
CM Chandrababu : రూ.13.85 లక్షల కోట్ల పెట్టుబడులే లక్ష్యం
CM Chandrababu : రూ.13.85 లక్షల కోట్ల పెట్టుబడులే లక్ష్యం

CM Chandrababu : రూ.13.85 లక్షల కోట్ల పెట్టుబడులే లక్ష్యం

CM Chandrababu : వచ్చే కాన్ఫరెన్స్ నాటికి 100 శాతం కనెక్టివిటీ ఉండాల్సిందే

CM Chandrababu: ‘నిజం గెలిచింది’.. ప్రజల కోసం నిలబడితే ప్రజలే మన వెంట నిలబడతారు..

దశాబ్దాల కాలం నాటి కల సాకారమైంది. ఉత్తరాంధ్ర బీళ్లకు జీవం పోసేందుకు గోదారమ్మ పరవళ్లు తొక్కుతూ తరలివచ్చింది. ఈ చారిత్రక ఘట్టంతో పులకించిపోయిన ఉత్తరాంధ్ర రైతులు, ప్రజలు.. తమ ప్రాంతానికి గోదావరి జలాలు తీసుకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు మనసారా కృతజ్ఞతలు తెలిపారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట వద్ద పోలవరం ఎడమ ప్రధాన కాలువ నుంచి గోదావరి జలాలను విడుదల చేసిన ముఖ్యమంత్రి, ఈ అపూర్వ ఘట్టానికి ప్రత్యక్ష సాక్షిగా నిలిచారు.బుధవారం పాయకరావుపేట వద్ద క్రాస్ రెగ్యులేటర్ నుంచి ఉత్తరాంధ్ర భూముల్లోకి అడుగుపెట్టిన గోదావరి జలాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక పూజలు నిర్వహించి, జలహారతి ఇచ్చారు. అరుణ వర్ణంలో ప్రవహిస్తున్న పవిత్ర జలాలను శిరస్సున చల్లుకుని, భావోద్వేగంతో కాలువలో నిల్చుని పుష్పాలు, పసుపు కుంకుమ సమర్పించారు. అనంతరం గోదావరి తల్లికి సాష్టాంగ నమస్కారం చేసి తన ప్రణామం అర్పించారు. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో తరలివచ్చిన స్థానిక రైతులు, మహిళలు హారతులు పడుతూ, పూలు చల్లుతూ గోదారమ్మకు స్వాగతం పలికారు.ఉత్తరాంధ్ర ఉన్నతాంధ్రగా మారుతుంది: సీఎంఅనంతరం జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.. "ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్లు వచ్చాయి. ఇక ఈ ప్రాంతంలోని బీళ్లన్నీ పంటలతో కళకళలాడతాయి. అన్నవరం సత్యదేవుడి ఆశీస్సులతో అనకాపల్లికి వచ్చిన గోదారమ్మను.. వచ్చే ఏడాదికి సింహాచలం అప్పన్న చెంతకు, ఆపై అరసవల్లి సూరీడి పాదాల వద్దకు తీసుకెళ్లి, వంశధార వరకు గోదావరి జలాలను తరలిస్తాం" అని స్పష్టం చేశారు.ఈ ప్రాజెక్టు ద్వారా తొలి దశలో తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ, అనకాపల్లి జిల్లాల్లో 2.87 లక్షల

సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. YS Jagan Mohan Reddy: 'పురుషోత్తపట్నం నుంచి ఉన్న పంపులతో గోదావరి నీటిని ఎత్తి.. పోలవరం ఎడమ కాలువలో వదిలి దాన్ని చూపించి పోలవరం ప్రాజెక్టు నీళ్లు తెచ్చేశాం అంటూ డప్పు కొట్టుకోవడం ఏమిటి?' అని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రశ్నించారు. పోలవరం రిజర్వాయర్ నుంచి గ్రావిటీ ద్వారా నీళ్లు రాకున్నా ప్రచారం మాత్రం వేరే లెవల్ అని తెలిపారు. నీళ్లు పురుషోత్తపట్నానివి.. కాలువ వైఎస్సార్ హయాంలో నిర్మించినది అని పేర్కొన్నారు. క్రెడిట్ కోసం ఆరాటం మాత్రం మీదా? ఇదేం మ్యాజిక్? అని నిలదీశారు. 'సాగునీటి ప్రాజెక్టుల విషయంలో వరుసగా చేస్తున్న పబ్లిసిటీ ఈవెంట్లన్నీ ప్రజలను మభ్యపెట్టడానికే కదా? మొన్న వెలిగొండ, ఇవాళ పోలవరం ఎడమ కాలువ. మీరు మొదలుపెట్టని.. మీరు పూర్తి చేయని ప్రాజెక్టులకు మీ పేరు చెప్పుకోవడం, మీ అనుకూల మీడియాతో వాటి సృష్టికర్తలు మీరు అన్నట్టుగా భజన చేయించుకోవడం మీకు అలవాటే' అని చంద్రబాబు పబ్లిసిటీపై మాజీ సీఎం వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 'పురుషోత్తపట్నం పంపుల ద్వారా విడుదల చేస్తామంటున్నది 3,500 క్యూసెక్కుల నీళ్లు. ఈ ప్రాజెక్ట్, ఈ పంపులు కొత్తవికాదు కదా? ఇప్పటికే ఉన్నవే కదా? మరెందుకు ఈ డ్రామా?' అని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ప్రశ్నించారు. పోలవరం ఎడమ కాలువకు సంబంధించిన ప్రధాన పనులు వైఎస్సార్ హయాంలోనే పూర్తయితే.. ఇప్పుడు ఆ పనులన్నింటి మీద నిలబడి అంతా నేనే చేశా అని చెప్పుకోవడం చంద్రబాబు మీకే చెల్లింది' అని వైఎస్ జగన్ విమర్శించారు. 'పోలవరం ప్రాజెక్టు విషయంలో 2014-19 మధ్య
4 గోల్డ్ మెడల్స్ సాధించిన అథ్లెట్.. కూరగాయలు అమ్ముతూ.. ట్రాజెడీ స్టోరీ.. దేశం గర్వపడేలా అంతర్జాతీయ వేదికలపై 4 సార్లు స్వర్ణ పతకాలు (గోల్డ్ మెడల్స్) సాధించిన భారత స్టార్ త్రోబాల్ ప్లేయర్ అమర్దీప్ కుమార్ నేడు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడు. జార్ఖండ్ రాజధాని రాంచీ వీధుల్లో కుటుంబ పోషణ కోసం కూరగాయలు అమ్ముతూ, పార్ట్టైమ్ క్యాబ్ నడుపుకుంటున్నాడు. స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగం కోసం ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయింది. మెడల్స్ వెనుక వేలాడుతుంటే కూరగాయలు అమ్ముతున్న అమర్దీప్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వార్తకు సంబంధించిన

ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కల నెరవేరింది. అనకాపల్లి జిల్లాలో గోదావరి జలాలు గలగలా పారాయి. పాయకరావుపేట మండలం వద్ద పోలవరం ప్రాజెక్టు ఎడమ ప్రధాన కాలువ నుంచి ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం విడుదల చేశారు. ఈ చారిత్రక ఘట్టానికి గుర్తుగా ఆయన గోదావరి తల్లికి ప్రత్యేక పూజలు చేసి, జలహారతి ఇచ్చారు. అనంతరం కాలువ గట్టుపై సాష్టాంగ నమస్కారం చేసి తన మొక్కు తీర్చుకున్నారు.ఈ కార్యక్రమంపై చంద్రబాబు సోషల్ మీడియాలో స్పందించారు. "అదే సంతోషం.. అదే భావోద్వేగం! నిన్న మార్కాపురంలో బిరబిరా కృష్ణమ్మ.. నేడు అనకాపల్లిలో గలగలా గోదారమ్మ.. రైతుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు జీవనదుల పరవళ్లు ఎనలేని సంతోషాన్ని, సంతృప్తిని కలిగించాయి. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట వద్ద పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా ఉత్తరాంధ్రకు చేరిన గోదావరి జలాలకు జల హారతి ఇచ్చి ప్రణమిల్లాను. రాష్ట్రాన్ని చల్లగా చూడమని ప్రార్థించాను. కృష్ణా, గోదావరి సహా రాష్ట్రంలో శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు అన్ని నదులను అనుసంధానం చేసి తెలుగు తల్లికి జలహారతి ఇస్తాను. అందుకు అవసరమైన శక్తిని ప్రసాదించమని గంగమ్మ తల్లిని కోరుకున్నాను" అని చంద్రబాబు తన పోస్ట్ లో పేర్కొన్నారు. రూ. 4,192 కోట్లతో నిర్మించిన 213 కిలోమీటర్ల ఈ కాలువ ద్వారా ఉత్తరాంధ్రలోని లక్షలాది ఎకరాలకు సాగు, తాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యం. తొలి దశలో ఈ నీటితో అనకాపల్లి జిల్లాలోని 110 చెరువులను నింపనున్నారు. దీన్ని విస్తరించి ఇతర ఉత్తరాంధ్ర జిల్లాలకు కూడా నీరు అందించనున్నారు

ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కొండచరియలు విరిగిపడటం, ఇళ్లు కూలిపోవడం, నదులు ఉప్పొంగడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. ఇంటర్నెట్ డెస్క్: ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కొండచరియలు విరిగిపడటం, ఇళ్లు కూలిపోవడం, నదులు ఉప్పొంగడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. రాష్ట్రంలో మంగళవారం ఒక్కరోజే వర్ష సంబంధిత ఘటనల్లో 12 మంది మృతి చెందినట్లు స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ (SEOC), స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (SDRF) వెల్లడించాయి (Uttarakhand heavy rain). భారీ వర్షాల నేపథ్యంలో భారత వాతావరణ శాఖ (IMD) బుధవారం డెహ్రాడూన్, నైనిటాల్, బాగేశ్వర్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కూడా పడే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్రంలోని మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు (Uttarakhand rain alert). భారీ వర్షాలకు పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి (12 dead Uttarakhand). అల్మోరాలోని ఒడ్యూదా గ్రామంలో తెల్లవారుజామున ఓ ఇంటి గోడ కూలడంతో ముగ్గురు మృతి చెందారు. మరో ఘటనలో అల్మోరా పట్టణంలోని ధార్కితుని ప్రాంతంలో పాత ఇంటి గోడ కూలి ఇద్దరు నేపాలీ కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. డెహ్రాడూన్లోని కండోలీ బ్రిడ్జి సమీపంలో భారీగా ప్రవహించిన నీటిలో ఓ కారు కొట్టుకుపోయింది. ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు. మరో మహిళను రక్షించారు. ఉక్రెయిన్పై రష్యా దాడిలో జగిత్యాల వాసి మృతి వియన్నా మ్యూజియంలో భారీ దోపిడీ.. రూ.38 కోట్ల విలువైన వజ్రాల హారం చోరీ

'ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' చిత్రంతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న 7 PM ప్రొడక్షన్స్ సంస్థ మరో కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టింది. ఇ.ఎం.ఐ టైటిల్ తో న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ నూతన నటీనటులు, సాంకేతిక నిపుణులతో ఓ కంప్లీట్ ఎంటర్ టైనర్ ను నిర్మిస్తోంది. ఈ చిత్రానికి నిఖిల్ కువ్వరపు దర్శకత్వం వహిస్తున్నారు. లాల్ సలామ్, హాస్టల్ డేస్ వంటి పలు వెబ్ సిరీస్ లతో పేరు తెచ్చుకున్న దరహాస్ ఈ చిత్రంతో హీరోగా పరిచయమవుతున్నారు. లిటిల్ హార్ట్స్ సినిమాలో ఓ కీలక పాత్ర పోషించి ఫేమ్ అయిన శైలజ ఈ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోంది. ఈ రోజు పూజా కార్యక్రమాలతో "ఇ.ఎం.ఐ" సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి హీరో ఆది సాయికుమార్ క్లాప్ ఇవ్వగా, డైరెక్టర్ సాయి మార్తాండ్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో సినిమా దర్శకుడు రాహుల్ శ్రీనివాస్ స్క్రిప్ట్ అందజేశారు. బైక్, కారు, మంచి ఫోన్..ఇలా ఏ వస్తువు కొన్నా ఇ.ఎం.ఐ కట్టాల్సిందే. దాదాపు ప్రతి మధ్య తరగతి ఇంటిలో ఇ.ఎం.ఐ కష్టాలు తప్పవని అనుకోవచ్చు. ఇలా ఇ.ఎం.ఐ మీద వస్తువులు తీసుకున్న యువత ఆ ఇ.ఎం.ఐ లు కట్టేందుకు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు అనే కాన్సెప్ట్ తో హార్ట్ టచింగ్ ఎమోషన్స్ తో పాటు కంప్లీట్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ సినిమాలోని ప్రతి సీన్ యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ కనెక్ట్ అయ్యేలా ఉండబోతోంది. ఇక ఈ సినిమాతో పాటు 7 పి.ఎం. ప్రొడక్షన్స్ సంస్థ ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో దర్శకుడు రాహుల్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ఒక భారీ చిత్రాన్ని నిర్మించబోతోంది. ఈ సినిమాకు సంబంధించిన కాస్ట్ అండ్ క్రూ వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల్లో

