
రాజస్థాన్లోని టోంక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంతో కారు నడుపుతూ సోషల్ మీడియాలో లైవ్ వీడియో చేస్తున్న ఓ వ్యక్తి రెప్పపాటులో ప్రాణాలు కోల్పోయాడు. దూనీ ప్రాంతంలోని పోల్యాడా సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.




