. దీంతో ముంబయి, పరిసర ప్రాంతాల్లో కేజీ గ్యాస్ ధర రూ.88కి ఎగబాకింది. డొమెస్టిక్ పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG) స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ (SCM)కు ఒక రూపాయి చొప్పున పెరిగింది. ఈ ధరలు నేటినుంచే అమల్లోకి వచ్చాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ఘర్షణల నేపథ్యంలో అంతర్జాతీయ విపణిలో ధరలకు అనుగుణంగా ఈ ఇంధనాల రేట్లను సవరించినట్లు ఎంజీఎల్ వెల్లడించింది. రెండురోజుల క్రితం ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ కూడా సీఎన్జీ ధరలు పెంచిన సంగతి తెలిసిందే. దాంతో దిల్లీ పరిసర ప్రాంతాల్లో ఆ గ్యాస్ ధర రూ.83.09 నుంచి రూ.86.98కి చేరింది. సీఎన్జీ ధరలు పెరగడంతో ఆటో, ట్యాక్సీ సంఘాలు ప్రయాణ ఛార్జీల పెంపునకు డిమాండ్ చేస్తున్నాయి. దేశీయ విమానాలకు ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF) ధర లీటర్కు రూ.6.28 (5.46 శాతం) మేర పెరిగింది. దీంతో లీటర్ ధర రూ.115 నుంచి రూ.121.28కి పెరిగింది. ఈ మేరకు ఇండియన్ ఆయిలో కార్పొరేషన్ లిమిటెడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ పెంపు దేశీయ విమానయాన సంస్థలకు భారంగా మారనుంది. దాంతో ఆ ప్రభావం ప్రయాణికులపై పడనుంది. ఆగస్టు ఒకటిన ఏటీఎఫ్ లీటర్ ధర రూ.110 నుంచి 115కు పెరిగిన సంగతి తెలిసిందే. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల

వీసాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని యూఏఈలోని భారతీయులను అక్కడి ఇండియన్ ఎంబసీ అప్రమత్తం చేసింది. వీసాల విషయాల్లో సాయం చేస్తామని వచ్చే అనధికారిక ఏజెంట్లు, వ్యక్తులకు బయోమెట్రిక్ వివరాలు ఇవ్వవద్దని సూచించింది. ఇంటర్నెట్ డెస్క్: వీసాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని యూఏఈలోని భారతీయులను అక్కడి ఇండియన్ ఎంబసీ అప్రమత్తం చేసింది. వీసాల విషయాల్లో సాయం చేస్తామని వచ్చే అనధికారిక ఏజెంట్లు, వ్యక్తులకు బయోమెట్రిక్ వివరాలు ఇవ్వవద్దని సూచించింది. వీసా రెగ్యులరైజేషన్, ఎమర్జెన్సీ సర్టిఫికేట్స్ జారీ, ఎగ్జిట్ పర్మిట్లు, ఎమిరేట్ ఐడీలు, ఉపాధి విషయాల్లో అవగాహనతో ఉండాలని సూచించింది. యూఏఈలో వెలుగు చూస్తున్న స్కామ్స్లో పలువురు బ్లూకాలర్ ఉద్యోగులు బాధితులుగా మారుతున్న విషయం తమ దృష్టికి వచ్చినట్టు ఎంబసీ వెల్లడించింది. మోసపూరితంగా బయోమెట్రిక్ వివరాలు సేకరిస్తున్న నిందితులు వాటితో ఆర్థిక అక్రమాలకు పాల్పడుతున్నారని చెప్పింది. బాధితులకు తెలియకుండానే వారి పేరిట బ్యాంకు ఖాతాలు తెరవడం, లోన్లు, క్రెడిట్ కార్డులు తీసుకోవడం వంటివి చేస్తున్నారని చెప్పింది. ఈ స్కామ్ బారిన పడితే అప్పులు మిగిలడంతో పాటు నిషేధానికి గురయ్యే అవకాశం ఉందని కూడా హెచ్చరించింది. ఈ స్కామ్స్ బారిన పడకుండా ఉండేందుకు భారతీయులు తమ బయోమెట్రిక్, పాస్పోర్టు వివరాలను అనధికారిక ఏజెంట్లు, వ్యక్తులతో పంచుకోవద్దని సూచించింది. యూఏఈ ప్రభుత్వ కేంద్రాలు, కౌంటర్లలోనే ఈ వివరాలను ఇవ్వాలని సూచించింది. భారతీయ పాస్పోర్టులు, ఎమర్జెన్సీ సర్టిఫికేట్ల జారీ కోసం భారతీయ కాన్సులేట్లు, లేదా ఎంబసీ బయోమెట్రిక్ వివరాలను కోరవని కూడా స్పష్టం చేసింది. బయోమెట్రిక్ వివరాలను ఎవరైనా అడిగితే వెంటనే ఎంబసీకి సమాచారం ఇవ్వాలని కూడా అధికారులు చెప్పారు. రష్యా సైన్యంలోని 51 మంది భారతీయుల మృతి.. విదేశాంగ శాఖ సెక్రటరీ వెల్లడి రైల్వే అభివృద్ధిలో తెలంగాణకు పెద్దపీట కేంద్ర మంత్రి కిషన్రెడ్డి

మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల ప్రజల మూడు దశాబ్దాల చిరకాల స్వప్నం నెరవేరబోతోంది. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశను ఆగస్టు 31వ తేదీన ప్రారంభించి నీటిని విడుదల చేయనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో, వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు మూడో విడత పరిహారంగా రూ.250 కోట్ల చెక్కును ఆయన అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నామని స్పష్టం చేశారు.48 రోజుల్లోనే రూ.768 కోట్ల పరిహారంకూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కేవలం 48 రోజుల్లోనే వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు రికార్డు స్థాయిలో పరిహారం అందించింది. మూడు విడతల్లో మొత్తం 6,206 నిర్వాసిత కుటుంబాలకు రూ.768 కోట్లను ప్రభుత్వం చెల్లించింది. తొలి విడతలో 2,557 కుటుంబాలకు రూ.318 కోట్లు, రెండో విడతలో 1,622 కుటుంబాలకు రూ.200 కోట్లు అందించగా, శుక్రవారం మూడో విడతగా 2,027 కుటుంబాలకు రూ.250 కోట్లు సీఎం చేతుల మీదుగా అందజేశారు. నిర్వాసితులకు ఇంకా రూ.132 కోట్లు మాత్రమే చెల్లించాల్సి ఉందని అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్టు తొలిదశ పూర్తయితే 1.19 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, సుమారు 4 లక్షల మందికి తాగునీరు అందుబాటులోకి వస్తుంది.గత ప్రభుత్వ డ్రామాలతోనే ఆలస్యం: సీఎంఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.. "1996లో నేనే ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేసి శంకుస్థాపన చేశాను. ఇప్పుడు 2026లో నా చేతుల మీదుగానే ప్రారంభించడం నా అదృష్టం. గత రెండేళ్లలో రూ.2,250

చైనాలో మైనర్లకు ఏఐ ప్రేమికులు, వర్చువల్ భాగస్వాములు వంటి సేవలను పూర్తిగా నిషేధిస్తూ కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి.జూలై 15 నుంచి అమలవుతున్న నిబంధనల ప్రకారం 18 ఏళ్లలోపు వారికి వర్చువల్ ప్రేమికులు, భాగస్వాములు, బంధువుల తరహా సన్నిహిత సేవలు అందించకూడదు. యువత కృత్రిమ మేధ చాట్బాట్లు, వీడియో గేమ్ పాత్రలతో భావోద్వేగ బంధాలు పెంచుకుంటున్న నేపథ్యంలో ఈ నియంత్రణ తీసుకొచ్చారు. దీంతో మైనర్లకు కృత్రిమ మేధ సహాయకుడిగా ఉండొచ్చు కానీ ప్రేమికుడిగా మారకూడదనే స్పష్టమైన గీతను చైనా గీసింది. చైనా సైబర్స్పేస్ అడ్మినిస్ట్రేషన్ సహా 5 ప్రభుత్వ విభాగాలు కలిసి ఈ నిబంధనలను 2026 ఏప్రిల్ 10న విడుదల చేశాయి. కృత్రిమ మేధ ఆధారిత మనిషి తరహా పరస్పర సేవల నిర్వహణకు సంబంధించిన తాత్కాలిక చర్యలుగా వీటిని రూపొందించారు. 14 ఏళ్లలోపు పిల్లలు ఇతర మనిషి తరహా కృత్రిమ మేధ సేవలు ఉపయోగించాలంటే తల్లిదండ్రులు లేదా సంరక్షకుల అనుమతి తప్పనిసరి చేశారు. సేవను ఉపయోగిస్తున్న వ్యక్తికి తాను నిజమైన మనిషితో మాట్లాడటం లేదని వ్యవస్థ స్పష్టంగా గుర్తుచేయాలి. నిరంతరంగా 2 గంటలు వినియోగించిన తర్వాత విరామం తీసుకోవాలని కూడా సూచించాలి. ఏఐ ప్రేమికులు వినియోగదారుల్లో భావోద్వేగ ఆధారపడటం లేదా వ్యసనం పెంచే విధంగా రూపొందించకూడదని కొత్త నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. వాస్తవ జీవితంలోని కుటుంబ, స్నేహ, సామాజిక సంబంధాలు దెబ్బతినేలా కృత్రిమ మేధ సేవలు ప్రోత్సహించకూడదు. దీంతో తీవ్రమైన భావోద్వేగ పరిస్థితులను గుర్తించి అవసరమైన సమయంలో జోక్యం చేసుకునే వ్యవస్థలను కూడా సంస్థలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇదిలా ఉండగా కస్టమర్ సేవలు, విద్య, పని సహాయక కృత్రిమ మేధ వ్యవస్థలకు ఈ ప్రత్యేక నిబంధనలు వర్తించవు. ప్రధానంగా మనిషి తరహా భావోద్వేగ అనుబంధాన్ని సృష్టించే సేవలపైనే నియంత్రణ దృష్టి పెట్టింది. కొత్త నిబంధనల నేపథ్యంలో బైట్డాన్స్కు చెందిన డౌబావో, అలీబాబా క్యూవెన్, టెన్సెంట్ యువాన్బావో వంటి పెద్ద వేదికలు కస్టమ్ కృత్రిమ