సాక్షి, విశాఖపట్నం: చంద్రబాబు మరో ఈవెంట్ మేనేజ్మెంట్కు తెరలేపారని.. రెండున్నరేళ్ల నుంచి ఇదే తరహాలో కాలం గడుపుతూ వచ్చారంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. ‘‘పురుషోత్తపట్నం ద్వారా పోలవరం ఎడమ కాల్వలోకి నీళ్లు వదిలారు. పోలవరం నీళ్లు వస్తున్నాయని చంద్రబాబు అబద్ధాలు ఆడుతున్నారు. ఉత్తరాంధ్ర ప్రజలను చంద్రబాబు మోసం చేస్తున్నారు’’ అని అమర్నాథ్ దుయ్యబట్టారు. ‘‘పోలవరం కాలువ ప్యాకేజీలను అంచనాలు పెంచి తనకు నచ్చిన వాళ్లకు ఇచ్చుకున్నారు. పోలవరం ఏటీఎం అని స్వయంగా ప్రధాని మోదీ చెప్పారు. పోలవరం ఎత్తు 41 మీటర్లు కాంటూరు వద్ద నీటిని నిల్వ చేస్తే ఉత్తరాంధ్ర ప్రజలకు అన్యాయం జరుగుతుందని తెలియదా?. 45 మీటర్ల నుంచి ఎత్తును 41 మీటర్లకు తగ్గించేందుకు ఎందుకు ఒప్పుకున్నారు? ఇంకా ఎన్ని రోజులు ప్రజలను మోసం చేస్తారు. చంద్రబాబు పాలనలో ఉత్తరాంధ్రకు తెచ్చిన ఒక ప్రాజెక్ట్ పేరు చెప్పండి’’ అంటూ అమర్నాథ్ ప్రశ్నించారు. వైఎస్ జగన్ ఫోబియాతో చంద్రబాబు భయపడుతున్నారు. జగన్నామస్మరణతో చంద్రబాబు బతుకుతున్నారు. చంద్రబాబు చేసిన ఈవెంట్ మేనేజ్మెంట్ల ఖర్చుతో మరొక పోలవరం ప్రాజెక్టు కట్టవచ్చు. పోలవరం ప్రాజెక్ట్ నుంచి నీళ్లు ఇస్తున్నారా? పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ద్వారా నీళ్లు ఇస్తున్నారా? ప్రజలకు చెప్పాలి. వైఎస్సార్ మరణించిన రోజు నీళ్లు విడుదల చేయడం దేవుడు రాసిన స్క్రిప్ట్. చేతకాని వాడు మంగళవారం అన్నారనే సామెత చందంగా ఉంది చంద్రబాబు తీరు. చంద్రబాబు పాలనలో పనులు చేయలేక ఆ నెపాన్ని ఉద్యోగుల మీద నెడుతున్నారు. గ్రావిటీ ద్వారా పోలవరం కాలువకు నీళ్లు ఇవ్వాలి.. ఎత్తిపోతల పథకం ద్వారా కాదు.’’ అని గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. మై లిటిల్ ప్యారడైజ్.. కొడుకు అర్జున్తో నాని క్యూట్ మూమెంట్స్ (ఫోటోలు) ప్రభాస్ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్పై ఆటోగ్రాఫ్ తీసుకున్న యంగ్ హీరో (ఫోటోలు) పని.. ప్రకృతిలో మమేకం.. శ్రీనిధి జ్ఞాపకాలు (ఫొటోలు) 'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' సినిమా ప్రీ-రిలీజ్

సాక్షి, డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఇప్పటివరకూ 12 మంది మృతిచెందినట్లు అక్కడి ప్రభుత్వం తెలిపింది. వేరు వేరు ఘటనల్లో ఈ మరణాలు సంభివించినట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో మరికొద్ది రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. ఈ రోజు బుధవారం డెహ్రాడూన్, నైనిటాల్, బాగేశ్వర్ జిల్లాల్లో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులు కూడా సంభవించే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు వాతావరణ శాఖ ‘ఎల్లో అలర్ట్’ జారీ చేసింది. వాతావరణ శాఖ హెచ్చరిక నేపథ్యంలో, ఏదైనా అవాంఛనీయ ఘటన జరిగిన వెంటనే చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉండటంతో పాటు అప్రమత్తంగా ఉండాలని జిల్లా యంత్రాంగాలకు ఆదేశాలు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. కాగా గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షపాతం నమోదైంది. వాటిలో అత్యధికంగా నైనిటాల్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది. మై లిటిల్ ప్యారడైజ్.. కొడుకు అర్జున్తో నాని క్యూట్ మూమెంట్స్ (ఫోటోలు) ప్రభాస్ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్పై ఆటోగ్రాఫ్ తీసుకున్న యంగ్ హీరో (ఫోటోలు) పని.. ప్రకృతిలో మమేకం.. శ్రీనిధి జ్ఞాపకాలు (ఫొటోలు) 'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు) సంజు, బుమ్రా రీ ఎంట్రీ.. ఆఫ్గన్ సిరీస్ కు టీమిండియా ఇదే snake plant ఈ మొక్కలని కిచెన్లో పెట్టుకుంటే.. మళ్లీ ఎప్పుడు పుడతావు రాజన్నా..? YSRపై భూమన భావోద్వేగ వ్యాఖ్యలు Konda Surekha: నాకంటే ముందు రేవెంత్ పై చర్యలు తీసుకోవాలి

అనకాపల్లికి పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా గోదావరి జలాల్ని ఇవాళ సీఎం చంద్రబాబు (Chandrababu) విడుదల చేశారు. మొన్ననే వెలిగొండతో కృష్ణమ్మను తరలించి కరువుపీడిత మార్కాపురంనకు నీళ్లిచ్చామన్నారు. తూర్పు కనుమలను, అడవులను, నదుల్ని, వాగులు, వంకలు, హైవేలను దాటుకుని అన్నవరం సత్యదేవుని ఆశీస్సులతో గోదారమ్మ ఈ ప్రాంతానికి వచ్చిందని తెలిపారు. వచ్చే ఏడాది సింహాద్రి అప్పన్న చెంతకు గోదారమ్మను తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. భవిష్యత్లో అరసవెల్లి సూర్యనారాయణ స్వామి వద్దకు తరలించి వంశధార నదికి అనుసంధానం చేస్తామన్నారు. శంకరంబాడి సుందరాచారీ చెప్పినట్లుగా గలగలా గోదారి...బిరబిరా కృష్ణ్మమ్మ పరుగులతో రాష్ట్రాన్ని సుభిక్షం చేస్తామని చంద్రబాబు పేర్కొన్నారు.ఉత్తరాంధ్ర చరిత్రలో అపురూప ఘట్టం.. పరవళ్లు తొక్కుతూ వచ్చిన గోదారమ్మ!నాటి గొడ్డలి పార్టీ చీకలి పాలనలో ఉత్తరాంధ్ర వణికిపోయిందని, ఎక్కడ చూసినా అరాచకాలు, కబ్జాలు, భయానక వాతావరణం ఉండేదన్నారు. ఉత్తరాంధ్రలోని ప్రాజెక్టులకు రూ.500 కోట్లు కూడా ఖర్చు పెట్టని ఆ పార్టీ... ఆ నాయకుడి నివాసానికి, విలాసాల కోసం రూ.500 కోట్లు ఖర్చుచేసి రుషికొండపై ప్యాలెస్ కట్టుకున్నారని విమర్శించారు. ఆ రూ.500 కోట్లతో నాలుగైదు ప్రాజెక్టులు పూర్తయ్యేవన్నారు. విపక్షంలోనూ గొడ్డలిపార్టీ విషం చిమ్ముతోందన్నారు. విశాఖకు డేటా సెంటర్ వస్తే నీరు, విద్యుత్ కొరత వస్తుందని పేటియం బ్యాచ్తో తప్పుడు ప్రచారం చేయిస్తున్నారన్నారు. Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు కట్టిందెవరు ? జగన్- లోకేష్ క్రెడిట్ వార్..!పోలవరం ఎడమ కాలువ ద్వారా 4 లక్షల ఎకరాలకు నీరు అందుతుందని, తూర్పుగోదావరి, కోనసీమ, కాకినాడ, అనకాపల్లి జిల్లాల్లో సాగు తాగునీరు అందుతుందిని, అలాగే 9 లక్షల మందికి తాగునీరు కూడా అందుతుందని చంద్రబాబు తెలిపారు. విశాఖ, అనకాపల్లి జిల్లాలకు 23.44 టీఎంసీల నీరు పారిశ్రామిక, తాగు,సాగునీటి అవసరాలకు అందిస్తామన్నారు. లెఫ్ట్ మెయిన్ కెనాల్ ను మరింత విస్తరించి ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి అనుసంధానిస్తామని తెలిపారు. 12 ప్రధాన ప్రాజెక్టులను రూ.

ఏపీలో అధికార కూటమిలో భాగస్వాములుగా ఉన్న టీడీపీ, జనసేన అధినేతలు చంద్రబాబు (Chandrababu), పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మధ్య తాజాగా గ్యాప్ నెలకొందన్న ప్రచారం జరుగుతోంది. పవన్ తరచుగా కేబినెట్ భేటీలకు, చంద్రబాబు పాల్గొంటున్న కీలక కార్యక్రమాలకు హాజరు కాకపోవడంతో ఈ ప్రచారం సాగుతోంది. అలాగే పవన్ కళ్యాణ్ స్దానిక ఎన్నికల్లో జనసేన పోటీపై చేస్తున్న వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఇలాంటి సమయంలో టీడీపీ ఎంపీ ఒకరు ఆయన పుట్టినరోజును ఇవాళ ఘనంగా నిర్వహించడంతో పాటు జనసేనాని నాయకత్వంపైనా ప్రశంసలు కురిపించడం చర్చనీయాంశమైంది.ఉద్యోగులతో గ్యాప్ పెరుగుతున్న వేళ ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..!విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని (Kesineni Chinni) ఇవాళ ఎన్టీఆర్ జిల్లా తిరువూరులోని జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు. తిరువూరు జనసేన పార్టీ ఇంచార్జి మనుబోలు శ్రీనివాసరావు, జనసేన నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ నాయకత్వం రాష్ట్రానికి ఎంతో అవసరంమని ఎంపీ కేశినేని చిన్ని తెలిపారు. చంద్రబాబు-పవన్ కళ్యాణ్ మైత్రి రాష్ట్ర అభివృద్ధికి బలమైన పునాది అని అన్నారు. కూటమి ఐక్యతతోనే ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లగలమన్నారు. ఏం చేసినా క్రెడిట్ చోరీ చేసేస్తున్న జగన్ ..! రేపు ఇవన్నీ.. చంద్రబాబు జోస్యం..!ఎన్టీఆర్ జిల్లా కూటమి తరఫున ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. గతంలో రాష్ట్రంలో సాగిన దుష్ట పరిపాలనకు చరమగీతం పాడేందుకు పవన్ కళ్యాణ్ చేసిన పోరాటం, కూటమి ఏర్పాటులో ఆయన పోషించిన కీలక పాత్రను రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ మరువరని ఎంపీ కేశినేని చిన్ని అన్నారు. ఎలాంటి వ్యక్తిగత లేదా రాజకీయ లాభాలను ఆశించకుండా, రాష్ట్ర అభివృద్ధి కోసం తెలుగుదేశం

ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల దాహార్తిని తీరుస్తూ, పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా పయనించి వచ్చిన గోదావరి జలాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు అపూర్వ రీతిలో స్వాగతం పలికారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట వద్ద క్రాస్ రెగ్యులేటర్ నుంచి వస్తున్న గోదావరి జలాలకు, స్వయంగా కాలువలోనే నిల్చుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అరుణ వర్ణంలో ప్రవహిస్తున్న గోదారమ్మకు పుష్పాలు సమర్పించి, జలహారతి ఇచ్చి తన కృతజ్ఞతను చాటుకున్నారు. పవిత్ర గోదావరి జలాలను శిరస్సుపై చల్లుకున్న అనంతరం, ఉద్విగ్నభరిత వాతావరణంలో గోదావరి ప్రవాహానికి సాష్టాంగ నమస్కారం చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు.బుధవారం పాయకరావుపేటలో జరిగిన ఈ చారిత్రక కార్యక్రమంలో భాగంగా, ముఖ్యమంత్రి చంద్రబాబు తొలుత శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. మంత్రులు నిమ్మల రామానాయుడు, వంగలపూడి అనిత, కొల్లు రవీంద్ర, నారాయణ, అచ్చెన్నాయుడు, కొలుసు పార్థసారధి, ఎంపీలు చింతకాయల విజయ్, సీఎం రమేశ్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ఆయన గోదావరి జలాలను ఉత్తరాంధ్ర జిల్లాలకు విడుదల చేశారు. ఈ సందర్భంగా సాంప్రదాయ కోలాటంతో కళాకారులు ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికారు.రూ.4,192 కోట్ల వ్యయంతో నిర్మించిన పోలవరం ఎడమ కాలువ ద్వారా విడుదల చేసిన ఈ నీటితో నాలుగు జిల్లాల పరిధిలో 2.87 లక్షల ఎకరాలకు సాగునీరు, 9 లక్షల మందికి తాగునీరు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మొత్తం 23.44 టీఎంసీల గోదావరి జలాలతో విశాఖ, అనకాపల్లి జిల్లాల్లోని పారిశ్రామిక, తాగు, సాగునీటి అవసరాలు తీరనున్నాయి. ఈ నీటితో అనకాపల్లి వద్ద ఏలేరు కాలువతో పాటు జిల్లాలోని 110 చెరువులను నింపేందుకు జలవనరుల

అశోక్ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది. Dr Subhash Chandra Case: తుది లీగల్ ఆర్డర్ లేకుండా పదిహేను రోజులుగా సాగుతున్న మీడియా ట్రయల్పై నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (NCLAT) దృష్టికి ఎస్సెల్ గ్రూప్ ఛైర్మన్ సుభాష్ చంద్ర తీసుకువెళ్లారు. అదేవిధంగా ఈ కేసును మళ్లీ మొదటి నుంచి ఏకంగా ఐదుగురు సభ్యుల ప్రత్యేక బెంచ్ను ఏర్పాటు చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. దీనిపై నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ ముందు సుభాష్ చంద్ర తరుఫున న్యాయవాదులు బలమైన వాదనలు వినిపించారు. NCLAT తాత్కాలిక ఛైర్మన్ జస్టిస్ యోగేష్ ఖన్నా, సాంకేతిక సభ్యులు బరుణ్ మిత్రా, అజయ్ దాస్ మెహ్రోత్రాలతో కూడిన ధర్మాసనం ముందు బుధవారం ఈ పిటిషన్లపై విచారణ జరిగింది. సుభాష్ చంద్ర తరఫున సీనియర్ న్యాయవాది సస్మిత్ పాత్ర వాదనలు వినిపిస్తూ.. ప్రస్తుతం ఈ కేసులో ఎలాంటి అధికారిక తుది ఉత్తర్వు అమల్లో లేదని స్పష్టం చేశారు. అయినా.. రూ.22,006 కోట్ల మేర ఉన్న క్లెయిమ్లకు బదులుగా ఆయన కేవలం రూ.6.5 కోట్లు మాత్రమే చెల్లిస్తున్నారంటూ ఆయన ప్రతిష్టను దిగజార్చేలా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని తెలిపారు. ఈ రూ.22,006 కోట్ల రుణం సుభాష్ చంద్ర వ్యక్తిగతంగా తీసుకున్నది కాదని.. ఎస్సెల్ గ్రూప్ కంపెనీలు తీసుకున్న రుణాలకు ఆయన గ్యారెంటర్గా మాత్రమే ఉన్నారని చెప్పారు. ఆయన వ్యక్తిగత ఆస్తుల నికర విలువ రూ.31.79 కోట్లు ఉండగా.. దాని ఆధారంగానే నిబంధనల ప్రకారం రూ.6.25 కోట్లు రుణదాతలకు, మరో రూ.25 లక్షలు న్యాయ ప్రక్రియ ఖర్చుల కోసం రీపేమెంట్ ప్లాన్ను రూపొందించారని వివరించారు. రీపేమెంట్ ప్లాన్ను ఆమోదిస్తూ ఎలాంటి

ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కలను సాకారం చేస్తూ గోదావరి జలాలు ఈ ప్రాంతాన్ని తాకాయని, ఇది ముఖ్యమంత్రి, అపర భగీరథుడు చంద్రబాబు దార్శనికత వల్లే సాధ్యమైందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కొనియాడారు. పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ ద్వారా ఉత్తరాంధ్రకు నీరు చేరడం రాష్ట్ర జలవనరుల చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయమని ఆయన అభివర్ణించారు. బుధవారం అనకాపల్లి జిల్లా పాయకరావుపేట వద్ద సీఎం చంద్రబాబు గోదావరి జలాలకు హారతి పట్టడం తెలిసిందే. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో నిమ్మల రామానాయుడు మాట్లాడారు.పోలవరం ప్రాజెక్ట్ పూర్తి కాకముందే, పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు, పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ద్వారా ఉత్తరాంధ్రకు నీరందించాలన్న చంద్రబాబు ముందుచూపు వల్లే ఈరోజు ఈ ప్రాంత ప్రజల దాహం తీరుతోందని మంత్రి అన్నారు. "2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే, 2026 నాటికి లెఫ్ట్ మెయిన్ కెనాల్ పూర్తి చేస్తామని మాట ఇచ్చాం. ఇచ్చిన మాట ప్రకారం గడువులోగా పూర్తి చేసి ఈ ప్రాంతానికి గోదావరి జలాలను తీసుకొచ్చాం" అని ఆయన స్పష్టం చేశారు. ఈ రెండేళ్ల కాలంలోనే ఏలేరు, పంప, తాండవ, శారద, వరాహ వంటి ఐదు ప్రధాన నదులను, తొమ్మిది జాతీయ రహదారులను దాటుతూ కెనాల్ నిర్మాణంలో ఉన్న క్లిష్టమైన పనులను పూర్తి చేశామని తెలిపారు. కొమ్మరిలోవ వద్ద 100 మీటర్ల లోతైన కొండను తవ్వి కాలువను తీసుకురావడం తమ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని అన్నారు.ఈ సందర్భంగా గత వైసీపీ ప్రభుత్వంపై మంత్రి నిమ్మల తీవ్ర

ఉత్తరాంధ్ర ప్రజలు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న గోదావరి జలాల కల సాకారమైంది. పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా తొలిసారిగా గోదావరి నీటిని ఉత్తరాంధ్ర వైపు విడుదల చేశారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం పీఎల్ పురం వద్ద సీఎం చంద్రబాబు నాయుడు రెగ్యులేటర్ను ప్రారంభించి జలప్రవాహానికి శ్రీకారం చుట్టారు. అంతకుముందు కాలువ శిలాఫలకాన్ని ఆవిష్కరించిన ఆయన గోదావరికి జలహారతి ఇచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రూ.4,192 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ కాలువ ద్వారా ఏలేరు కాలువకు నీటిని అందించడంతో పాటు అనకాపల్లి జిల్లాలోని 110 చెరువులను నింపే ప్రణాళిక ఉంది. దీంతో సాగునీరు, తాగునీటి అవసరాలకు భరోసా లభించడంతో పాటు భూగర్భ జలాలు మెరుగుపడి ఈ ప్రాంత అభివృద్ధికి కొత్త ఊపు వచ్చే అవకాశం ఉంది. పోలవరం ఎడమ ప్రధాన కాలువ పోలవరం ప్రాంతం నుంచి ప్రారంభమై తూర్పు దిశగా విస్తరిస్తుంది. గోదావరి జలాలను కొండ ప్రాంతాల నుంచి మైదాన ప్రాంతాలకు తరలించేలా దీని మార్గాన్ని రూపొందించారు. ప్రారంభ ప్రాంతంలోనే కొండను తొలిచి సొరంగ మార్గం ఏర్పాటు చేయడం ఈ ప్రాజెక్టులో కీలకమైన ఇంజినీరింగ్ ప్రత్యేకత. సుమారు 914 మీటర్ల పొడవుతో నిర్మించిన సొరంగం ద్వారా గోదావరి జలాలు ముందుకు సాగుతాయి. ఆ తర్వాత వివిధ ప్రాంతాల గుండా ప్రవహిస్తూ కాకినాడ, అనకాపల్లి మీదుగా విశాఖ ప్రాంతానికి చేరేలా కాలువ వ్యవస్థను రూపొందించారు. ఈ మార్గంలో పుష్కర, పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. పోలవరం హెడ్వర్క్స్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చే వరకు ఎత్తిపోతల పథకాల ద్వారా నీటిని తరలించే విధానాన్ని అమలు చేస్తున్నారు. భవిష్యత్లో పోలవరం ప్రాజెక్టు పూర్తయిన తర్వాత గ్రావిటీ ద్వారా నీరు సహజ ప్రవాహంతోనే ముందుకు సాగేలా ప్రణాళిక రూపొందించారు. ప్రస్తుతం నిర్మించిన ప్రధాన కాలువతో పాటు తాగునీటి పంపిణీ వ్యవస్థలను కలుపుకొని సుమారు 213 కిలోమీటర్ల మేర జలమార్గాన్ని అభివృద్ధి చేశారు. పోలవరం ఎడమ కాలువ

జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 55వ జన్మదినం సందర్భంగా పార్టీ యువజన విభాగానికి అధికారిక రూపం లభించింది. కాకినాడ జిల్లా పిఠాపురంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో ‘జై కొట్టు’ పేరుతో జనసేన యువజన విభాగం లోగో, థీమ్ సాంగ్ను నాదెండ్ల మనోహర్ గ్రాండ్గా లాంచ్ చేశారు. జనసేన యువతను అత్యంత సంఘటితంగా రాజకీయంలోకి తీసుకురావడానికి ఈ విభాగం ఎంతో కీలకమని పార్టీ భావిస్తోంది. సినీ నేపథ్యం నుంచి వచ్చిన పవన్ కళ్యాణ్కు యువతలో ఉన్న బలమైన కనెక్షన్ను ఇప్పుడు సంస్థాగత రూపంలోకి మార్చేందుకు ఈ అడుగు పడింది. కేరళలో వైద్య చికిత్స పొందుతున్న కారణంగా ఈ ముఖ్యమైన కార్యక్రమానికి స్వయంగా హాజరుకాని పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ఒక ఆడియో సందేశాన్ని పంపారు. ఆ సందేశంలో ఆయన యువతకు రాజకీయ చైతన్యంతో పాటు బాధ్యతను గుర్తుచేస్తూ స్పష్టమైన పిలుపునిచ్చారు. ఇన్నాళ్లు కేవలం నాయకులు, రాజకీయ పార్టీల కోసం జిందాబాద్ కొట్టామని, ఇకపై యువత తమ భవిష్యత్తు కోసం, సమాజంలో మార్పు కోసం జై కొట్టాలని పవన్ కళ్యాణ్ ఉద్బోధించారు. దేహి అని ఇతరుల ముందుకు చేతులు చాపకుండా దేశం కోసం సేవ చేసే చేతులు కావాలని ఆయన తన ప్రసంగంలో ఆకాంక్షించారు. ఈ వేడుకల సందర్భంగా పిఠాపురం నుంచి చిత్రాడ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించగా, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని సందడి చేశారు. దీంతో పాటు రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ సమాంతరంగా కార్యక్రమాలు జరిగాయి. ఇదిలా ఉండగా, కొన్ని ప్రధాన కేంద్రాల్లో పవన్ కళ్యాణ్ ఆడియో సందేశాన్ని వినేందుకు ప్రత్యేకంగా లైవ్ ప్రసారాలు కూడా ఏర్పాటు చేశారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా తెలంగాణ సహా ఇతర పొరుగు రాష్ట్రాల్లో కూడా ఈ విధమైన కార్యక్రమాలు నిర్వహించేందుకు పార్టీ వర్గాలు భారీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. కార్యక్రమంలో నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ యువజన విభాగం ద్వారా

విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తున్న ఏఐ డేటా సెంటర్ ప్రాజెక్టులపై విపక్ష వైఎస్ఆర్సీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. డేటా సెంటర్ల నిర్మాణం వల్ల విశాఖ నగరం తీవ్ర నీటి, విద్యుత్ కొరతను ఎదుర్కొంటుందని సోషల్ మీడియా వేదికగా విపక్షాలు భయాలను రేకెత్తిస్తున్నాయని ఆయన మండిపడ్డారు. ఈ ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాకముందే నీటి కొరత వస్తుందనడం అసత్యమని సీఎం తేల్చి చెప్పారు. విశాఖను గ్లోబల్ టెక్ హబ్గా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంటే విపక్షం ఉద్దేశపూర్వకంగానే విషం కక్కుతోందని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ మరియు అనకాపల్లి ప్రాంతాల్లో గూగుల్, అదానీ, ఎయిర్టెల్ భాగస్వామ్యంతో 15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో 1 గిగావాట్ సామర్థ్యం గల ఏఐ డేటా సెంటర్ హబ్ నిర్మాణం వేగంగా సాగుతోంది. 2026 ఏప్రిల్ నెలలో గూగుల్ ప్రాజెక్టుకు శంకుస్థాపన జరగగా, కొన్ని నిర్దేశిత ప్రాంతాలలో ఇప్పటికే భూమి పనులు కూడా ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో మొత్తం 6.5 గిగావాట్ల సామర్థ్యంతో ప్రాజెక్టులు స్థాపించాలని లక్ష్యంగా పెట్టుకోగా, రిలయన్స్ సహా పలు దిగ్గజ సంస్థలు పెట్టుబడులతో ముందుకు వచ్చాయి. 2029-30 నాటికి 50 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ లక్ష్యాన్ని అందుకోవడానికి ప్రభుత్వం పక్కా ప్రణాళికతో అడుగులు వేస్తోంది. ఈ భారీ ప్రాజెక్టుల నిర్వహణకు సంవత్సరానికి 3 నుంచి 3.5 టీఎంసీల నీరు అవసరమని ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. దీంతో నగర తాగునీటి సరఫరాకు ఎలాంటి విఘాతం కలగకుండా పోలవరం పారిశ్రామిక కేటాయింపుల నుంచి ప్రత్యేక పైప్లైన్ల ద్వారా నీటిని అందిస్తామని స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా సాధారణ 1 గిగావాట్ థర్మల్ ప్లాంట్ దీనికంటే పది రెట్లు ఎక్కువ నీటిని వినియోగిస్తుందని ఐటీ మంత్రి నారా లోకేష్ అసెంబ్లీలో వివరించారు. మరోవైపు డేటా సెంటర్లకు నిరంతర విద్యుత్ సరఫరా కోసం ప్రత్యేక ట్రాన్స్మిషన్ లైన్లు ఏర్పాటు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజీ సినిమా ఎప్పటికీ ప్రత్యేకమైన చిత్రంగా నిలిచింది. దర్శకుడు సుజీత్ ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ను ప్రత్యేకమైన శైలిలో చూపించగా, ఈ సినిమా ఆయన కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఓజీ యూనివర్స్ను మరింత విస్తరించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా దర్శకుడు సుజీత్ విడుదల చేసిన ప్రత్యేక వీడియో ప్రస్తుతం అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. ఈ వీడియోలో దర్శకుడు సుజీత్, సంగీత దర్శకుడు తమన్తో కలిసి పవన్ కళ్యాణ్తో ఓజీ యూనివర్స్కు సంబంధించిన క్రియేటివ్ చర్చ జరుపుతున్నట్లు చూపించారు. ఓజీ సినిమాల భవిష్యత్తు ఎలా ఉండబోతుందనే అంశంపై ఈ ముగ్గురు చర్చించిన దృశ్యాలు వీడియోలో కనిపించాయి. ఓజీ సీక్వెల్కు సంబంధించిన ఆలోచనలపై తమన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓజీ సీక్వెల్ కథ భారతదేశంలో సాగుతుందని, అయితే ఆగ్నేయాసియా భావోద్వేగాలు, పాశ్చాత్య తరహా ప్రదర్శనతో ఈ చిత్రాన్ని రూపొందించే అవకాశం ఉందని తమన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కూడా ఓజీ యూనివర్స్పై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. సుభాష్ చంద్రబోస్ అంశాన్ని ఇందులో చేర్చితే కథకు ఎంతో అవకాశాలు ఉంటాయని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈ ఆలోచనకు సంబంధించిన అవకాశాలపై చర్చించిన అనంతరం మనం మన బెస్ట్ ఇవ్వాలని పవన్ కళ్యాణ్ చెప్పినట్లు వీడియోలో కనిపించింది. దీంతో ఓజీ యూనివర్స్లో భవిష్యత్తులో ఎలాంటి కథలు, పాత్రలు ఉండబోతున్నాయనే అంశంపై అభిమానుల్లో మరింత ఆసక్తి పెరిగింది. వీడియో చివర్లో రాబోయే ఓజీ సినిమాలకు సంబంధించిన కొన్ని యానిమేటెడ్ విజువల్స్ను కూడా చూపించారు. ముఖ్యంగా సమురాయ్ కోణానికి సంబంధించిన విజువల్స్ అభిమానులకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఓజీ యూనివర్స్లో సమురాయ్ అంశం కూడా భాగం కానుందనే సంకేతాలను ఈ విజువల్స్ ద్వారా ఇచ్చారు. మరోసారి పవర్ స్టార్పై తన అభిమానాన్ని తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ద్వారా ప్రదర్శించారు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖుల నుంచి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. పవర్ స్టార్, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (AP Deputy CM Pawan Kalyan) పుట్టినరోజు వేడుకల అదరహో అనే రేంజ్లో జరిగాయి. తెలుగునేలపైనే కాదు తెలుగువారున్న పలు ప్రాంతాల్లో పవన్ పుట్టినరోజు (HBDPawanKalyan)ను ఘనంగా జరుపుకున్నారు ఫ్యాన్స్. ఈ సందర్భంగా సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖుల నుంచి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు ఈ సారి మరింత ఘనంగా జరిగిందని చెప్పవచ్చు. ఊరూరా, వాడవాడలా పవన్ బర్త్ డే సెలబ్రేషన్స్ను ఫ్యాన్స్ ఉత్సాహంగా జరుపుకున్నారు. తెలుగునేలపైనే కాదు ప్రపంచంలోని నలుమూలల ఉన్న తెలుగువారిలో చాలామంది పవన్ పుట్టినరోజు వేడుకలు చేసుకోవడం విశేషం. పవన్కు దేశప్రధాని నరేంద్ర మోదీ, ఆయన అన్న మెగాస్టార్ చిరంజీవితో పాటు పవన్ భార్య అన్నా, ఆయన నిర్మాత బండ్ల గణేశ్ తదితరులు విషెస్ తెలిపారు. ఈ సందర్భంగా పలువురు పలు స్పెషల్ వీడియోస్ కూడా క్రియేట్ చేశారు. సురేశ్ ప్రొడక్షన్స్ సంస్థ పవన్ పై ఓ స్పెషల్ వీడియో రిలీజ్ చేయడం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. మరికొందరు సినీజనం కూడా పవన్ పుట్టినరోజున స్పెషల్ వీడియోస్ రిలీజ్ చేయడం విశేషం. ఇక పవన్ బర్త్ డే సెలబ్రేషన్స్లో సాయిధరమ్ పాల్గొని అభిమానులకు ఆనందం పంచారు... చిత్రసీమలోని పలువురు పవన్కు బర్త్ డే విషెస్ చెప్పారు. పవన్ కళ్యాణ్పై ‘ఓజీ’ నటి శ్రియా రెడ్డి ఎమోషనల్ పోస్ట్ 200 కోట్ల క్లబ్లోకి ‘ఇరుముడి’.. మణికంఠుడి పోస్టర్ వైరల్ ఈశ్వరా.. పవనేశ్వరా.. పవరేశ్వరా.. బండ్లన్న మళ్లీ స్టార్ట్ చేశాడ్రోయ్

