
మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Delhi EV Policy 2026 : ఢిల్లీ ప్రభుత్వం కొత్త ఎలక్ట్రిక్ వాహన విధానం ఇప్పుడు రాజధానిలో ఎలక్ట్రిక్ వాహనాలకు కొత్త ఊపునివ్వడానికి సిద్ధంగా ఉంది. సోమవారం ముఖ్యమంత్రి రేఖా గుప్తా అధ్యక్షతన జరిగిన ఢిల్లీ క్యాబినెట్ సమావేశంలో ఈ కొత్త ఈవీ విధానానికి ఆమోదం లభించింది. ఈ విధానం ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తుందని, కాలుష్యాన్ని తగ్గిస్తుందని, రాజధానిలో స్వచ్ఛమైన రవాణాను బలోపేతం చేస్తుందని ప్రభుత్వం పేర్కొంది.
ఢిల్లీ ప్రభుత్వ కొత్త ఎలక్ట్రిక్ వాహన విధానం జూలై 1 నుండి అమల్లోకి రానుంది. ఈ విధానం కింద, ప్రభుత్వం రాబోయే నాలుగేళ్లలో సుమారు రూ.15,000 కోట్లు ఖర్చు చేయాలని యోచిస్తోంది. ఈ భారీ బడ్జెట్ను ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడానికి, సంబంధిత మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి వినియోగించనున్నారు. అంతేకాకుండా, పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుపై 100శాతం రిజిస్ట్రేషన్ పన్నును మాఫీ చేయనున్నారు.
ఈ రోజు ఢిల్లీకి ఒక చారిత్రాత్మక దినం అని ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఈరోజు విలేకరుల సమావేశంలో అన్నారు. కొన్నేళ్లుగా ఢిల్లీకి అత్యంత అవసరమైన ఎలక్ట్రిక్ వాహనాల విధానం, 2026 జూలై 1 నుండి అమలులోకి వచ్చి, 2030 మార్చి 31 వరకు అమల్లో ఉంటుంది. ఈ విధానం మొత్తం ఎలక్ట్రిక్ వాహనాలపైనే దృష్టి సారిస్తుంది. ఢిల్లీని కాలుష్య రహితంగా మార్చాలని మేము కోరుకుంటున్నాము. రాబోయే నాలుగేళ్లలో ఈ పనిని దశలవారీగా ఎలా పూర్తి చేయాలనే దానిపై ఒక ప్రణాళికను రూపొందించాము అని తెలిపారు.
సీఎం రేఖా గుప్తా మాట్లాడుతూ.. ఈవీ విధానం కింద రాబోయే నాలుగేళ్లలో రూ.7,000 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఈవీ మౌలిక సదుపాయాల అభివృద్ధికి, సబ్సిడీలకు అదనంగా రూ.8,000 కోట్లు ఖర్చు చేయనున్నారు. అంటే ఈ విధానం కింద ప్రభుత్వం మొత్తం రూ.15,000 కోట్ల బడ్జెట్ను కేటాయించింది. ఇందులో ఏటా ఇచ్చే రోడ్డు పన్ను మినహాయింపులు, ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుకు ప్రోత్సాహకాలు, ఛార్జింగ్ మౌలిక సదుపాయాల మెరుగుదల, పాత వాహనాలను స్క్రాప్ చేయడానికి ప్రోత్సాహకాలు వంటివి ఉన్నాయి.
ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడానికి ఇంత సమగ్రమైన విధానాన్ని ప్రవేశపెట్టిన దేశంలోని ఏకైక రాష్ట్రం ఢిల్లీ మాత్రమే. ఇది ద్విచక్ర వాహనాలు, త్రిచక్ర వాహనాలు, నాలుగు చక్రాల వాహనాలు, N1 కేటగిరీ ట్రక్కులు, గ్రామీణ సేవలు, ఇతరాలతో సహా అన్ని రకాల వాహనాలను కవర్ చేస్తుంది. దీని ప్రత్యక్ష ప్రయోజనం సామాన్య ఢిల్లీవాసులకు అందుతుందని ఆమె తెలిపారు. అన్ని స్థాయిలలో చర్చల అనంతరం ఆమోదం పొందిన ఈ విధానం జూలై 1 నుంచి అమలులోకి రానుంది ఢిల్లీలో వాహన కాలుష్యానికి సుమారు 33 శాతం వాణిజ్య వాహనాలే కారణమని, 46 శాతం ద్విచక్ర, త్రిచక్ర వాహనాలే కారణమని ఢిల్లీ ప్రభుత్వం పేర్కొంది. ఢిల్లీలోని వాణిజ్య సరుకు రవాణా వాహనాలు N1 కేటగిరీకి చెందినవి, ఇవి 3.5 టన్నుల వరకు బరువున్న చిన్న ట్రక్కులు. ఈ విధానం ప్రత్యేకంగా ఈ మూడు కేటగిరీలపై దృష్టి సారిస్తుంది, తద్వారా వాటి పాత వాహన సముదాయాన్ని ఈవీలుగా మార్చవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఈ కొత్త ఈవీ పాలసీ ప్రకారం.. ఈవీల కొనుగోలుపై మొదటి ఏడాదిలో ఆర్థిక ఉపశమనం లభిస్తుంది. ఎలక్ట్రిక్ టూవీలర్ పై 30వేలు.. ఎలక్ట్రిక్ ట్రిపుల్ వీలర్ పై 50వేలు సబ్సిడీ అందించనుంది. ఎక్కువ మందిని ఈవీలు తీసుకునేలా ప్రోత్సహించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పాలి.