
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన...
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Urdu teaching controversy at Armoor: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో స్థానికంగా ఉన్న భరత్ చంద్ర పాఠశాలలో ఉర్దూ బోధించడం పెను దుమాంగా మారింది. భరత్ చంద్ర పాఠశాలలో ఎలాంటి అనుమతి లేకుండా 1 నుంచి 5 వ తరగతి విద్యార్థులకు హింది బదులు ఉర్దు బోధిస్తున్నట్లు విషయం బైటపడింది. దీంతో స్థానిక బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి స్కూల్ కు తరలివచ్చారు. విద్యార్థుల నోట్ బుక్ లను పరిశీలించగా ఉర్దు బోధిస్తున్నట్లు రాతలు బైటపడ్డాయి. స్కూల్ విద్యార్థులు సైతం తమకు ఉర్దూ బోధిస్తున్నారని చెప్పారు.
ఈ క్రమంలో బీజేపీ ఆర్మూర్ అధ్యక్షులు మందుల బాలు, నూతన శ్రీనివాస్ తదితరులు ప్రిన్సిపాల్ అమీర్ ఖాన్, ఉర్దూ బోధిస్తున్నట్లు చెబుతున్న ఉపాధ్యాయుడిపై సీరియస్ అయ్యారు. అప్పటికే విద్యాశాఖ అధికారులు , పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఈక్రమంలో బీజేపీ నేతలు తమ పిల్లలకు పాఠశాలలో కల్మాలు, అనుమతిలేని ఉర్దూ నేర్చించడం ఏంటని మండిపడ్డారు.
కొంత మంది పిల్లల్ని స్కూల్ దశ నుంచి ఇతర మతాల్లోకి వెళ్లేలా వారిలో చెడు భావనలను నింపుతున్నారని, లవ్ జీహద్ లవైపు వెళ్లేలా వారిని ఉసిగొల్పుతున్నారని మండిపడ్డారు. ఈ క్రమంలో ఉర్దూ ఉపాధ్యాయుడిపై బీజేపీ నేతలు చేయిచేసుకున్నారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీనిపై ఇప్పటికే ఎంఈవో,స్థానిక ఎమ్మార్వో సైతం రంగంలోకి దిగి విచారణకు ఆదేశించారు. మరోవైపు అనుమతిలేనిదే స్కూల్ లో ఉర్దు బోధనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
మరోవైపు ముస్లిం ఉపాధ్యాయుడ్ని తిట్టి, చేయిచేసుకున్నారన్న ఆరోపణలపై బీజేపీ నేతలపై మరో కేసు నమోదు చేశారు. అంతే కాకుండా రెండు వర్గాలు ఆర్మూర్ పోలీస్ స్టేషన్ కు చేరుకుని సీఐను కలిసి ఫిర్యాదులు చేసుకున్నారు. ఈవిషయం కాస్త నిజామాబాద్ కలెక్టర్, సీపీ వరకు కూడా చేరాయి. దీంతో ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సైతం సీపీతో మాట్లాడటంతో ఈ వివాదం కాస్త పోలిటికల్ గా మరింత హీట్ ఎక్కింది.
తమ వర్గంకు చెందిన వ్యక్తిపై బీజేపీ దాడికి నిరసనగా ఒక వర్గం నేడు ఆర్మూర్ బంద్ కు పిలుపునిచ్చింది. ఆర్మూర్ లో అంబేద్కర్ చౌరస్తా వద్దకు చేరుకుని నిరసనలు చేపట్టారు. మరో వర్గం కూడా రాస్తారోకోకు పిలుపునివ్వడంతో ఒక్కసారిగా హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసులు ఎక్కడికక్కడ బీజేపీ నేతల్ని అదుపులోకి తీసుకున్నారు.
ఆర్మూర్ లో బీజేపీ కార్యకర్తలు, నేతలు చేపట్టిన నిరసన ర్యాలీలో పాల్గొనడానికి వస్తున్న ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. ఎక్కడికక్కడ బారికెడ్లను ఏర్పాటు చేశారు. దీంతో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. నా నియోజక వర్గంకు వెళ్లడానికి నన్ను ఎందుకు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. మతమార్పిడులు చేస్తున్నారని, పిప్రిలో హిందుకుటుంబం ఇల్లు తగల పెట్టినప్పుడు మీరంతా ఏమయ్యారనిమండిపడ్డారు.
Read more: Kalvakuntla Kavitha: ఇడుపు కాయితం అంటే పవన్ కళ్యాణ్కు బాగా తెలుసు.!. కవిత సంచలన వ్యాఖ్యలు..
చిన్న పిల్లలకు నమాజ్ లు నేర్పిస్తున్నారని మండిపడ్డారు. హిందువులంటే ఎందుకంత పగ అని మండపడ్డారు.మొత్తంగా ఆర్మూర్ ప్రస్తుతం రెండు వర్గాల నిరసనలు, ఉర్దు బోధన వివాదంతో నివురు గప్పిన నిప్పులా ఉంది. మరోవైపు శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా పోలీసులు అదనపు బలగాల్ని ఆర్మూర్ వ్యాప్తంగా మోహరించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.