ఏపీలో అన్ని నదులను అనుసంధానం చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చి తెలుగుతల్లి రుణం తీర్చుకుంటామని పేర్కొన్నారు. అనకాపల్లి జిల్లా, సెప్టెంబర్ 2 (ఆంధ్రజ్యోతి): ఏపీలో అన్ని నదులను అనుసంధానం చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) వ్యాఖ్యానించారు. ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చి తెలుగుతల్లి రుణం తీర్చుకుంటామని పేర్కొన్నారు. ఈరోజు (బుధవారం) ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను విడుదల చేసి సీఎం జలహారతి ఇచ్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రసంగించారు. ఉత్తరాంధ్రకు గోదారమ్మను తీసుకువచ్చామని తెలిపారు. నదులు, వాగులు, వంకలు దాటుకుని గోదారమ్మ వచ్చిందని ప్రస్తావించారు. వెలిగొండ ప్రాజెక్ట్ ద్వారా కృష్ణమ్మను తరలించి.. కరువు పీడిత మార్కాపురానికి నీళ్లిచ్చామని ఉద్ఘాటించారు. నల్లమల కొండలను చీల్చుకుని కృష్ణమ్మ వచ్చిందని అన్నారు. ఎన్నో సమస్యలను అధిగమించి గోదావరి జలాలు తీసుకువచ్చామని తెలిపారు. పోలవరం ఎడమ కాలువ కోసం రూ.4 వేల కోట్ల ఖర్చు చేశామని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాష్ట్రం సుభిక్షంగా మారేలా చేస్తామని తెలిపారు. ఈ జల విజయం.. ప్రజల విజయమని చెప్పుకొచ్చారు. ఆధునిక దేవాలయాలు.. సాగునీటి ప్రాజెక్టులు అని అభివర్ణించారు. నీరు ఉంటేనే భద్రత, భవిష్యత్తుపై ఓ భరోసా కల్పిస్తుందని తెలిపారు. నీరు ఉంటేనే పరిశ్రమలు.. తద్వారా ఉపాధి అవకాశాలు వస్తాయని వివరించారు. 2014లో తాము అధికారంలోకి వచ్చాక పోలవరంపై దృష్టిపెట్టామని అన్నారు. 2019 నాటికి 72 శాతం పోలవరం పనులు పూర్తిచేశామని స్పష్టం చేశారు. ప్రతి సోమవారం.. పోలవరాన్ని పర్యవేక్షించేలా మార్చామని వెల్లడించారు. 2019లో గొడ్డలి పార్టీ అధికారంలోకి వచ్చిందని.. పోలవరానికి శాపమైందని ఆవేదన వ్యక్తం చేశారు. గొడ్డలి పార్టీ నిర్లక్ష్యం వల్ల డయాఫ్రం వాల్ కొట్టుకుపోయిందని ధ్వజమెత్తారు. పోలవరం నిర్వాసితులకు గొడ్డలి పార్టీ పైసా కూడా ఇవ్వలేదని సీఎం చంద్రబాబు ఆగ్రహించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. పోలవరానికి శాపవిముక్త కలిగిందని వ్యాఖ్యానించారు. 2028 నాటికి

ఉత్తరాంధ్ర దశాబ్దాల కల సాకారమైంది. పోలవరం ప్రాజెక్టు ఎడమ ప్రధాన కాలువ ద్వారా గోదావరి జలాలు ఉత్తరాంధ్ర నేలను తాకాయి. ఈ చారిత్రక ఘట్టానికి అనకాపల్లి జిల్లా పాయకరావుపేట వేదికైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు గోదావరి జలాలకు జలహారతి ఇచ్చి, పవిత్ర జలాలను శిరస్సున చల్లుకున్నారు. అనంతరం నేలపై సాష్టాంగ ప్రమాణం ఆచరించి, ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంఛ నెరవేరిన క్షణాన తన కృతజ్ఞతను చాటుకున్నారు. ఓ దశలో కాలువ నుంచి నీరు ప్రవహిస్తుంటే, చంద్రబాబు మెడలోని పచ్చ కండువా తీసి గాల్లో గిరగిరా తిప్పి తన ఆనందం వ్యక్తం చేశారు. చంద్రబాబును చూసి మిగతా నేతలు, రైతులు కూడా తమ కండువాలను గాల్లో ఊపుతూ హర్షం వెలిబుచ్చారు.అంతకుముందు, నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు రెగ్యులేటర్ బటన్ నొక్కి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకంలోకి గోదావరి నీటిని విడుదల చేశారు. పాయకరావుపేట వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు వంగలపూడి అనిత, అచ్చెన్నాయుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, ఎంపీ సీఎం రమేశ్ తదితరులు హాజరయ్యారు.పోలవరం జలాల ప్రయాణం ఒక అద్భుతమైన ఇంజనీరింగ్ విన్యాసం. తూర్పు కనుమలను తొలిచి, ఏలేరు, పంపా, తాండవ, వరాహ, శారద వంటి నదులను దాటుకుంటూ ఈ కాలువను నిర్మించారు. కొన్ని చోట్ల నదుల ప్రవాహానికి ఎగువన అక్విడెక్టులు నిర్మించగా, ఏలేరు నది గర్భం కింద నుంచి సైఫన్ ద్వారా నీటిని తరలించడం ఈ ప్రాజెక్టు ప్రత్యేకత. ఈ కాలువను ఉత్తరాంధ్ర సుజల

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పవన్ కల్యాణ్(Pawan Kalyan) పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని సీఎం చంద్రబాబు(Chandrababu Naidu) ఆయనకు ప్రత్యేకంగా ఫోన్ చేసి శుభాకాంక్షలు అందజేశారు. పవన్ కల్యాణ్ సంపూర్ణ ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ప్రజాసేవలో ముందంజలో ఉండాలని ఆకాంక్షిస్తూ చంద్రబాబు తన సందేశాన్ని పంచుకున్నారు. ప్రస్తుతం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కేరళలో ఆయుర్వేద వైద్య చికిత్స చేయించుకుంటున్నారు. గత కొంతకాలంగా భుజం నొప్పితో బాధపడుతున్న పవన్ కల్యాణ్కు ఇటీవల ముంబైలోని ఒక ప్రముఖ ఆసుపత్రిలో భుజానికి శస్త్రచికిత్స (Surgery) జరిగింది. గత ఎన్నికల ప్రచార సమయం నుండి ఎడతెరిపి లేకుండా పర్యటనలు చేయడం వల్ల ఆయన భుజానికి తీవ్ర గాయమైంది. సర్జరీ అనంతరం వైద్యుల సూచనల మేరకు ఆయన కొద్దిరోజుల పాటు విశ్రాంతి తీసుకుంటున్నారు. ముంబైలో శస్త్రచికిత్స పూర్తి చేసుకున్న తర్వాత, పవన్ కల్యాణ్ తన తదుపరి కోలుకునే ప్రక్రియ మరియు ఫిట్నెస్ కోసం కేరళ ఆయుర్వేద చికిత్సను ఎంచుకున్నారు. పవన్ కల్యాణ్ బర్త్డే సందర్భంగా కేరళ నుంచే ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోన్ కాల్ను స్వీకరించి, ధన్యవాదాలు తెలిపారు. పవన్ కల్యాణ్ పుట్టినరోజు వేడుకలను రాష్ట్రవ్యాప్తంగా జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి నాయకులు, అభిమానులు భారీ ఎత్తున సేవా కార్యక్రమాలతో జరుపుకుంటున్నారు. అటు మంత్రి నారా లోకేష్ కూడా పవన్ కళ్యాణ్ కు ప్రత్యేకంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. దేవుడు ఇచ్చిన అన్నయ్య అంటూ తన సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ తో దిగిన ఫోటోను ఆయన షేర్ చేసారు

సూపర్ స్టార్ రజనీకాంత్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ జైలర్ 2 రిలీజ్ పై గత కొన్ని రోజులుగా రకరకాల ప్రచారాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సినిమా ప్రమోషన్స్ చాలా సైలెంట్ గా సాగుతుండటం, రీషూట్స్ జరుగుతున్నాయనే పుకార్లు రావడంతో పాటు దసరా రేసులో తెలుగు సినిమాలు కూడా పోటీ పడుతుండటంతో జైలర్ 2 వాయిదా పడుతుందని వార్తలు వచ్చాయి. ఈ రూమర్స్ పై చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది. సినిమా పోస్ట్పోన్ అవుతుందంటూ జరుగుతున్న అసత్య ప్రచారాలకు సన్ పిక్చర్స్ తమదైన శైలిలో ఫుల్ స్టాప్ పెట్టింది. చిత్ర యూనిట్ అఫిషియల్ గా కొత్త పోస్టర్ ను రిలీజ్ చేస్తూ, సినిమాను 2026 అక్టోబర్ 15నే గ్రాండ్ గా విడుదల చేస్తున్నట్లు స్పష్టం చేసింది. దీంతో సూపర్ స్టార్ అభిమానులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో మేకర్స్ విడుదల చేసిన లేటెస్ట్ పిక్చర్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతోంది. టైగర్ ముత్తువేల్ పాండియన్ లుక్ లో రజనీకాంత్ చేతిలో తుపాకీ పట్టుకుని చాలా మాస్ గా కనిపిస్తున్నారు. ఈ పోస్టర్ పై మొదటి భాగంలోని సూపర్ హిట్ డైలాగ్ 'అలప్పారై సెలబ్రేషన్స్' లైన్ తో పాటు అక్టోబర్ 15 రిలీజ్ డేట్ ను స్పష్టంగా మెన్షన్ చేశారు. ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ను నెల్సన్ దిలీప్కుమార్ డైరెక్ట్ చేస్తుండగా, రాక్స్టార్ అనిరుధ్ రవిచందర్ అదిరిపోయే మ్యూజిక్ అందిస్తున్నారు. భారీ బడ్జెట్ తో సన్ పిక్చర్స్ బ్యానర్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. మొదటి భాగాన్ని మించేలా పార్ట్ 2 ను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం అందుతోంది. ఇదిలా ఉండగా ఈ సినిమాలో భారీ తారాగణం నటిస్తోంది. రజనీకాంత్ సరసన రమ్యకృష్ణ, యోగి బాబు, మిర్నా నటిస్తుండగా, శివ రాజ్కుమార్, మోహన్లాల్, ఎస్. జె. సూర్య కీలక పాత్రల్లో

ఏపీలో రెండున్నరేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ తనదైన శైలిలో పాలన సాగిస్తోంది. సీఎం చంద్రబాబు కూడా గతానికి భిన్నంగా దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్తున్నారు. కేబినెట్లో మంత్రులు కూడా తనతో పోటీ పడాలని ఆయన పదే పదే చెప్తుంటారు. అయితే ఆయన కేబినెట్లో తనతో పాటు కుమారుడు లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాత్రమే ఎక్కువగా ఫోకస్ అవుతుంటారు. మిగతా మంత్రుల పాత్ర నామమాత్రమే అన్న విమర్శలు వినిపిస్తుంటాయి. ఇదే విషయం తాజాగా మరోసారి రుజువైంది.పోలవరం లోపాల పుట్ట- హైకోర్టు ముందు స్వయంగా వాదించబోతున్న మాజీ ఐపీఎస్ ..!పోలవరం కుడి కాలువ ద్వారా ఉత్తరాంధ్రకు నీళ్లు విడుదల చేసే కార్యక్రమాన్ని ఇవాళ సీఎం చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమం సందర్భంగా ప్రధాన పత్రికల్లో ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో సీఎం చంద్రబాబుతో పాటు ప్రధాని మోడీ, మంత్రి నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫొటోలు మాత్రమే ఉన్నాయి. సాగునీటిపారుదల ప్రాజెక్టు ప్రారంభోత్సవం అయినా ఆ శాఖను చూస్తున్న జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు ఫొటో మాత్రం లేదు. దీనిపై చంద్రబాబు మాజీ ఇంటెలిజెన్స్ ఛీఫ్, మాజీ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు (AB Venkateswara Rao) వ్యంగాస్త్రాలు సంధించారు. Bhogapuram Airport: భోగాపురం క్రెడిట్ వారిదే ? ఆధారాలతో తేల్చేసిన మాజీ ఇంటెల్ ఛీఫ్ ..!ముఖ్యమంత్రి గారూ,.. మీరు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు తప్పించి కాబినెట్ లోని మంత్రులందరూ నామమాత్రులే అనేది లోక విదితం అంటూ ఏబీ వెంకటేశ్వరావు ఇవాళ ట్వీట్ చేశారు. అయినా ఏదో సంప్రదాయాలంటూ ఉంటాయి కదా!

