
వర్షాల నేపథ్యంలో అంటువ్యాధుల వ్యాప్తికి అవకాశం లేకుండా ఆరోగ్యశాఖను అప్రమత్తం చేసినట్లు మంత్రి సత్యకుమార్ ఆదివారం ఓ ప్రకటనలో వెల్లడించారు. రాష్ట్రంలో మలేరియా, డెంగ్యూ, స్క్రబ్టైపస్, టైఫాయిడ్, నీరు-ఆహారం ద్వారా వచ్చే వ్యాధులు, తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు.





