
నల్గొండ జిల్లా: గణేష్ ఉత్సవాల సందర్భంగా చోటుచేసుకున్న వాగ్వాదం విషాదానికి దారితీసింది. నల్గొండ జిల్లా తిరుమలగిరిసాగర్ మండలం చింతలపాలెం గ్రామంలో గణేష్ మండపం వద్ద పూజారి మృతి చెందడం కలకలం రేపింది. పూజారి దత్తు ప్రసాద్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.