TikTok | ఇంటర్నెట్ డెస్క్: చిన్నారుల భద్రతకు సంబంధించిన కేసును పరిష్కరించుకునేందుకు ప్రముఖ షార్ట్ వీడియో యాప్ టిక్టాక్ (TikTok) అమెరికా ప్రభుత్వంతో రాజీకొచ్చింది. ఇందుకుగాను ఆ దేశ న్యాయ విభాగానికి (US Justice Department) 400 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.3,800 కోట్లు) చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మొత్తాన్ని రెండు దఫాలలో చెల్లించనున్నట్లు వెల్లడించింది. దీంతో 2024లో దాఖలైన ఈ వ్యాజ్యం ముగిసింది. టిక్టాక్ తమతో రాజీ చేసుకోవడం దేశంలోని పిల్లలు, తల్లిదండ్రులకు ఒక పెద్ద విజయమని అమెరికా అసోసియేట్ అటార్నీ జనరల్ స్టాన్లీ పేర్కొన్నారు. ఆన్లైన్లో పిల్లలకు రక్షణ కల్పించడం.. వారి వ్యక్తిగత సమాచారాన్ని సోషల్ మీడియా యాప్లు గోప్యంగా ఉంచేలా పర్యవేక్షించడం తమ బాధ్యత అని తెలిపారు. 13 ఏళ్లలోపు పిల్లల వ్యక్తిగత సమాచారాన్ని (children's privacy) సేకరించే ముందు, పిల్లల కోసం ఉద్దేశించిన యాప్లు, వెబ్సైట్లు తల్లిదండ్రుల అనుమతి తీసుకోవాలని నిర్దేశించే ఫెడరల్ చట్టాన్ని టిక్టాక్, దాని చైనా ఆధారిత మాతృ సంస్థ బైట్డాన్స్ ఉల్లంఘించాయని ఆరోపిస్తూ.. 2024లో న్యాయ శాఖ వ్యాజ్యం దాఖలు చేసింది. నాటి నుంచి టిక్టాక్లో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. చైనాకు చెందిన బైట్డ్యాన్స్ (ByteDance) సంస్థ తన వాటాలను తగ్గించుకుంది. దీంతో కొత్త టిక్టాక్ యూఎస్ జాయింట్ వెంచర్ను ఏర్పాటు చేయడానికి ఒరాకిల్ (Oracle), సిల్వర్ లేక్, ఎమిరేట్స్ పెట్టుబడి సంస్థ ఎంజీఎక్స్ వంటి ప్రధాన పెట్టుబడిదారులతో ఒప్పందం చేసుకుంది. పిల్లల భద్రత, గోప్యతపై సోషల్ మీడియా కంపెనీలు పెద్ద సంఖ్యలో వ్యాజ్యాలను ఎదుర్కొంటున్న తరుణంలో టిక్టాక్ అమెరికా ప్రభుత్వంతో రాజీ కుదుర్చుకోవడం గమనార్హం. మరోవైపు 1998 నాటి బాలల ఆన్లైన్ గోప్యతా పరిరక్షణ చట్టం (COPPA)తో పాటు.. వివిధ రాష్ట్ర చట్టాలను ఉల్లంఘించిందనే ఆరోపణలు రావడంతో ఇన్స్టాగ్రామ్ మాతృ సంస్థ మెటా (Meta) సైతం కోర్టు విచారణలను ఎదుర్కొంటోంది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు

థియేటర్లలోకి వచ్చినవి తర్వాత స్ట్రీమింగ్ అవుతుంటాయి. కొన్నిసార్లు నేరుగా ఓటీటీలో రిలీజ్ అవుతుంటాయి. ఇలాంటి వాటిలో థ్రిల్లర్ జానర్లో తెరకెక్కిన సినిమాలు, సిరీస్లు ఉంటాయి. ఇప్పుడు అలా ఓ మూవీ నేరుగా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇంతకీ దీని సంగతేంటి? ఎప్పుడు ఎందులోకి రానుంది? 'ద గ్రేట్ ఇండియన్ కిచెన్' అనే మలయాళ సినిమాలో హీరోయిన్గా చేసిన నిమిషా సజయన్.. తెలుగులోనూ కాస్త గుర్తింపు తెచ్చుకుంది. ఈమె చేసిన ఓటీటీ మూవీ 'బబిత సింగ్ రిపోర్టింగ్'. ఇందులో ఈమె ఏఎస్ఐ పాత్రలో కనిపించనుంది. వచ్చే శుక్రవారం(ఆగస్టు 28) నుంచి అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ కానుందని చెబుతూ ట్రైలర్ వదిలారు. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ కథతో దీన్ని తెరకెక్కించారు. తెలుగులోనూ అందుబాటులోకి రానుంది. ట్రైలర్ బట్టి చూస్తే.. భోపాల్లోని పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగ పనిచేసే బబితా సింగ్ (నిమిషా సజయన్), కొన్ని పనుల వల్ల రెండు వారాలు సస్పెండ్ అవుతుంది. అదే టైంలో ఈమె చిన్ననాటి స్నేహితుడు బన్సి హత్యకు గురవుతాడు. హంతకుడిని పోలీసులు అరెస్ట్ కూడా చేస్తారు. అయితే తన ఫ్రెండ్ని ఎందుకు చంపారు? అసలు ఈ హత్య వెనక ఎవరెవరున్నారు? అనేది బబిత దర్యాప్తు చేస్తుంది. చివరకు ఏమైందనేదే స్టోరీలా అనిపిస్తుంది. బ్యూటీఫుల్ డ్రెస్లో మలయాళ బ్యూటీ అభిరామి అందాలు.. ఫోటోలు శారీలో హీరోయిన్ ఆదితి శంకర్ అందాలు.. ఫోటోలు వరలక్ష్మీ వ్రతం స్పెషల్.. టాలీవుడ్ సినీతారల ప్రత్యేక పూజలు.. ఫోటోలు హైదరాబాద్: నూతన వధూవరులకు వైఎస్ జగన్ ఆశ్వీరాదం(ఫొటోలు) ‘ఇరుముడి’మూవీ ప్రెస్మీట్...బేబీ నక్షత్ర ఏం చెప్పిందో తెలుసా? 20 మంది MLAల లేఖ కొండా సురేఖ మెడకు ఉచ్చు బర్తరఫ్ చేయాల్సిందే విశాఖ పిల్లాడి ఘటనపై త్రీమెన్ కమిటీ నియమించిన ప్రభుత్వం తీరని విషాదం.. కొడుకు ఎంత చెప్పినా వినలేదు, చివరికి తల్లి కూడా ! రోహిత్, గిల్ రికార్డులు OUT పంత్ @

