
నెల్లూరులో పండుగలా పెన్షన్ల పంపిణీ పాల్గొన్న మంత్రి నారాయణ
Nellore: నెల్లూరులో పండుగలా పెన్షన్ల పంపిణీ పాల్గొన్న మంత్రి నారాయణ! ఈ వార్తకు సంబంధించిన

Nellore: నెల్లూరులో పండుగలా పెన్షన్ల పంపిణీ పాల్గొన్న మంత్రి నారాయణ! ఈ వార్తకు సంబంధించిన

వైసీపీ ఎన్ని అడ్డంకులు సృష్టించినా, కోర్టుల్లో కేసులు వేసినా స్థానిక సంస్థల ఎన్నికలు జరిగి తీరుతాయని ఏపీ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ స్పష్టం చేశారు. నిబంధనలు, న్యాయస్థానం ఆదేశాలకు అనుగుణంగానే ఎన్నికల నిర్వహణపై నిర్ణయాలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో ఇప్పటికే రూ. 3,300 కోట్లతో వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించామని మంత్రి తెలిపారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమం, రాష్ట్రాభివృద్ధిని చూసి తట్టుకోలేక ఓటమి భయంతోనే వైసీపీ నాయకులు కోర్టులను ఆశ్రయిస్తున్నారని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు కూడా లేని దయనీయ స్థితిలో ఆ పార్టీ ఉందన్న ఆయన... అందుకే రాష్ట్రంలో ఎక్కడా ఎన్నికలు ఏకగ్రీవం కాకూడదని జగన్ తన నేతలకు హుకుం జారీ చేశారని ఎద్దేవా చేశారు. ఇదే సమయంలో... భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, వెలిగొండ ప్రాజెక్టుల క్రెడిట్ తమదేనని వైసీపీ నేతలు ప్రచారం చేసుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. గత ప్రభుత్వం చేసిన చారిత్రక తప్పిదాలను, నిర్లక్ష్యాన్ని కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా సరిదిద్దుకుంటూ రాష్ట్రాన్ని ప్రగతిపథంలో తీసుకెళ్తోందని వివరించారు. నెల్లూరు నగరంలో కాలువల కట్టలపై ఇళ్లు నిర్మించుకుని నివసిస్తున్న పేదలకు శాశ్వత పట్టాలు మంజూరు చేసే అంశంపై త్వరలోనే ప్రభుత్వం తీపి కబురు అందిస్తుందని హామీ ఇచ్చారు

Rajahmundry: రివర్ఫ్రంట్లో మహనీయుల విగ్రహాల తొలగింపు లేదు రాజమండ్రి: గోదావరి గట్టున నిర్మాణ దశలో ఉన్న రివర్ఫ్రంట్ అభివృద్ధి పనుల నేపథ్యంలో అక్కడ ఉన్న వివిధ మహనీయుల విగ్రహాల విషయంలో ఎలాంటి అపోహలకు తావులేకుండా చర్యలు తీసుకుంటామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, నగర పాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా స్పష్టం చేశారు. విగ్రహాల నిర్వాహకులు, సంబంధిత ప్రతినిధులతో నగర పాలక సంస్థ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో వారు ఈ రోజు సమీక్ష నిర్వహించారు. రివర్ఫ్రంట్ ప్రాజెక్టు అభివృద్ధి పనులతో ప్రస్తుతం ఉన్న విగ్రహాలకు ఎలాంటి నష్టం కలగకుండా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, అధికారులు హామీ ఇచ్చారు. ప్రాజెక్టు తుది రూపకల్పనలో భాగంగా విగ్రహాలను తొలగించడం కాదని, అవసరమైన చోట యూనిఫామ్ రీలోకేషన్, సమాన దూరం, ఒకే అలైన్మెంట్, సమానమైన ప్లాట్ఫామ్ డిజైన్తో క్రమపద్ధతిలో ఏర్పాటు చేయడం మాత్రమే ఉద్దేశమని వివరించారు. రివర్ఫ్రంట్లోకి ప్రవేశించే వారు, నడిచే ప్రజలు, బయట నుంచి చూసే సందర్శకులు అందరికీ విగ్రహాలు ఒకే తరహా డిజైన్లో కనిపించేలా సమగ్ర ప్రణాళిక రూపొందిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం కొన్ని విగ్రహాలు ఒకే లైన్లో ఉండగా, మరికొన్ని విభిన్న ప్రదేశాల్లో లేదా ఎత్తుపల్లాల్లో ఉండటంతో మొత్తం రివర్ఫ్రంట్ అందం, సమతుల్యత దెబ్బతినే అవకాశం ఉందని వివరించారు. అందువల్ల సిమెట్రికల్ డిజైన్, సమాన విరామాలు, యూనిఫామ్ అలైన్మెంట్ ద్వారా మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దే ఆలోచనను నిర్వాహకుల ముందుంచారు. విగ్రహాల రూపం, పేర్లు, గుర్తింపు విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తామని ఎమ్మెల్యే, కమిషనర్ స్పష్టం చేశారు. ఒక్క పేరు కూడా తప్పిపోకుండా, ఎలాంటి పొరపాటు జరగకుండా ప్రతి విగ్రహానికి సంబంధించిన వివరాలను నిర్వాహకుల సమక్షంలోనే పరిశీలించి, వారి ఆమోదం అనంతరం తుది రూపకల్పనలో పొందుపరుస్తామని తెలిపారు. మహనీయుల పేర్లు, విగ్రహాల గుర్తింపు విషయంలో ఎలాంటి చిన్న తప్పిదానికీ అవకాశం ఇవ్వబోమని పేర్కొన్నారు. అదేవిధంగా అన్ని విగ్రహాలకు సాధ్యమైనంత వరకు ఒకే

Chirala: చిన్నపిల్లల పార్క్లో పారిశుధ్య పనులు చేపట్టిన ఎమ్మెల్యే మాలకొండయ్య చీరాల: రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నెలా మూడో శనివారం నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా చీరాలలోని చిన్నపిల్లల పార్క్లో స్వచ్ఛత కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీ మద్దులూరి మాలకొండయ్య , ఆర్డీవో నరసింహరావు, మున్సిపల్ కమిషనర్ డానియల్ జోసెఫ్ పాల్గొన్నారు. ఎమ్మెల్యేతో పాటు ఆర్డీవో, కమిషనర్లు కూడా చీపురు పట్టి పార్క్ పరిసరాలను శుభ్రం చేశారు. అనంతరం అధికారులు, సిబ్బందితో స్వచ్ఛత ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య మాట్లాడుతూ.. పరిశుభ్రమైన పరిసరాలతోనే ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించగలమన్నారు. స్వచ్ఛత కేవలం ప్రభుత్వ కార్యక్రమం మాత్రమే కాదని, ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలన్నారు. ఇళ్లు, వీధులు, పార్కుల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. చిన్నపిల్లల పార్క్ను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు దాని పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు సమిష్టిగా కృషి చేసి స్వచ్ఛ చీరాలను సాధించాలని ఎమ్మెల్యే శ్రీ మద్దులూరి మాలకొండయ్య అన్నారు

Minister Narayana: ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల వాతావరణం వచ్చినట్టే కనిపిస్తోంది.. ఎన్నికల ప్రక్రియకు కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.. మరోవైపు.. బీసీలకు రిజర్వేషన్లు పెంచుతూ.. స్థానిక సంస్థల్లో వాటిని అమలు చేసేలా కూడా నిర్ణయాలు తీసుకున్నారు.. అయితే, ఈ సమయంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మంత్రి నారాయణ.. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోర్టు తీర్పుపై ఆధారపడి ఉందని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తెలిపారు. విశాఖలో ఆయన మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికలపై కోర్టు తీర్పు రావాల్సి ఉందని, తీర్పు వెలువడిన వెంటనే ఎన్నికల నిర్వహణ ప్రక్రియను ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ప్రభుత్వం కోర్టు తీర్పు కోసం ఎదురుచూస్తోందని మంత్రి నారాయణ పేర్కొన్నారు. తీర్పు వచ్చిన వెంటనే ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన తదుపరి చర్యలు చేపడతామని తెలిపారు. ఇదిలా ఉండగా, విశాఖలో డేటా సెంటర్ల ఏర్పాటుతో నీటి సమస్యలు తలెత్తుతాయన్న ఆందోళనలపై కూడా మంత్రి నారాయణ స్పందించారు. డేటా సెంటర్ల కారణంగా విశాఖలో నీటి సమస్యలు రావని స్పష్టం చేశారు. విశాఖ ప్రజల తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని పక్కా ప్రణాళిక సిద్ధం చేశామని తెలిపారు. ఇక, భోగాపురం వెళ్లే రహదారి మరమ్మతులకు గురైనట్టు తన దృష్టికి రాలేదని మంత్రి నారాయణ అన్నారు. అయితే రహదారి పరిస్థితిపై పరిశీలన చేస్తామని చెప్పారు

