
NEET : జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (NEET-UG) రాయబోయే అభ్యర్థులకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) కీలక అప్డేట్ ఇచ్చింది. దేశవ్యాప్తంగా నిర్వహించనున్న నీట్ రీ-ఎగ్జామ్ (మళ్లీ నిర్వహించే పరీక్ష)కు


NEET : జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (NEET-UG) రాయబోయే అభ్యర్థులకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) కీలక అప్డేట్ ఇచ్చింది. దేశవ్యాప్తంగా నిర్వహించనున్న నీట్ రీ-ఎగ్జామ్ (మళ్లీ నిర్వహించే పరీక్ష)కు

Versova Beach : మహారాష్ట్రలో ఎండల తీవ్రత, ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరిగిపోవడంతో ముంబై నగరవాసులు నరకం చూస్తున్నారు. సరైన వర్షాలు లేకపోవడం, దీనికి తోడు ముంబై వాతావరణంలో ఉండే విపరీతమైన తేమ (ఉక్కపోత)

Nishant Tomar: ఢిల్లీ పోలీస్ శాఖలో సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేసిన నిశాంత్ తోమర్ అనే వ్యక్తి తన స్థిరమైన ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలి ఆస్ట్రేలియాలో కొత్త జీవితాన్ని ప్రారంభించిన కథ ప్రస్తుతం సోషల్

Yoshitha Rajapaksa : శ్రీలంక రాజకీయాల్లో మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. దేశ మాజీ అధ్యక్షుడు మహింద రాజపక్స కుమారుడు యోషిత రాజపక్సను అవినీతి, అక్రమాల ఆరోపణలపై అక్కడి దర్యాప్తు సంస్థలు అరెస్టు

Operation Kagar: మావోయిస్టు వ్యతిరేక చర్యల నేపథ్యంలో కొనసాగుతున్న ఆపరేషన్ కగార్ ప్రభావం మరింత స్పష్టమవుతోంది. ఈ క్రమంలో దీర్ఘకాలంగా మావోయిస్టు కార్యకలాపాల్లో కీలక పాత్ర పోషించిన మహిళా నేత శకుంతల అలియాస్ పుష్ప కోల్కతా పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఆమె వద్ద నుంచి ఒక తుపాకీతో పాటు 40 రౌండ్ల మందుగుండు సామగ్రిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. భద్రతా సంస్థల వాంటెడ్ జాబితాలో ఉన్న శకుంతలపై ప్రభుత్వం రూ.10 లక్షల నగదు బహుమతి ప్రకటించింది. గత రెండు దశాబ్దాలుగా వివిధ మావోయిస్టు కార్యకలాపాల్లో ఆమె కీలకంగా వ్యవహరించినట్లు అధికారులు చెబుతున్నారు. Read also: Elon Musk : ‘కాక్రోచ్’ల అపర సృష్టి మస్క్ దేనా? కోల్కతా పోలీస్ కమిషనర్ అజయ్ నంద్ వివరాల ప్రకారం, శకుంతల 2001లో మావోయిస్టు భావజాలానికి ఆకర్షితురాలై సంస్థలో చేరారు. ప్రారంభంలో సాంస్కృతిక విభాగంలో పనిచేస్తూ విప్లవ గీతాలు, ప్రచార కార్యక్రమాలు, కరపత్రాల పంపిణీ వంటి బాధ్యతలను నిర్వహించారు. తరువాత పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (PLGA)లో ప్రముఖ నాయకురాలిగా ఎదిగిన శకుంతల, దల్మా జోన్ జోనల్ కమిటీ సభ్యురాలిగా పనిచేశారు. బీహార్, జార్ఖండ్, ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో జరిగిన పలు హింసాత్మక ఘటనలతో ఆమెకు సంబంధాలు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. లొంగుబాటు అనంతరం శకుంతల చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. హింసా మార్గం ఎలాంటి శాశ్వత పరిష్కారాన్ని ఇవ్వదని, తుపాకీ కంటే ప్రశాంత జీవితం ఎంతో విలువైనదని ఆమె పేర్కొన్నారు. ఇంకా అడవుల్లో సాయుధ పోరాటం కొనసాగిస్తున్న మావోయిస్టులు ఆయుధాలు వదిలి సమాజంలో కలిసిపోవాలని సూచించారు. శకుంతల లొంగుబాటుతో జంగల్మహల్ ప్రాంతంలో మావోయిస్టు నెట్వర్క్ బలహీనపడే అవకాశం ఉందని భద్రతా వర్గాలు భావిస్తున్నాయి. ఆమె నిర్ణయం ప్రభావంతో మరికొందరు క్యాడర్లు కూడా ప్రధాన ప్రవాహంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. Sadhu Dulal Giri Ji Maharaj : భగవంతుని సాక్షాత్కారం కోసం