
పాఠశాల విద్యార్థులకు అల్పాహారం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం జిల్లా కేంద్రంలో సెంట్రలైజ్డ్ కిచెన్(కేంద్రీకృత సామాజిక వంటశాల)ను ఏర్పాటు చేస్తోంది. కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో ఈ వంటశాల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. త్వరలో పనులు పూర్తి చేసుకొని ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్నది.