కృష్ణా జిల్లా ఉయ్యూరులో డయేరియా విస్తరిస్తోందంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని, కొందరు కావాలనే అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మంత్రి నారాయణ మండిపడ్డారు. ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని డయేరియా బాధితులను ఆయన ఈరోజు పరామర్శించారు. స్థానిక 5వ వార్డులో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలో 9 మంది చికిత్స పొందుతున్నారని, బాధితులందరి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని తెలిపారు. ఆగస్టు 17న మృతి చెందిన ఒక వ్యక్తి గుండెపోటు కారణంగానే కన్నుమూశారని, ఆ మరణానికి డయేరియాకు ఎలాంటి సంబంధం లేదని మంత్రి తేల్చిచెప్పారు. ప్రాథమిక నీటి పరీక్షల నివేదిక ప్రకారం తాగునీటిలో ఎలాంటి బ్యాక్టీరియా లేదని వెల్లడైందన్నారు. సమస్యకు కారణం మున్సిపల్ పైప్లైన్లా లేక ప్రైవేట్ ఆర్వో ప్లాంట్లా అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉందని వివరించారు. అమృత్ 2.0 పథకంలో భాగంగా రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీల్లో పాత పైప్లైన్లను మారుస్తున్నామని, అందులో భాగంగా ఉయ్యూరులో రూ. 98 కోట్లతో పనులు చేపడుతున్నామని మంత్రి నారాయణ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బోడే ప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ బాబు రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు

ట్రై కార్పొరేషన్లలోని కొందరు పట్టణ ప్రణాళికా విభాగం అధికారులు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ట్రై కార్పొరేషన్లలోని ప్లానింగ్ విభాగం లీలలు హైదరాబాద్ సిటీ: ట్రై కార్పొరేషన్లలోని కొందరు పట్టణ ప్రణాళికా విభాగం అధికారులు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అనుమతుల నుంచి ఓసీల జారీ వరకు.. ఫైల్కు ఇంత అని, అంతస్తులు, నిర్మాణ విస్తీర్ణం బట్టి రేట్లు నిర్ణయించి మరీ లంచాలు తీసుకుంటున్నారు. అడిగినంత ఇవ్వకుంటే నోటీసులు, కూల్చివేతలంటూ వేధింపులకు గురి చేస్తున్నారు. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(సీఎంసీ) పరిధిలో ఈ తతంగం ఎక్కువగా జరుగుతుండగా.. తామేమి తక్కువ కాదన్నట్టు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ), మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్(ఎంఎంసీ) యంత్రాంగం కూడా వారితో పోటీ పడుతోంది. అక్రమ నిర్మాణాల విషయంలో అధికారుల దోపిడికి అడ్డూ అదుపు ఉండడం లేదు. మాదాపూర్లో నోటరీ స్థలాల్లో నాలుగైదు అంతస్తుల భవన నిర్మాణాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. ప్రాంతాల వారీగా అవుట్ సోర్సింగ్ సిబ్బందికి బాధ్యతలు అప్పగించి.. నిర్మాణదారుల నుంచి కొందరు అధికారులు వసూళ్లు చేస్తుండడం గమనార్హం. కూకట్పల్లి జోన్ పరిధిలోనూ పలువురు పట్టణ ప్రణాళికా విభాగం అధికారుల తీరు చర్చనీయాంశంగా మారింది. అంతా మేం చూసుకుంటాం.. అదనపు అంతస్తులు నిర్మించుకోండని భవన యజమానులకు భరోసా ఇస్తున్నట్టు తెలిసింది. గ్రౌండ్ ప్లస్ రెండంతస్తుల భవనానికి అనుమతి తీసుకున్న ఓ వ్యక్తి అదనంగా మరో రెండంతస్తులు నిర్మించారు. స్థానికులు ఫిర్యాదు చేసినా అధికారులు అటు వైపు కన్నెత్తి చూడకపోగా.. త్వరగా బయటి వైపు పనులు పూర్తి చేసి రంగులు వేయాలని సూచించినట్టు సమాచారం. చైన్మెన్ నుంచి టీపీఎస్, ఏసీపీ, సిటీ ప్లానర్ల వరకు అవినీతిలో భాగస్వాములుగా ఉంటున్నారు. ప్రతీ ఫైల్కు ముడుపులు ముట్టాల్సిందే అని కింది స్థాయి సిబ్బంది వద్ద పైఅధికారులు బహిరంగంగా చెబుతుండడం గమనార్హం

Kamareddy: కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం ఎదుట కార్మికుల ధర్నా! Kamareddy: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ పరిధిలో కార్మికులు ధర్నా చిన్న విషయానికి సైతం అధికారులు తమను టార్గెట్ చేసి వేధింపులకు పాల్పడుతున్నారని మున్సిపల్ కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు. అధికారుల వేధింపులకు నిరసనగా సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ సానిటరీ ఇన్స్పెక్టర్ ప్రశాంత్ కార్మికుల పట్ల ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని, ఒక్కరోజు ఆలస్యం అయినా వారం రోజుల పాటు పనిలోకి తీసుకోవడం లేదన్నారు. 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చినా పనిలోకి తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అశోక్ నగర్ రైల్వే గేటు వద్ద చెత్త సంచులు ఆటోలో వేస్తున్న కార్మికునిపై కమిషనర్ చెప్పుకోలేని భాషలో బూతు పురాణం అందుకున్నారన్నారు. జవాన్ తో కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడారన్నారు. షాప్ వ్యక్తికి జరిమానా వేయాలని, చెత్త తోసుకోవద్దనో కమిషనర్ చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కార్మికుల పట్ల అధికారుల వేధింపులు మానుకోవాలని డిమాండ్ చేశారు
రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. రాష్ట్రంలోని 100 పురపాలక సంఘాలలో త్వరలోనే ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు చేపట్టింది. ఈ మేరకు ఏర్పాట్లు చేయాల్సిందిగా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ప్రభుత్వం ఆదేశించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన వర్గాలకు (బీసీలు) 33.33 శాతం రిజర్వేషన్లను అమలు చేయాలని ఏపీ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ఈ మేరకు ఏపీ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక పురపాలక శాఖ కమిషనర్ రాష్ట్ర ప్రభుత్వానికి అందించిన నివేదిక ప్రకారం, రాష్ట్రంలోని 123 పట్టణ స్థానిక సంస్థలలో.. 100 చోట్ల త్వరలోనే ఎన్నికలు నిర్వహిస్తారు.87 పురపాలక సంఘాల పదవీకాలం ఇప్పటికే పూర్తికాగా.. మరో 13 పురపాలక సంఘాల పదవీకాలం నవంబర్ నాటికి ముగియనుంది. కోర్టు కేసులు ఇతరత్రా న్యాయపరమైన ఇబ్బందుల కారణంగా 23 పురపాలక సంఘాలలో ఎన్నికలు సాధ్యపడేలా కనిపించడం లేదు. మిగతా వంద చోట్లా త్వరలోనే ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా సుప్రీం కోర్టు తీర్పును అనుసరించి బీసీలకు మున్సిపల్ ఎన్నికల్లో రిజర్వేషన్లు ఖరారు చేశారు. అలాగే మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అవసరమైన వార్డుల విభజన, రిజర్వేషన్ల ఖరారు, ఓటర్ల జాబితా తయారీ వంటి ప్రక్రియలను పూర్తి చేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.మరోవైపు ఎన్నికల ఏర్పాట్లపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా కసరత్తు వేగవంతం చేసింది. అందులో భాగంగా బుధవారం రోజున రాష్ట్ర ఎన్నికల సంఘం సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ కీలక వివరాలు వెల్లడించారు. స్థానిక ఎన్నికల ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించామని, ఒక్కో ప్రక్రియ పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్తున్నట్లు అనిల్ చంద్ర పునేఠా వెల్లడించారు. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలను సకాలంలో పూర్తిచేసి.. 16వ ఆర్థిక సంఘం నిధులు రాబట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అందులో
ప్రత్యేక తెలంగాణ ఆవిర్భావం తర్వాత భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. మారమూల పల్లెల్లోనూ భూముల ధరలు లక్షలు పలుకుతున్నాయి. ఇదే అదనుగా కొందరు అక్రమార్కులు కబ్జాలకు పాల్పడుతున్నారు. ఖాళీ స్థలం కనిపిస్తే చాలు కన్నేసి సొంతం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఖమ్మం జిల్లా మధిర పట్టణంలోనూ భూముల ధరలు పెరుగుతుండటంతో ప్రభుత్వ స్థలాలు ఆక్రమణలకు గురవతున్నాయి. పెరుగుతున్న వాణిజ్య కార్యకలాపాలు, రియల్ ఎస్టేట్ డిమాండ్తో భూముల ధరలు భారీగా పెరగటంతో పట్టణ పరిధిలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాలపై కొందరు ఆక్రమణదారులు కన్నేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.ప్రభుత్వ భూములకు ఆనుకుని ఉన్న కొద్దిపాటి ప్రైవేట్ స్థలాలను తొలుత కొనుగోలు చేసి.. క్రమంగా పక్కనే ఉన్న ప్రభుత్వ భూముల్లోకి చొచ్చుకెళ్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో మధిర పట్టణానికి దశాబ్దాలుగా ఉన్న పురాతన డొంక రహదారి క్రమంగా ఆక్రమణలకు గురవుతోంది. ఒకప్పుడు ప్రజల రాకపోకలకు, వ్యవసాయ అవసరాలకు ఉపయోగపడిన ఈ మార్గం భవిష్యత్తులో పూర్తిగా కనుమరుగయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది.మధిరలోని ఎస్సీ కాలనీ నుంచి దెందుకూరు వరకు సుమారు 5 కిలోమీటర్ల పొడవున డొంక రహదారి ఉంది. మధిర–విజయవాడ ప్రధాన రహదారి సమీపం నుంచి కొనసాగుతున్న ఈ మార్గం దాదాపు శతాబ్ద కాలంగా ప్రజల వినియోగంలో ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో భూముల ధరలు భారీగా పెరగడంతో ఈ ప్రభుత్వ భూమికి విలువ కూడా పెరిగింది. ఎస్సీ కాలనీ నుంచి మార్కెట్యార్డు వరకు గజం ధర సుమారు రూ.లక్ష నుంచి రూ.1.50 లక్షల వరకు పలుకుతున్నట్లు స్థానిక రియల్ ఎస్టేట్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో డొంకకు ఆనుకుని ప్రైవేట్ స్థలాలను కొనుగోలు చేసిన కొందరు క్రమంగా ప్రభుత్వ భూమిలోకి చొచ్చుకెళ్తున్నారు.దీంతో ఒకప్పుడు 100 అడుగుల వెడల్పుతో ఉన్న ఈ పురాతన మార్గం ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో కేవలం 20 అడుగులకు మాత్రమే పరిమితమైనట్లు స్థానికులు చెబుతున్నారు. సుమారు 5 కిలోమీటర్ల

