
Nh 65 Expansion Pppac Approves Six Lane Expansion Of Nh 65 From Hyderabad To Vijayawada Machilipatn 504337
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జాతీయ రహదారుల ఏర్పాటుకు కేంద్రం తోడ్పాటును అందిస్తున్న విషయం తెలిసిందే. హైదరాబాద్ నుంచి విజయవాడ మీదుగా మచిలీపట్నం వరకు ఉన్న జాతీయ రహదారి 65ను ఆరు లేన్లుగా విస్తరించే ప్రతిపాదనకు కేంద్రం కీలక...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జాతీయ రహదారుల ఏర్పాటుకు కేంద్రం తోడ్పాటును అందిస్తున్న విషయం తెలిసిందే. హైదరాబాద్ నుంచి విజయవాడ మీదుగా మచిలీపట్నం వరకు ఉన్న జాతీయ రహదారి 65ను ఆరు లేన్లుగా విస్తరించే ప్రతిపాదనకు కేంద్రం కీలక ఆమోదం లభించింది. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా సమర్పించిన ప్రతిపాదనపై కేంద్ర ప్రభుత్వ పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ అప్రైజల్ కమిటీ పీపీపీఏసీ ఆమోదం తెలిపింది.ప్రైవేటుకు భూగర్భ బొగ్గు గనులు.. కేంద్రం సూచన .. సింగరేణి యోచన!జాతీయ రహదారి 65ను ఆరు లేన్లుగా విస్తరణకు భూసేకరణ, నిర్మాణం కోసం భారీ వ్యయంప్రధాని నేతృత్వంలోని ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ సీసీఈఏ తుది అనుమతి ఇచ్చిన వెంటనే టెండర్లు, భూసేకరణ పనులు వేగంగా మొదలుకానున్నాయి. మొత్తం 284 కిలోమీటర్ల మేర ఈ విస్తరణకు భూసేకరణ, నిర్మాణం కోసం భారీ వ్యయం కానుంది. ప్రాజెక్టును మూడు ప్యాకేజీలుగా అమలు చేయనున్నారు. మల్కాపూర్ నుంచి విజయవాడ గొల్లపూడి బైపాస్ వరకు 284 కి.మీ మార్గాన్ని నాలుగులేన్ల నుంచి ఆరు లేన్లుగా మారుస్తారు.ప్రాజెక్టును మూడు ప్యాకేజీలుగా నిర్మాణందీనిని బిల్డ్-ఆపరేట్-ట్రాన్స్‌ఫర్ బీఓటీ విధానంలో రెండు ప్యాకేజీలుగా హైదరాబాద్-నందిగామ ఒక ప్యాకేజీ, నందిగామ-గొల్లపూడి మరో ప్యాకేజీగా చేపడతారు. ప్రస్తుత నాలుగు లేన్లను ఉంచి ఇరువైపులా కొత్త సర్వీస్ రోడ్లు నిర్మిస్తారు. అమరావతి ఔటర్ రింగ్ రోడ్ క్రాసింగ్ నుంచి మచిలీపట్నం వరకు 44 కి.మీ మార్గాన్ని హైబ్రిడ్ అన్యుటీ మోడల్ హ్యామ్ కింద ఒకే ప్యాకేజీగా ఆరు లేన్లుగా విస్తరిస్తారు.పోర్న్ కంటెంట్ తో బిగ్ ఫైనాన్షియల్ ఫ్రాడ్: ఈ యాప్‌లు తక్షణమే డిజేబుల్ చేయండి- కేంద్రంగొల్లపూడి వరకు ప్రతిపాదనకు ఓకే.. ఆ ప్రతిపాదనలకు నో పర్మిషన్ప్రారంభంలో కంచికచర్ల వరకే ఉన్న ప్రతిపాదనను గొల్లపూడి వరకు పొడిగించాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి లేఖ రాయడంతో విస్తరణ పెంచారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం అడిగిన గొల్లపూడి నుంచి భవానీపురం కనకదుర్గ ఫ్లైఓవర్ వరకు అదనపు 5 కి.మీ, అలాగే బెంజ్ సర్కిల్ నుంచి ఇడుపుగల్లు వరకు ఎలివేటెడ్ కారిడార్ ప్రతిపాదనలకు పీపీపీఏసీ ఆమోదం ఇవ్వలేదు.తుది ఆమోదం కోసం ఏపీ ప్రభుత్వం నిరీక్షణఈ ప్రాజెక్టు దాదాపు 284 కిలోమీటర్లు ఉంటుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అంచనా వ్యయం 12 వేల కోట్ల రూపాయలు కాగా ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించి ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య ఆపరేటర్లు కమిటీ ప్రతిపాదనకు ఆమోదం తెలపగా, కేంద్ర ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ తుది ఆమోదం కోసం ఏపీ ప్రభుత్వం నిరీక్షిస్తోంది.





