
తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశ వ్యాప్తంగా వినాయక చవితి సందడి మొదలైపోయింది. నేటి నుంచి నవరాత్రులు పూర్తయి నిమజ్జనోత్సవం ముగిసే దాకా వాడవాడలా ఏదో ఒక మూల నుంచి చెవులు చిల్లులు పడేలా.. గుండెలు అదిరిపోయేలా.. డీజే మోతలు, తీన్మార్ డప్పుల చప్పుళ్లు వినిపిస్తూనే ఉంటాయి.