ఏపీలో కీలకమైన కార్పోరేషన్ మేయర్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల ఛైర్ పర్సన్లను ప్రత్యక్షంగా ప్రజలే ఎన్నుకునేందుకు మార్గం సుగమం అయింది. గతంలో అమల్లో ఉన్న ఈ విధానాన్ని 2005లో రద్దు చేశారు. ఇప్పుడు మళ్లీ కూటమి సర్కార్ దీన్ని అమల్లోకి తెచ్చింది. ఈ మేరకు నిన్న కేబినెట్లో ఆమోదించిన బిల్లును ఇవాళ అసెంబ్లీలో (AP Assembly)ప్రవేశపెట్టిన ప్రభుత్వం.. ఆమోద ముద్ర వేయించుకుంది. దీంతో మున్సిపల్ చట్టంలో సవరణలు రానున్నాయి.మండలిలో వైసీపీకి హ్యాట్రిక్..! కూటమి మళ్లీ చేతులెత్తేసిందా ?1986 వరకు మేయర్, మున్సిపల్ చైర్మన్ల ఎంపికకు పరోక్ష ఎన్నికలు జరిగేవని, 1986 నుంచి 2005 వరకు ప్రత్యక్ష ఎన్నికలు జరిగాయని, 2005 నుంచి ఇప్పటివరకు మళ్లీ పరోక్ష ఎన్నికల విధానం కొనసాగుతోందని మంత్రి నారాయణ ఈ బిల్లుపై మాట్లాడుతూ వెల్లడించారు. ప్రస్తుతం తీసుకొచ్చిన చట్ట సవరణతో ఇకపై మేయర్, మున్సిపల్ చైర్మన్ల ఎన్నికలు ప్రత్యక్ష విధానంలో నిర్వహించేందుకు అవకాశం కలుగుతుందన్నారు. ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ప్రజలే నేరుగా మేయర్ లేదా మున్సిపల్ చైర్మన్ను ఎన్నుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయని, ప్రత్యక్ష ఎన్నికల్లో ప్రజల నుంచి ఎన్నికైన మేయర్, చైర్మన్కు బలమైన ప్రజామోదం ఉంటుందని ఆయన తెలిపారు. అలాగే కౌన్సిలర్లు, కార్పొరేటర్ల ద్వారా కాకుండా ప్రజలే నేరుగా ఎన్నుకోవడం వల్ల మేయర్ లేదా చైర్మన్పై కౌన్సిలర్లు, కార్పొరేటర్ల ప్రభావం ఉండదన్నారు. తొలి రోజే మండలి డిప్యూటీ ఛైర్మన్ కు కూటమి షాక్..! బొత్స ఫైర్..!ప్రత్యక్ష ఎన్నికల విధానంతో మేయర్, చైర్మన్లు వేగవంతమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందని, నగరాలు, పట్టణాల అభివృద్ధికి సంబంధించిన ప్రాజెక్టులను త్వరితగతిన అమలు చేసేందుకు ఇది పనికొస్తుందని తెలిపారు. రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, ప్రజా రవాణా, వ్యర్థాల నిర్వహణ, పట్టణ ప్రణాళిక వంటి అంశాల్లో సుదీర్ఘకాలిక అభివృద్ధి ప్రణాళికలను రూపొందించి అమలు చేసే అవకాశం ఉంటుందన్నారు. అభివృద్ధి పనుల అమలులో వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థలతో మెరుగైన సమన్వయం చేసుకుంటూ పనులను

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Man dog costume in Khandwa collectorate Madhya Pradesh: సాధారణంగా చాలా మంది ప్రభుత్వాలు సరిగ్గా ప్రజలకు కావాల్సిన సదుపాయలు, ఇచ్చిన హమీలు నెరవేర్చకుంటే నిరసనలు చేస్తారు. కొంత మంది ప్రజల దృష్టిని తమవైపు తిప్పుకునేందుకు వినూత్నంగా నిరసనలు చేస్తారు. దీనితో ఓవర్ నైట్ లో ఫెమస్ అయి ఉన్నతాధికారుల వరకు వీరి బాధలు చేరుతాయని భావిస్తారు. ఈ నేపథ్యంలో మధ్య ప్రదేశ్ లోని ఖాండ్వాలో ఒక వ్యక్తి తమ గ్రామంలో కొన్ని రోజులుగా ఉన్న కుక్కల బెడదను లేకుండా చేయాలని అధికారుల చుట్టు తిరిగాడు. కానీ లాభం లేకుండా పోయింది. దీంతో వెరైటీ నిరసలు చేయాలని ప్లాన్ చేశాడు. దీనిలో భాగంగా ఖాండ్వాలోని కలెక్టర్ ఆఫీసు లో మున్సిపల్ కార్పొరేషన్ ప్రతిపక్ష నాయకుడు దీపక్ రాథోర్ వెరైటీగా కుక్క మాదిరిగా కాస్ట్యూమ్ ను వేసుకున్నాడు. నేరుగా కలెక్టర్ కు శునకంలా వేషం వేసుకుని మరీ వెళ్లి గత నాలుగేళ్లలో కుక్కల సంతాన నిరోధక కార్యక్రమాలపై రూ. 40 లక్షలు ఖర్చు చేయగా, 13, 225 కుక్కకాటు కేసులు నమోదయ్యాయని ఆరోపించారు. ఈ కార్యక్రమం యొక్క ఖర్చు, అమలుపై విచారణ జరపాలని ఆయన కలెక్టరేట్ ఆఫీస్ లో తమ గొడును చెప్పుకున్నారు. నగరంలో ఇంత ఖర్చుచేసిన కూడా వీధి శునకాల కాటులతో చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్పుకొచ్చాడు. ఇటీవల కుక్క కాటు ఘటనలు మరీ ఎక్కువయ్యాయని ఆవేదన వ్యక్తం చేశాడు. Read more: Snake Video: ఏంటాలెంట్ భయ్యా.!. పాము బర్త్ డే సెలబ్రేషన్స్ ఇలా కూడా చేస్తారా..?.. వీడియో వైరల్

నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, ఉద్యమకారుడు, దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ ఏర్పాటు వివాదం చిలికి చిలికి గాలివానగా మారింది. నర్సంపేటలో ఉద్రిక్తతలకు కారణమైంది. పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం తర్వాత ఒక ప్రైవేటు భూమిలో పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని విగ్రహ గద్దెను నిర్మించారు బిఆర్ఎస్ శ్రేణులు. అయితే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలంటే అనుమతి తీసుకోవాలని మున్సిపల్ అధికారులు ఆ గద్దెను కూల్చివేశారు.నర్సంపేటలో పొలిటికల్ హీట్ఆ తర్వాత మళ్లీ బిఆర్ఎస్ శ్రేణులు విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో, మున్సిపల్ అధికారులు మళ్ళీ విగ్రహాన్ని తొలగించారు. దీంతో నర్సంపేటలో పొలిటికల్ హీట్ పెరిగింది. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే దివంగత నేతపెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని తొలగించిన నేపథ్యంలో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి దిష్టిబొమ్మను బిఆర్ఎస్ శ్రేణులు దగ్ధం చేశారు. భారీ ఎత్తున ధర్నాలు నిర్వహించారు.పెద్ది సుదర్శన్రెడ్డి విగ్రహ గద్దె కూల్చివేత, బీఆర్ఎస్ రాస్తారోకో, నర్సంపేటలో ఉద్రిక్తత!నేడు నర్సంపేట బంద్మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, కేటీఆర్, హరీష్ రావులు దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు చర్యను తీవ్రంగా ఖండించారు. పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని మున్సిపల్ అధికారులు తొలగించడంతో బిఆర్ఎస్ నేడు నర్సంపేట బంద్ కు పిలుపునిచ్చింది. ఈరోజు ఉదయం నుండి నర్సంపేటలోపెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపును నిరసిస్తూ బిఆర్ఎస్ శ్రేణులు భారీ ర్యాలీలు నిర్వహించడంతో నర్సంపేటలో పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు.నర్సంపేటలో 1500మంది పోలీసులతో భారీ బందోబస్తుఅవాంఛనీయ సంఘటనలు జరగకుండా నర్సంపేటలో 1500మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు అక్కడ పరిస్థితిని వరంగల్ పోలీస్ కమిషనర్ పరిశీలిస్తున్నారు. నర్సంపేట కు తరలి వెళ్లడానికి ప్రయత్నం చేసిన బి ఆర్ ఎస్ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ ను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. అయితే నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి దిష్టిబొమ్మను బీఆర్ఎస్ శ్రేణులు దగ్ధం చేయడాన్ని కాంగ్రెస్

ఏపీ రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల వేళ కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. ఎన్నికలకు ముహూర్తం ఖరారైంది. కూటమి ఏకపక్షంగా విజయం సాధించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తోంది. అటు వైసీసీకి ఈ ఎన్నికలు ప్రతిష్ఠాత్మకంగా మారుతున్నాయి. ఇదే సమయంలో ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం ఆసక్తి కరంగా మారుతోంది. వైసీపీ ఏం చేయబోతుందనేది కీలకంగా మారే అవకాశం కనిపిస్తోంది.ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్దం అవుతోంది. ప్రభుత్వం అధికారికంగా ఈ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బీసీ రిజర్వేషన్ల అమలుకు నిర్ణయించింది. అర్బన్ - రూరల్ ప్రాంతాల్లో ఏ మేర అమలు చేయాలో డిసైడ్ అయింది. అదే విధంగా మేయర్, మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికలను ప్రత్యక్ష పద్దతిలో నిర్వహించాలని నిర్ణయించింది. గ్రామీణ స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం, పట్టణ స్థానిక సంస్థల్లో 33.33 శాతం బీసీ రిజర్వేషన్లు ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం నుంచి స్థానిక సంస్థలకు రావాల్సిన నిధులను రాబట్టేందుకు పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలను అత్యవసరంగా నిర్వహించాలని తీర్మానించింది.చట్టంలోని నిబంధనల మేరకు బీసీ రిజర్వేషన్తోనే ఎన్నికలు నిర్వహించేందుకు క్యాబినెట్ ఆమోదించింది. తిరుమల వేదికగా సాయిరెడ్డి కీలక ప్రకటన - టార్గెట్ ఫిక్స్..!!ప్రభుత్వం వ్యూహాత్మక నిర్ణయాలుఇదే సమయంలో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా.. ప్రస్తుతం వారి రిజర్వేషన్లు యథతథంగా కొనసాగుతాయని ప్రభుత్వం చెబుతోంది. కాగా.. ఇప్పటివరకు ఉన్న 13 జిల్లా పరిషత్లను 28 జిల్లా పరిషత్లుగా పెంచడానికి కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. జిల్లాల విభజనకు అనుగుణంగా జిల్లా పరిషత్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తరువాత కూటమి పార్టీల సమన్వయ కమిటీ సమావేశం కానుంది. మూడు పార్టీలు స్థానిక ఎన్నికల్లో సీట్ల పంపకాల పైన ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం కనిపిస్తోంది. అయితే, అటు వైసీపీ సైతం ఈ ఎన్నికల్లో గట్టి పోటీ

స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. అదే సమయంలో బీసీలకు రిజర్వేషన్లు పెంచాలని కూడా నిర్ణయించింది. అమరావతి, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. అదే సమయంలో బీసీలకు రిజర్వేషన్లు పెంచాలని కూడా నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. అక్టోబరులోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని సీఎం స్పష్టం చేశారు. రిజర్వేషన్ల విషయానికి వస్తే.. గ్రామీణ స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం, పట్టణ స్థానిక సంస్థల్లో 33.33 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం నుంచి స్థానిక సంస్థలకు రావాల్సిన నిధులను రాబట్టేందుకు పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలను అత్యవసరంగా నిర్వహించాలని తీర్మానించింది. చట్టంలోని నిబంధనల మేరకు బీసీ రిజర్వేషన్తోనే ఎన్నికలు నిర్వహించేందుకు క్యాబినెట్ ఆమోదించింది. రాష్ట్ర పంచాయతీరాజ్ చట్టం 1994కు అనుగుణంగా స్థానిక సంస్థల్లో సామాజికంగా వెనుకబడ్డ వర్గాలకు రిజర్వేషన్లు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిని రాష్ట్ర మంత్రిమండలి ఆమోదించింది. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా.. ప్రస్తుతం వారి రిజర్వేషన్లు యథతథంగా కొనసాగుతాయని ప్రభుత్వం పేర్కొంది. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఏర్పాటు చేసిన డెడికేటెట్ కమిషన్ ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని మంత్రి మండలికి అధికారులు వివరించారు. పట్టణ ప్రాంత స్థానిక సంస్థల్లో ప్రత్యక్ష ఎన్నికలకు వెళ్లాలని, ఇప్పటివరకు ఉన్న 13 జిల్లా పరిషత్లను 28 జిల్లా పరిషత్లుగా పెంచడానికి కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. జిల్లాల విభజనకు అనుగుణంగా జిల్లా పరిషత్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ ఏడాది అక్టోబరులోగా స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావాలని మంత్రివర్గం నిర్ణయించింది. మంత్రివర్గ సమావేశంలో అజెండా అంశాలు ముగిసిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లపై సుదీర్ఘ చర్చ జరిగింది. సకాలంలో ఎన్నికలు జరగకుంటే కేంద్రం నుంచి వచ్చే నిధులను భారీగా