ఇంటర్నెట్ డెస్క్: దేశంలో ఇటీవల చక్కెర ధరలు పెరగడంపై కేంద్రం స్పందించింది. ఇథనాల్ ఉత్పత్తి కోసం చక్కెరను మళ్లించడం వల్లే వీటి ధరలు పెరిగాయనడం సరికాదని పేర్కొంది. స్థానికంగా దిగుబడి తగ్గడం, పండగల వేళ డిమాండ్ పెరగడమే ధరల పెరుగుదలకు కారణాలని స్పష్టం చేసింది. ధరల నియంత్రణకు చర్యలు చేపట్టామని.. నిల్వలపై పరిమితులు విధించడంతోపాటు దిగుమతులపైనా సుంకాలు తగ్గించామని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. భారత్లో మారుమూల ప్రాంతాలకూ స్టార్లింక్: ఎలాన్ మస్క్ దేశంలో జులై 20న కిలో చక్కెర ధర రూ.48.18గా ఉండగా.. ఆగస్టు 20నాటికి అది రూ.55.70కు పెరిగింది. దీంతో ఇథనాల్ తయారీకి కోసం చక్కెర మళ్లించడం వల్లే ఈ ధరలు పెరిగాయని విపక్షాలు విమర్శలు గుప్పించాయి. పెట్రోల్లో కలిపే ఇథనాల్ తయారీ కోసం మళ్లించే చక్కెర వాటా 2022-23లో 12శాతం ఉండగా.. 2025-26లో 9శాతానికి తగ్గిందని కేంద్రం తెలిపింది. అంచనాల కంటే తక్కువ దిగుబడి రావడం, పండగల వేళ డిమాండ్, పంట నష్టం, అంతర్జాతీయ సరఫరాల్లో అంతరాయం, ఊహాగానాలతో కొంతమంది నిల్వలు పెంచడం, తదితర కారణాల వల్ల ధరలు పెరిగాయని స్పష్టం చేసింది. దేశంలో దాదాపు మూడోవంతు ఇథనాల్.. మొక్కజొన్న వంటి ధాన్యాల నుంచే ఉత్పత్తి అవుతోందని తెలిపింది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు
కేజీఎఫ్ సిరీస్తో ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపించిన రాకింగ్ స్టార్ యష్.. ఇప్పుడు తన తదుపరి పాన్-ఇండియా చిత్రం ‘టాక్సిక్’తో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. విలక్షణ దర్శకురాలు గీతు మోహన్దాస్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ప్రారంభం నుంచే ప్రేక్షకులు, సినీ వర్గాల్లో భారీ అంచనాలను నెలకొల్పింది. బిగ్ స్క్రీన్పై యష్ను సరికొత్త డార్క్ అవతార్లో చూడటానికి ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమా సెన్సార్ ప్రక్రియను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. చిత్రంలో ఉన్న తీవ్రమైన యాక్షన్ సీన్లు, డార్క్ థీమ్ను పరిగణనలోకి తీసుకుని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) ఈ చిత్రానికి 'A' (అడల్ట్స్ ఓన్లీ) సర్టిఫికేట్ను మంజూరు చేసింది. విశేషమేమిటంటే, సినిమాలో ఎలాంటి ప్రధాన సన్నివేశాలపై కట్స్ విధించకుండా బోర్డు క్లియరెన్స్ ఇచ్చింది. కేవలం ఒకటి రెండు సంభాషణల్లోని పదాలను మ్యూట్ చేయడం, చట్టబద్ధమైన హెచ్చరికలను స్పష్టంగా ప్రదర్శించడం వంటి చిన్నచిన్న మార్పులను మాత్రమే సూచించారు. ఇక ఈ మోస్ట్ అవైటెడ్ యాక్షన్ డ్రామా రన్టైమ్ 3 గంటల 12 నిమిషాలుగా లాక్ అయినట్లు అధికారిక సమాచారం. నిడివి కాస్త ఎక్కువగా ఉన్నప్పటికీ, కథనంలోని ఇంటెన్సిటీ ప్రేక్షకులను సీట్ల అంచులపై కూర్చోబెడుతుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. గతంలో భారీ హింసాత్మక సన్నివేశాలున్న చిత్రాలకు సెన్సార్ బోర్డ్ తీవ్రమైన కోతలు విధించిన సందర్భాలున్నాయి. అయితే 'టాక్సిక్' చిత్రంలో ఉన్న రా వయొలెన్స్కు ఒక్క కట్ కూడా పడకపోవడం ఇప్పుడు ఫిలిం సర్కిల్స్లో విపరీతంగా చర్చనీయాంశమైంది. స్వయంగా యష్ కూడా గతంలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఈ సినిమా కేవలం పెద్దల కోసమే రూపొందించబడిన కథ అని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో నయనతార, కియారా అద్వానీ, హుమా ఖురేషి, రుక్మిణి వసంత్, తారా సుతారియా వంటి ప్రసిద్ధ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తుండటం సినిమాకు మరింత గ్లామర్, క్రేజ్ను తెచ్చిపెట్టింది. పవర్ ఫుల్ కాస్టింగ్ తో
మాస్ మహారాజా రవితేజ, క్లాస్ డైరెక్టర్ శివ నిర్వాణ కాంబినేషన్లో తెరకెక్కిన ఎమోషనల్ డివోషనల్ యాక్షన్ డ్రామా 'ఇరుముడి' ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద మంచి పాజిటివ్ టాక్తో దూసుకుపోతోంది. తండ్రీకూతుళ్ల అనుబంధం నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో రవితేజ యాక్షన్ తో పాటు ఎమోషనల్ సీన్లు ఆడియన్స్ను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అయితే ఈ సినిమాలో రవితేజ కూతురిగా నటించిన చిన్నారి తన అద్భుతమైన నటనతో అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఆ చిన్నారే కేరళకు చెందిన చైల్డ్ ఆర్టిస్ట్ బేబీ నక్షత్ర. సినిమాలో 'మణికంఠ' అలియాస్ 'మణెమ్మ' పాత్రలో ఆమె చూపించిన ఎక్స్ప్రెషన్స్ ప్రేక్షకులను భావోద్వేగానికి గురిచేస్తున్నాయి. ముఖ్యంగా రవితేజతో వచ్చే తండ్రీకూతుళ్ల సెంటిమెంట్ సీన్లలో ఆమె సహజమైన అభినయం ఆడియన్స్తో కంటతడి పెట్టిస్తోంది. తొలి తెలుగు చిత్రమే అయినప్పటికీ ఎంతో ఆత్మవిశ్వాసంతో నటించిన ఈ చిన్నారి, తన పాత్రకు సొంతంగా తెలుగులోనే డబ్బింగ్ చెప్పడం విశేషం. ఇంతటి ప్రాధాన్యత ఉన్న లక్కీ ఆఫర్ ఈ చిన్నారికి ఎలా వచ్చిందనే విషయంపై రీసెంట్గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో నక్షత్ర ఆసక్తికర విశేషాలను వెల్లడించింది. ప్రస్తుతం ఏడో తరగతి చదువుతున్న నక్షత్రకి సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేయడం అంటే ఎంతో ఇష్టమట. అలా ఆమె చేసిన కొన్ని రీల్స్ చూసిన దర్శకుడు శివ నిర్వాణ, ఈ కథలోని అమాయకమైన, బలమైన పాత్రకు నక్షత్ర అయితే సరిగ్గా సరిపోతుందని భావించి ఆఫర్ ఇచ్చారని తెలిపింది. మైత్రీ మూవీ మేకర్స్ వంటి అగ్ర నిర్మాణ సంస్థలో, మాస్ రాజా రవితేజ వంటి పెద్ద హీరోతో కలిసి నటించడం తన అదృష్టమని నక్షత్ర సంతోషం వ్యక్తం చేసింది. షూటింగ్ సమయంలో రవితేజ, ప్రియా భవానీ శంకర్ తనను ఎంతో ఆప్యాయంగా చూసుకున్నారని, దర్శకుడు శివ నిర్వాణ ప్రోత్సాహంతో ఆడుతూ పాడుతూ తన పాత్రను పూర్తి చేశానని వెల్లడించింది. చిన్న వయసులోనే దక్షిణాది భాషలైన తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలోనూ పలు

