
ప్రముఖ దర్శకుడు దేవి ప్రసాద్, నటి నగ్మా సెట్స్లో ప్రవర్తించిన తీరుపై అనేక ఆసక్తికర విషయాలను ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.
నగ్మాతో తన అనుభవాలను, పరిశ్రమలో తన గురువు ప్రత్యేకమైన చిత్ర నిర్మాణ శైలిని ఆయన పంచుకున్నారు. ముందుగా, భిక్షగాడు సినిమా షూటింగ్ సమయంలో నగ్మా సెట్ నుండి వెళ్ళిపోతుండగా, చిరంజీవి ఆమె వెనుక వెళ్లి నగ్మా నా మాట విను, వెళ్లొద్దు అని బతిమాలిన సంఘటన గురించి అడగగా, దేవి ప్రసాద్ తాను ఆ సినిమాకి పనిచేయలేదని తెలిపారు. అయితే, అప్పట్లో ఏదో చిన్న డిస్టర్బెన్స్ జరిగిందని తాను విన్నానని పేర్కొన్నారు. ఆ గొడవ ఏమిటో, ఎందుకు జరిగిందో తనకు క్లారిటీగా తెలియదని స్పష్టం చేశారు. ఆ తర్వాత, తాను పనిచేసిన ఆవేశం సినిమా సమయంలో నగ్మాతో జరిగిన వివాదాలను దేవి ప్రసాద్ వివరించారు.
ఎక్కువమంది చదివినవి : RRR Movie : అబ్బబ్బా.. ఏం మారింది భయ్యా.. ఆర్ఆర్ఆర్ సినిమా మల్లీని చూశారా.. ? అచ్చం హీరోయిన్లాగే ఉందిగా..
నగ్మాకు డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుండి సరైన గౌరవం లభించడం లేదని ఆవిడ గొడవ చేసిందని తెలిపారు. నిజానికి, డైలాగులు లేదా నటనకు సంబంధించిన సూచనలను దాసు అనే సీనియర్ వ్యక్తి నగ్మాకు చెప్పేవారని, జూనియర్ అసిస్టెంట్లు నేరుగా చెప్పే అవసరం ఉండేది కాదని వివరించారు. అదే సమయంలో, మరో నటి మధుబాల తమిళం బాగా మాట్లాడటం వలన తమకు ఆమెతో ఎక్కువ యాక్సెస్ ఉండేదని, బహుశా నగ్మా దీనిని పోల్చి చూసి తనకు గౌరవం లభించడం లేదని భావించి ఉండవచ్చని దేవి ప్రసాద్ చెప్పారు.
ఎక్కువమంది చదివినవి : Tollywood : ఖుష్బూ కూతురి పెళ్లిలో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ సందడి.. స్పెషల్ అట్రాక్షన్గా త్రిష.. వీడియోస్ ఇదిగో..
ఒకానొక సందర్భంలో నగ్మా నాకు రెస్పెక్ట్ ఇవ్వకపోతే నేను షూటింగ్ కి రాను అని చెప్పి ప్రొడ్యూసర్కు తెలియజేసిందని, దీంతో షూటింగ్ నిలిచిపోయిందని దేవి ప్రసాద్ గుర్తుచేసుకున్నారు. అప్పట్లో తాము కూడా చిన్న వయసులో పొగరుతో, అంతకుముందు విష్ చేసే అలవాటును మానేసి, ఆమె సెట్లోకి రాగానే కాళ్ళ మీద కాలు వేసుకుని కూర్చునేవాళ్ళమని చెప్పుకొచ్చారు. . చివరికి, నగ్మా లాస్ట్ షెడ్యూల్కు రావడానికి నిరాకరించి, తమ క్షమాపణ కోరిందని తెలిపారు. అప్పుడు డైరెక్టర్ గకి మొత్తం పరిస్థితిని వివరించి, తాము షూటింగ్ నుండి వెళ్లిపోవడానికి సిద్ధమని చెప్పామని అన్నారు. చివరగా, జర్నలిస్ట్ సహాయంతో, సౌత్ ఇండియన్ డైరెక్టర్స్ ఫిల్మ్ అసోసియేషన్కు ఫిర్యాదు చేస్తామని చెప్పడంతో, నగ్మా షూటింగ్కు తిరిగి వచ్చిందని, ప్రొడ్యూసర్ల సమక్షంలో సమస్య పరిష్కారమైందని వివరించారు. ఇదంతా ఇరుపక్షాలలోని యువతరం తాలూకు అపరిపక్వత, ఈగోల కారణంగానే జరిగిందని దేవి ప్రసాద్ అన్నారు.
ఎక్కువమంది చదివినవి : Tollywood : ఉదయ్ కిరణ్తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్.. ఎంతో నరకం అనుభవించాను.. టాలీవుడ్ హీరోయిన్..
[caption id="attachment_1853606" align="alignnone" width="1280"] Devi Prasad, Nagma[/caption] ఎక్కువమంది చదివినవి : Tollywood : ఉదయ్ కిరణ్తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్.. ఎంతో నరకం అనుభవించాను.. టాలీవుడ్ హీరోయిన్..