
Chirala: చిన్నపిల్లల పార్క్లో పారిశుధ్య పనులు చేపట్టిన ఎమ్మెల్యే మాలకొండయ్య చీరాల: రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నెలా మూడో శనివారం నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా చీరాలలోని చిన్నపిల్లల పార్క్లో స్వచ్ఛత కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీ మద్దులూరి మాలకొండయ్య , ఆర్డీవో నరసింహరావు, మున్సిపల్ కమిషనర్ డానియల్ జోసెఫ్ పాల్గొన్నారు. ఎమ్మెల్యేతో పాటు ఆర్డీవో, కమిషనర్లు కూడా చీపురు పట్టి పార్క్ పరిసరాలను శుభ్రం చేశారు. అనంతరం అధికారులు, సిబ్బందితో స్వచ్ఛత ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య మాట్లాడుతూ.. పరిశుభ్రమైన పరిసరాలతోనే ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించగలమన్నారు. స్వచ్ఛత కేవలం ప్రభుత్వ కార్యక్రమం మాత్రమే కాదని, ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలన్నారు. ఇళ్లు, వీధులు, పార్కుల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. చిన్నపిల్లల పార్క్ను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు దాని పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు సమిష్టిగా కృషి చేసి స్వచ్ఛ చీరాలను సాధించాలని ఎమ్మెల్యే శ్రీ మద్దులూరి మాలకొండయ్య అన్నారు
.