ఇంటర్నెట్ డెస్క్: దేశీయ మార్కెట్లు శుక్రవారం ఫ్లాట్గా ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల మిశ్రమ సంకేతాలు, భౌగోళిక రాజకీయ అనిశ్చితులతో పెరుగుతోన్న చమురు ధరలు వంటి కారణాలతో మదుపర్లు అప్రమత్తత పాటించారు. దీంతో నేటి సెషన్లో రోజంతా ఒడుదొడుకులతో సాగిన సూచీలు (Stock Market).. చివరకు స్తబ్దుగా ముగిశాయి. ఈ ఉదయం 77,701 వద్ద స్వల్ప లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్ (Sensex) కాసేపటికి 77,725 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకింది. కానీ, ఆ జోరు ఎంతోసేపు కొనసాగలేదు. కీలక రంగాల్లో మదుపర్లు అమ్మకాలకు దిగడంతో సూచీలు లాభనష్టాల్లో ఊగిసలాడాయి. ఒక దశలో 77,445 కనిష్ఠాన్ని తాకిన సూచీ చివరకు అత్యల్పంగా 3 పాయింట్ల లాభంతో 77,540 వద్ద ముగిసింది. అటు నిఫ్టీ (Nifty) 20 పాయింట్లు పెరిగి 24,252 వద్ద స్థిరపడింది. డాలర్తో పోలిస్తే రూపాయి విలువ 3 పైసలు పెరిగి 95.71 వద్ద ముగిసింది. నిఫ్టీలో పవర్గ్రిడ్ కార్పొరేషన్, హెచ్డీఎఫ్సీ లైఫ్, నెస్లే, కొటక్ మహీంద్రా బ్యాంక్, భారత్ ఎలక్ట్రానిక్స్ షేర్లు స్వల్పంగా లాభపడ్డాయి. మారుతి సుజుకీ, ట్రెంట్, ఇంటర్గ్లోబ్ ఏవియేషన్, సిప్లా, టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ షేర్లు నష్టపోయాయి. రంగాల వారీగా.. లోహ, ప్రభుత్వ రంగ బ్యాంకింగ్, రియల్టీ షేర్లలో కొనుగోళ్లు జరిగాయి. ఐటీ, ఆటో, మీడియా, ఫార్మా రంగాల షేర్లు ఒత్తిడికి గురయ్యాయి. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

కొన్నిసార్లు గొప్ప ఆవిష్కరణలు పక్కా ప్రణాళికలతో కాదు, అనుకోని పొరపాట్ల నుంచి పుడతాయి. అలాంటి ఓ సంఘటనే ప్రపంచానికి తొలి ఆర్టిఫిషియల్ స్వీటెనర్ అయిన 'శాకరిన్'ను పరిచయం చేసింది. ప్రయోగశాలలో రోజంతా పనిచేసి, చేతులు శుభ్రం చేసుకోవడం మరిచిపోయిన ఓ శాస్త్రవేత్త చేసిన చిన్న పొరపాటే ఈ అద్భుతమైన తీపి ఆవిష్కరణకు దారితీసింది. ఈ ఆసక్తికర ఘటన 1879లో చోటుచేసుకుంది.అసలేం జరిగింది?అమెరికాలోని ప్రఖ్యాత జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీలో రసాయన శాస్త్రవేత్త కాన్స్టాంటిన్ ఫాల్బర్గ్, ప్రొఫెసర్ ఇరా రెమ్సెన్ ప్రయోగశాలలో పనిచేసేవారు. ఆయన బొగ్గు తారు (coal tar) సమ్మేళనాలపై పరిశోధనలు చేస్తున్నారు. ఒకరోజు ప్రయోగాలన్నీ ముగించుకుని, అలసిపోయి ఇంటికి వెళ్లారు. అయితే, ప్రయోగశాల నుంచి వచ్చిన తర్వాత చేతులు, చేతులను శుభ్రంగా కడుక్కోవాలన్న విషయాన్ని ఆయన పూర్తిగా మరిచిపోయారు.అదే చేతులతో భోజనానికి కూర్చుని, ఒక రొట్టె ముక్కను కొరకగానే ఆయన ఆశ్చర్యపోయారు. ఆ రొట్టె ఎన్నడూ లేనంత విపరీతమైన తీపితో అనిపించింది. అసలు ఈ తీపి ఎక్కడ నుంచి వస్తోందో ఆయనకు అర్థం కాలేదు. కాసేపటికి ఆయనకు అసలు విషయం బోధపడింది. ఆ తీపి రొట్టెది కాదు, తన చేతులపై అంటుకున్న ఏదో రసాయనానిది అని గ్రహించారు. వెంటనే ఆయన ప్రయోగశాలకు తిరిగి పరుగుపెట్టారు.తీపి మూలాన్ని గుర్తించడంప్రయోగశాలకు వెళ్లిన ఫాల్బర్గ్, తాను ఆ రోజు పనిచేసిన రసాయనాలను, మిశ్రమాలను ఒక్కొక్కటిగా రుచి చూడటం ప్రారంభించారు. ఆ రోజుల్లో శాస్త్రవేత్తలకు ఇది సాధారణ విషయమే. అలా రుచి చూస్తున్న క్రమంలో 'బెంజోయిక్ సల్ఫిమైడ్' అనే రసాయనానికి అత్యంత తీపి

ఎట్టకేలకు రవితేజ హిట్ కొట్టాడు. చాలా కాలంగా మాస్ రాజా సరైన హిట్స్ లేక సతమతం అవుతున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఇరుముడి సినిమాతో థియేటర్లోకి వచ్చాడు రవితేజ. ఈ సినిమా భారీ విజయం దిశగా దూసుకుపోతుంది. ప్రీమియర్స్ తోనే ఇరుముడి సినిమా బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఇరుముడి సినిమా నేడు ( శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విలేజ్ బ్యాక్డ్రాప్ తో పాటు అయ్యప్ప స్వామి మాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు ఆడియన్స్ బ్రహ్మరధం పడుతున్నారు. థియేటర్స్ లో ఈ సినిమా తెగ ఎంజాయ్ చేస్తున్నాడు ప్రేక్షకులు. శ్రీహరి చనిపోయిన తర్వాత క్లోజ్ ఫ్రెండ్సే సగం ఆస్తులు కాజేశారు.. నన్ను ఎవ్వరూ పట్టించుకోలేదు సినిమా చూసి అభిమానులు తమ అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. కాగా సినిమాలోని మల్లెపూల పల్లకి సాంగ్ కు థియేటర్స్ పూనకాలతో ఊగిపోతున్నాయి.. ఆడియన్స్ ఈ పాటకు నెక్స్ట్ లెవల్ లో వైబ్ అవుతున్నారు. డాన్స్ లు చేస్తూ పాటను ఆలపిస్తూ తెగ సందడి చేస్తున్నారు. స్క్రీన్ ముందు డాన్స్ చేస్తూ భజన చేస్తూ సందడి చేస్తున్నారు. అంతే కాదు కొన్ని థియేటర్స్ లో ఆడియన్స్ హారతులు కూడా పడుతున్నారు. Madhuri Rathod: అందుకే అలాంటి పాటల్ని సెలక్ట్ చేసుకున్నా.. వాటితోనే క్రేజ్ తెచ్చుకున్నా : మాధురి రాథోడ్ ప్రస్తుతం ఇరుముడి సినిమాకు సంబందించిన వీడియోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల్లో ఒకదాంట్లో థియేటర్ లోపల స్క్రీన్ కు హారతి ఇస్తున్న వీడియో వైరల్ అవుతుంది. సినిమాలోని మల్లెపూల పల్లకి సాంగ్ ప్లే అవుతుండగా ఓ అభిమాని ఇలా స్క్రీన్ కు హారతి ఇస్తూ కనిపించాడు. ఈ వీడియోను రవితేజ అభిమానులు సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు. ఎట్టకేలకీ రవన్న హిట్ కొట్టేశాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్

భారత మాజీ క్రికెటర్ జాకబ్ మార్టిన్ 22 ఏళ్ల నాటి క్రిమినల్ కేసులో నిర్దోషిగా విడుదలయ్యాడు. 2004లో జాకబ్ మార్టిన్ పాస్పోర్ట్ ఫోర్జరీ చేశాడన్న ఆరోపణలు రావడంతో అతడిపై క్రిమినల్ కేసు నమోదైంది. ఐపీసీలోని సెక్షన్లు 420, 468, 471, 120బితో పాటు పాస్పోర్ట్ చట్టంలోని సెక్షన్ 12 కింద జాకబ్ మార్టిన్పై అభియోగాలు మోపబడ్డాయి. తాజాగా 22 ఏళ్ల తర్వాత పాస్పోర్ట్ ఫోర్జరీ, నకిలీ యూకే ఇమ్మిగ్రేషన్ స్టాంప్, ప్రయాణ ఏర్పాట్లు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించి జాకబ్పై వచ్చిన ఆరోపణలు రుజువు కాలేదు. దీంతో పాటియాలా హౌస్ కోర్టు జాకబ్పై వచ్చిన ఆరోపణలన్నింటిని కొట్టివేస్తూ నిర్దోషిగా విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జాకబ్ మార్టిన్ పాస్పోర్ట్ అవకతవకలకు పాల్పడినట్లు గానీ, ఆర్థిక లావాదేవీలకు సంబంధించి విశ్వసనీయమైన ఆధారాలు లేవని కోర్టు స్పష్టం చేసింది. కేసులో ముఖ్యులైన పలువురు సాక్ష్యాలు, ఆధారాలు నిరూపించడంలో విఫలమయ్యారని, అందుకే జాకబ్ మార్టిన్ను నిర్దోషిగా విడుదల చేస్తున్నట్లు పాటియాలా కోర్టు తమ తీర్పును వెల్లడించింది. తాను నిర్దోషిగా విడుదలవ్వడంపై జాకబ్ మార్టిన్ మీడియాతో స్పందించాడు. "2004లో యూకే పర్యటనకు వెళ్లిన జట్టులో ఒక సభ్యుడు వీసా గడువు ముగిసినప్పటికీ అక్కడే ఉండిపోయాడు. అయితే నకిలీ ఇమ్మిగ్రేషన్ స్టాంప్ పొంది భారత్కు తిరిగి రావడంతోనే పట్టుబడడంతో కేసు వెలుగులోకి వచ్చింది. అసలు ఎఫ్ఐఆర్లో మొదట నా పేరు లేదు. కానీ విచారణ సమయం వచ్చేనాటికి నా పేరును కేసులో చేర్చారు. తాను అంతర్జాతీయ క్రికెటర్గా ఎదగకూడదనే ఉద్దేశంతో కొందరు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. ఏ తప్పు చేయనప్పటికీ నేను దోషిగా తేలడం వల్ల రైల్వే ఉద్యోగాన్ని కూడా కోల్పోవాల్సి వచ్చింది. క్రికెటర్గా ఎదగలేకపోయానన్న బాధ ఒత్తిడికి గురయ్యాను. తాజాగా 22 ఏళ్ల తర్వాత కేసులో నిర్దోషిగా బయటికి రావడం ఉపశమనాన్ని కలిగిస్తోంది. ఇది నా జీవితంలో ఒక కీలక మలుపు" అని చెప్పుకొచ్చాడు. 1999లో అంతర్జాతీయ అరంగేట్రం ఇక

