ఇవి ఆవరణలో పెంచుకోవడానికి అత్యంత అనువైన మొక్కలు. వీటిలో దేశవాళీ రకాలతో పాటు హైబ్రిడ్ రకాల్లో కూడా అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా ఎరుపు, పసుపు, గులాబీ, తెలుపు వంటి రకరకాల రంగుల్లో లభిస్తాయి.
ఇవి ఇంటి ఆవరణలో, కుండీల్లో కూడా చాలా సులభంగా పెరిగే మొక్కలు. అయితే వీటిని ప్రతిరోజూ కనీసం 5 గంటల పాటు ఎండ అవసరం. ఇవి హెల్త్ యాంగిల్లో కూడా మంచి ఉపయోగాలు కలిగి ఉన్నాయని NLM అధ్యయనం పేర్కొంది.
ఇవి ఇంటికి ఒక కలర్ఫుల్ లుక్ తీసుకురావడానికి బెస్ట్ ఛాయిస్. ఇవి గులాబీ, నారింజ, తెలుపు, ఊదా రంగుల్లో లభిస్తాయి. ఈ పూలు చూడటానికి కాగితాల వలే చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. ఈ పూల మొక్కలకు ఎంత ఎక్కువ ఎండ తగిలితే అంత బాగా పూలు పూస్తాయి. నీరు తక్కువగా పోసినా తట్టుకుంటాయి. కాబట్టి ఇంటి ఆవరణలో బాల్కనీలు, గేట్ల దగ్గర పెంచడానికి అనువైనవి.
ఇవి ఎలాంటి వాతావరణాన్ని అయినా తట్టుకుని నిలబడగల గట్టి మొక్కలు. ఇవి కూడా గులాబీ, తెలుపు, పసుపు రంగుల్లో గుత్తులు గుత్తులుగా పూలు పూస్తాయి. వీటి సంరక్షణకు కూడా ఎక్కువ నీళ్లు అవసరం లేదు. ఎండ ఎక్కువగా ఉండే చోట పెడితే ఏడాది పొడవునా పూలు పూస్తూనే ఉంటాయి.
ఇవి చిన్న చిన్న పూలు అన్నీ కలిపి ఒక పెద్ద గుత్తిలా, బంతిలా ఉండటం వీటి ప్రత్యేకత. ఇవి ఎరుపు, పసుపు, నారింజ, గులాబీ రంగుల్లో లభిస్తాయి. వీటి సంరక్షణకు పాక్షిక ఎండ ఉన్నా సరిపోతుంది. ఇవి తేమతో కూడిన మట్టిని ఇష్టపడుతాయి.
ఈ పూలతో పాటు ఇల్లంతా మంచి సువాసనతో నిండిపోవాలంటే మల్లె జాతి మొక్కలు బెస్ట్. వీటిలో నిత్యమల్లె రకం మొక్కలు ఏడాది పొడవునా పూలు పూస్తాయి. వీటిని తీగలాగా పైకి పాకించవచ్చు లేదా కుండీలో పొదలాగా కూడా పెంచుకోవచ్చు. అయితే వీటిని ఎంత, క్రమం తప్పకుండా నీళ్లు పోయడం చాలా అవసరం.
ఈ మొక్కలన్నింటికీ కనీసం 4 లేదా 5 గంటలు సూర్యరశ్మి అవసరం. కాబట్టి సూర్యరశ్మి అందేలా చూసుకోవాలి. అలాగే కనీసం నెలకు ఒకసారైనా వర్మీ కంపోస్ట్ లేదా ఆవు పేడ ఎరువు వేస్తే మొక్కలు ఆరోగ్యంగా ఉండి ఎక్కువ పూలు పూస్తాయి. అలాగే ఈ మొక్కలు పూలు పూయడం తగ్గినప్పుడు మొక్కల కొమ్మల చివర్లను కొద్దిగా కత్తిరిస్తే కొత్త చిగుళ్లు వచ్చి మళ్లీ పూలు పూయడం ప్రారంభం అవుతుంది.
ముఖ్య గమనిక: ఈ కథనంలోని సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, కొందరు నిపుణులు పేర్కొన్న అంశాల ఆధారంగా తెలియజేశాము. వీటిని ఎంత వరకు పాటించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం. సమయం తెలుగు వీటిని ధృవీకరించడం లేదు.
రచయిత గురించికిషోర్ రెడ్డికిషోర్ రెడ్డి సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేస్తున్నారు. ఆయనకు జర్నలిజంలో 10 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. 2020లో సమయం తెలుగులో చేరిన కిషోర్ రెడ్డి లైఫ్స్టైల్కి సంబంధించిన న్యూట్రిషియన్, డైట్ ప్లాన్, రోగాలు - లక్షణాలు, ఫిట్నెస్, ఇంటి చిట్కాలు, ఫ్యాషన్, హోమ్ డెకార్, రిలేషన్షిప్ వార్తలతో పాటు వివిధ ఆరోగ్య అంశాలపై ఆరోగ్య నిపుణులు, న్యూట్రిషనిస్ట్, డైటీషియన్లు, ఆయుర్వేద నిపుణులు ఇచ్చిన సలహాలు, సమాచారం ఆధారంగా విస్తృత స్థాయిలో వార్తల్ని రాశారు. అంతేకాకుండా క్లీవ్ ల్యాండ్ క్లినిక్, మాయో క్లినిక్, WHO, హార్వర్డ్ వంటి పరిశోధనలు ఆధారంగా కూడా కంటెంట్ అందించారు. ఈ సమాచారాన్ని నిజమో కాదో తెలుసుకోవడానికి నిపుణుల సలహా తీసుకోమని కూడా వివరించారు. ఈ ఆర్టికల్స్ పాఠకులకు అర్థమయ్యేలా సరళమైన భాషలో రాస్తారు.కిషోర్ రెడ్డి 2015లో సాక్షి జర్నలిజం స్కూల్లో జర్నలిజం కోర్సును పూర్తి చేశారు. అనంతరం సాక్షి న్యూస్ ఛానెల్లో (20.08.2016 నుంచి 23.03.2020 వరకు) సబ్ ఎడిటర్గా పనిచేశారు. ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్, విద్య, ఉద్యోగం వార్తలు రాశారు. ముఖ్యంగా ఎడ్యుకేషన్ / జాబ్స్ సెక్షన్ చూసుకునేవారు. ఆ తర్వాత 02.04.2020 నుంచి సమయం తెలుగులో విద్య, ఉద్యోగ వార్తలతో పాటు టెక్నాలజీ న్యూస్, అడ్వర్టయిజ్మెంట్స్ కూడా రాశారు. ఖాళీ సమయంలో పుస్తకాలు చదవడం, ప్రముఖల ఇంటర్వ్యూలు చూడటం, కొత్త కొత్త అంశాల గురించి తెలుసుకోవడానికి ఆయన ఇష్టపడతారు.... ఇంకా చదవండి