భువనగిరి అర్బన్, సెప్టెంబర్ 02 : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 1,000 రోజుల్లో చేసింది ఏమీ లేదని, మిగిలిన 750 రోజుల్లో ఏం చేస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని ఆయన అన్నారు. బుధవారం భువనగిరిలోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వెస్ట్ బెంగాల్ తీరుగా తయారు చేస్తుందని మండిపడ్డారు. కాంగ్రెసోళ్లు రాష్ట్ర వ్యాప్తంగా బిజెపి నాయకులపై, పార్టీ కార్యాలయాలపై దాడులు చేస్తూ రాష్ట్రాన్ని అల్లకల్లోలంగా మారుస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెసోళ్లు బిజెపి నాయకులపై దాడి చేయాలనే కార్యక్రమాలు పెట్టుకున్నారని, ఇటీవల నల్లగొండ జిల్లా అధ్యక్షుడి ఇంటిలోకి వెళ్లి అధ్యక్షుడి తల్లిని భయభ్రాంతులకు గురి చేశారన్నారు. పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పక్కన పెట్టి ప్రజలు బిజెపిని అధికారంలోకి తెచ్చారని, తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయన్నారు. దళితులు ఆరాధ్య దైవంగా భావించే సంత్ రవిదాస్ ఫొటోపై కూడా నల్లరంగు పోశారని ఆరోపించారు. రాష్ట్రంలో బీజేపీపై దాడులు అధికమవుతున్నాయని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో బ్రదర్స్ అండ్ కంపెనీ పాలన నడుస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, బీజేపీ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు ఉట్కూరి అశోక్, పార్టీ నాయకులు పాల్గొన్నారు

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉనికి కోసం గొడ్డలి పార్టీ ఆరాట పడుతోందని విమర్శించారు. కర్నూలు, సెప్టెంబర్ 2 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (YS Jagan Mohan Reddy) ఏపీ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి (AP Minister BC Janardhan Reddy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉనికి కోసం గొడ్డలి పార్టీ ఆరాట పడుతోందని విమర్శించారు. వైసీపీ ఏ రోజు ప్రజల సమస్యలపై ఎందుకు స్పందించ లేదని ప్రశ్నించారు. ఈరోజు (బుధవారం) కర్నూలు జిల్లాల్లో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పర్యటించి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఎల్నినో ప్రభావం ఉన్నప్పటికీ సీఎం చంద్రబాబు ముందస్తు ఆలోచనతో ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా చూస్తున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు దూరదృష్టితో పట్టిసీమను పూర్తి చేసి ఆదుకున్నారు.. జగన్ హయాంలోని ఐదేళ్లలో ప్రజా సంక్షేమం కోసం ఏమి చేశారో చెప్పే దమ్ము ఉందా అని బీసీ జనార్దన్ రెడ్డి నిలదీశారు. సీఎం చంద్రబాబు దూరదృష్టితో పట్టిసీమను పూర్తి చేసి ఆదుకున్నారని తెలిపారు. పులివెందులకు కూడా నీరు ఇచ్చిన ఘనత చంద్రబాబుదని చెప్పుకొచ్చారు. 36 నీటి ప్రాధాన్య ప్రాజెక్టులకు నీరు ఇస్తున్నామని వెల్లడించారు. ఏపీలో డ్రిప్ ఇరిగేషన్ లేకుండా చేసింది జగన్ మోహన్ రెడ్డినే అని విమర్శించారు. వైసీపీ దొంగ దీక్షలు, ధర్నాలు చేస్తే ప్రజలు నమ్మరు.. వైసీపీ నేతలు దొంగ దీక్షలు, ధర్నాలు చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని మంత్రి అన్నారు. ప్రజలకు, రైతులకు ఏ విధంగా నీరు ఇవ్వాలో అధికారులతో తాము సమీక్షలు చేస్తున్నామని తెలిపారు. తలకిందులు చేసిన కూడా గొడ్డలి పార్టీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదన్నారు. కేసీ కెనాల్కు నీరు ఎప్పుడు విడుదల

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సెప్టెంబర్ 2వ తేదీన తన 55వ జన్మదినాన్ని ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ ప్రత్యేకమైన సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పవన్ కల్యాణ్కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కేవలం రాష్ట్ర నాయకులే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న పలువురు ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షల సందేశాలు పంపించారు. సినిమా రంగంలో పవర్ స్టార్గా కోట్ల మంది అభిమానుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న పవన్ కల్యాణ్, ఆ తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టి ప్రజాసేవలో బిజీగా మారారు. జనసేన పార్టీని స్థాపించి ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూ, ఇటీవల జరిగిన ఎన్నికల్లో అద్భుత విజయం సాధించి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ క్రమంలోనే ఆయన తన 55వ పుట్టినరోజు వేడుకలను జరుపుకోవడం ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. సీఎం చంద్రబాబు తన పోస్టులో పవన్ కల్యాణ్ను ప్రియ మిత్రుడిగా సంబోధిస్తూ ఆయన సేవా నిరతిని కొనియాడారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్ కల్యాణ్ రోడ్ల నిర్మాణం, పచ్చదనం పెంపొందించడం మరియు గిరిజన ప్రాంతాల అభివృద్ధికి అనేక సంస్కరణలు చేపట్టారని కొనియాడారు. దీంతో రాష్ట్ర పునర్నిర్మాణ హామీలను నెరవేర్చేందుకు పవన్ నిరంతరం శ్రమిస్తున్నారని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా ఆయన ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు సంతోషంగా వర్ధిల్లాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. మంత్రి నారా లోకేశ్ కూడా పవన్ కల్యాణ్పై తనకున్న అభిమానాన్ని ప్రత్యేక పోస్ట్ ద్వారా చాటుకున్నారు. పవన్ కల్యాణ్ను దేవుడిచ్చిన అన్నయ్యగా అభివర్ణించిన లోకేశ్, సినీ అభిమానులకు ఆయన పవర్ స్టార్ అయితే జనసైనికులకు మార్గదర్శకుడైన సేనాని అని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో పవన్ జన్మదిన వేడుకలు ఒక పండగ వాతావరణాన్ని తలపిస్తున్నాయని చెప్పారు. ఫలితంగా అభిమానులు, నాయకులు భారీ ఎత్తున సేవా

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్సైట్కు సంబంధించిన వీడియో కంటెంట్పై కూడా అవగాహన ఉంది.. Chanakya Niti Rules: మన జీవితంలో కొన్నిసార్లు బయట వ్యక్తుల కంటే.. మనకు అత్యంత సన్నిహితంగా ఉండే సొంత మనుషులే ఎక్కువ బాధ పెడుతూ ఉంటారు.. మన ఎదుగుదలను చూసి ఓర్వలేక అసూయతో రగిలిపోయే బంధువులతో పాటు మిత్రులు మన చుట్టూనే ఉండిపోతూ ఉంటారు.. వాళ్లు మనపై కుట్రలు పన్నుతున్నారని తెలిసినప్పుడు చాలామంది ఆవేశంతో తప్పులు చేస్తూ ఉంటారు. అయితే ఇలాంటి విపత్కర పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో వేల ఏల క్రితమే ఆచార్య చానక్యుడు తన చాణక్య నీతి శాస్త్రంలో స్పష్టంగా వివరించారు. సన్నిహితులు ద్రోహానికి పాల్పడినప్పుడు ఆవేశంతో నిర్ణయాలు తీసుకోకుండా.. చాణక్యుడు సూచించిన ఐదు పద్ధతులను పాటిస్తే మిమ్మల్ని మీరు సులభంగా కాపాడుకోవచ్చు.. ప్రశాంతంగా ఉండాల్సి ఉంటుంది.. మీరు అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తులు మీకు ద్రోహం చేస్తున్నారని.. లేదా మీపై కుట్రలు చేస్తున్నారని తెలిసినప్పుడు వెంటనే ఆవేశపడకుండా ఉండడం చాలా మంచిది.. కోపంతో రగిలిపోతూ అప్పటికప్పుడు స్పందించడం వల్ల పరిస్థితి మరింత దిగజారిపోయే అవకాశాలు ఉంటాయని చాణక్యనీతి శాస్త్రం చెబుతోంది.. మీరు తీసుకునే తొందరపాటు నిర్ణయాల వల్ల మీకే నష్టం కలగవచ్చు.. కాబట్టి ఆ సమయంలో ఎంత ప్రశాంతంగా ఉంటే అంత మంచిదని.. ముఖ్యంగా మౌనంగా ఉండి పరిస్థితులను అంచనా వేయడం చాలా మంచిదని చాణక్యనీతి శాస్త్రం క్లియర్ గా చెబుతోంది.. మీ సీక్రెట్స్ ఎవరితో పంచుకోకూడదు.. కుటుంబంలో నమ్మకం చాలా ముఖ్యమైనదిగా భావించవచ్చు.. కానీ అందరితో అన్నీ పంచుకోవడం తెలివైన పని కాదని చాణక్యనీతి శాస్త్రం చెబుతోంది

ప్రపంచ ఆర్థిక సవాళ్ల నడుమ భారత ఆర్థిక వ్యవస్థ 7.8% జీడీపీ (GDP)వృద్ధితో దూసుకుపోతోందన్న వార్తలు దేశవ్యాప్తంగా గొప్ప ఆశాభావాన్ని నింపాయి.అయితే,పైకి అత్యంత ఆకర్షణీయంగా కనిపిస్తున్న ఈ గణాంకాల వెనుక ఉన్న అసలు ఆర్థిక చిత్రాన్ని లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉందంటున్నారు కేంద్ర మాజీ ఆర్థిక కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్.కేవలం హెడ్లైన్ సంఖ్యలను చూసి సంబరపడకుండా,గణాంకాల వెనుక ఉన్న వాస్తవాలను దేశ ప్రజల ముందుకు తీసుకొచ్చారు.బేస్ ఇయర్ సవరణల మాయాజాలం:గార్గ్ విశ్లేషణ ప్రకారం,గత ఏడాది జీడీపీ అంచనాలను సవరించి 6.9%కి గణనీయంగా తగ్గించారు.ముఖ్యంగా ప్రస్తుత ధరల వద్ద గతేడాది తొలి త్రైమాసికం (Q1) జీడీపీ రూ.86 ట్రిలియన్లుగా అంచనా వేయగా,దానిని సవరించి రూ.80 ట్రిలియన్లకు కుదించారు.ఈ విధంగా గత ఏడాది ఆధారిత సంఖ్య తగ్గడం వల్ల,ఈ ఏడాది వృద్ధి రేటు గణాంకాలు స్వయంచాలకంగా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయని ఆయన తెలిపారు.ఈ స్థాయిలో భారీ సవరణ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందో ఆయన బహిరంగంగానే ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.తయారీ రంగం మందగమనం - వినియోగంలో క్షీణత:ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం,గనుల రంగాలు మెరుగ్గా రాణించినప్పటికీ,ప్రభుత్వ మునుపటి డేటాతో పోలిస్తే తయారీ రంగం బలహీనంగా ఉందన్నారు.ప్రభుత్వం చేస్తున్న మూలధన వ్యయం నిజమైనదేనని,అది 15% పైగా పెరిగిందని అంగీకరించినప్పటికీ..ఆయన ప్రధాన ఆందోళన మాత్రం సాధారణ ప్రజల వినియోగంపైనే ఉంది.ప్రభుత్వ పాత అంచనాలతో పోల్చి చూస్తే ప్రస్తుత వినియోగ వృద్ధి ప్రతికూలంగా ఉండే అవకాశం ఉందని హెచ్చరించారు.నో డబుల్ స్టాండర్డ్స్: ప్రధాని మోదీ ఇన్ డైరెక్ట్ వార్నింగ్- పాకిస్తాన్ పీఎం ఎదురుగానేఆర్థిక వ్యవస్థ అసలైన బలానికి సాధారణ ప్రజల కొనుగోలు శక్తే ప్రాతిపదిక.కేవలం కాగితాలపై అంకెలను అందంగా చూపిస్తూ లోపలి బలహీనతలను దాచిపెట్టడం వల్ల నష్టం జరుగుతుంది.ఇప్పటికైనా పాలకులు హెడ్లైన్ నంబర్లపై మాత్రమే దృష్టి పెట్టకుండా,గ్రౌండ్ లెవెల్లో వినియోగం తగ్గడానికి గల కారణాలను గుర్తించాలి.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇటీవలే 1,000 రోజుల పాలనను పూర్తి చేసుకుంది. ప్రజాప్రభుత్వం పాలనలో సమూల మార్పులు తీసుకువచ్చామని, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చామని, సామాజిక న్యాయానికి ప్రాధాన్యత ఇచ్చామని ప్రభుత్వం చెబుతోంది. రైతులు, మహిళలు, యువత కోసం అనేక రకాల సంక్షేమ పథకాలను అమలు చేస్తోన్నట్లు చెప్పుకొచ్చింది. తెలంగాణ చరిత్రలో ఓ నూతన అధ్యాయాన్ని లిఖించామని స్పష్టం చేస్తోంది.దీనికి భిన్నంగా స్పందిస్తోంది.. బీజేపీ రాష్ట్రశాఖ. రేవంత్ రెడ్డి 1,000 రోజుల పాలన మొత్తం దోపిడీపూరకమంటూ ఆరోపణలు గుప్పిస్తోంది. అధికార పార్టీ నాయకులు వందల కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడ్డారని విమర్శిస్తోంది. గతంలో ఎప్పుడూ లేనంతగా అవినీతి, అక్రమాలు చోటు చేసుకున్నాయని ధ్వజమెత్తుతోంది. దీనిపై నిరసన కార్యక్రమాలను చేపట్టింది కూడా. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నాలకు తెర తీసింది.ఈ క్రమంలో.. నగరం అంతటా బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన పోస్టర్లను అతికించాయి. హైదరాబాద్ వ్యాప్తంగా అత్యంత రద్దీగా ఉండే దాదాపు 500కు పైగా ప్రాంతాలలో ఈ పోస్టర్లు కనిపించాయి. కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు, గాంధీ భవన్ పరిసరాల్లో ఈ పోస్టర్లను అంటించారు బీజేపీ నాయకులు. అసెంబ్లీ, రవీంద్ర భారతి, లక్డీకాపుల్ బస్ స్టాప్, ముఖ్యమంత్రి అధికారిక నివాసం వెలుపల పోస్టర్లు రాత్రికి రాత్రే వెలిశాయి.సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు అరుదైన ఘనత..: దేశంలోనేపలు ప్రధాన రహదారులు, జంక్షన్లు, రద్దీగా ఉండే బస్ స్టాండ్లు, మెట్రో రైలు పిల్లర్ల వద్ద కూడా స్థానిక బీజేపీ శ్రేణులు ఈ నిరసన పోస్టర్లను ప్రదర్శించాయి. దీంతో హైదరాబాద్ లో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. రెండు పార్టీల మధ్య ఘర్షణపూరిత వాతావరణానికి దారితీసింది. కాంగ్రెస్ ఇచ్చిన కీలక గ్యారెంటీల అమలుపై నిరసన తెలపడమే తమ ప్రధాన లక్ష్యమని బీజేపీ నాయకులు స్పష్టం చేస్తోన్నారు.ప్రజల పక్షాన ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడతామని బీజేపీ స్పష్టం చేసింది. ఈ

ఏసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం సిఎం చంద్రబాబు కీలక ప్రకటన తగ్గనున్న సాధారణ బస్సుల రద్దీ Stree Shakthi Scheme: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల సంక్షేమానికి మరో కీలక నిర్ణయం తీసుకుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 'స్త్రీశక్తి(Stree Shakthi Scheme)' పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించిన విషయం తెలిసిందే. అయితే, ప్రస్తుతం కేవలం పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్ వంటి ఐదు కేటగిరీల బస్సులకే ఇది పరిమితం కావడంతో విపరీతమైన రద్దీ పెరుగుతోంది. ఈ సమస్యకు పరిష్కారంగా, మహిళలకు మరింత సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు త్వరలోనే ఏసీ బస్సుల్లో కూడా ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారికంగా ప్రకటించారు. Hitech City Railway Station: పండుగ రద్దీకి పక్కా ప్లాన్.. హైటెక్ సిటీలో రైళ్ల నిలుపుదల పొడగింపు.. పూర్తి వివరాలు మీకోసం! మోగల్తూరు సభలో ప్రకటన.. రద్దీ నియంత్రణకు ముందడుగు: మోగల్తూరులో నిర్వహించిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు ఈ తీపి కబురు అందించారు. రాష్ట్రంలో త్వరలోనే భారీ సంఖ్యలో కొత్త ఏసీ బస్సులను ప్రవేశపెట్టనున్నామని, వాటిలో మహిళలకు స్త్రీశక్తి పథకం వర్తింపజేస్తామని స్పష్టం చేశారు. సాధారణ బస్సులపై ఒత్తిడి తగ్గించడంతో పాటు, వేసవిలో కూడా మహిళలు హాయిగా ప్రయాణించేలా ఆర్టీసీ అధికారులు ఈ దిశగా కసరత్తు చేస్తున్నారు. చంద్రబాబు స్పష్టమైన హామీ ఇవ్వడంతో త్వరలోనే ఇది అమల్లోకి రానుంది. 'దివ్యాంగశక్తి' సేవలు విస్తరణపై ఆసక్తి.. పెరగనున్న సౌకర్యాలు: ఇప్పటికే రాష్ట్రంలో 'దివ్యాంగశక్తి' పథకం ద్వారా 40 శాతానికి పైగా అంగవైకల్యం ఉన్న వారికి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని, వారి సహాయకులకు 50 శాతం రాయితీని ప్రభుత్వం అందిస్తోంది. అయితే, ఏసీ బస్సుల్లో కూడా దివ్యాంగులకు ఉచిత ప్రయాణం వర్తిస్తుందా లేదా అన్నదానిపై త్వరలో స్పష్టత రానుంది. ఏదేమైనా, ఏసీ బస్సుల్లోనూ స్త్రీశక్తి పథకాన్ని వర్తింపజేయాలన్న నిర్ణయం పట్ల

పోలవరం జిల్లాలోని గొల్లగుప్ప గ్రామంలో మలేరియా నివారణ మందుల (క్లోరోక్విన్) వికటన ఘటన తీవ్ర కలకలం రేపింది. సంఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెంటనే స్పందించి ఉన్నతాధికారులతో వేర్వేరుగా అత్యవసర సమీక్ష నిర్వహించారు. మందులు వికటించి ఒక బాలిక మృతి చెందిందనే సమాచారం అందుకోవడంతో సీఎం చంద్రబాబు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడి పరిస్థితులను స్వయంగా సమీక్షించారు. బాధితులకు తక్షణమే అత్యుత్తమ వైద్యం అందించాలని, ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని సీఎంతో పాటు మంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.గ్రామంలో మొత్తం 71 మందికి మలేరియా నివారణ మందులు పంపిణీ చేయగా, వాటి ప్రభావంతో పలువురు అస్వస్థతకు గురయ్యారు. విషయం తెలిసిన వెంటనే అధికారులు అప్రమత్తమై గ్రామంలో అత్యవసర మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. అస్వస్థతకు గురైన వారిలో 47 మంది చిన్నారులతో సహా మొత్తం 52 మందికి తెలంగాణలోని భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. మరో 24 మందికి స్థానిక లక్ష్మీపురం పీహెచ్సీలో వైద్య సేవలు అందిస్తున్నారు. పొరుగు రాష్ట్రంలో ఉన్న భద్రాచలం ఆసుపత్రికి చింతూరు ఐటీడీఏ పీవో, ఏఎస్పీ సహా ఇతర అధికారులు స్వయంగా వెళ్లి బాధితుల ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. డయేరియా పంజా: ముగ్గురు మృతి, 76 మందికి అస్వస్థతఅసత్య ప్రచారాలు నమ్మొద్దు!భద్రాచలం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 52 మందికి మలేరియా ఆర్డీటీ పరీక్షలు నిర్వహించగా, వారిలో ఆరుగురికి మలేరియా పాజిటివ్గా తేలిందని వైద్యులు వెల్లడించారు. పాజిటివ్ వచ్చిన వారందరికీ తగిన యాంటీ మలేరియా చికిత్సను ప్రారంభించినట్లు మంత్రి సత్యకుమార్కు అధికారులు నివేదించారు. ముందు జాగ్రత్త చర్యగానే బాధితులందరినీ మెరుగైన వైద్యం కోసం దగ్గర్లోని ఏరియా ఆసుపత్రికి తరలించామని, ప్రస్తుతం వారందరి ఆరోగ్య పరిస్థితి పూర్తి నిలకడగా ఉందని స్పష్టం చేశారు. ఈ ఘటనలో ఇద్దరు చనిపోయారంటూ వస్తున్న

పోలవరం జిల్లా, ఏటపాక మండలం గొల్లగుప్ప గ్రామంలో క్లోరోక్విన్ మాత్రలు వేసుకున్న అనంతరం ఏడేళ్ల బాలిక మృతి చెందడం, పలువురు అస్వస్థతకు గురికావడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనపై తక్షణమే సమగ్ర విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు. బాధితులందరికీ అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని ఆయన స్పష్టం చేశారు.ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్తో ముఖ్యమంత్రి ఈ ఘటనపై సమీక్ష నిర్వహించారు. మలేరియా రాకుండా ముందస్తు చర్యల్లో భాగంగా గ్రామంలోని 71 మందికి క్లోరోక్విన్ మాత్రలు పంపిణీ చేయగా, వాటిని తీసుకున్న తర్వాత పలువురు అనారోగ్యం పాలయ్యారు. ఈ దురదృష్టకర ఘటనలో జమున అనే ఏడేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది.ప్రభుత్వ ఆదేశాలతో అధికార యంత్రాంగం తక్షణమే సహాయక చర్యలు చేపట్టింది. అస్వస్థతకు గురైన వారిలో 29 మందిని భద్రాచలం ఏరియా ఆసుపత్రికి, మరో 24 మందిని లక్ష్మీపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గ్రామంలో అత్యవసర వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి తొమ్మిది మంది సభ్యులతో కూడిన ప్రత్యేక వైద్య బృందం ఇప్పటికే గ్రామానికి చేరుకోగా, విజయవాడ, రాజమండ్రి నుంచి మరిన్ని బృందాలు బయలుదేరాయి.ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు మరణించారంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని, కేవలం ఒక బాలిక మాత్రమే మృతి చెందిందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి ఆరోగ్యం నిలకడగా ఉందని, జిల్లా యంత్రాంగం పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తోందని వారు వెల్లడించారు

వేగంగా ఓల్డ్సిటీ మెట్రో కారిడార్ పనులు మొత్తం 888 ఆస్తుల్లో ఇప్పటి వరకు 833 సేకరణ ఈ నెలాఖరులోగా పూర్తి చేసేందుకు చర్యలు మరోవైపు ముమ్మరంగా కూల్చివేతలు హైదరాబాద్ సిటీ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మెట్రో రెండో దశ విస్తరణలోని ఓల్డ్సిటీ కారిడార్ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. నిర్మాణంలో భాగంగా కావాల్సిన భూసేకరణ ప్రక్రియ చివరి దశకు చేరింది. మరో 55 ప్రభావిత ఆస్తులను తీసుకుంటే కారిడార్ నిర్మాణానికి అడుగులు పడినట్లవుతుందని హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్ఎంఆర్ఎల్) అధికారులు చెబుతున్నారు. నగరంలో రెండో దశ మెట్రో విస్తరణలో భాగంగా కారిడార్-6 కింద ఎంజీబీఎస్ - చాంద్రాయణగుట్ట వరకు (7.5 కిలోమీటర్లు) నిర్మాణాన్ని చేపడుతున్న విషయం తెలిసిందే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జాయింట్ వెంచర్ (జేవీ) ప్రాతిపదికన రూ.2,741 కోట్లతో నిర్మాణాన్ని పూర్తి చేయనున్నాయి. అయితే నాగోల్ - శంషాబాద్ ఎయిర్పోర్టు (36.8 కిలోమీటర్ల) మార్గం తర్వాత పాతనగరం కారిడార్పైనే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ‘ఇది ఓల్డ్సిటీ కాదు.. ఒరిజినల్ సిటీ’ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పలు సభల్లో చెబుతూ వస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం రెండో దశ ప్రాజెక్టుకు సంబంధించిన డిటైల్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్)కు అనుమతి ఇచ్చిన వెంటనే ఈ మార్గంలోని పనులను ప్రారంభించేందుకు ఎదురుచూస్తోంది. ఇదిలా ఉండగా, ఫలక్నుమా ఆర్టీసీ ప్రాంగణంలో 2024 మార్చి 8న శంకుస్థాపన చేశారు. పరిహారం.. వెంటనే తొలగింపు ఇప్పటివరకు సేకరించిన ఆస్తుల్లో 60 శాతం కమర్షియల్ భవనాలు, 40 శాతం నివాస గృహాలున్నాయి. అయితే సేకరించిన ఆస్తులకు సంబంధించిన యజమానులకు పరిహారం అందిస్తున్న అధికారులు వెంటవెంటనే తొలగింపు పనులు చేపడుతున్నారు. ఆయా దారుల్లో వాహనదారుల రాకపోకలకు ఇబ్బందులు కలుగకుండా చూస్తూ పొక్లెయినర్లతో తొలగిస్తూ శిథిలాలను దూర ప్రాంతాలకు తరలిస్తున్నారు. మరోవైపు విద్యుత్ స్తంభాలు, వాటర్పైపులకు ప్రమాదం వాటిల్లకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కాగా, తొలగింపు పనులను వివిధ శాఖల అధికారులు దగ్గరుండి

సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. AP JAC Amaravati Protest: తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉద్యోగులు తమ డిమాండ్ల సాధన కోసం, తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళనలను తీవ్రం చేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ ఉద్యమం చేపట్టగా.. ఇటు ఆంధ్రప్రదేశ్లోనూ ప్రభుత్వ ఉద్యోగులు భారీ నిరసనలకు దిగారు. న్యాయమైన సమస్యలు, పెండింగ్ బకాయిల పరిష్కారం కోసం ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు మొదటి దశ ఉద్యమ కార్యాచరణకు నేటి నుంచి శ్రీకారం చుట్టారు. తమ నిరసనలో భాగంగా మంగళవారం నల్ల బ్యాడ్జీలతో ఉద్యోగుల ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. చంద్రబాబు సార్... తమ డబ్బులు తమకు ఇవ్వండి అనే నినాదంతో ఉద్యమాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలోని గ్రామ సచివాలయాలు దగ్గర నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో, అన్ని తహసీల్దార్ కార్యాలయాలు, మున్సిపల్ కార్యాలయాలు, వెటర్నరీ డిపార్ట్మెంట్ ఉద్యోగులు, అన్ని ఆర్టీసీ డిపోల్లో, వివిధ కార్యాలయాల ఉద్యోగులు, డివిజన్ స్థాయిలో ఆర్డీఓ కార్యాలయాల ఉద్యోగులు, మున్సిపాలిటీ ఉద్యోగులు, కార్మిక శాఖ, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ ఉద్యోగులు, జిల్లా స్థాయిలోని అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ఉద్యోగులు, జిల్లా స్థాయి వివిధ శాఖల కార్యాలయాల ఉద్యోగులు అందరూ నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. వేలాది మంది ఉద్యోగులు తమ సెల్ఫోన్లలో "సీఎం సార్ మా డబ్బులు మాకు ఇవ్వండి" అని కామన్ డీపీగా పెట్టుకుని నిరసన తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు తమ ఉద్యమంలో భాగంగా సెప్టెంబర్ 1 నుంచి 5వ తేదీ వరకు ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతూ నిరసనలు చెబుతున్నారు. ఉద్యోగులందరూ తమ వాట్సాప్ డీపీగా ,స్టేటస్లుగా “సీఎం సార్... మా

చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన ప్రాధాన్యం గురించి మనకు తెలిసిందే. అయినా సరే- కొంతమంది ఈ విషయంలో అశ్రద్ధ చేస్తుంటారు. బయటి నుంచి వచ్చాక, ఆహారం తీసుకునే ముందు.. ఏదో అలా పైపైన చేతులు కడుక్కుంటారు. చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన ప్రాధాన్యం గురించి మనకు తెలిసిందే. అయినా సరే- కొంతమంది ఈ విషయంలో అశ్రద్ధ చేస్తుంటారు. బయటి నుంచి వచ్చాక, ఆహారం తీసుకునే ముందు.. ఏదో అలా పైపైన చేతులు కడుక్కుంటారు. ఫలితంగా చేతులకు అంటుకున్న క్రిములు, బ్యాక్టీరియా తీసుకునే ఆహారం ద్వారా శరీరంలోకి చేరతాయి. సమస్త ఆరోగ్య సమస్యలకు ఇక్కడే బీజం పడుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో చేతుల శుభ్రత విషయంలో ఏమాత్రం అజాగ్రత్త పనికి రాదని సూచిస్తున్నారు. ⚛ చేతులు శుభ్రం చేసుకోకపోతే చేతిపై ఉన్న వ్యాధికారక క్రిములన్నీ మనం తీసుకునే ఆహారం ద్వారా శరీరంలోకి వెడతాయి. ఇక అపరిశుభ్ర చేతులతో ఇతరులను తాకితే వారి చేతులకు కూడా ఆ క్రిములన్నీ అంటుకుంటాయి. ⚛ చేతులు పరిశుభ్రంగా లేకపోవడం వల్ల డయేరియా, హెపటైటిస్, జలుబు.. వంటి వివిధ రకాల అనారోగ్యాలు తలెత్తే అవకాశాలు ఎక్కువ. ఒక టాయిలెడ్ కమోడ్ పైనే లక్షల సంఖ్యలో క్రిములు దాగి ఉంటాయని పరిశోధనలు చెబుతున్నాయి. కాబట్టి తరచూ చేతులు శుభ్రం చేసుకోవడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకూడదు అంటున్నారు నిపుణులు. ⚛ చేతులు అపరిశుభ్రంగా ఉండడం వల్ల కంటి సంబంధిత సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. కాబట్టి సబ్బు, హ్యాండ్వాష్, శానిటైజర్తో కనీసం 20 సెకన్ల పాటు చేతులు శుభ్రం చేసుకుంటే వివిధ అనారోగ్యాలకు దూరంగా ఉండచ్చని సూచిస్తున్నారు. ఈ క్రమంలో ప్రత్యేకించి పిల్లలకు కూడా చేతులు చక్కగా శుభ్రం చేసుకునేలా చిన్నప్పటి నుంచే శిక్షణ ఇవ్వాలి అని చెబుతున్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి

నగరంలోని చందానగర్లో భారీగా స్టెరాయిడ్ ఇంజెక్షన్లను ఆర్సీ పురం ఎస్ఓటి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తనిఖీలు చేపట్టగా.. ఈ ఇంజెక్షన్లతో ఇద్దరు వ్యక్తులు దొరికారు. హైదరాబాద్: నగరంలోని చందానగర్లో భారీగా స్టెరాయిడ్ ఇంజెక్షన్లను ఆర్సీ పురం ఎస్ఓటి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు చందానగర్ పీజేఆర్ స్టేడియం వద్ద చేపట్టిన తనిఖీల్లో స్టెరాయిడ్ ఇంజెక్షన్లతో ఇద్దరు వ్యక్తులు పోలీసులకు చిక్కారు. వారి నుంచి రూ. లక్ష విలువ చేసే ఈ ఇంజెక్షన్లను స్వాధీనం చేసుకుని, నిందితులిద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చట్టవిరుద్ధంగా స్టెరాయిడ్లు విక్రయిస్తున్న వీరిని సరసాయి రామ్, కుంచాల రవీంద్రలగా గుర్తించారు. నిందితుల దగ్గర మెఫెంటెరమైన్ సల్ఫేట్ ఇంజెక్షన్లు (Wofen 10ml) ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఇద్దరి మధ్య లావాదేవీలు అన్నీ ఆన్లైన్ పేమెంట్స్ ద్వారానే జరిగినట్లు వెల్లడించారు. అయితే ఈ విక్రయాల్లో వినియోగదారులుగా ఉన్న దీపక్, సాయి ప్రసాద్, షకీల్, కిషోర్, నితీష్ అనే మరో ఐదుగురు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది

సీరియస్ పాత్రలతో ప్రయాణం చేస్తున్న కామెడీ కింగ్ అల్లరి నరేశ్ చాలా కాలం తర్వాత తనదైన శైలిలో నవ్వులు పంచేందుకు సిద్ధమయ్యారు. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘రంభ ఊర్వశి మేనక’ విడుదలకు అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి U/A సర్టిఫికెట్ జారీ చేసింది. సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.చంద్రమోహన్ చింతాడ దర్శకత్వం వహించిన ఈ చిత్రం పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రంగా తెరకెక్కింది. ఇందులో సురభి హీరోయిన్ గా నటించింది. రాశి సింగ్, విష్ణు ప్రియ, ప్రిషా సింగ్ ఓ డ్యాన్స్ నెంబర్ లో మెరిశారు. ప్రముఖ హాస్యనటుడు వెన్నెల కిశోర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. గత కొంతకాలంగా ‘నాంది’, ‘ఉగ్రం’ వంటి ఇంటెన్స్ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించిన నరేశ్, మళ్లీ కామెడీ జోనర్లో సినిమా చేయడంతో ఆయన అభిమానులు, సినీ ప్రియులలో ఆసక్తి నెలకొంది.ఈ చిత్రానికి చైతన్ భరద్వాజ్ సంగీతం అందించారు. సెన్సార్ పనులు కూడా పూర్తి కావడంతో, థియేట్రికల్ రిలీజ్ కోసం చిత్ర యూనిట్ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ సినిమాతో అల్లరి నరేశ్ తన మార్క్ కామెడీతో మరో విజయాన్ని అందుకుంటారని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది

రాజమండ్రి(తూ.గో. జిల్లా): చంద్రబాబు పూర్తి చేసిన కాలువ పనులు కూడా అవినీతిమయమేనని మాజీ ఎంపీ, వైఎస్సార్సీపీ నేత మార్గాని భరత్ విమర్శించారు. వెలిగొండ ప్రాజెక్టుతో పాటు అనేక ప్రాజెక్టులు వైఎస్సార్ రెక్కల కష్టమన్నారు. చంద్రబాబుది క్రెడిట్ చోరీ తప్ప ఏమీలేదని ధ్వజమెత్తారు. పోలవరం ప్రాజెక్టు నుండి ఒక్క చుక్క నీరు కూడా ఎడమ కాలువ ద్వారా తరలించడం లేదని, పురుషోత్తపట్నం నుండి ఏలేరులో నీటిని ఎత్తిపోసి ఎడమ కాలువ ద్వారా పంపుతున్నారన్నారు. ఇది పోలవరం ప్రాజెక్టు నీరు కాదని.... గ్రావిటీపై ఒక చుక్క కూడా నీరు రావటం లేదన్నారు. ‘పోలవరం ఎడమ కాలువ నుండి నీటిని విడుదల చేస్తామని చంద్రబాబు చెప్తున్నారు. వైఎస్సార్ హయాంలోనే రైట్ మెయిన్ కెనాల్, లెఫ్ట్ మెయిన్ కెనాల్ చాలావరకు పూర్తయ్యాయి. ఇది జల యజ్ఞం కాదు... ధన యజ్ఞం.. అని అప్పట్లో చంద్రబాబు అన్నారు. 45.72 మీటర్లు నీటిని నిల్వ చేస్తే తప్ప గ్రావిటీపై ఉత్తరాంధ్రకు నీటి సరఫరా సాధ్యం కాదు. పోలవరం ప్రాజెక్టును 41.15 మీటర్లకు పరిమితం చేస్తే ఇది కేవలం బ్యారేజ్ గా మిగులుతుంది. కుడి, ఎడమ కాలువలు తవ్వించకపోతే అసలు పోలవరం ప్రాజెక్టు ముందుకు వెళ్లే పరిస్థితి ఉందా?, ఇప్పుడు ఉన్నదంతా జంజీ జనరేషనే... గతంలో చంద్రబాబు పవిత్ర సంగమం పేరిట డ్రామా చేశారు. మీరు చేసే పనులు వల్ల విద్యుత్ ఎంత అవుతుంది. చంద్రబాబు దారుణంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు’ అని విమర్శించారు. చంద్రబాబు మొగల్తూరు పర్యటన అట్టర్ ఫ్లాప్ మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు) తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు) హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు) అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు) కీర్తి సురేశ్ కలర్ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు) భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు పుష్ప శ్రీవాణి పై

హైదరాబాద్: చంద్రబాబు జీవితమంతా అబద్ధాల మయమేనని, ఎన్నికలకు ముందు సంక్షేమం.. గెలిచాక పచ్చి మోసం చేయడమమే ఆయన నైజమని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీపార్వతి ధ్వజమెత్తారు. ’విజనరీ’ అనే పదాన్ని కూడా చోరీ చేసిన ఘనుడు ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబేనని, ఇతరుల ప్రాజెక్టులకు శిలాఫలకాలు వేసి క్రెడిట్ కొట్టేసే వ్యక్తి అంటూ విమర్శించారు. నందమూరి తారక రామారావుకు వెన్నుపోటు పొడిచి, తెలుగుదేశం పార్టీని, ఆయన పదవిని లాక్కుని, సరిగ్గా 31 ఏళ్ల క్రితం ఇదే రోజు సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారని, అందుకే వెన్నుపోటుకు కేరాఫ్ అడ్రస్ చంద్రబాబునాయుడు అని మండిపడ్డారు.. అలా అడ్డదారిలో గద్దెనెక్కిన చంద్రబాబు, ఆనాటి నుంచి ఇప్పటి వరకు ఏ మాత్రం నైతిక విలువలు లేని రాజకీయాలు చేస్తున్నారని ఆమె గుర్తు చేశారు. హైదరాబాద్లోని తన నివాసంలో నందమూరి లక్ష్మీపార్వతి మీడియాతో మాట్లాడుతూ.. మహనీయుడు ఎన్టీఆర్ అయితే ద్రోహి చంద్రబాబు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మహిళా యూనివర్సిటీ తీసుకువచ్చారు. ఉద్యోగాల్లో మహిళలకు 9 శాతం, స్థానిక సంస్థల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించారు. మునసబు, కరణాల వ్యవస్థను రద్దు చేసి పరిపాలనను గ్రామ స్థాయికి తీసుకువెళ్లిన గొప్ప నేత ఆయన. కాంగ్రెస్కు వ్యతిరేకంగా దేశంలోని పార్టీలన్నింటినీ ఏకం చేసి, నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేసి వీపీ సింగ్గారిని ప్రధానిని చేసిన మహానుభావుడు. 1994 ఎన్నికల్లో 222 సీట్లు, కమ్యూనిస్టులతో కలిపి ఏకంగా 258 స్థానాలతో అఖండ మెజారిటీ సాధించారు. అలాంటి గొప్ప వ్యక్తికి ఎనిమిది నెలలు తిరక్కుండానే చంద్రబాబు ద్రోహం చేశాడు. వెన్నుపోటుకు కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు ఆ రోజుల్లో ఎన్టీఆర్ ఆరోగ్యం బాగాలేక ప్రాణాపాయ స్థితిలో ఉంటే.. చంద్రబాబు మాత్రం వైస్రాయ్ హోటల్లో ఎమ్మెల్యేలతో మందు, మాంసంతో విందులు, వినోదాలు చేసుకున్నారు. ఆగస్టు 25వ తేదీన ఎన్టీఆర్ గారిని పార్టీ అధ్యక్ష పదవి నుంచి అన్యాయంగా తొలగించి, పార్టీ ఫండ్ను ఆపేశారు. తండ్రిని

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జాతీయ రహదారుల ఏర్పాటుకు కేంద్రం తోడ్పాటును అందిస్తున్న విషయం తెలిసిందే. హైదరాబాద్ నుంచి విజయవాడ మీదుగా మచిలీపట్నం వరకు ఉన్న జాతీయ రహదారి 65ను ఆరు లేన్లుగా విస్తరించే ప్రతిపాదనకు కేంద్రం కీలక ఆమోదం లభించింది. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా సమర్పించిన ప్రతిపాదనపై కేంద్ర ప్రభుత్వ పబ్లిక్-ప్రైవేట్ పార్ట్నర్షిప్ అప్రైజల్ కమిటీ పీపీపీఏసీ ఆమోదం తెలిపింది.ప్రైవేటుకు భూగర్భ బొగ్గు గనులు.. కేంద్రం సూచన .. సింగరేణి యోచన!జాతీయ రహదారి 65ను ఆరు లేన్లుగా విస్తరణకు భూసేకరణ, నిర్మాణం కోసం భారీ వ్యయంప్రధాని నేతృత్వంలోని ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ సీసీఈఏ తుది అనుమతి ఇచ్చిన వెంటనే టెండర్లు, భూసేకరణ పనులు వేగంగా మొదలుకానున్నాయి. మొత్తం 284 కిలోమీటర్ల మేర ఈ విస్తరణకు భూసేకరణ, నిర్మాణం కోసం భారీ వ్యయం కానుంది. ప్రాజెక్టును మూడు ప్యాకేజీలుగా అమలు చేయనున్నారు. మల్కాపూర్ నుంచి విజయవాడ గొల్లపూడి బైపాస్ వరకు 284 కి.మీ మార్గాన్ని నాలుగులేన్ల నుంచి ఆరు లేన్లుగా మారుస్తారు.ప్రాజెక్టును మూడు ప్యాకేజీలుగా నిర్మాణందీనిని బిల్డ్-ఆపరేట్-ట్రాన్స్ఫర్ బీఓటీ విధానంలో రెండు ప్యాకేజీలుగా హైదరాబాద్-నందిగామ ఒక ప్యాకేజీ, నందిగామ-గొల్లపూడి మరో ప్యాకేజీగా చేపడతారు. ప్రస్తుత నాలుగు లేన్లను ఉంచి ఇరువైపులా కొత్త సర్వీస్ రోడ్లు నిర్మిస్తారు. అమరావతి ఔటర్ రింగ్ రోడ్ క్రాసింగ్ నుంచి మచిలీపట్నం వరకు 44 కి.మీ మార్గాన్ని హైబ్రిడ్ అన్యుటీ మోడల్ హ్యామ్ కింద ఒకే ప్యాకేజీగా ఆరు లేన్లుగా విస్తరిస్తారు.పోర్న్ కంటెంట్ తో బిగ్ ఫైనాన్షియల్ ఫ్రాడ్: ఈ యాప్లు తక్షణమే డిజేబుల్ చేయండి- కేంద్రంగొల్లపూడి వరకు ప్రతిపాదనకు ఓకే.. ఆ ప్రతిపాదనలకు నో పర్మిషన్ప్రారంభంలో కంచికచర్ల వరకే ఉన్న ప్రతిపాదనను గొల్లపూడి వరకు పొడిగించాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి లేఖ రాయడంతో విస్తరణ పెంచారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం అడిగిన గొల్లపూడి నుంచి భవానీపురం కనకదుర్గ ఫ్లైఓవర్ వరకు

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావును పోలీసులు అరెస్టు చేయడాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తీవ్రస్థాయిలో తప్పుబట్టారు. ఈ అణచివేత చర్య కాంగ్రెస్ ప్రభుత్వ దివాలాకోరుతనానికి, నియంతృత్వ వైఖరికి అద్దం పడుతోందని మండిపడ్డారు. కాంగ్రెస్ కార్యకర్తల దాడికి గురైన నల్గొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళుతున్న రాంచందర్ రావును పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేయడం అత్యంత హేయమని నితిన్ నబీన్ అన్నారు. కాంగ్రెస్ శ్రేణులు భౌతిక దాడులు, అరాచకాలకు పాల్పడుతున్నప్పుడు ప్రేక్షక పాత్ర వహించిన పోలీసు యంత్రాంగం... బాధితులకు అండగా నిలిచేందుకు వెళుతున్న ప్రతిపక్ష నేతలను అరెస్ట్ చేయడం ఏ రకమైన ప్రజాస్వామ్యమని ప్రశ్నించారు. రాజ్యాంగ పరిరక్షణ గురించి కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చెప్పే మాటలన్నీ కేవలం ప్రజలను మభ్యపెట్టే నాటకాలని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం సాగిస్తున్న ఈ దౌర్జన్యాలు, ప్రతిపక్షాలపై దాడులకు తెలంగాణ ప్రజలు రాబోయే రోజుల్లో తగిన రీతిలో బుద్ధి చెబుతారని నితిన్ నబీన్ హెచ్చరించారు. రాంచందర్ రావు కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు

