
పురుగుల మందు తాగి ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకున్న ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. నేలకొండపల్లి మండలం అప్పల నరసింహాపురానికి చెందిన శ్రీనివాసరావు అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి స్థానికంగా నివసిస్తున్నాడు. ఇతనికి ఇద్దరు సంతానం.. కుమార్తె లాస్య, కుమారుడు నిఖిల్ ఉన్నారు. అయితే ఏం కష్టం వచ్చిందో తెలియదు కానీ.. నిన్న సాయంత్రం శ్రీనివాసరావు ఇంట్లో ఉన్న పురుగుల మందు తాను తాగి, ఇద్దరు పిల్లలకూ తాగించాడు. కాసేపటికే వారంతా స్పృహ కోల్పోయారు.





