
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన...
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Heavy rain lashes Mumbai city: దేశంలో నైరుతి రుతుపవనాలు వేగంగా విస్తరించాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలోని ముంబాయి నగరం భారీ వర్షాలకు చిగురుటాకుల వణికిపోయింది. అసలు ముంబాయి నగరంలో చిన్నపాటి వర్షాలకు రోడ్లన్ని జలమయం అయిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ తరుణంలో నిన్న రాత్రి కేవలం నాలుగు గంటల్లోనే 100 మి.మీల కంటే ఎక్కువ వర్షం కురిసినట్లు ముంబాయి వాతావరణ శాఖ తెలిపింది. రోడ్లన్ని ఎక్కడికక్కడ జలమయం అయ్యాయి. లోతట్లు ప్రాంతాలు అన్ని వరద నీళ్లతో నిండిపోయాయి. ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. జనజీవనం అంతా అస్తవ్యస్తంగా మారిపోయింది. ఈ క్రమంలో ముంబై బీఎంసీ అధికారులు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. ముఖ్యంగా రోడ్లపై నిల్చిపోయిన నీళ్లను మోటర్లతో తొలగించే చర్యలు చేపట్టారు.
బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) డేటా ప్రకారం.. ములుంద్ తూర్పు శివారులోని వీణా నగర్లో ఏకంగా 160.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, పశ్చిమ శివారులోని వెర్సోవాలో 156.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. అర్ధరాత్రి నుంచి తెల్లవారుజామున 4 గంటల మధ్య శివారు ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షం కారణంగా ములుండ్లోని ఎల్బిఎస్ రోడ్డు, అంధేరి సబ్వేలోని పలుచోట్ల నీరు నిలిచిపోయింది. దీంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది.
తూర్పు శివారు ప్రాంతాల్లో అత్యధిక వర్షపాతం నమోదైనట్లు బీఎంసీ ఆటోమేటిక్ వాతావరణ కేంద్రాలు నమోదు చేశాయి. మంఖుర్డ్లోని మహారాష్ట్ర నగర్ పాఠశాలలో 123.4 మిల్లీమీటర్ల వర్షం కురవగా, ఆ తర్వాత పోవైలోని పాస్పోలి మున్సిపల్ పాఠశాలలో (122 మిల్లీమీటర్లు), ములుండ్లోని మిఠాగర్ మున్సిపల్ పాఠశాలలో (120.8 మిల్లీమీటర్లు), ఎస్ వార్డ్ కార్యాలయంలో (120.6 మిల్లీమీటర్లు) వర్షం నమోదైందని అధికారులు తెలిపారు.
పశ్చిమ శివారు ప్రాంతాల్లో, వెర్సోవా పంపింగ్ స్టేషన్లో 121.6 మిల్లీమీటర్ల వర్షం నమోదు కాగా, ఆ తర్వాత మారోల్ ఫైర్ స్టేషన్లో (108.4 మిల్లీమీటర్లు), ఓషివారాలోని ప్రతీక్ష నగర్ మున్సిపల్ పాఠశాలలో (108 మిల్లీమీటర్లు), అంధేరిలోని మల్పా డోంగరి మున్సిపల్ పాఠశాలలో (104 మిల్లీమీటర్లు) వర్షం నమోదైందని అధికారులు తెలిపారు.
Read more: ఉరుములు మెరుపులతో ఏపీలో మరో రెండు రోజులు భారీ వర్షాలు..
మటుంగాలో అత్యధికంగా 53.4 మి.మీ వర్షపాతం నమోదవ్వగా, ఆ తర్వాత రావాలి క్యాంప్ (46.72 మి.మీ), దాదర్ ఫైర్ స్టేషన్ (45.6 మి.మీ), మలబార్ హిల్ (37.2 మి.మీ), నాయర్ హాస్పిటల్ (33.77 మి.మీ)లలో వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరోవైపు ముంబైలో వాతావరణ శాక రాబోయే 24 గంటల్లో మరల భారీ వర్షాలు కురుస్తాయని అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ మేరకు పలు ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.