
ప్రకృతి తన రూపాన్ని మార్చుకుంటే ఎంత భీభత్సంగా ఉంటుందో చెప్పడానికి నెదర్లాండ్స్లో తాజాగా సంభవించిన మహా ప్రళయమే నిదర్శనం. ఆకాశం ఒక్కసారిగా అగ్నిగోళమైంది.
ప్రకృతి తన రూపాన్ని మార్చుకుంటే ఎంత భీభత్సంగా ఉంటుందో చెప్పడానికి నెదర్లాండ్స్‌లో తాజాగా సంభవించిన మహా ప్రళయమే నిదర్శనం. ఆకాశం ఒక్కసారిగా అగ్నిగోళమైంది. మేఘాలు శత్రువులపై దండెత్తినట్టుగా భూమిపైకి దూసుకొచ్చాయి. నెదర్లాండ్స్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా కేవలం 24 గంటల వ్యవధిలో ఏకంగా 3,01,137 పిడుగులు పడ్డాయంటే అక్కడి వాతావరణం ఎంతలా అల్లకల్లోలమైందో ఊహించుకోవచ్చు. జూన్ 28 రాత్రి ఆమ్‌స్టర్‌డ్యామ్ నగర వాసులు కళ్లారా చూసిన ఆ దృశ్యం.. ఒకవైపు ప్రకృతి అద్భుతమా అనిపిస్తూనే, మరోవైపు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకునేలా వణికించింది.క్షణానికి 17 పిడుగులు.. నిరంతర స్ట్రోబ్ లైట్ బీభత్సం!సాధారణంగా వర్షం పడేటప్పుడు అక్కడక్కడా మెరుపులు రావడం సహజం. కానీ, నెదర్లాండ్స్‌లో ఊహకందని రేంజ్‌లో పిడుగుల తాండవం జరిగింది. వాతావరణ శాఖ (KNMI) లెక్కల ప్రకారం.. తుఫాను గరిష్ట స్థాయికి చేరినప్పుడు కేవలం 30 నిమిషాల్లోనే నెదర్లాండ్స్, ఉత్తర జర్మనీ పరిసరాల్లో 30,000 పిడుగులు విరుచుకుపడ్డాయి. అంటే.. ప్రతి సెకనుకు దాదాపు 17 పిడుగులు భూమిని తాకాయి! దాదాపు నాలుగు గంటల పాటు ఆకాశంలో నాన్-స్టాప్‌గా డిస్కో లైట్ల తరహాలో మెరుపులు జిగేల్‌మన్నాయి. రాత్రి వేళ కూడా పగటి పూటలా వెలుతురు వచ్చేలా నిరంతరాయంగా పిడుగులు పడుతుంటే, స్థానికులు భయాందోళనలతో వణికిపోయారు.మండుతున్న ఎండలకు.. ఒక్కసారిగా బ్రేక్!ఈ అసాధారణ వాతావరణ మార్పు వెనుక తీవ్రమైన ఉష్ణోగ్రతలు ఉన్నాయి. గత వారం రోజులుగా యూరప్ ఖండం రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో అల్లాడిపోయింది. నెదర్లాండ్స్ చరిత్రలోనే మొదటిసారిగా వాతావరణ శాఖ అత్యంత ప్రమాదకరమైన కోడ్ రెడ్ హీట్‌వేవ్ హెచ్చరిక జారీ చేసింది. ఆమ్‌స్టర్‌డ్యామ్‌లో ఉష్ణోగ్రతలు 30°C దాటి.. కొన్ని ప్రాంతాల్లో 40°C కి చేరువయ్యాయి. 41 డిగ్రీల సెగ.. 1300 మంది మృతి!అయితే, ఈ తీవ్రమైన వేడి వాతావరణంలోకి ఒక్కసారిగా చల్లని గాలులు ప్రవేశించడంతో ప్రకృతి ఒక్కసారిగా తిరగబడింది. వేడి, తేమతో కూడిన గాలి.. చల్లటి గాలితో ఢీకొట్టడంతో ఆకాశంలో అత్యంత శక్తివంతమైన, పేలుడు లాంటి పిడుగులతో కూడిన తుఫాను మేఘాలు ఏర్పడ్డాయి. వాతావరణ శాఖ వెంటనే అప్రమత్తమై కోడ్ ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది.నిప్పుల వాన.. గోల్ఫ్ బాల్ సైజులో వడగళ్లు!ఈ పిడుగుల దాడి కేవలం ఆకాశంలో మెరుపుల విన్యాసానికే పరిమితం కాలేదు. భూమిపై తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. గ్రోనింగెన్, ఉట్రెచ్ట్, ఆమ్‌స్టర్‌డ్యామ్ నగరాల్లో పడిన పిడుగుల కారణంగా అనేక ఇళ్లు, భవనాలు తగలబడ్డాయి. ల్యాండ్స్‌మీర్‌లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. టూర్న్‌వెర్డ్‌లో పిడుగుపాటుకు ఒక పశువుల పాక దగ్ధమై రెండు దూడలు సజీవ దహనమయ్యాయి. ఆకాశం నుంచి కురిసిన వర్షంతో పాటు ఏకంగా 5 సెంటీమీటర్ల (గోల్ఫ్ బాల్ సైజు) పరిమాణంలో ఉన్న వడగళ్లు పడ్డాయి. Omega Block: నిప్పుల కొలిమిలా మారిన ఐరోపా, సెగలు గక్కుతున్న ఖండం!గ్లోబల్ వార్మింగ్ హెచ్చరిక.. ఇది ఆరంభం మాత్రమేనా?ఈ విపత్తు మానవ తప్పిదాల వల్ల మారుతున్న వాతావరణానికి ఒక బలమైన హెచ్చరిక అని శాస్త్రవేత్తలు తేల్చి చెప్తున్నారు. భూతాపం (Global Warming) కారణంగా గాలిలో వేడి, తేమ పెరిగిపోతాయని, అది భవిష్యత్తులో ఇలాంటి మరింత శక్తివంతమైన, వినాశకరమైన తుఫానులకు కారణమవుతుందని హెచ్చరిస్తున్నారు. నెదర్లాండ్స్ ఆకాశంలో కనిపించిన ఆ మెరుపుల సిరీస్.. పర్యావరణ మార్పులు కేవలం ఉష్ణోగ్రతలకే పరిమితం కాదని, అవి ఊహించని ప్రళయాలకు దారితీస్తాయనే చేదు నిజాన్ని మరోసారి గుర్తుచేసింది.