Rajahmundry: రాజమండ్రి: వీధి వ్యాపారులకు 'జోన్ల' భరోసా! Rajahmundry: నగరంలో ఏ ఒక్క వీధి వ్యాపారికి అన్యాయం జరగకుండా వీధులను జోన్లు వారీగా విభజించినట్లు కమిషనర్ రాహుల్ మీనా తెలిపారు. మంగళవారం నగరపాలక సంస్థ కార్యాలయంలోని మీటింగ్ హాల్ నందు టౌన్ వెండింగ్ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. వీధి వ్యాపారస్తుల చట్టం ప్రకారం పట్టణ ప్రణాళిక మరియు మెప్మా సిబ్బంది క్షేత్రస్థాయిలో పరిశీలించి రెడ్ జోన్, యాంబర్ జోన్, గ్రీన్ జోన్లను గుర్తించినట్లు చెప్పారు. నగర పరిధిలోగల వీధులన్నీ జోన్లు వారీగా విభజించి నివేదికను సిద్ధం చేసుకున్నట్లు వివరించారు. విద్యా సంస్థలు, వైద్యశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, జంక్షన్ లు, ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ప్రాంతాలను రెడ్ జోన్లుగా ప్రకటించినట్లు తెలిపారు. నిర్దేశిత సమయాలు, నిర్దేశిత రోజులలో వ్యాపారాలు చేసుకునే ప్రాంతాలను యాంబర్ జోన్లుగా మిగతా ప్రాంతాలను గ్రీన్ జోన్లుగా ప్రకటించటం జరిగిందన్నారు. మొత్తంగా నగర పరిధిలో 62 గ్రీన్, 26 యాంబర్, 58 రెడ్ జోన్లను గుర్తించినట్లు వెల్లడించారు. రెడ్ జోన్లకు సంబంధించి అభ్యంతరాలు ఉన్నట్లయితే.. అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించి తెలియజేయాలని కమిటీ సభ్యులకు సూచించారు. జోన్ల గుర్తింపు అనంతరం వీధి వ్యాపారులకు గుర్తింపు కార్డులను జారీ చేసి వెండింగ్ జోన్లలో స్థలాలను కేటాయించి తగు మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. వీధి వ్యాపారుల జీవనోపాధికి ఎటువంటి నష్టం వాటిల్లకుండా, ఒక స్పష్టమైన మరియు యోచనాత్మక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లు ఈ సందర్భంగా తెలియజేశారు. సమీక్షలో అడిషనల్ కమిషనర్ పి.వి.రామలింగేశ్వర్, సిటీ ప్లానర్ జి.వి.ఎస్.ఎన్.మూర్తి, సీఎంఎం రామలక్ష్మి, శానిటరీ సూపర్ వైజర్ శ్రీనివాస్, ట్రాఫిక్ ఎస్సై పి.శ్రీనివాసరావు, టౌన్ వెండింగ్ కమిటీ ప్రెసిడెంట్ సత్యనారాయణ, ఎన్జీఓ రాంబాబు, ఇతర సభ్యులు పాల్గొన్నారు

Rajahmundry: రాజమండ్రి: ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ఉంటేనే భవనాల వినియోగం! Rajahmundry: ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ పొందిన తర్వాతే ఆయా భవనాలను యజమానులు వినియోగించాలని కమిషనర్ రాహుల్ మీనా స్పష్టం చేశారు. మంగళవారం టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో ఆయన పర్యటించారు. గోరక్షణపేటలో ఆక్యునెన్సీ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న భవన కొలతలను తనిఖీ చేశారు. అర్బన్ పరిధిలో నిర్మిస్తున్న భవనాలు వాటి అనుమతి పొందిన ప్లాన్లకు అనుగుణంగా కడితేనే నివాసయోగ్య ధృవీకరణ పత్రం జారీ చేయబడుతుందని ఈ సందర్భంగా కమిషనర్ తెలిపారు. భవన నిర్మాణ సమయంలోనే ర్యాంపులు ప్రహరీ లోపలే ఉండేలా చూడాలని.. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల మేరకు తగిన డ్రైనేజి సిస్టం, గ్రీనరీ ఏర్పాటు చేసుకోవాలన్నారు. అలాగే భవనం పూర్తయ్యేంత వరకు నిర్మాణం జరిగే చోట బిల్డింగ్ ప్లాన్ను తప్పనిసరిగా ప్రదర్శించాలని తెలియజేశారు. ఆయన వెంట ఏసీపీ కొండలరావు, ఇతర సిబ్బంది ఉన్నారు

Nellore: కల్యాణ్ నగర్లో రూ.1 కోటితో సీసీ డ్రైన్ పనులకు శంకుస్థాపన! నెల్లూరు: నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని 23వ డివిజన్ కల్యాణ్ నగర్ నందు 1కోటి రూపాయలతో సి.సి. డ్రైన్ పనులకు శంకుస్థాపన చేశారు స్థానిక కార్పొరేటర్ దుద్దుగుంట శ్రీనివాసులు రెడ్డి. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 23వ డివిజన్ అభివృద్ధికి 11 కోట్ల 11 లక్షల రూపాయల నిధులు కేటాయించామని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్ లో 857 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి తెలిపారు. భారీ వర్షాలు కురిసినప్పుడు ఎగువ ప్రాంతాలనుండి వచ్చు వర్షపు నీరు వెళ్లేందుకు అవుట్ ఫ్లో డ్రైన్ లేక అనేక సంవత్సరాలుగా తాత్కాలిక పనులు చేప్పటం జరిగిందని, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని శాశ్వత పరిష్కారం కోసం అవుట్ ఫ్లో డ్రైన్ ను మంజూరు చేయించారు. అయితే ఇప్పటికే కొంత భాగం పనులు పూర్తిచేయడం జరిగిందని, మిగిలిన పనులు శంకుస్థాపన చేయడం జరిగిందని, అతి త్వరలో ఈ పనులు పూర్తిచేసి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని చెప్పారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ఎల్లప్పుడూ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం అందుబాటులో ఉంటుంది. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఇంత మంచి చేస్తున్న కూటమి ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడుకి మరియు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కి మీ

ఆంధ్రప్రదేశ్లో బీసీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ.. మున్సిపాలిటీల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నామని తెలిపారు. అమరావతి: బీసీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ.. మున్సిపాలిటీల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నామని చెప్పారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్ కల్పించడం కేవలం ఎన్నికల హామీ కాదని, అది తమ రాజకీయ సిద్ధాంతంలో భాగమని చంద్రబాబు స్పష్టం చేశారు. హామీలు ఇవ్వడంతోనే ఆగిపోకుండా వాటిని అమలు చేసి చూపిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. గత ప్రభుత్వం బిసిలకు రిజర్వేషన్ల విషయంలో చేసిన అన్యాయన్ని సరిచేయడానికి ప్రత్యేక క్యాబినెట్ పెట్టి నిర్ణయం తీసుకున్నట్లు సీఎం చెప్పారు. 2024 ఎన్నికల్లో ఈ స్ధాయి గెలుపుకు కారణం బిసిల వల్లేనని చెప్పుకొచ్చారు. 94శాతం స్ట్రయిక్ రేట్ 57శాతం ఓట్లు వచ్చాయంటే అది బిసిల వల్ల, నాయకత్వంపై ఉన్న నమ్మకం వల్ల మాత్రమేనని పేర్కొన్నారు. బిసిలకు న్యాయం చేయాలని తాను, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ నేతలు ఎన్నికలకు ముందే నిర్ణయం తీసుకున్నామన్నారు

