
ఈ ఏడాది జరిగిన బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికల్లో బీఎన్పీ పార్టీ విజయం సాధించడంతో ప్రధాన మంత్రిగా తారిక్ రెహ్మాన్ బాధ్యతలు చేపట్టారు. ఆయన పదవీ ప్రమాణం రోజునే భారత్కు రావాలని ప్రధాని మోదీ ఆహ్వానం పంపారు. ఆ తర్వాత న్యూఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సుకు బిమ్స్టెక్ సభ్యదేశంగా భారత్ ఆహ్వానించింది. కానీ, బంగ్లాదేశ్ ప్రధాని హాజరుకాలేదు. అయితే, న్యూయార్క్లో జరిగే ఐరాస సాధారణ సభ సమావేశానికి ఆయన హాజరవుతారని బంగ్లాదేశ్ ప్రకటించింది.





