
ఏసీఏ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న డబ్ల్యూఏపీఎల్ను నారా బ్రాహ్మణి ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభిస్తారని ఏసీఏ అధ్యక్షుడు, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) తెలిపారు. బుధవారం విజయవాడలోని ఏసీఏ భవనంలో ఎంపీ చిన్ని మాట్లాడుతూ, ఈ నెల 19 నుంచి 27 వరకు డబ్ల్యూఏపీఎల్ పోటీలు జరగనున్నాయన్నారు.





