
భారత్-చైనా వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబడి చైనా తన సైనిక బలగాలను గణనీయంగా ఉపసంహరించుకున్నట్లు భారత రక్షణ మంత్రిత్వ శాఖ తన వార్షిక నివేదికలో పేర్కొంది. గతంలో లద్దాఖ్లోనే 60 వేల కంటే ఎక్కువగా ఉన్న పీఎల్ఏ దళాలు ఇప్పుడు 40,000 నుంచి 50,000కి తగ్గాయని స్పష్టం చేసింది. మోదీ-జిన్పింగ్ చర్చల ఫలంగా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తగ్గి స్థిరత్వం ఏర్పడటంతో పాటు భారత సైనిక పహారా వల్ల జమ్మూ కశ్మీర్లో రాళ్ల దాడులు తగ్గి శాంతిభద్రతలు నెలకొన్నాయని వివరించింది..