ఇంటర్నెట్డెస్క్: టాటా మోటర్స్ ప్యాసింజర్ వెహికల్స్ (Tata Motors Passenger Vehicles) సంస్థ సెప్టెంబర్ 1వ తేదీ నుంచి కార్లపై రూ.25,000 వరకు ధరలను పెంచనుంది. ఈ విషయాన్ని శుక్రవారం ఓ ప్రకటనలో ఆ కంపెనీ పేర్కొంది. ద్రవ్యోల్బణ ఒత్తిడి, ముడి పదార్థాల ధరల పెరుగుదల వంటి కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ పేర్కొంది. ఈ పెంపు ఐసీఈ ఇంజిన్, ఎలక్ట్రిక్ వెహికల్స్లోని కార్లకు వర్తిస్తుందని పేర్కొంది. కాకపోతే ఎంత పెంపు అనేది మోడల్ను బట్టి ఉంటుందని వెల్లడించింది. ముడిపదార్థాల ధరల పెరుగుదలను చాలా వరకు కంపెనీ తట్టుకుందని పేర్కొంది. కొద్ది భారాన్ని మాత్రమే వినియోగదారులకు బదిలీ చేస్తున్నట్లు వెల్లడించింది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

ట్రై కార్పొరేషన్లలోని కొందరు పట్టణ ప్రణాళికా విభాగం అధికారులు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ట్రై కార్పొరేషన్లలోని ప్లానింగ్ విభాగం లీలలు హైదరాబాద్ సిటీ: ట్రై కార్పొరేషన్లలోని కొందరు పట్టణ ప్రణాళికా విభాగం అధికారులు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అనుమతుల నుంచి ఓసీల జారీ వరకు.. ఫైల్కు ఇంత అని, అంతస్తులు, నిర్మాణ విస్తీర్ణం బట్టి రేట్లు నిర్ణయించి మరీ లంచాలు తీసుకుంటున్నారు. అడిగినంత ఇవ్వకుంటే నోటీసులు, కూల్చివేతలంటూ వేధింపులకు గురి చేస్తున్నారు. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(సీఎంసీ) పరిధిలో ఈ తతంగం ఎక్కువగా జరుగుతుండగా.. తామేమి తక్కువ కాదన్నట్టు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ), మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్(ఎంఎంసీ) యంత్రాంగం కూడా వారితో పోటీ పడుతోంది. అక్రమ నిర్మాణాల విషయంలో అధికారుల దోపిడికి అడ్డూ అదుపు ఉండడం లేదు. మాదాపూర్లో నోటరీ స్థలాల్లో నాలుగైదు అంతస్తుల భవన నిర్మాణాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. ప్రాంతాల వారీగా అవుట్ సోర్సింగ్ సిబ్బందికి బాధ్యతలు అప్పగించి.. నిర్మాణదారుల నుంచి కొందరు అధికారులు వసూళ్లు చేస్తుండడం గమనార్హం. కూకట్పల్లి జోన్ పరిధిలోనూ పలువురు పట్టణ ప్రణాళికా విభాగం అధికారుల తీరు చర్చనీయాంశంగా మారింది. అంతా మేం చూసుకుంటాం.. అదనపు అంతస్తులు నిర్మించుకోండని భవన యజమానులకు భరోసా ఇస్తున్నట్టు తెలిసింది. గ్రౌండ్ ప్లస్ రెండంతస్తుల భవనానికి అనుమతి తీసుకున్న ఓ వ్యక్తి అదనంగా మరో రెండంతస్తులు నిర్మించారు. స్థానికులు ఫిర్యాదు చేసినా అధికారులు అటు వైపు కన్నెత్తి చూడకపోగా.. త్వరగా బయటి వైపు పనులు పూర్తి చేసి రంగులు వేయాలని సూచించినట్టు సమాచారం. చైన్మెన్ నుంచి టీపీఎస్, ఏసీపీ, సిటీ ప్లానర్ల వరకు అవినీతిలో భాగస్వాములుగా ఉంటున్నారు. ప్రతీ ఫైల్కు ముడుపులు ముట్టాల్సిందే అని కింది స్థాయి సిబ్బంది వద్ద పైఅధికారులు బహిరంగంగా చెబుతుండడం గమనార్హం

22 ఏళ్ల క్రితం నమోదైన ఓ కేసులో టీమిండియా మాజీ క్రికెటర్ నిర్దోషిగా తేలాడు. అతడిపై వచ్చిన అభియోగాలకు సరైన ఆధారాలు లేకపోవడంతో కోర్టు అతడిని నిర్దోషిగా తేలుస్తూ తీర్పునిచ్చింది. స్పోర్ట్స్ డెస్క్: టీమిండియా మాజీ క్రికెటర్ జేకబ్ మార్టిన్ను 22 ఏళ్ల క్రితం నమోదైన క్రిమినల్ కేసు నుంచి పాటియాలా హౌస్ కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. 2004లో నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఐపీసీ సెక్షన్లు 420, 468, 471, 120బీ, పాస్పోర్ట్ చట్టం సెక్షన్ 12 కింద అతడిపై అభియోగాలు మోపబడ్డాయి. అయితే యూకే ఇమ్మిగ్రేషన్ స్టాంప్ ఫోర్జరీ, ప్రయాణ ఏర్పాట్లు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించి మార్టిన్పై వచ్చిన ఫిర్యాదులకు ఎటువంటి ఆధారాలు లేవని కోర్టు తేల్చిచెప్పింది. ఆర్థిక లావాదేవీలపై లేదా 'అజ్వా స్పోర్ట్స్ క్లబ్' యాజమాన్య నియంత్రణపై ఎటువంటి సరైన సాక్ష్యాలు లభించలేదని కోర్టు పేర్కొంది. పలువురు సాక్షులు కూడా ఈ ఆరోపణలను రుజువు చేయలేకపోవడంతో కోర్టు జేకబ్కు క్లీన్ చిట్ ఇచ్చింది. కోర్టు తీర్పు వెలువడిన అనంతరం జేకబ్ మార్టిన్ మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యాడు. 2004లో ఇంగ్లండ్లో ఆడేందుకు వెళ్లిన తన జట్టులోని ఒక ప్లేయర్ వీసా గడువు ముగిసినా యూకేలోనే ఉండిపోయాడని పేర్కొన్నాడు. తప్పుడు స్టాంపింగ్ చేయించుకుని భారత్కు తిరిగొచ్చే క్రమంలో ఎయిర్పోర్టులో పట్టుబడ్డాడని జేకబ్ వివరించాడు. అసలు ఎఫ్ఐఆర్లో తన పేరు లేకపోయినా, తానొక ఇంటర్నేషనల్ క్రికెటర్ కావడం వలనే విచారణ సమయంలో తన పేరును ఈ కేసులోకి బలవంతంగా చేర్చాని అతడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ 22 ఏళ్ల సుదీర్ఘ కాలం తనను తీవ్రమైన మానసిక ఆందోళనకు గురిచేసిందని, చివరకు రైల్వే ఉద్యోగాన్ని కూడా కోల్పోవాల్సి వచ్చిందని జేకబ్ మార్టిన్ వాపోయాడు. తనపై ఆరోపణలు వచ్చిన సమయంలో బీసీసీఐ నుంచి కూడా ఎటువంటి స్పందన లభించలేదని తెలిపాడు. ఏదేమైనా కోర్టు ఇచ్చిన ఈ తీర్పు తన జీవితానికి ఒక పెద్ద మలుపు అని