ద్రవ్యోల్బణం పెరుగుతున్నందున ధరల నియంత్రణకు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర మంత్రివర్గం అంజెడా అంశాలు ముగిశాక వివిధ పరిణామాలపై సీఎం చర్చించారు. అమరావతి, ఆగస్టు 18: ద్రవ్యోల్బణం పెరుగుతున్నందున ధరల నియంత్రణకు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర మంత్రివర్గం అంజెడా అంశాలు ముగిశాక వివిధ పరిణామాలపై సీఎం చర్చించారు. సోషల్ మీడియాలో వస్తున్న నెగిటివ్ కామెంట్లపై ధీటుగా స్పందించాలని మంత్రులకు సూచించారు. అక్టోబర్లోగా స్థానిక ఎన్నికలు జరగకుంటే రూ.12150 కోట్లు అర్బన్ లోకల్ బాడీ నిధులు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. న్యాయ పరిధిలో 23 మున్సిపాలిటీల విలీన ప్రక్రియను తర్వాత చూసుకుందామని.. ముందైతే అన్నింటిలోనూ ఎన్నికలు నిర్వహించాలని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. మద్యం బ్రాండ్లు పిచ్చి పిచ్చి పేర్లతో రాకుండా కమిటీ జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అక్రమార్కులు కంటైనర్లలో ఇసుక తరలింపుకు యత్నిస్తుంటే కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఆలయ ఉద్యోగాల్లో జోనల్ విధానం లేదు.. మెరిట్కే ప్రాధాన్యం: మంత్రి ఆనం రామనారాయణ

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల రెండో రోజున కీలక అంశంపై ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. 25 వేల కంటే ఎక్కువ జనాభా ఉన్న గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలుగా ఉన్నతీకరించే ప్రతిపాదన ప్రస్తుతానికి ఏదీ లేదని పురపాలక శాఖ మంత్రి నారాయణ స్పష్టం చేశారు. జాతీయ జనాభా గణన (సెన్సస్) ప్రక్రియ పూర్తయ్యే వరకు ఈ విషయంలో ముందుకు వెళ్లలేమని ఆయన వెల్లడించారు.మంగళవారం స్పీకర్ అయ్యన్నపాత్రుడు అధ్యక్షతన శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి నారాయణ సమాధానమిచ్చారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా జనాభా గణన ప్రక్రియ కొనసాగుతోందని, 2027 మార్చి 31 వరకు ఈ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉందని ఆయన గుర్తుచేశారు.జనగణన పూర్తయ్యే వరకు పరిపాలనా పరమైన సరిహద్దుల్లో ఎలాంటి మార్పులు చేయవద్దని కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయని మంత్రి సభకు వివరించారు. అందువల్ల, జనాభా గణన ప్రక్రియ ముగిసిన తర్వాతే అధిక జనాభా గల పంచాయతీలను మున్సిపాలిటీలుగా మార్చే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందని ఆయన పేర్కొన్నారు. దీంతో కొత్త మున్సిపాలిటీల ఏర్పాటుపై మరికొంత కాలం వేచి చూడక తప్పదని స్పష్టమైంది

ఏపీలో మంత్రి లోకేష్ మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధికి ప్రధానంగా ఫోకస్ చేస్తున్నారు. తనకు ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా అవకాశం కల్పించిన మంగళగిరి వాసులకు మౌలిక వసతుల కల్పనకు లోకేష్ ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందించే నిధుల నుండే కాదు వివిధ కేంద్ర నిధులను కూడా మంగళగిరి-తాడేపల్లిలో మౌలిక సదుపాయాల కల్పనకు భారీగా కేటాయించేలా చొరవ చూపుతున్నారు.మంగళగిరి-తాడేపల్లిలో మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్ర నిధులు ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన నగరాలైన విశాఖపట్నం, మంగళగిరి-తాడేపల్లిలో మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆమోదం తెలిపింది. ఇందులో కేంద్ర ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పన కోసం అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద మంజూరు చేసిన నిధులు రూ. 497.71 కోట్లు ఉన్నాయి.రూ. 1,167.50 కోట్ల రూపాయలతో అత్యాధునిక అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఈ ప్రాంతంలో అత్యాధునిక అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ప్రాజెక్ట్ ఫేజ్-1 మరియు ఫేజ్-2 పనుల కోసం కేంద్రం ఇచ్చే నిధులతో పాటు, హైబ్రిడ్ యాన్యుటీ మోడల్లో ఈ నిధులు కేటాయించి పనులు ప్రారంభించారు. ఇందులో కొంత మేర నిధులు హడ్కో రుణాల ద్వారా కూడా సమకూరుస్తున్నారు.రూ. 1,167.50 కోట్ల రూపాయలతో ఈ భారీ ప్రాజెక్ట్ ను చేపట్టారు. ఈ నిధులతో మంగళగిరి-తాడేపల్లిలో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థలను ఆధునీకరించనున్నారు.33వేల ఇళ్ళకు మేలు చేసేలా భారీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థమంగళగిరి-తాడేపల్లిలో సుమారు 33వేల ఇళ్లకు మేలు చేసేలా భారీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థను తీసుకురానున్నారు మంత్రి లోకేష్. 303కిలోమీటర్ల పొడవైన నెట్వర్క్తో పాటు రోజూ 26.68 మిలియన్ లీటర్ల మురుగునీటిని శుద్ధి చేసే సామర్థ్యం కలిగిన 6 STPలను ఇందులో భాగంగా నిర్మించనున్నారు. ఇది మాత్రమే కాక రూ. 450.24 కోట్లను నగరవ్యాప్తంగా, కొత్తగా విలీనమైన 15కు పైగా గ్రామాల్లో 24గంటల తాగునీటి సరఫరా గ్రిడ్ కోసం కేటాయించారు.రోడ్లు, డ్రైనేజీలు, మౌలిక వసతుల కల్పనకు నిధులు ఇలా అమృత్ 2.0 పథకం కింద

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలపైన కీలక అప్డేట్ వచ్చింది. రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితా పైన క్లారిటీ ఇచ్చింది. 2025 నాటికి ప్రత్యేక సంక్షిప్త సవరణ ఓటర్ల జాబితాల ఆధారంగానే ఎన్నికలను నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. తాజాగా కేంద్రం నిర్వహించిన ప్రత్యేక సమగ్ర సవరణ తుది ఓటర్ల జాబితా కోసం ఎదురు చూడకుండానే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు ప్రకటించింది.తాజా సర్ తుది జాబితాతో సంబంధం లేకుండా ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించడం ఆలస్యం కాకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఎన్నికల సంఘం పేర్కొంది. ఇటీవల కేంద్రం నిర్వహించిన ప్రత్యేక సమగ్ర సవరణ తుది ఓటర్ల జాబితాలు అక్టోబర్ 3వ తేదీన ప్రచురితమవుతాయి. వాటిని ప్రామాణికంగా తీసుకుని స్థానిక సంస్థల ఓటర్ల జాబితాలు తయారు చేస్తే ఎన్నికల నిర్వహణ ఆలస్యం అవుతుందని ఎన్నికల సంఘం భావిస్తోంది.2025 నాటి జాబితాతోనే ముందుకు వెళ్లాలని నిర్ణయంఈ క్రమంలోనే సమయం తక్కువగా ఉన్న కారణంగా 2025 నాటి జాబితాలతోనే ముందుకు వెళ్లాలని నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం అక్టోబర్లో ఎన్నికలను నిర్వహించాలని ఆలోచిస్తున్న క్రమంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. ముందుగా పురపాలక, నగర పంచాయతీలలో, నగరపాలక సంస్థ ఫోటో గుర్తింపు ఓటర్ల జాబితాలో ప్రచురణకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ తర్వాత గ్రామ పంచాయతీలలో ఎన్నికలు జరగనున్నాయి.రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయితే ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఈ క్రమంలో రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో నిమగ్నమయ్యాయి. ఇక స్థానిక సంస్థల ఎన్నికల కోసం రిజర్వేషన్ల పైన ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి డెడికేటెడ్ కమిషన్ ఇప్పటికే నివేదిక సమర్పించింది. రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయితే ఎన్నికలు దగ్గర పడినట్లేనని అర్థం చేసుకోవచ్చు.జాబితాల ప్రచురణకు ఎన్నికల సంఘం ఆదేశం ఇక స్థానిక సంస్థల ఎన్నికల కోసం మునిసిపాలిటీల్లో వచ్చే నెల 3వ తేదీలోగా, ఇప్పటివరకు
ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి మొదలైంది. అక్టోబర్లో ఈ ఎన్నికలు నిర్వహించాలన్న ఆలోచనతో ప్రభుత్వం ఉంది. అయితే, ఇటీవల నిర్వహించిన ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) తుది ఓటర్ల జాబితాలతో కాకుండా.. 2025 నాటి ప్రత్యేక సంక్షిప్త సవరణ (ఎస్ఎస్ఆర్) ఓటర్ల జాబితాల ఆధారంగా ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. అక్టోబర్ 3న సర్ తుది ఓటర్ల జాబితాలు ప్రచురించనున్నారు. వాటిని ప్రామాణికంగా తీసుకుని స్థానిక సంస్థల్లో ఓటర్ల జాబితాలు ప్రచురిస్తే ఎన్నికల నిర్వహణ జాప్యమవుతోందని భావిస్తున్నారు. ఈ కారణంతో 2025 నాటి జాబితాలతోనే ఎలక్షన్స్కి వెళ్లాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది.ఈ మేరకు ముందుగా పురపాలక, నగరపాలక సంస్థలు, నగర పంచాయతీల్లో ఫొటో గుర్తింపు ఓటరల్ జాబితాల ప్రచురణకు ఏర్పాట్లు చేస్తున్నారు. ముందుగా పుర, నగరపాలక,నగర పంచాయతీల్లో.. ఆ తర్వాత గ్రామ పంచాయతీల్లో ఎలక్షన్స్ జరగనున్నాయి. ఈ ఎన్నికల కోసం ఆశావాహులంతా సన్నద్ధమవుతున్నారు. రాజకీయ పార్టీలు కూడా అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో పడ్డాయి.ఇక స్థానాల రిజర్వేషన్లపై కూడా ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి డెడికేటెడ్ కమిషన్ ఇప్పటికే నివేదిక ఇచ్చింది. రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయిందంటేనే ఎన్నికలు సమీపించాయని అర్థం అంటూ అధికారులు చెబుతున్నారు. దాంతో ఓటర్ల జాబితా ప్రచురణపై ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. వీలైనంత త్వరగా ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని ఆదేశాలు కూడా జారీ చేసింది.మున్సిపాలిటీల్లో వచ్చే నెల 3లోగా, ఇప్పటి వరకు ఓటర్ల జాబితా సిద్ధం చేయని సుమారు 50 పంచాయతీల్లో ఈ నెల 17వ తేదీలోగా ఓటర్ల జాబితా ప్రచురణ పూర్తి చేయాలని పురపాలక, పట్టణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖలను ఎన్నికల సంఘం ఆదేశించింది. పంచాయతీల్లో పోలింగ్ కేంద్రాల ఎంపిక, వాటికి సంబంధించిన పబ్లికేషన్ ప్రక్రియ కూడా ఈ నెల 21 నుంచి 31లోగా పూర్తి చేయాలని సూచించింది. ఎన్నికల సిబ్బందికి శిక్షణతో పాటు ఏర్పాట్లు కూడా

