
నిత్యావసర వస్తువుల ధరలు పెరగకుండా, సామాన్యుడికి అందుబాటులో అవి ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ముందస్తు అంచనాలతో పంటల సాగు, ఉత్పత్తి, మార్కెట్ నిర్వహణపై దృష్టి పెట్టాలన్నారు. బుధవారం ఉండవల్లిలోని క్యాంప్ కార్యాలయంలో వ్యవసాయ, అనుబంధ శాఖలపై సీఎం సమీక్ష నిర్వహించారు.