నిషేధిత జాబితాలో చేరినవి ఎన్ని? లెక్కలు తేల్చండి.. వివరాలు ఇవ్వండి! 22ఏ సెక్షన్ నేపథ్యంలో తహసీల్దార్లకు కలెక్టర్ ఆదేశాలు సబ్ రిజిస్ర్టార్లతో సంప్రదింపులు జరపాలని సూచన జిల్లాలో రోజువారీ రిజిస్ర్టేషన్ల ప్రక్రియపై ఆరా హైదరాబాద్ సిటీ: 22ఏ కింద నిషేధిత జాబితాలో చూపుతున్న లక్షలాది మంది నిరుపేదల నివాసాలు, ఖాళీ స్థలాలతో పాటు పెద్ద పెద్ద భవనాలను ఆ జాబితా నుంచి బయటపడేసేందుకు జిల్లా రెవెన్యూ శాఖ చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వ ఆదేశాలతో హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ప్రియాంక దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. తహసీల్దార్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లతో చర్చిస్తూ, రికార్డులను సరిచూస్తున్నారు. ప్రధానంగా రిజిస్ర్టేషన్ ఆఫీసుల్లో సబ్ రిజిస్ర్టార్లు తిరస్కరిస్తున్న సర్వే నంబర్లలో ఉన్న మొత్తం భూమి ఎంత.. అందులో ఎంతవరకు ప్రైవేట్ పట్టా స్థలాలు ఉన్నాయి.. వాటి పక్కన ఉన్న ప్రభుత్వ భూమిలో ఎన్ని కోర్టు కేసులు నడుస్తున్నాయి.. అనే వివరాలను ఆరా తీస్తున్నారు. అధికారుల తప్పిదంతో నిషేధిత జాబితాలోకి.. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని నెలలుగా 22ఏ సెక్షన్ తీవ్ర చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ప్రభుత్వ భూముల పరిరక్షణ పేరుతో తీసుకొచ్చిన ఈ చట్టంతో 50 ఏళ్లకు పైబడిన ప్రైవేట్ పట్టా భూములు, ఇళ్లు సైతం అనుకోకుండా ప్రోహిబిటెడ్ లిస్టులోకి వెళ్లాయి. అయితే కొంతమంది రెవెన్యూ అధికారుల తప్పిదంతోనే ఈ పొరపాట్లు చోటుచేసుకున్నాయని గ్రహించిన రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజులుగా దిద్దుబాటు చర్యలకు దిగింది. రాష్ట్రంలో ఇతర జిల్లాల్లో ఈ సమస్య తక్కువగా ఉన్నప్పటికీ, గ్రేటర్లోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్లో ఎక్కువగా ఉండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నివేదిక ఇచ్చేందుకు హడావుడి వాస్తవంగా జిల్లాలో 12 లక్షలకు పైగా భూములు వివిధ కోర్టు కేసుల్లో ఉన్నాయి. ఏళ్ల తరబడి ఇవి కోర్టుల్లో నడుస్తూనే ఉన్నాయి. కౌంటర్లు దాఖలు చేయడంలో కొంతమంది తహసీల్దార్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో మగ్గుతున్నాయి. దీంతో కొంత మంది వాటిని ఆక్రమించుకుని పట్టాలు సైతం పొందుతున్నారనే ఆరోపణలున్నాయి. ఈ

సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Lingamaneni Sanjush Accident Case: ఐటీ కారిడార్లో భోజనం చేసి రోడ్డు దాటుతూ వెళ్తున్న యువతిని అత్యంత వేగంగా కారుతో దూసుకొచ్చి ఢీకొట్టడంతో ఆమె ఎగిరి కిందపడి దుర్మరణం చెందింది. ఈ ప్రమాదం చేసిందెవరో కాదు ఏపీలోని జనసేన పార్టీ ఎంపీ లింగమనేని రమేశ్ కుమారుడు లింగమనేని సంజూశ్. ప్రమాదం జరిగి నాలుగు రోజుల తర్వాత పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారం సంచలనం రేపుతోంది. ఇంకా అరెస్ట్ చేయకపోవడంతో పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. హైదరాబాద్ మాదాపూర్లోని ఇన్ఆర్బిట్ మాల్లోని లైఫ్స్టైల్ స్టోర్లో పనిచేసే ఇద్దరు మహిళా ఉద్యోగులు భారతి ముఖి (26), పూజా అశోక్ ఆగస్టు 16న భోజనం కోసం రోడ్డు అవతల ఉన్న హోటల్కు వెళ్లారు. భోజనం చేసి వారిద్దరూ మధ్యాహ్నం 3 గంటల సమయంలో తిరిగి విధుల్లో చేరేందుకు వస్తూ రోడ్డు దాటుతున్నారు. ఆ సమయంలో స్పోర్ట్స్ కారు (టీజీ09జీ0666) కారు అత్యంత వేగంగా దూసుకువచ్చి భారతి ముఖిని ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు భారతి ముఖి ఎగిరి కిందపడగా.. పూజా అశోక్కు స్వల్ప గాయాలయ్యాయి. కారును ఏపీ రాజ్యసభ సభ్యుడు లింగమనేని రమేశ్ కుమారుడు లింగమనేని సంజూశ్ డ్రైవింగ్ చేస్తున్నాడు. ప్రమాదం అనంతరం వెంటనే తీవ్ర గాయాలపాలైన భారతి ముఖికి హుటాహుటిన అదే కారులో జూబ్లీహిల్స్లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. ప్రమాద సమయంలో భారతి ముఖితో ఉన్న పూజా అశోక్ వెంటనే ఈ విషయాన్ని లైఫ్స్టైల్ స్టోర్ మేనేజర్ అశ్విన్ కుమార్కు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. విషయం

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఆర్డీఓ కార్యాలయాల్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు ఏక కాలంలో 15 చోట్ల సోదాలు నిర్వహించారు. డీఎస్పీ ఆనంద్ ఆధ్వర్యంలో దాడులు జరిగాయి. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలతో డీఏఓగా పనిచేస్తున్న శ్రీనివాస్ రెడ్డి ఇల్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ఆయనకు రూ. 100 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. బంధువులు, సహచరులకు చెందిన 5 ప్రాంతాల్లోనూ సోదాలు జరిపారు. భారీగా ఆస్తుల పత్రాలు గుర్తించారు.వీటిలో కర్మన్ ఘాట్ లో రూ.2.63 కోట్లు విలువ చేసే రెండు ప్లాట్లు, అలాగే జీ+3 పెంట్ హౌస్.. దీని విలువ రూ.1.61 కోట్లుగా ఉంది. ఇక యాచారం నల్లవెల్లిలో 10 ఎకరాల 08 గుంటల వ్యవసాయ భూమి.. దీని విలువ రూ.25.50 లక్షలు.. అలాగే నగర పరిధి, శివార్లలో 8 ఖాళీ స్థలాలు.. దీని విలువ రూ.62.84 లక్షలుగా ఉంది. ఇక బాలాపూర్ లోని నరేంద్ర బార్ అండ్ రెస్టారెంట్ లో పెట్టుబడులు.. వీటి వాటా రూ.86 లక్షలుగా ఉంది.వీటితోపాటు అధికారుల సోదాల్లో రూ.4 లక్షల నగదు, బ్యాంక్ ఖాతాల్లో రూ.8.60 లక్షల నిల్వలు, 680 గ్రాముల బంగారు ఆభరణాలు.. రూ.5.85 లక్షలు, మూడు కార్లు, రెండు ద్విచక్ర వాహనాలు.. వీటి విలువ రూ. 59 లక్షలు.. అలాగే రూ.11 లక్షల విలువైన గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు.. బ్యాంకులో 46 తులాల బంగారం తాకట్టు పెట్టి రుణం.. ఇప్పటివరకు మొత్తం ఆస్తుల విలువ రూ.6.87 కోట్లుగా ఏసీబీ అంచనా వేసింది. ఇక గతంలోనే 2009 లో ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదైనట్లు ఏసీబీ వెల్లడించింది. శ్రీనివాస్ రెడ్డిని అరెస్ట్ చేశామని.. జ్యుడిషియల్ రిమాండ్ కోసం కోర్టులో హాజరుపరచనున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు

ఇంటర్నెట్ డెస్క్: బంగారం, వెండి ధరలు మరోసారి భారీగా పెరిగాయి. పసిడి ధర ఒకేరోజు దాదాపు రూ.4300 పెరిగింది. దీంతో దేశ రాజధానిలో 10 గ్రాముల బంగారం ధర రూ.1.62 లక్షలకు చేరుకుంది. ఈ స్థాయిలో పెరగడం మూడు నెలల్లో ఇదే గరిష్ఠం. మార్కెట్లో నిన్న బంగారం ధర సుమారు రూ.1.58 లక్షలుగా ఉన్న విషయం తెలిసిందే. మరోవైపు, వెండి సైతం కిలోకు రూ.10 వేలు పెరిగి రూ.2.45 లక్షలకు చేరింది. గత ఏడు వారాల్లో ఈ స్థాయిలో పెరగడం ఇదే తొలిసారి. గోల్డ్ లోన్ రంగంలోకి ఆదిత్య బిర్లా కంపెనీ అంతర్జాతీయంగా చమురు మంటలు కొనసాగుతున్న వేళ అమెరికా డాలర్ విలువ పడిపోవడం.. యూఎస్ బాండ్లపై రాబడి తగ్గుతుండడంతో మదుపరులు లోహాల వైపు మొగ్గు చూపుతున్నట్లు మార్కెట్రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. దీంతో డిమాండ్ పెరిగి, బంగారం ధరలు పైపైకి పోతున్నట్లు చెబుతున్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

హైదరాబాద్లోని ఇనార్బిట్ మాల్ సమీపంలో చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదం కేసులో కీలక పురోగతి లభించింది. ఈ ప్రమాదానికి కారణమైన కారును జనసేన రాజ్యసభ సభ్యుడు లింగమనేని రమేశ్ కుమారుడు లింగమనేని సంజూష్ నడిపినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అతడిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.గత నెల ఆగస్టు 16వ తేదీ రాత్రి ఇనార్బిట్ మాల్ ఎదురుగా రోడ్డు దాటుతున్న భారతి ముఖి (26) అనే యువతిని అతివేగంగా వచ్చిన ఆస్టన్ మార్టిన్ కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. మృతురాలు ఓ లైఫ్స్టైల్ స్టోర్లో సేల్స్గర్ల్గా పనిచేస్తోంది. కాగా, ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా అక్కడి నుండి పరారయ్యాడు.ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, సీసీటీవీ ఫుటేజ్, వాహనం రిజిస్ట్రేషన్ నంబర్ (టీజీ-09-జీ-0666) ఆధారంగా లోతైన దర్యాప్తు చేపట్టారు. విచారణలో భాగంగా, ప్రమాద సమయంలో కారును సంజూష్ నడుపుతున్నట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అజాగ్రత్తగా వాహనాన్ని నడిపి మరణానికి కారణమైనందుకు అతడిపై భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 106(1) కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి తదుపరి విచారణ కొనసాగుతోంది

దక్షిణాది చిత్ర పరిశ్రమలో రెండు దశాబ్దాలకు పైగా అగ్ర కథానాయికగా వెలుగొందుతున్న త్రిష కృష్ణన్, నటనతోనే కాకుండా సంపాదనలోనూ తన సత్తా చాటుతున్నారు. వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈ చెన్నై బ్యూటీ ప్రస్తుతం సౌత్ ఇండియాలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటీమణులలో ఒకరిగా నిలిచారు. మీడియా నివేదికల ప్రకారం.. ప్రస్తుతం త్రిష నికర ఆస్తి విలువ సుమారు రూ. 85 కోట్లకు చేరింది. ‘పొన్నియిన్ సెల్వన్’, ‘లియో’ వంటి భారీ విజయాల తర్వాత త్రిష తన రెమ్యునరేషన్ను గణనీయంగా పెంచారు. ప్రస్తుతం ఆమె ఒక్కో చిత్రానికి రూ.10 నుంచి 12 కోట్ల వరకు ఛార్జ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. సినిమాలతో పాటు ప్రముఖ బ్రాండ్లకు ప్రచారకర్తగా వ్యవహరిస్తూ, ఎండార్స్మెంట్ల ద్వారా ఏటా సుమారు రూ.9 కోట్లు ఆర్జిస్తున్నారు. ఆస్తి పెట్టుబడుల్లోనూ త్రిష ముందున్నారు. చెన్నైలో ఆమెకు సుమారు రూ.10 కోట్ల విలువైన లగ్జరీ ఇల్లు ఉంది. అలాగే షూటింగ్ నిమిత్తం హైదరాబాద్ వచ్చినప్పుడు ఉండేందుకు ఇక్కడ రూ. 6 నుంచి 6.5 కోట్ల విలువైన మరో ఇల్లు ఉంది. అంతేకాకుండా విదేశాల్లోనూ ఆమెకు పెట్టుబడులు ఉన్నట్లు సమాచారం.ఇక లగ్జరీ కార్లంటే త్రిషకు చాలా ఇష్టం. ఆమె గ్యారేజీలో మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్, బీఎండబ్ల్యూ, రేంజ్ రోవర్ ఎవోక్, ఆడి వంటి రూ. 3 నుంచి 4 కోట్ల విలువైన ఖరీదైన కార్లు ఉన్నాయి. ఇలా నటనతో పాటు వ్యాపార దృక్పథంతో ముందుకు సాగుతూ త్రిష తన సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నారు. మటన్ అమ్మే పనిలో బిజీగా షాపు ఓనర్.. అంతలో వచ్చిన ఊహించని కస్ట్మర్.. తర్వాత ఏమైందంటే.. Anupama Parameswaran: నెలసరి వచ్చిందా అంటూ నీచంగా అవహేళన చేసేవాడు.. టాలీవుడ్లో ఆగని రచ్చ.. ఫిల్మ్ పెడరేషన్ సీరియస్ చర్యలు బఘీరా.. ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటారా.. NTR ఎమోషనల్! Balakrishna 111: గాయాన్ని లెక్కచేయకుండా.. బాలయ్య మొండి పట్టు

stock market| ఇంటర్నెట్ డెస్క్: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు రాణించాయి. దీంతో వరుసగా ఏడు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది. గురువారం సెషన్లో సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. అమెరికా బాండ్ల రాబడులు తగ్గడం మార్కెట్ సెంటిమెంట్ను బలపరిచింది. విదేశీ మదుపర్ల పెట్టుబడులు కలిసొచ్చాయి. రియాల్టీ, ప్రైవేట్ బ్యాంక్, ఐటీ షేర్లలో కొనుగోళ్లు సూచీలకు దన్నుగా నిలిచాయి. సెన్సెక్స్ ఉదయం 77,468.45 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 76,909.68) లాభాల్లో ప్రారంభమైంది. రోజంతా సూచీ లాభాల్లోనే కదలాడింది. ఇంట్రాడేలో 77,611.11 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకిన సూచీ.. చివరికి 628.04 పాయింట్ల లాభంతో 77,537.72 వద్ద ముగిసింది. నిఫ్టీ 153.55 పాయింట్లు పెరిగి 24,231.85 వద్ద స్థిరపడింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 95.71గా ఉంది. సెన్సెక్స్ 30లో టైటాన్, హెచ్సీఎల్, ఇండిగో, టాటా స్టీల్ కంపెనీ షేర్లు తప్ప మిగతా కంపెనీల షేర్లన్నీ లాభాలను ఆర్జించాయి. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ ధర 93.94డాలర్ల వద్ద కొనసాగుతోంది. బంగారం ఔన్స్ ధర 4,490.60 వద్ద స్థిరపడింది. ఆసియా మార్కెట్లలో దక్షిణ కొరియా, జపాన్, షాంఘై, హాంకాంగ్ మార్కెట్ సూచీలు కూడా లాభాల్లోనే ట్రేడయ్యాయి. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