కష్టకాలంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వెంట ఉన్నది ఎవరో కవిత తెలుసుకోవాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఘాటుగా వ్యాఖ్యానించారు. తనపై కవిత చేసిన ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. కవిత చర్యల వల్ల తండ్రి కేసీఆర్ ఎంతటి మనోవేదనకు గురవుతున్నారో ఆమె ఆలోచించుకోవాలని... తాను ఎప్పుడూ కేసీఆర్-కవితలను కలపడానికే ప్రయత్నించాను తప్ప విడగొట్టడానికి కాదని స్పష్టం చేశారు. తాను, తన తండ్రి వేముల సురేందర్ రెడ్డి 2001లో పార్టీ ఆవిర్భావానికి ముందే కేసీఆర్ వెంటే ఉన్నామని, తాము టీఆర్ఎస్ (బీఆర్ఎస్) వ్యవస్థాపక సభ్యులమని గుర్తుచేశారు. "బీఆర్ఎస్ అంటేనే ప్రశాంత్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి అంటేనే బీఆర్ఎస్" అని పేర్కొన్న ఆయన... కవిత మధ్యలో వచ్చి మధ్యలోనే వెళ్లిపోయారని ఎద్దేవా చేశారు. పార్టీ లైన్ దాటినందుకే ఆమెపై చర్యలు తీసుకున్నారని తెలిపారు. అసెంబ్లీ లోపలా బయటా రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై నిరంతరం పోరాడుతున్నది ఎవరో ప్రజలందరికీ తెలుసన్నారు. తాను కాంగ్రెస్ నాయకులతో ఎలాంటి మంతనాలు జరపలేదని యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధానంలో ప్రమాణపూర్వకంగా చెప్పగలనని... మరి కాంగ్రెస్తో కవిత రహస్య మంతనాలు జరపలేదని ఆమె చెప్పగలరా? అని నిలదీశారు. కేసీఆర్కు అత్యంత ఆప్తులుగా, బలంగా ఉన్న నాయకులపై నిరాధార ఆరోపణలు చేస్తూ... పార్టీని బలహీనపరిచి పరోక్షంగా అధికార కాంగ్రెస్ పార్టీకి కవిత లబ్ధి చేకూరుస్తున్నారని ఆరోపించారు. సభలో ఆమె కన్నీళ్లు పెట్టుకోవడం కేవలం రాజకీయం కోసం, సానుభూతిని పొందేందుకేనని విమర్శించారు. కవితను రెండుసార్లు ఎమ్మెల్సీని చేయడంలో తన పాత్ర ఏంటో కేసీఆర్కు స్పష్టంగా తెలుసని, నిన్నటి వరకు ఆమెపై ఉన్న గౌరవాన్ని తన వ్యాఖ్యలతో కవిత స్వయంగా పోగొట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు

ఆంధ్రప్రదేశ్లో గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణ దిశగా రాష్ట్ర ఎన్నికల సంఘం అతిపెద్ద కీలక అడుగు ముందుకు వేసింది. రాష్ట్రంలోని 13,278 గ్రామపంచాయతీల పరిధిలోని 1,33,128 వార్డులకు గాను మొత్తం 1,36,326 పోలింగ్ స్టేషన్లతో తుది జాబితాను అధికారికంగా విడుదల చేసింది. జిల్లా కలెక్టర్లు మరియు జిల్లా ఎన్నికల అధికారుల ఆమోదంతో ఈ ప్రక్రియను పూర్తయినట్లు స్పష్టం చేశారు. స్థానిక పోరుకు సంబంధించి అత్యంత ముఖ్యమైన పోలింగ్ కేంద్రాల ప్రక్రియ పూర్తి కావడంతో త్వరలోనే నోటిఫికేషన్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ తుది జాబితా రూపకల్పన వెనుక ఒక స్పష్టమైన టైమ్లైన్ మరియు నిబంధనావళిని ఎన్నికల సంఘం పక్కాగా అమలు చేసింది. ఆగస్టు 12న సర్క్యులర్ జారీతో ప్రారంభమైన ఈ ప్రక్రియలో ఆగస్టు 23న డ్రాఫ్ట్ జాబితా వెలువడింది. ఆగస్టు 26 వరకు అందిన అభ్యంతరాలు మరియు సూచనలను పరిశీలించిన తర్వాతే ఈ సెప్టెంబర్ 1న తుది జాబితా ఖరారైంది. ప్రతి వార్డుకు కనీసం ఒక కేంద్రం ఉండేలా ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా అదనపు స్టేషన్లను సైతం అధికారులు సిద్ధం చేశారు. 2021లో ఎన్నికైన సర్పంచులు, వార్డు సభ్యుల పదవీకాలం 2026 ఏప్రిల్తో ముగియడంతో రాజ్యాంగం ప్రకారం ఎన్నికలు నిర్వహించడం అనివార్యంగా మారింది. దీంతో కొన్ని చోట్ల ఉన్న కోర్టు కేసులు, సరిహద్దుల మార్పులు, పట్టణ పరిధుల విస్తరణ లాంటి అడ్డంకులను దాటుకుంటూ ఈసీ వేగంగా చర్యలు చేపట్టింది. ఇదిలా ఉండగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేతా కలెక్టర్లు మరియు అధికారులతో వరుస సమీక్షలు నిర్వహిస్తూ ఏర్పాట్లను పరుగులు తీస్తున్నారు. పోలింగ్ కేంద్రాల ప్రకటనతో ఇక నోటిఫికేషన్, నామినేషన్ల ప్రక్రియకు మార్గం సుగమమైంది. రాజకీయంగా కూడా స్థానిక పోరు వేడి తీవ్రస్థాయికి చేరింది. ఫలితంగా అధికార టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం ఎన్నికలను త్వరితగతిన పూర్తి చేయాలని భావిస్తుండగా, వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అన్ని స్థానాల్లో పోటీకి కేడర్ను సిద్ధం చేస్తున్నారు. ఈ

హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్న చందంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సందర్భంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావుకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ఫోన్ చేశారు. పార్టీ కార్యాలయంపై దాడులు, నేతల అరెస్ట్లపై ఆరా తీశారు. అదే సమయంలో కాంగ్రెస్ నిరంకుశ విధానంపై పోరాటాన్ని కొనసాగించాలని రాంచందర్రావుకు నబిన్ సూచించారు. కాగా, తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తల దాడులు, నిరసనలతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. నిన్న(సోమవారం, ఆగస్టు 31వ తేదీ) బీజేపీ రాష్ట్ర కార్యాలయ గేటుకు కాంగ్రెస్ శ్రేణులు నల్లరంగు వేయగా, ప్రతిగా నల్లగొండలో మంత్రి కోమటిరెడ్డి కార్యాలయంపై బీజేపీ శ్రేణులు దాడికి దిగాయి. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేపై, బిహార్లో విద్యార్థులపై బీజేపీ వ్యవహరించిన తీరును నిరసిస్తూ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివ చరణ్రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయ గేటుకు యూత్ కాంగ్రెస్ శ్రేణులు నల్ల రంగు పూయడంపై బీజేవైఎం శ్రేణులు మండిపడ్డారు. దీనిని నిరసిస్తూ బీజేవైఎం ఆధ్వర్యంలో గాం«దీభవన్ ముట్టడికి యతి్నంచారు. గాంధీభవన్పై కోడ్డిగుడ్లు విసిరేసి నిరసన వ్యక్తం చేశారు. నిరసన వ్యక్తం చేస్తున్న బీజేపీ శ్రేణులను పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ, కాంగ్రెస్ పరస్పర నిరసన దాడులతో నల్లగొండ జిల్లా కేంద్రం అట్టుడికింది. శ్రీనగర్ కాలనీలో ఉన్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి క్యాంపు కార్యాలయంపై (వ్యక్తిగత కార్యాలయం) సోమవారం బీజేపీ జిల్లా అ«ధ్యక్షుడు నాగం వర్షిత్రెడ్డి నేతృత్వంలో కోడి గుడ్లు, టమాటాలతో దాడి చేశారు. అక్కడే ఉన్న మంత్రి ప్లెక్సీకి నిప్పంటించారు. దీంతో మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్రెడ్డి నేతృత్వంలో దేవరకొండ రోడ్డు చైతన్యపురికాలనీలో ఉన్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్రెడ్డి నివాసంపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడిచేశారు. ‘ ఫ్రెండ్లీ పోలీస్.. కాంగ్రెస్ నేతలకు వత్తాసు పలకడమేనా?’ తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్

ఉత్తరాంధ్ర ప్రజా సమూహాల దశాబ్దాల కల నెరవేరే సువర్ణ ఘడియలు ఆసన్నమయ్యాయి. పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ ద్వారా గోదావరి జలాలు ఉత్తరాంధ్ర భూముల్లోకి పారేందుకు మార్గం సుగమమైంది. రేపు పాయకరావుపేట వద్ద ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెగ్యులేటర్ ఆన్ చేసి, పుడమి తల్లిని తడిపే గోదావరి తరంగాలకు జల హారతి ఇచ్చి ఘనంగా స్వాగతం పలకనున్నారు. ఇంజనీరింగ్ అద్భుతంగా రూపొందిన ఈ కాలువ ద్వారా ఉగ్రరూప మెత్తే గోదావరి ప్రవాహం ఇకపై ఉత్తరాంధ్ర జిల్లాల సాగు, తాగునీటి దాహాన్ని తీర్చబోతోంది.తూర్పు కనుమల విసిరిన క్లిష్టమైన భౌగోళిక సవాళ్లను దాటుకుంటూ, రూ.4,192 కోట్ల భారీ వ్యయంతో 213 కిలోమీటర్ల మేర పోలవరం ఎడమ ప్రధాన కాలువ నిర్మాణం పూర్తయింది. ఏలేరు, పంపా, తాండవ, వరాహ, శారద వంటి అనేక నదులు, వాగులను దాటుకుంటూ ఈ కాలువ సాగుతుంది. ఇంజనీరింగ్ అద్భుతాలకు ప్రతీకగా కొన్ని చోట్ల నదీ ప్రవాహానికి ఎగువ నుంచి అక్విడెక్టులు, మరికొన్ని చోట్ల దిగువ నుంచి సైఫన్లు నిర్మించారు.ముఖ్యంగా పంపా నదిపై 30 మీటర్ల లోతులో 312 పైల్స్తో అక్విడెక్ట్, తాండవ నదిపై 10,634 క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యాన్ని తట్టుకునేలా 447 మీటర్ల పొడవున భారీ నిర్మాణాలు పూర్తి చేశారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న తాళ్లపాలెం భూ వివాదాన్ని పరిష్కరించి 472 కుటుంబాలకు పునరావాసం కల్పించడం ద్వారా ప్రాజెక్టును వేగవంతం చేశారు.Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు కట్టిందెవరు ? జగన్- లోకేష్ క్రెడిట్ వార్..!2.87 లక్షల ఎకరాలకు సాగునీరు..ఈ గోదావరి జలాల విడుదలతో నాలుగు జిల్లాల పరిధిలోని 2,87,320 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందడమే కాకుండా, 5.23 లక్షల మంది ప్రజలకు శాశ్వత తాగునీటి భరోసా లభించనుంది. మొత్తం 23.44 టీఎంసీల నీటిని వినియోగించుకుంటూ పరిశ్రమలకు, తాగునీటికి, సాగుకు ఇబ్బంది లేకుండా డిజైన్ చేశారు. పాయకరావుపేట అక్విడెక్ట్ ద్వారా విడుదలయ్యే నీటితో అనకాపల్లి వద్ద ఏలేరు కాలువను, అలాగే జిల్లాలోని

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అనగానే మనకు వెంటనే గుర్తుకొచ్చేది భారీ బిల్డింగ్లు, పెద్ద రోడ్లు, వరల్డ్ క్లాస్ సిటీ ప్లాన్స్ మాత్రమే కాదు. భారతదేశ రియల్ ఎస్టేట్ చరిత్రలోనే ఇది ఒక అత్యంత ఆసక్తికరమైన ప్రయాణం. ఒకప్పుడు పచ్చని పంట పొలాలతో ఎంతో ప్రశాంతంగా ఉన్న కృష్ణా నదీ తీర ప్రాంతం, రాజధాని ప్రకటన రాగానే రాత్రికి రాత్రే కోట్ల రూపాయల బిజినెస్కు కేరాఫ్ అడ్రస్గా మారిపోయింది. గత పదేళ్ల కాలంలో అమరావతి భూముల ధరలు చూసిన ఎత్తుపల్లాలు, పొలిటికల్ ట్విస్టులు, చివరకు ఇన్వెస్టర్లకు ఇచ్చిన లాభాలు రియల్ ఎస్టేట్ వరల్డ్లోనే ఒక కొత్త చరిత్ర సృష్టించాయి. 2014 సంవత్సరానికి ముందు తుళ్లూరు, నేలపాడు, మందడం, నవులూరు, రాయపూడి లాంటి గ్రామాల్లో భూముల వ్యాపారం ఎకరాల లెక్కన మాత్రమే జరిగేది. అప్పట్లో ఎకరం ధర రూ.15 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు ఉండేది. అంటే గజం లెక్కన చూసుకుంటే కేవలం రూ.3,000 నుంచి రూ.6,000 మాత్రమే. కానీ 2014 చివరిలో ఉమ్మడి ఏపీ విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిగా అమరావతిని ప్రకటించడంతో రియల్ ఎస్టేట్ స్ సీన్ ఒక్కసారిగా మారిపోయింది. రైతుల నుంచి ఏకంగా 33,000 ఎకరాలను ల్యాండ్ పూలింగ్ కింద సేకరించారు. 2016 నుంచి 2018 మధ్య వెలగపూడిలో తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు నిర్మాణాలు ప్రారంభం కావడంతో భూముల రేట్లు ఆకాశాన్ని తాకాయి. అయితే 2019లో ప్రభుత్వం మారడం, మూడు రాజధానుల ప్రతిపాదన ముందుకు రావడంతో 2019-2023 మధ్య మార్కెట్ తీవ్రంగా పడిపోయింది. ఆ సమయంలో భూమి అమ్మకాలు తగ్గిపోయి గజం ధర రూ.12,000 వరకు పడిపోయింది. కానీ 2024లో మళ్లీ ప్రభుత్వం మారడం, వరల్డ్ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ADB) నుంచి నిధులు రావడంతో అమరావతిలో భూముల రేట్లు మళ్లీ రికార్డు స్థాయికి చేరాయి. ఒక సాధారణ ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే అమరావతి