
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
konda surekha reacts on her daughter sushmita controversy: తెలంగాణ రాజకీయాలు ప్రస్తుతం కొండా సురేఖ ఫ్యామిలీ చుట్టు తిరుగుతున్నాయి. ఇప్పటికే కొండా సురేఖ కూతురు వరంగల్ జిల్లా గీసు కొండలో సుష్మిత చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టిని కలవరపెట్టేదిగా మారాయి. అంతే కాకుండా ఏకంగా సీఎంను సుష్మిత టార్గెట్ చేసి మాట్లాడటం, ఆయన ప్రతిష్టను అభాసుపాలు చేసేలా ఉండటంతో తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ సైతం సీరియస్ అయ్యింది. దీనిపై ఇప్పటికే క్రమశికణ కమిటీ మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. దీనికి కౌంటర్ గా కొండా సురేఖ తన కూతురు చేసిన వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమన్నారు. ఇక దీనిపై తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రంగంలోకి దిగారు.
మంత్రి కొండా సురేఖను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. దీంతో తెలంగాణ కాంగ్రెస్ లో ఏంజరుగబోతుందని రచ్చ మొదలైంది. ఇక దీనిపై మంత్రి కొండా సురేఖ మరోసారి స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన నుంచి వచ్చాక ఆయనను కలిసి అన్ని విషయాలు బైటపెడతానని అన్నారు.
ఇప్పటికే క్రమశికణ కమిటీకి చెప్పాల్సింది చెప్పానని మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. మా ఇంట్లో పూజలతో బిజీగా ఉన్నానని చెప్పారు. మరోవైపు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వివాదంపై మాట్లాడేందుకు కొండా సురేఖ ఆసక్తిని చూపించలేదు.
Read more: Konda Surekha: కొండా సురేఖను బర్తరఫ్ చేయాలి.! . సీఎల్పీ వేదికగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తీవ్ర ఆగ్రహం..
మరోవైపు కొండా సుష్మిత తనకు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ గౌరవమన్నారు. అసలు సీఎం రేవంత్ తన టార్గెట్ అని చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్ని మరో టర్న్ తీసుకునేలా చేశాయి. ఈ వివాదంపై కాంగ్రెస్ అధిష్టానం, సీఎం రేవంత్ సైతం సీరియస్ గా ఉన్నట్లు సమాచారం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.





