
ఫిఫా వరల్డ్ కప్ రౌండ్ ఆఫ్ 16లో అర్జెంటీనా సాధించిన సంచలన విజయం చుట్టూ ఇప్పుడు అంతర్జాతీయంగా వివాదం ముదురుతోంది. 2-0 ఆధిక్యంతో ఉన్న రెక్టాంగులర్ మ్యాచ్ను అర్జెంటీనా 13 నిమిషాల వ్యవధిలో 3-2తో తిరగరాసిన తీరుపై ఈజిప్ట్ హెడ్ కోచ్ హోసామ్ హసన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫిఫా కావాలనే లైనెల్ మెస్సీని, డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాను వరల్డ్ కప్ రేసులో ఉంచాలని భావించిందని, అందుకే మైదానంలోనూ, వెలుపల కూడా వారికి అన్ని స్థాయుల్లోనూ మద్దతు లభించిందని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు.మ్యాచ్ ముగిసిన అనంతరం విలేకరుల సమావేశంలో హసన్ మాట్లాడుతూ.. "మేము డిఫెండింగ్ ఛాంపియన్ల కంటే అన్ని రంగాల్లో అద్భుతంగా ఆడాం. కానీ ఫలితాన్ని మైదానంలో ఉన్న అంతర్గత శక్తులు, బయట ఉన్న బాహ్య శక్తులు శాసించాయి. బహుశా ప్రపంచ విజేతను టోర్నమెంట్లో ఉంచాలని వారు అనుకుని ఉండవచ్చు. మెస్సీ రేసులో కొనసాగాలని వారు కోరుకుని ఉండవచ్చు. క్రీడల్లో కొన్నిసార్లు సాంకేతిక అంశాలకు మించిన శక్తులు పనిచేస్తుంటాయి. మా దేశానికి తిరిగి వెళ్ళాక నేను జీవితంలో మళ్లీ వరల్డ్ కప్ చూడను, ఎందుకంటే ఈ టోర్నమెంట్లో న్యాయం లేదు" అంటూ తీవ్ర అసంతృప్తి వెళ్లగక్కారు.వీఏఆర్ నిర్ణయాలపై ఈజిప్ట్ ఆగ్రహంఈజిప్ట్ శిబిరం ఆగ్రహానికి ముఖ్య కారణం అంపైర్ల వివాదాస్పద నిర్ణయాలే. 59వ నిమిషంలో ఈజిప్ట్ ప్లేయర్ మోస్తఫా జికో కొట్టిన గోల్ను వీఏఆర్ రివ్యూ ద్వారా రద్దు చేయడం మ్యాచ్ను మలుపు తిప్పిందని హసన్ పేర్కొన్నారు. అలాగే పెనాల్టీ బాక్స్లో స్టార్ ప్లేయర్ మొహమ్మద్ సలాహ్ను






























