
Rajahmundry: రాజమండ్రి: ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ఉంటేనే భవనాల వినియోగం! Rajahmundry: ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ పొందిన తర్వాతే ఆయా భవనాలను యజమానులు వినియోగించాలని కమిషనర్ రాహుల్ మీనా స్పష్టం చేశారు. మంగళవారం టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో ఆయన పర్యటించారు. గోరక్షణపేటలో ఆక్యునెన్సీ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న భవన కొలతలను తనిఖీ చేశారు. అర్బన్ పరిధిలో నిర్మిస్తున్న భవనాలు వాటి అనుమతి పొందిన ప్లాన్లకు అనుగుణంగా కడితేనే నివాసయోగ్య ధృవీకరణ పత్రం జారీ చేయబడుతుందని ఈ సందర్భంగా కమిషనర్ తెలిపారు. భవన నిర్మాణ సమయంలోనే ర్యాంపులు ప్రహరీ లోపలే ఉండేలా చూడాలని.. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల మేరకు తగిన డ్రైనేజి సిస్టం, గ్రీనరీ ఏర్పాటు చేసుకోవాలన్నారు. అలాగే భవనం పూర్తయ్యేంత వరకు నిర్మాణం జరిగే చోట బిల్డింగ్ ప్లాన్ను తప్పనిసరిగా ప్రదర్శించాలని తెలియజేశారు. ఆయన వెంట ఏసీపీ కొండలరావు, ఇతర సిబ్బంది ఉన్నారు
.