
దసరా శరన్నవరాత్రుల్లో ఇంద్రకీలాద్రికి వచ్చిన భక్తులకు లడ్డూల విక్రయానికి ఏటీఎం సేవలను అధికారులు అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. అమ్మవారి దర్శనం పూర్తయిన తర్వాత లడ్డూ ప్రసాదాల కోసం క్యూల్లో గంటల తరబడి వేచిఉండే అవసరం లేకుండా స్మార్ట్ విధానంలో త్వరితగతిన సేవలు పొందేలా దీన్ని రూపొందించారు.





