
దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి.. ఇండస్ట్రీలో హీరోయిన్లందరూ ఇలాగే అనుకుంటారు. కొన్ని సినిమాలు చేశామా.. నాలుగు రాళ్ళు వెనకేసుకున్నమా.. సరైన సమయంలో పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యామా అనేలానే ఉంటారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి.. ఇండస్ట్రీలో హీరోయిన్లందరూ ఇలాగే అనుకుంటారు. కొన్ని సినిమాలు చేశామా.. నాలుగు రాళ్ళు వెనకేసుకున్నమా.. సరైన సమయంలో పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యామా అనేలానే ఉంటారు. కొందరు పెళ్లి తరువాత సినిమాలు చేస్తారు.. మరికొందరు ఆపేస్తారు. అయితే.. కొందరికి రీఎంట్రీలు కలిసిరావు.. కానీ, ముగ్గురు హీరోయిన్లకు మాత్రం రీఎంట్రీ బాగా కలిసి వచ్చింది. అది కూడా పెళ్లి చేసుకుంటే కాదు.. పెళ్లి పెటాకులు చేసుకుంటే.. అంటే పెళ్లిని క్యాన్సిల్ చేసుకున్నాక వారి కెరీర్ నెక్స్ట్ లెవెల్ లో దూసుకుపోతోంది. అందాల భామలు నయనతార, త్రిష ఇద్దరూ ఒక దశలో పెళ్లి చేసుకుని సినిమాలకు టాటా చెప్పేయాలని అనుకున్నారు. నయనతార ప్రభుదేవాతో, అలాగే త్రిష నిర్మాత వరుణ్ మణియన్తో నిశ్చితార్థం చేసుకొని పెళ్లికి సిద్దమయ్యారు కూడా. కానీ, కొన్ని కారణాల వలన ఆ ఎంగేజ్ మెంట్ ని రద్దు చేసుకున్నారు. అలా రద్దు చేసుకున్నాక.. పాత విషయాలను మర్చిపోయి సెకండ్ ఇన్నింగ్స్లో మునుపటి కంటే రెట్టింపు స్టార్డమ్తో దూసుకెళ్లారు. ఇప్పుడు సరిగ్గా ఇదే బాటలో మలయాళ ముద్దుగుమ్మ నివేతా పేతురాజ్ కూడా కెరీర్లో ఫుల్ బిజీ అయ్యే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. గతేడాది నివేతా.. దుబాయ్ కి చెందిన బిజినెస్మ్యాన్ రాజ్ హిత్ ఇబ్రాన్ తో నిశ్చితార్థం అయ్యినట్లు అధికారికంగా తెలిపింది. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని అందరూ సంతోషించారు. అయితే సడెన్ గా ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ అని, అతని నుంచి విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. అయితే పర్సనల్ లైఫ్లో ఎదురైన ఈ ఎదురుదెబ్బ తరువాత ఆమె కెరీర్ ముగిసిపోయింది అనుకున్నారు కానీ అదే నివేతా పేతురాజ్ కి పెద్ద ప్లస్ లా మారింది





