Chevella: మున్సిపాలిటీలో స్వాతంత్య్ర వేడుకలు జెండా ఎగురవేసిన చైర్పర్సన్! Chevella: చేవెళ్ల మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు చేవెళ్ల మున్సిపల్ కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను మున్సిపల్ చైర్మన్ దేవర సమత వెంకట్ రెడ్డి ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించి, దేశభక్తి, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ. మున్సిపల్ చైర్ పర్సన్ దేవర సమత వెంకట్ రెడ్డి మాట్లాడుతూ..మన దేశానికి స్వాతంత్ర్యం ఎంతోమంది మహనీయుల త్యాగాలు, పోరాటాల ఫలితం. వారి త్యాగాలను మనం ఎప్పటికీ మరువకూడదు. యువత దేశానికి వెన్నెముక. విద్యతో పాటు క్రమశిక్షణ, దేశభక్తి, సేవా భావాన్ని అలవర్చుకొని సమాజ అభివృద్ధిలో భాగస్వాములు రావాలని చేవెళ్ల పట్టణ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని, మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ, పర్యావరణాన్ని కాపాడుతూ, ప్రజా సమస్యల పరిష్కారానికి కలిసికట్టుగా ముందుకు సాగాలని యువత మంచి లక్ష్యాలను ఏర్పరచుకొని, నూతన ఆలోచనలతో దేశ ప్రగతికి బాటలు వేయాలి,స్వాతంత్ర్య సమరయోధులు కలలుగన్న బలమైన, అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించేందుకు మనందరం ఐక్యంగా కృషి చేద్దాం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, కో ఆప్షన్ మెంబర్స్, మాజీ సర్పంచులు, ఉప సర్పంచులు, నాయకులు,వార్డు సభ్యులు, మున్సిపల్ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు

Madanapalle: మదనపల్లెలో స్వాతంత్య్ర వేడుకలు జెండా ఎగురవేసిన మధుసూదన్ రెడ్డి! ఈ వార్తకు సంబంధించిన

Minister Narayana: తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. కొన్ని స్థానిక సంస్థలకు సంబంధించిన కేసులు కోర్టుల్లో పెండింగ్లో ఉండటంతో గతంలో వాటిని ఎన్నికల ప్రక్రియ నుంచి తప్పించాల్సి వచ్చిందని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు మిగిలిన అన్నింటికీ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి నారాయణ తెలిపారు. పవన్ కల్యాణ్ గైర్హాజరుపై వక్రభాష్యం వద్దు అమరావతిలో జరిగిన ప్రభుత్వ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హాజరు కాకపోవడంపై మంత్రి నారాయణ స్పందించారు. ఈ విషయాన్ని ఎవరూ వక్రంగా అర్థం చేసుకోవద్దని సూచించారు. తానే స్వయంగా వెళ్లి పవన్ కల్యాణ్ను కార్యక్రమానికి ఆహ్వానించానని తెలిపారు. అయితే ఆపరేషన్ చేయించుకున్న కారణంగా కార్యక్రమానికి హాజరు కాలేనని పవన్ తనకు చెప్పారని మంత్రి వివరించారు. అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ దూరం ఈ నెల 17వ తేదీ నుంచి జరగనున్న శాసనసభ సమావేశాలకు వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కావడం లేదని మంత్రి నారాయణ తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమావేశాలకు హాజరు కాకూడదని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. రోజువారీ చెత్త సేకరణపై దృష్టి ఇళ్ల నుంచి వచ్చే చెత్తను రోజుకు రోజే తరలించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. కమర్షియల్ కాంప్లెక్స్లు, ఆస్పత్రుల నుంచి వెలువడే వ్యర్థాలను కూడా ఆలస్యం చేయకుండా వెంటనే ప్రాసెస్ చేయాలని అధికారులకు సూచించారు. ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు, మెరుగైన రోడ్లు, వీధి లైట్లు, పార్కులు, కమ్యూనిటీ హాళ్లు వంటి మౌలిక వసతులు అందించడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని చెప్పారు. ఇక, రాష్ట్ర ప్రభుత్వం సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్కు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి నారాయణ తెలిపారు. గత ప్రభుత్వం లక్షల టన్నుల లెగసీ చెత్తను పేరుకుపోయేలా చేసిందని ఆయన ఆరోపించారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం

హరిద్వార్: కన్వర్ యాత్ర ముగిసిన తర్వాత హరిద్వార్లో భారీ వ్యర్థాల సమస్య తలెత్తింది. ఈ ఏడాది సుమారు 4.8 కోట్ల మంది కన్వర్ యాత్రికులు హరిద్వార్ను సందర్శించి, గంగాజలాన్ని సేకరించారు. యాత్ర ముగిసిన అనంతరం, గంగా తీరాలు, మేళా మైదానాల్లో సుమారు 7,000 మెట్రిక్ టన్నుల చెత్త పేరుకుపోయింది. హర్ కీ పౌరీ సహా అనేక ఘాట్ల వద్ద పారిశుధ్య పరిస్థితులు అత్యంత దారుణంగా తయారయ్యాయి. మహిళల కోసం ఏర్పాటు చేసిన డ్రెస్సింగ్ రూముల్లో మూత్రంతో నిండిన సీసాలు, పాత బట్టలు, చెప్పులు, వ్యర్థాల కుప్పలు దర్శనమిచ్చాయి. యాత్రికులు వదిలి వెళ్లిన కన్వర్ పరికరాలు, ఇతర చెత్త వల్ల స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న దృశ్యాలు ఈ అపరిశుభ్రతను కళ్లకు కడుతున్నాయి. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు మున్సిపల్ కార్పొరేషన్, జిల్లా యంత్రాంగం ఆగస్టు 18 వరకు ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్ను చేపట్టినట్లు మున్సిపల్ కమిషనర్ నందన్ కుమార్ తెలిపారు. ఈ శుభ్రత పనుల కోసం సుమారు 1,000 మంది ప్రత్యేక పారిశుధ్య కార్మికులను నియమించారు. వ్యర్థాలను తరలించేందుకు 80కి పైగా వాహనాలను సిద్ధం చేశారు. ముందుపెన్నడూ లేని విధంగా, ఈసారి డ్రోన్ కెమెరాల సాయంతో చెత్త పేరుకుపోయిన ప్రాంతాలను గుర్తించి, వెంటనే క్లీనింగ్ సిబ్బందిని పంపే ఏర్పాట్లు చేశారు. అంతేకాకుండా వ్యర్థాలు నిండిన వెంటనే హెచ్చరికలు పంపే ‘సోలార్ సెన్సార్’ డస్ట్బిన్లను ప్రయోగాత్మకంగా అమర్చారు. స్థానిక స్వచ్ఛంద సంస్థలు క్షేత్రస్థాయిలో పారిశుధ్య పనులను పర్యవేక్షిస్తూ, ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. పవిత్రమైన గంగా తీరాలను తిరిగి పరిశుభ్రంగా మార్చేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. కర్నూలులో వైఎస్ జగన్కు జననీరాజనం.. కదం తొక్కిన కార్యకర్తలు (ఫొటోలు) 'అగధ' మూవీ కామాక్షి భాస్కర్ల ఇంటర్వ్యూ స్పెషల్ (ఫొటోలు) బాలనటి గ్రీష్మ నేత్రిక ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?... ఫోటోలు వైరల్ ‘కొరియన్ కనకరాజు’ సక్సెస్ సెలబ్రేషన్స్లో మెరిసిన రితికా నాయక్ (ఫొటోలు) బుడ్జోడి

హైదరాబాద్లో ట్రాఫిక్జామ్కు చెక్ పెట్టడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ ట్రాన్స్ఫర్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్(హెచ్-సిటీ)లో భాగంగా వంతెనలు, అండర్పాస్ల నిర్మాణాన్ని వేగవంతం చేసింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో పనులు ప్రారంభం అయ్యాయి. నిర్మాణ సంస్థ ఎంపిక.. ఆమోదించిన పురపాలక శాఖ హైదరాబాద్ సిటీ: మహా నగరంలో ట్రాఫిక్జామ్కు చెక్ పెట్టడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ ట్రాన్స్ఫర్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్(హెచ్-సిటీ)లో భాగంగా వంతెనలు, అండర్పాస్ల నిర్మాణాన్ని వేగవంతం చేసింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో పనులు ప్రారంభం అయ్యాయి. మరికొన్ని జంక్షన్ల వద్ద వంతెనల నిర్మాణానికి పాలనాపరమైన అనుమతులు జారీ చేస్తోంది. టెండర్ ప్రక్రియలో భాగంగా ఏజెన్సీల ఎంపికకూ ఆమోదం తెలుపుతోంది. ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన ఓవైసీ ఫ్లై ఓవర్ నుంచి సంతోష్నగర్ వైపు వెళ్లేలా ఎడమ వైపు ర్యాంపు, హఫీజ్బాబా నగర్ జంక్షన్ నుంచి బాలాపూర్ 100 అడుగుల రోడ్డు వరకు, బండ్లగూడ- ఎర్రకుంట ఎక్స్ రోడ్ వద్ద ఆరు లేన్ల వంతెనల నిర్మాణం కోసం ఏజెన్సీ ఎంపికకు సర్కార్ ఆమోదం తెలుపుతూ బుధవారం పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రూ.242.72 కోట్ల నిర్మాణ వ్యయంతో ఈ వంతెనలు, ర్యాంప్ను ఒకే ప్యాకేజీగా చేపట్టనున్నారు. వాస్తవంగా ప్రాజెక్టు నిర్మాణ వ్యయం రూ.231.87 కోట్లుగా అంచనా వేయగా.. 4.68 శాతం ఎక్కువకు కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ లిమిటెడ్ బిడ్ దాఖలు చేసింది. రెండు పర్యాయాలు టెండర్ ప్రకటించినా.. సింగిల్ బిడ్ దాఖలు కావడంతో అదే సంస్థను ఎంపిక చేశారు. ఆస్తుల సేకరణతో కలిపి ప్రాజెక్టుకు రూ.385 కోట్లు అవసరమని అంచనా వేయగా సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.పనులు చేపట్టేందుకు ఏజెన్సీతో జీహెచ్ఎంసీ కమిషనర్ ఒప్పందం కుదర్చుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వంతెనలు పూర్తయితే పాతబస్తీలో పలు ప్రాంతాల నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి రాకపోకలు సులువు కానున్నాయి. ప్రియాంక కుటుంబానికి రూ.20 లక్షల ఆర్థికసాయం
రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత సొంత నియోజకవర్గం పాయకరావుపేట ఇప్పటి వరకు మేజర్ పంచాయతీగానే ఉంది. ఇప్పుడు దాన్ని మున్సిపాలిటీగా మార్చే ప్రతిపాదన మరోసారి తెరపైకి వచ్చింది. పాయకరావుపేట అభివృద్ధి కోసం హోం మంత్రి అనిత సర్వశక్తులు ఒడ్డుతోంది. ఈ క్రమంలోనే పట్టణానికి చెందిన నాయకులతో కూడా ఆమె సమావేశం నిర్వహించారు. పాయకరావుపేట అభివృద్ధి పథంలో పయనించాలన్నా.. భారీ గ్రాంట్లు రావాలన్నా పురపాలక సంఘంగా మార్చడమే సరైన పద్ధతని ఆమె నాయకులకు వివరించారు.మేజర్ పంచాయతీగా ఉన్న పాయకరావుపేట మున్సిపాలిటీ మారడం సాధ్యమేనా అనే విషయాలను చర్చిస్తే.. ఒక ఊరిని మున్సిపాలిటీగా మార్చాలంటే 30 వేల జనాభా ఉంటే సరిపోతుంది. 2021లో కూడా మున్సిపాలిటీ ప్రతిపాదన వచ్చింది, కానీ అప్పట్లో 2011 జనాభా లెక్కల ప్రకారం 27 వేల మంది మాత్రమే ఉన్నారు. దాంతో పక్కనే ఉన్న పీఎల్పురం, అరట్లకోట గ్రామాలను కలిపి మున్సిపాలిటీగా మార్చాలని నిర్ణయించారు.READ ALSO తపాలాశాఖ గోల్డెన్ ఛాన్స్.. మీరు లేఖలు రాయగలరా, అయితే రూ. 25 వేలు మీకే!ప్రభుత్వం కూడా అప్పట్లో నర్సీపట్నం, ఎలమంచిలి, చోడవరం, పాయకరావుపేటలను మున్సిపాలిటీలుగా పేర్కొంటూ జీఓ కూడా విడుదల చేసింది. అయితే, పలు రకాల కారణాలతో చోడవరం, పాయకరావుపేటలను పంచాయతీలుగానే కొనసాగించేందుకు నిర్ణయించారు. దీనికి ప్రధాన కారణాలు ఏడాదికి రెండుసార్లు ఇంటిపన్ను కట్టాల్సి రావడం, ఉపాధి హామీ పథకం పనులు నిలిచిపోతాయనే కారణాలతో పాయకరావుపేటను మున్సిపాలిటీ చేయకుండా వదిలేశారు. అంతేగాకుండా పీఎల్పురం గ్రామస్థులు దీనిపై కోర్టును ఆశ్రయించేందుకు కూడా సిద్ధపడటంతో పాయకరావుపేట మేజర్ పంచాయతీగానే మిగిలిపోయింది.ప్రస్తుత జనాభా లెక్కల ప్రకారం పాయకరావుపేట మున్సిపాలిటీగా చేయడానికి సరిపోతుంది. తాజాగా జనాభా లెక్కల ప్రకారం సుమారు 40 వేల జనాభా ఉంది. దాంతో మిగతా గ్రామాలను కలుపుకోకుండానే పాయకరావుపేటను ఒక్కదానినే మున్సిపాలిటీగా చేయొచ్చు. హోం మంత్రి సొంత నియోజకవర్గం కావడంతో నిధులకు కొరతే ఉండదు, పైగా కేంద్రం నుంచి కూడా పెద్దఎత్తున నిధులు వస్తాయి. దాంతో