అమెరికా జాతీయ రుణం చరిత్రలో తొలిసారిగా 40 ట్రిలియన్ డాలర్ల నూతన గరిష్ట స్థాయికి చేరుకుంది. కేవలం ఐదు నెలల్లోనే ఈ రుణం 1 ట్రిలియన్ డాలర్లు పెరగడంతో, సామాన్యులకు వడ్డీ ఖర్చులు, ఆర్థిక ఆందోళనలు పెరిగాయి. డొనాల్డ్ ట్రంప్, జో బైడెన్ల హయాంలో ఈ రుణం రెట్టింపు అయి ఈ చారిత్రాత్మక స్థాయికి చేరుకుందని బుధవారం విడుదలైన గణాంకాలు చూపిస్తున్నాయి. అమెరికా ప్రభుత్వ వ్యయంలో ఎక్కువగా రక్షణ, సామాజిక భద్రత, మెడికేర్ వంటి కార్యక్రమాలకు కేటాయిస్తున్న తరుణంలో ఈ రుణం భారీగా పెరిగిపోయింది. ప్రభుత్వ వ్యయంలో రుణాలపై వడ్డీ కూడా ఒక కీలక భాగంగా మారింది. ముఖ్యంగా అమెరికా రుణం ప్రతి ఐదు నెలలకు 1 ట్రిలియన్ డాలర్ల చొప్పున పెరుగుతోంది.కిమ్కు దండం పెట్టేసిన ట్రంప్. అమెరికా సైనిక విన్యాసాలకు బ్రేక్..గత కొన్ని నెలలుగా అమెరికా జాతీయ రుణ పెరుగుదల వేగం స్పష్టంగా కనిపిస్తోంది. అక్టోబర్లో ఇది 38 ట్రిలియన్ డాలర్లను దాటింది. సుమారు ఐదు నెలల తర్వాత మార్చిలో ఈ సంఖ్య 39 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇప్పుడు ఆగస్టులో ఈ రుణం 40 ట్రిలియన్ డాలర్లను మించిపోయింది. అంటే సుమారు 10 నెలల్లో అమెరికా జాతీయ రుణం 2 ట్రిలియన్ డాలర్లు పెరిగింది. ఈ సంఖ్య ప్రభుత్వ రుణాన్ని ప్రతిబింబించడమే కాకుండా, భవిష్యత్తులో అమెరికా బడ్జెట్ ఎదుర్కోబోయే ఒత్తిడిని కూడా సూచిస్తోంది.యూఎస్ ట్రెజరీ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన కొత్త సమాచారం ప్రకారం, మంగళవారం నాటికి మొత్తం ప్రభుత్వ రుణం 40.047 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. ఇందులో ప్రజల వద్ద ఉన్న 32.266 ట్రిలియన్ డాలర్ల ప్రభుత్వ సెక్యూరిటీలు, 7.782 ట్రిలియన్ డాలర్ల అంతర్-ప్రభుత్వ రుణం ఉన్నాయి. పెరుగుతున్న సామాజిక భద్రతా ఖర్చులు, రుణ వడ్డీ చెల్లింపులు ఇప్పటికే పన్ను రాబడిని మించిపోయాయి.రక్షణ రంగం నుంచి సామాజిక పథకాల వరకు భారీ వ్యయంఈ 40 ట్రిలియన్ డాలర్ల అంకెకు వివిధ ప్రభుత్వ

శ్రీలీల (Sreeleela) రెండేళ్ల క్రితం హిందీ సినిమాని సైన్ చేసింది. కార్తీక్ ఆర్యన్ సరసన సినిమా కావడంతో ఎగిరి గంతేసి ఒప్పుకొంది. మొదటి చిత్రమే కార్తీక్ ఆర్యన్ సరసన కావడం ఆమె ఎక్కువ హ్యాప్పీగా ఫీల్ అయింది. ఐతే, రెండేళ్ల తర్వాత కూడా ఇంకా షూటింగ్ పూర్తి కాలేదు. దానికి తోడు ఈ వారం షూటింగ్ మళ్ళీ మొదలు పెట్టింది టీం. కానీ ఇప్పుడు కొత్త సమస్య వచ్చి పడింది. కార్తీక్ ఆర్యన్ తాజాగా మరో సినిమా షూటింగ్ లో గాయపడ్డాడు. సర్జరీ అవసరం అని వైద్యులు చెప్పారట. దాంతో, ఈ వీకెండ్ కార్తీక్ కి సర్జరీ జరగనుంది. సర్జరీ తర్వాత ఆరు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది. సో, శ్రీలీల మొదలు పెట్టాల్సిన షూటింగ్ షెడ్యూల్ ఆగిపోయింది. ఈ సినిమా ఈ ఏడాది పూర్తి చేసుకుంటుందా అనేది పెద్ద డౌట్. తాజా సమాచారం ప్రకారం శ్రీలీల మొదటి చిత్రం వచ్చే ఏడాది అంటే 2027లోనే థియేటర్లలోకి వస్తుంది. అంటే ఆమె షూటింగ్ మొదలు పెట్టిన మూడేళ్లకు మొదటి హిందీ చిత్రం రిలీజ్ అవుతుంది. ప్రస్తుతం ఈ భామ ధనుష్ సరసన “ఓం” (OM) సినిమాలో నటిస్తోంది. తెలుగులో కొత్తగా ఇంకా ఏ సినిమా ఒప్పుకోలేదు. ఇక హిందీ చిత్రం అలా వాయిదాల మీద వాయిదాలు పడుతోంది

విద్యార్థుల నిరసనలపై నిబంధనలు రద్దు తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం ఉపసంహరణతో విద్యార్థులకు స్వేచ్ఛ Tamil Nadu Government: తమిళనాడులో విద్యార్థుల రాజకీయ భాగస్వామ్యం, నిరసన ప్రదర్శనలపై విధించిన సంచలనాత్మక ఆంక్షల విషయంలో సి. జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని తమిళనాడు ప్రభుత్వం(Tamil Nadu Government) కీలకమైన వెనకడుగు వేసింది. వామపక్ష రంగాలు, కాక్రోచ్ జనతా పార్టీ (సిజెపి) ఆధ్వర్యంలో నిర్వహించే నిరసనలు, ఆందోళనల్లో విద్యార్థులు పాల్గొనకుండా నిషేధిస్తూ గతంలో జారీ చేసిన వివాదాస్పద ఆదేశాలను ప్రభుత్వం బుధవారం అధికారికంగా ఉపసంహరించుకుంది. ఈ నిర్ణయంతో విద్యార్థుల సంఘాలు, రాజకీయ వర్గాల నుంచి వ్యక్క్తమైన నిరసనలకు తెరపడినట్లయింది. YS Jagan: ఎన్నికలు ఎప్పుడు వచ్చినా విజయం మాదే.. కూటమి పాలనపై తీవ్ర వ్యతిరేకత.. వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు గత ఉత్తర్వుల్లో ఉన్న ప్రధాన మార్గదర్శకాలు: గతంలో కాలేజియేట్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ జారీ చేసిన కఠిన నిబంధనల ప్రకారం, వామపక్షాలు, సిజెపి నిర్వహించే ఏ విధమైన ధర్నాలు లేదా నిరసన కార్యక్రమాల్లో విద్యార్థులు పాల్గొనకుండా చూడాలని ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు విద్యాశాఖ అధికారులు, పోలీసులు, జిల్లా యంత్రాంగాలు పరస్పరం సమన్వయం చేసుకుంటూ విద్యార్థులను నిరుత్సాహపరచాలని, వారిపై తీసుకున్న చర్యలకు సంబంధించిన నివేదికలను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు సమర్పించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఉత్తర్వుల ఉపసంహరణతో మారిన పరిస్థితులు: అయితే తాజాగా ప్రభుత్వం తీసుకున్న ఉపసంహరణ నిర్ణయంతో పాత ఉత్తర్వులు పూర్తిగా రద్దయ్యాయి. ఇకపై వివిధ శాఖలు, జిల్లా యంత్రాంగాలు విద్యార్థుల భాగస్వామ్యాన్ని నిరోధించడం లేదా వారిపై తీసుకున్న చర్యల నివేదికలను సమర్పించాల్సిన అవసరం లేదు. ఈ తాజా చర్యతో విద్యార్థుల ప్రజాస్వామ్య హక్కులకు, నిరసన తెలిపే స్వేచ్ఛకు ప్రభుత్వం మళ్లీ ప్రాధాన్యం ఇచ్చినట్లయింది

Stock market | ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీల నష్టాల పరంపర కొనసాగుతోంది. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితులు, ఇతర మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలతో సూచీలు నష్టపోయాయి. దీంతో నిఫ్టీ వరుసగా ఏడో రోజూ నష్టాల్లో ముగిసింది. సెన్సెక్స్ ఉదయం 77,218.05 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 77,235.46) వద్ద స్వల్ప నష్టాల్లో ప్రారంభమైంది. రోజంతా నష్టాల్లో కొనసాగిన సూచీ.. ఓ దశలో 76,822.89 పాయింట్ల వద్ద కనిష్ఠాన్ని తాకింది. చివరకు 325.78 పాయింట్ల నష్టంతో 76,909.68 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 76.60 పాయింట్ల నష్టంతో 24,078 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 95.75గా ఉంది. సెన్సెక్స్ 30 సూచీలో పవర్గ్రిడ్ కార్పొరేషన్, బజాజ్ ఫైనాన్స్, ఎల్అండ్టీ, ఐటీసీ, హిందుస్థాన్ యూనిలీవర్ స్టాక్స్ నష్టాల్లో ముగిశాయి. హెచ్సీఎల్ టెక్నాలజీస్, ఎటర్నల్, కోటక్ మహీంద్రా బ్యాంక్, సన్ఫార్మా, టైటాన్ షేర్లు లాభపడ్డాయి. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 91 డాలర్ల స్థాయికి చేరగా.. బంగారం ఔన్సు ధర 4,368 డాలర్ల వద్ద కొనసాగుతోంది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు